దండకారణ్యంలో సైనిక దాడులు
(మార్చి 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల కార్యకర్తల ఇండ్ల మీద ఎన్ఐఏ దాడులు మొదలుకావడానికి కొన్ని గంటల ముందు రాసిన వ్యాసం.. అముద్రితం- సంపాదకుడు) కళ్ల ముందరి సత్యం తెలుపు నలుపుల్లో కనిపిస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. అది మన చుట్టూ క్రీనీడల్లో కనిపించకుండాపోవచ్చు. ఈ సమస్యను తప్పించుకోడానికి పదునైన చూపు ఉండాలనుకుంటాం. కానీ న్యాయా న్యాయాలపట్ల మన వైఖరులతో, విలువలతోసంబంధం లేకుండా మన చూపు పదునెక్కబోదు. చుట్టూ ఉన్న సంక్షోభాలను, పోరాటాలను అర్థం చేసుకోవడంలో ఈ పరిమితిని అధిగమించగలమా? లేదా? అనేదే ప్రశ్న.దేనికంటే మనుషుల్లోని సకల ఉత్తేజాలను పాలకవర్గం నిరంతరం కొల్లగొడుతూ ఉంటుంది. దానికి ఒక