పత్రికా ప్రకటనలు

బైరి నరేష్‌ పై హిందుత్వ మూకల దాడి

నరేష్‌పై హిందుత్వ శక్తులు ఫిబ్రవరి 27న మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈసారి పోలీసుల సమక్షంలోనే  దాడి జరిగింది.   మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మూక ఈ పని చేసిందా? లేక కేసీఆర్‌ ప్రభుత్వ అండతో చెలరేగిపోయి దాడికి దిగిందా? అనే ప్రశ్నలు చాల మామూలు వాళ్లకు కలిగేలా ఈ ఘటన జరిగింది. నరేష్‌ అభిప్రాయాలేవైనా సరే... అవి ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. హేతుబద్ధ చర్చకు ఆస్కారం ఇవ్వదల్చుకోని వాళ్లే తరచూ మనోభావాల పేరుతో ఉన్మాద చర్యలకు పాల్పడుతుంటారు. ఇది ఫాసిస్టు లక్షణం. నరేష్‌పై దాడి వల్ల నాస్తిక, హేతువాడ, ప్రగతిశీల, విప్లవ శక్తులకు ఫాసిస్టు శక్తులు ఒక
పత్రికా ప్రకటనలు

వైద్య విద్యార్థి ప్రీతిబలవన్మరణానికి కారకులెవరు?

అసమానత, హింస, వివక్ష ఉన్న సమాజంలో జరిగే బలవన్మరణాలన్నీ సామాజిక హత్యలే. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి డాక్టర్‌ ప్రీతి ఫిబ్రవరి 22న బలవన్మరణానికి గురైంది. ఇది  మన సమాజ దుస్థితిని తెలియజేస్తోంది. స్త్రీలు  ఇంట్లో, సమాజంలో  ఆత్మగౌరవంతో జీవించడానికి  చాలా ఘర్షణ అనుభవించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఒక దశ దాటాక వారు ఆత్మహత్య వైపు నెట్టివేయబడుతున్నారు. మన సమాజం నాగరికంగా ఎదగలేదని చెప్పడానికి ప్రీతి బలవన్మరణం ఉదాహరణ.                 సమాజంలోలాగే ఉన్నత విద్యా రంగంలో  కూడా పితృస్వామ్య, ఆధిక్య భావజాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించగల
పత్రికా ప్రకటనలు

బిబిసి డాక్యుమెంటరీ”ఇండియా:ది మోదీ క్వశ్చన్” ప్రసార నిషేధంపై ఖండన

కన్నడ మేధావులు 522  మంది విడుదల చేసిన ప్రకటన మేము, భారతదేశ శాస్త్రవే త్తలం,  అధ్యాపకులం ”ఇండియా:ది మోదీ క్వశ్చన్”  బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాల ప్రసార నిలుపుదల పట్ల తీవ్ర విషాదానికి గురయ్యాం. ఆ డాక్యుమెంటరీ “భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రత” కు భంగకరమనే సాకుతో దాన్ని సామాజిక మాధ్యమాల నుండి తొలగించారు. ఈ సమర్థన పరిశీలనకు నిలబడదు. మీ తొలగింపు , మన సమాజానికి,  ప్రభుత్వానికి  సంబంధించిన  ముఖ్యసమాచారాన్ని దేశ ప్రజల  తెలుసుకొనే హక్కును కాలరాస్తుoది. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆ డాక్యుమెంటరీ  ప్రదర్శనను అడ్డుకొనే ప్రయత్నం జేసాయి. ఇది అకడమిక్  స్వేచ్ఛను    ఉల్లంఘించడమే అవుతుంది. విశ్వవిద్యాలయాలు
పత్రికా ప్రకటనలు

ATHENS: Solidarity panel for Professor Saibaba and the political prisoners in India

A panel concerning the political prisonersin India, event that dozens of people participated, was held by Bookstore-Cafe "Ektos ton Teichon" in Athens. The speakers of the event, described the chronicle of persecutions, of the disabled Professor GN Shaibaba, within the framework of the prefecture of "antiterrorist" law UAPA. The panel tried to indicate the general context within which operation "Green Hunt" takes place and the fierce oppression of left and revolutionary voices
పత్రికా ప్రకటనలు

డ్రోన్ దాడుల‌ను ఆపండి

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో ప్రచారం  దేశ‌వ్యాప్త ప్ర‌గ‌తిశీల సంస్థ‌లు, ర‌చ‌యిత‌లు, మేధావులు (దండ‌కార‌ణ్యంలో బాంబు దాడుల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా వివిధ ప్ర‌జాతంత్ర సంస్థ‌లు క‌దిలాయి. అనేక మంది ర‌చ‌యిత‌లు, మేధావులు ముందుకు వ‌చ్చారు. దేశంలోని ఒక భూభాగం మీద ప్ర‌భుత్వం వైమానిక దాడులు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ఒక ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. - వ‌సంత‌మేఘం టీం) సుక్మా, బీజాపూర్ అడవులలో గుంతలు, బాంబు అవశేషాల క‌నిపిస్తున్నాయి.  వాటికి  కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వివరణనిస్తాయా? 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బొట్టం, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), మడ్ప
పత్రికా ప్రకటనలు

వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర‌

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శ‌స్ర్త‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది. ఇక మిగిలింది తాత్కాలిక  మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని
పత్రికా ప్రకటనలు

జయితా దాస్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలి

పశ్చిమ బెంగాల్ 30.03.2022 29.03.2022 రాత్రి కోల్‌కతా పోలీసుల స్పెషల్  టాస్క్ ఫోర్స్ (STF) సామాజిక కార్యకర్త జయిత దాస్‌ను అరెస్టు చేసింది. నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జయిత నదియా జిల్లాలోని జగులియా క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా కోసం చూస్తుండగా జాగులియా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తెల్ల రంగు  కారులో ఎక్కించుకెళ్ళారు. ఆమె చేతిలో వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొంత డబ్బు ఉన్న బ్యాగును తీసేసుకున్నారు. తరువాత  ఆమెను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అరెస్టును ధృవీకరించడానికి STF అధికారి రాత్రి 8 గంటలకు వచ్చే వరకు కూర్చోబెట్టారు.
పత్రికా ప్రకటనలు

వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు  వారంట్‌ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో  వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒక‌టి ఉన్న‌ట్లు భీమా కొరేగావ్‌ కేసులో అరెస్ట‌యి పూనా జెయిల్లో ఉండ‌గా 2019లో ఆయ‌న‌కు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో
పత్రికా ప్రకటనలు

రైతులను మరిచిన బడ్జెట్

అన్నం పెడుతున్న వ్యవసాయ కుటుంబాలకు “అమృత కాలం “కాదిది వ్యవసాయ రంగానికి  కోతలు విధించిన 2022-2023 కేంద్ర బడ్జెట్  “రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు “లక్ష్యం మరచిన బడ్జెట్ ఇది ఎం‌ఎస్‌పి  చట్టబద్ధతకు ఏ హామీ ఇవ్వని కేంద్ర బడ్జెట్ ని తిరస్కరిద్దామ్ ---------------------------------------------------------------------------------- ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర రైతులకు రైతు స్వరాజ్య వేదిక పిలుపు ---------------------------------------------------------------------------------   వ్యవసాయ ,అనుబంధ రంగాలకు 4.26 శాతం నుండి 3.84 శాతానికి బడ్జెట్ తగ్గింది   పి‌ఎం ఆశా , ఇతర రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలకు బడ్జెట్ లో కోత అమానుషం ------------------------------------------------------------------------------ దేశ రైతాంగానికి ఇచ్చిన హామీల
పత్రికా ప్రకటనలు

విరసం మహాసభలను విజయవంతం చేసిన సాహితీ మిత్రులకు, రచయితలకు, ప్రజాసంఘాలకు, విప్లవాభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు.

అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ళ మధ్య విరసం 28వ మహాసభలు నెల్లూరులో విజయవంతంగా ముగిశాయి. *సాంఘిక విముక్తి కోసం ప్ర‌త్యామ్నాయ సంస్కృతి* ల‌క్ష్యంగా సంస్కృతి - మార్క్సిజం ఇతివృత్తంగా త‌ల‌పెట్టిన ఈ మ‌హాస‌భ‌ల‌ సన్నాహాల దగ్గరి నుండి చివరి దాకా నెల్లూరు మిత్రుల సహకారం మరువలేనిది. వీళ్లంతా విర‌సం ప‌నిని త‌మ ప‌నే అనుకొని ముందుకు వ‌చ్చారు.అడిగిన వెంటనే వేదిక ఇవ్వడానికి ముందుకొచ్చిన సంఘమిత్ర స్కూల్ యాజమాన్యం అర్ధరాత్రి పోలీసుల‌ బెదిరింపులు ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఏకంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయిస్తామనే దాకా పోలీసులు వెళ్లారు. ఇది రాజ్య దుర్మార్గానికి పరాకాష్ట.భిన్నాభిప్రాయాలను చర్చించలేనితనం, సహించలేనితనం ఫాసిస్టు లక్షణం. గత కొన్నేళ్లుగా