పత్రికా ప్రకటనలు

రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం

ఐఎమ్‌టి మనేసర్‌లో హర్యానా పోలీసులు అమలుచేసిన క్రూరమైన,  సమన్వయంతో కూడిన ప్రభుత్వ అణచివేతను  తీవ్రంగా ఖండిస్తున్నాం. 2026 ఏప్రిల్ ప్రారంభంలో, భారతదేశం అంతటా, ముఖ్యంగా ఇంధన రంగంలోనూ,  పారిశ్రామిక కేంద్రమైన ఐఎమ్‌టి మనేసర్ (హర్యానా) లోనూ ఆకస్మిక సమ్మెల వెల్లువ వ్యాపించింది. ఈ అశాంతికి ఐఎమ్‌టి మనేసర్‌లోని పరిస్థితి కేంద్ర బిందువుగా మారింది. హోండా, ముంజల్ షోవా, సత్యం ఆటో, రూప్ పాలిమర్స్, రిచికో గ్లోబల్, మోడలమా ఎక్స్‌పోర్ట్స్, రికో, సుప్రజిత్ ఇంజనీరింగ్, లాల్ సిర్మా ఎస్‌జిఎస్ వంటి అనేక ఫ్యాక్టరీలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 2వ తేదీ నుండి సమన్వయంతో, వరుస సమ్మెలను ప్రారంభించారు. కార్మికుల
పత్రికా ప్రకటనలు

ప్ర‌జా క‌ళాకారుడు జ‌హంగీర్‌కు జోహార్లు

ప్ర‌జా క‌ళాకారుడు, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య సభ్యుడు తుర్క‌ప‌ల్లి జ‌హంగీర్ ఏప్రిల్ 2, 2026న గుండెపోటుతో మ‌ర‌ణించారు. పీడిత ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడును సుదీర్ఘ‌కాలం త‌న గొంతులో ఆయ‌న ప‌లికించారు. జ‌హంగీర్ తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. బాల్యంలో పేదరికం వలన ప్రాథమిక దశలోనే చదువుకు దూరమయ్యారు. జీవిక కోసం వివిధ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. తెలుగు నేలను ఆవరించిన ప్రపంచీకరణతో పేద ప్రజల జీవితాలను 90ల ద‌శ‌కంలో మ‌రింత‌గా సంక్షోభంలోకి నెట్టడం మొద‌లైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ‌లో పతనమవుతున్న జీవితాలను కళ్ళారా చూసిన జహంగీర్
పత్రికా ప్రకటనలు

దళిత ఎక్స్ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసినా సంజీవరెడ్డి గౌడ,బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్టు చేయాలి.

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చేగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లింగప్ప పై కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో కొట్టి తల పగలగొట్టి, అడ్డువచ్చిన ఆయన భార్య పెద్ద శాంతమ్మను కాళ్లతో తన్ని, కొడుకు మోహన్ కుమార్ ను దాడి చేసి రక్త గాయాల పాలు చేసిన అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లింగప్ప ఇంటి ముందు గ్రామ సర్పంచ్  కొడుకు   సంజీవరెడ్డి గౌడ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడంలో భాగంగా గుంతలు తవ్వుతున్న
పత్రికా ప్రకటనలు

ఇరాన్ పై అమెరికా జియోనిస్ట్ కూటమి చేస్తున్న అన్యాయమైన యుద్ధాన్ని ఆపండి

సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం - లెనిన్విప్లవం యుద్ధాన్ని అంతం చేస్తుంది లేదా యుద్ధమే విప్లవానికి దారి తీస్తుంది - మావో జెడాంగ్ ఇజ్రాయిల్ తో పొత్తు పెట్టుకుని అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం ప్రపంచ ఆధిపత్యం కోసం కొన‌సాగిస్తున్న యుద్ధంలో భాగం. కాబట్టి ఇది అన్యాయమైన యుద్ధం. దీనికి ప్రతిఘటనగా ఇరాన్ చేస్తున్నా ఆత్మరక్షణ యుద్దం న్యాయమైనది. అన్యాయమైన యుద్ధానికి వ్యతిరేకంగా మనం నిరసన తెలపాలి. మనం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. శాంతి కోసం అమెరికా ఇరాన్ తో మూడు రౌండ్ల చర్చలు జరిపింది. నాలుగో సారి చర్చలు జరగాల్సి ఉంది. ఈ లోపలే, ప్రపంచ ప్రజల
పత్రికా ప్రకటనలు

కుమ్మెర జాతరలో పసిపాప మరణానికి కారకులైన దోషులను శిక్షించాలి

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో ఫిబ్రవరి 18న  ఆలయ దర్శన టికెట్ కోసం తలెత్తిన వివాదంలో అగ్ర కుల భూస్వామ్య శక్తులు జరిపిన దాడిలో రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడం అత్యంత హేయమైన చర్య. ఈ ఘటనను విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కేవలం ఒక జాతరలో జరిగిన ఘర్షణ కాదు. శతాబ్దాలుగా వేళ్లూనుకున్న ఆధిపత్య  కుల దురహంకార దాడి. జాతరలో ప్రవేశానికి ఫీజు చెల్లించలేదనే నెపంతో చాకలి గణేష్ కుటుంబంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూస్వామ్య శక్తులు దాడి చేయడం, పసిబిడ్డను తన్నడం, మహిళలను వివస్త్రలను చేసేలా ఈడ్చుకెళ్లడం
పత్రికా ప్రకటనలు

త్వరలో.. ఈ తరం సాహిత్య విమర్శ ప్రారంభం

తెలుగు సాహిత్యంలోకి  అనేక జీవ‌న మూలాల నుంచి కొత్త త‌రం ర‌చ‌యిత‌లు వ‌స్తున్నారు. కొత్త అనుభ‌వాలను ప‌రిచ‌యం చేస్తున్నారు.  అద్భుత నిర్మాణ ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. చాలా ప్ర‌శంస‌నీయ‌మైన ఈ కృషిలో   ఈ కాలపు జీవ‌న సంఘ‌ర్ష‌ణ ఎంత ఉన్న‌ది?  యువ ర‌చ‌యిత‌లు దాన్ని ఎంత మేర‌కు ఒడిసిపట్టుకోగ‌ల‌గుతున్నారు?  జీవితంలోని మార్పు క్ర‌మాల‌ను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించ‌గ‌లుగుతున్నారు?  అనే ప్ర‌శ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి  అన్ని త‌రాలు ఎదుర్కొన్న‌వే. సాహిత్య విమ‌ర్శ ఈ స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌నీయాంశం చేయాలి. ప‌రిష్కారం చూపాలి.  తెలుగు  సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాప‌రంగా త‌క్కువే కావ‌చ్చుగాని,   కొత్త తరం ప్రవేశించింది.  ర‌చ‌యిత‌లైనా, విమ‌ర్శ‌కులైనా,
పత్రికా ప్రకటనలు

  హిడ్మా హ‌త్య చ‌ట్టాతీతం

2025 నవంబరు 18నాడు స్థానిక ఆదివాసీ కార్యకర్త, నక్సలైట్ నాయకుడు మడావి హిడ్మా, అతని కామ్రేడ్, జీవన సహచరి మడకాం రాజేని మరో 11 మందిని చంపినట్లు భారత రాజ్యం విజయవంతంగా ప్రకటించింది. ఈ సైనిక 'విజయం'తో, భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని అంతం చేయడానికి హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన 2026 మార్చి 31 గడువును విజయవంతంగా చేరుకుంటున్నట్లు బిజెపి ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర అట్టడుగు వర్గాలను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న పెట్టుబడిదారులు భూమిని, సహజ వనరులను స్వాధీనం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి బిజెపి ప్రభుత్వ అణచివేత విధానాలలో
పత్రికా ప్రకటనలు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది.  పాలస్తీనాలో, ఉక్రెయిన్‌లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలు మానవతను ధ్వంసం చేస్తున్నాయి. అట్టడుగు సమూహాల ఉనికినే రద్దు చేస్తున్నాయి. మానవ ప్రాణానికన్నా  ఆధిపత్యం,  ఆయుధ వ్యాపారం,  కార్పొరేట్‌ లాభాలే పాలకులకు ముఖ్యమని ఈ హింసాకాండ నిరూపిస్తున్నది. మరీ ముఖ్యంగా  ఇజ్రాయిల్‌ దాడుల్లో వేలాదిగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. భారతదేశంలో  సొంత ప్రజలపైనే పాలకులు యుద్ధం ప్రకటించి నెత్తుటేరులు పారిస్తున్నారు. 2026 మార్చ్‌ నాటికి నక్సలిజాన్ని
పత్రికా ప్రకటనలు

శాంతి చర్చలు: ద్రోహాలు, మానవాహననాలు  

పాలస్తీనా నుండి బస్తర్ దాకా కార్పొరేట్ యుద్ధ యంత్రాన్ని ఆపండి భారత ప్రభుత్వం తమపై కొనసాగిస్తున్న చర్యలను నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ఏప్రిల్ 3నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శాంతి చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నొక్కి చెబుతూ, అర్థవంతమైన చర్చలకు సానుకూల, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. "ప్రభుత్వం మా పిలుపుకు సానుకూలంగా స్పందిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము" అని కూడా పార్టీ  ఆ
పత్రికా ప్రకటనలు

ఆదివాసీ నాయకుడు రఘు మిడియామి  అక్రమ అరెస్టు 

2025 ఫిబ్రవరి 27 నాడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ‌ఎ) దంతేవాడ నుండి ప్రముఖ యువ ఆదివాసీ నాయకుడు రఘు మిడియామిని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అరెస్టు చేసింది. 2025 ఫిబ్రవరి 28నాడు ఎన్‌ఐ‌ఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో, మూల్‌వాసీ బచావో మంచ్‌తో సంబంధం ఉన్న గజేంద్ర మాండవితో పాటు మరొక వ్యక్తిని 6 లక్షల రూపాయల నగదు,  మూల్‌వాసీ బచావో మంచ్‌, మావోయిస్టుల కరపత్రాలతో అరెస్టు చేసినట్లు చెప్పింది. 25.03.23న గజేంద్ర మాండవిని అరెస్టు చేసిన తర్వాత 24.08.23న నమోదు చేసిన FIR నం.02-2023-NIA-RPR పై దర్యాప్తులో, రఘు మిడియామి మూల్‌వాసీ బచావో మంచ్