శాంతి చర్చలు: ద్రోహాలు, మానవాహననాలు
పాలస్తీనా నుండి బస్తర్ దాకా కార్పొరేట్ యుద్ధ యంత్రాన్ని ఆపండి భారత ప్రభుత్వం తమపై కొనసాగిస్తున్న చర్యలను నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ఏప్రిల్ 3నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా శాంతి చర్చలకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నొక్కి చెబుతూ, అర్థవంతమైన చర్చలకు సానుకూల, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. "ప్రభుత్వం మా పిలుపుకు సానుకూలంగా స్పందిస్తే, మేము వెంటనే కాల్పుల విరమణ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాము" అని కూడా పార్టీ ఆ