పత్రికా ప్రకటనలు

‘ఏ దేశము తన పౌరులనుతానే చంపుకోకూడదు’

మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు  సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి. అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా
పత్రికా ప్రకటనలు

డ్రోన్ దాడుల‌ను ఆపండి

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో ప్రచారం  దేశ‌వ్యాప్త ప్ర‌గ‌తిశీల సంస్థ‌లు, ర‌చ‌యిత‌లు, మేధావులు (దండ‌కార‌ణ్యంలో బాంబు దాడుల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా వివిధ ప్ర‌జాతంత్ర సంస్థ‌లు క‌దిలాయి. అనేక మంది ర‌చ‌యిత‌లు, మేధావులు ముందుకు వ‌చ్చారు. దేశంలోని ఒక భూభాగం మీద ప్ర‌భుత్వం వైమానిక దాడులు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ఒక ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. - వ‌సంత‌మేఘం టీం) సుక్మా, బీజాపూర్ అడవులలో గుంతలు, బాంబు అవశేషాల క‌నిపిస్తున్నాయి.  వాటికి  కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వివరణనిస్తాయా? 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బొట్టం, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), మడ్ప
పత్రికా ప్రకటనలు

WTO నుంచి బైటికి రావాలి

"డబ్ల్యుటిఓను విడిచి పెట్టండి " అనే నినాదంతో సంయుక్త్ కిసాన్ మోర్చా యిచ్చిన పిలుపును దేశంలోని 400 జిల్లాల్లో ట్రాక్టర్ ప్రదర్శన  జరిగింది. రైతులు డబ్ల్యుటిఓ దిష్టి బొమ్మను కాల్చారు. డబ్ల్యుటిఓను వదిలి పెట్టాలని డిమాండ్ చేసారు. రైతులపై కాల్పులు, దాడులకు గృహ మంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజల్‌ను బాధ్యులుగా పేర్కొంటూ వారి రాజీనామాను డిమాండ్ చేసింది.  పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ అంశాన్ని ఉపయోగించి  ఎన్నికల ప్రయోజనాన్ని పొందటానికి, పంజాబ్ రైతులపై తీవ్ర అణచివేతకు కుట్ర పన్నడానికి నేరుగా బాధ్యుడని కేంద్ర
పత్రికా ప్రకటనలు

పోరాడుతున్న రైతులకు అండగా నిలబడదాం!!

2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. 1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ 2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు 3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ 4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం 5) వ్యవసాయ రుణాల మాఫీ 6) విద్యుత్ బిల్లులను తగ్గింపు - అమలు చేస్తామని ప్రభుత్వం హామీ
పత్రికా ప్రకటనలు

ATHENS: Solidarity panel for Professor Saibaba and the political prisoners in India

A panel concerning the political prisonersin India, event that dozens of people participated, was held by Bookstore-Cafe "Ektos ton Teichon" in Athens. The speakers of the event, described the chronicle of persecutions, of the disabled Professor GN Shaibaba, within the framework of the prefecture of "antiterrorist" law UAPA. The panel tried to indicate the general context within which operation "Green Hunt" takes place and the fierce oppression of left and revolutionary voices
పత్రికా ప్రకటనలు

తొలి తరం విప్లవ రచయితశ్రీపతికి నివాళి

ప్రముఖ కథా రచయిత శ్రీపతి(పుల్లట చలపతి) ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాదులో మరణించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఢల్లీిలో ఆలిండియా రేడియో న్యూస్‌ రీడర్‌గా పని చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కథా రచనలోకి ప్రవేశించాక కొద్ది కాలానికి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. ఆ పోరాటానికి ప్రతిస్పందించిన తొలి తరం విప్లవ రచయితల్లో, బుద్ధిజీవుల్లో శ్రీపతి ఒకరు. శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంతో, సుబ్బారావు పాణిగ్రాహితో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. అందువల్ల కూడా ఆ పోరాట
పత్రికా ప్రకటనలు

కేంద్రంలోని బిజెపి కార్పొరేట్‌ విధానాలను ప్రశ్నిస్తున్న రైతాంగ ఉద్యమానికి జేజేలు, ఢల్లీ రైతాంగ ఉద్యమంపై ఫాసిస్టు నిర్బంధాన్ని ఖండిద్దాం

భారతదేశ చరిత్రలో ఎన్నదగిన ఢిల్లీ రైతాంగ పోరాటం మరోసారి ప్రజ్వరిల్లింది. రెండేళ్ల కింద ప్రధానంగా పంజాబ్‌, హర్యాణా ప్రాంతాల నుంచి ఢిల్లీని చుట్టుముట్టి ఏడాది పాటు  పోరాడినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ  చట్టాలను రద్దు చేయాలని ఆ రోజు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ఒత్తిడికి నరేంద్రమోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ ఉద్యమంలో వచ్చిన ఇతర ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు వాటి ఊసే లేకుండా సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం
పత్రికా ప్రకటనలు

నాస్తికోద్యమ నేత జయగోపాల్‌కు నివాళి

ప్రముఖ నాస్తికోద్యమ నేత డాక్టర్‌ జయగోపాల్‌ ఫిబ్రవరి 7న విశాఖపట్నంలో మరణించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా నాస్తికోద్యమ నిర్మాణానికి ఆయన జీవితమంతా కృషి చేశారు. 1972లో ఆయన భారత నాస్తిక సమాజాన్ని స్థాపించి దాన్ని నిర్మాణాన్ని దేశమంతా విస్తరింపజేశారు. భానాసను ఒక ఉద్యమ సంస్థగా, ప్రజా చైతన్య వేదికగా మలచడానికి జయగోపాల్‌ భావజాల, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైన కృషి చేశారు. నాస్తికవాదాన్ని ఒక సామాజికవాదంగా, హక్కుల వాదంగా కూడా ఆయన తీర్చిదిద్దారు. ఆస్తికత్వాన్ని భారతీయ సామాజిక, సాంస్కృతికరంగాల్లో ఆధిపత్యశక్తిగా గుర్తించిన ఉద్యమకారుడు ఆయన.             భారత నాగరికతలో కులం, మతం, మూఢాచారాలు ప్రజల చైతన్యాన్ని ఆడ్డుకొని
పత్రికా ప్రకటనలు

కవి, కార్యకర్త, విప్లవాభిమాని నల్లెల రాజయ్యకు నివాళి

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు నల్లెల రాజయ్య ఫిబ్రవరి 15 గురువారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రలో ఉన్నారు. గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. వరంగల్‌కు చెందిన నల్లెల రాజయ్య కవిగా, పలు సాహిత్య సంస్థల బాధ్యుడిగా సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో వరంగల్‌ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన బాధ్యుడిగా పని చేశారు.   తెలంగాణ రచయితల వేదిక గౌరవాధ్యక్షుడిగా ఆయన అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం రచనకే పరిమితం కాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా రాజయ్య పాల్గొన్నారు. కొన్నిటికి
పత్రికా ప్రకటనలు

వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర‌

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శ‌స్ర్త‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది. ఇక మిగిలింది తాత్కాలిక  మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని