పత్రికా ప్రకటనలు

డ్రోన్ దాడుల‌ను ఆపండి

ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో ప్రచారం  దేశ‌వ్యాప్త ప్ర‌గ‌తిశీల సంస్థ‌లు, ర‌చ‌యిత‌లు, మేధావులు (దండ‌కార‌ణ్యంలో బాంబు దాడుల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా వివిధ ప్ర‌జాతంత్ర సంస్థ‌లు క‌దిలాయి. అనేక మంది ర‌చ‌యిత‌లు, మేధావులు ముందుకు వ‌చ్చారు. దేశంలోని ఒక భూభాగం మీద ప్ర‌భుత్వం వైమానిక దాడులు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ఒక ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. - వ‌సంత‌మేఘం టీం) సుక్మా, బీజాపూర్ అడవులలో గుంతలు, బాంబు అవశేషాల క‌నిపిస్తున్నాయి.  వాటికి  కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వివరణనిస్తాయా? 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బొట్టం, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), మడ్ప
పత్రికా ప్రకటనలు

వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర‌

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శ‌స్ర్త‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది. ఇక మిగిలింది తాత్కాలిక  మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని
పత్రికా ప్రకటనలు

జయితా దాస్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలి

పశ్చిమ బెంగాల్ 30.03.2022 29.03.2022 రాత్రి కోల్‌కతా పోలీసుల స్పెషల్  టాస్క్ ఫోర్స్ (STF) సామాజిక కార్యకర్త జయిత దాస్‌ను అరెస్టు చేసింది. నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జయిత నదియా జిల్లాలోని జగులియా క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా కోసం చూస్తుండగా జాగులియా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తెల్ల రంగు  కారులో ఎక్కించుకెళ్ళారు. ఆమె చేతిలో వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొంత డబ్బు ఉన్న బ్యాగును తీసేసుకున్నారు. తరువాత  ఆమెను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అరెస్టును ధృవీకరించడానికి STF అధికారి రాత్రి 8 గంటలకు వచ్చే వరకు కూర్చోబెట్టారు.
పత్రికా ప్రకటనలు

వరవరరావుకు తుమకూరు అక్రమ కేసులో అక్రమ వారెంట్‌

వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైనా గైర్హాజరీ అని రూ. 25,000 జరిమానా కర్ణాటక రాష్ట్రంలోని పావగడ అక్రమ కేసులో వరవరరావు గైర్హాజరీ అని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఈ నెల 11న మధుగిరి కోర్టు  వారంట్‌ ఇచ్చి, రూ. 25 వేల జరిమానా విధించడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ కేసు 2005 ఫిబ్రవరిలో నమోదైంది. ఇందులో  వరవరరావును నిందితుడిగా చేర్చారు. ఇలాంటి కేసు ఒక‌టి ఉన్న‌ట్లు భీమా కొరేగావ్‌ కేసులో అరెస్ట‌యి పూనా జెయిల్లో ఉండ‌గా 2019లో ఆయ‌న‌కు తెలిసింది. అనారోగ్య కారణాల మీద భీమా కొరేగావ్ కేసులో వ‌ర‌వ‌ర‌రావుకు బొంబాయి హైకోర్టు షరతులతో 2021 మార్చి నెలలో
పత్రికా ప్రకటనలు

రైతులను మరిచిన బడ్జెట్

అన్నం పెడుతున్న వ్యవసాయ కుటుంబాలకు “అమృత కాలం “కాదిది వ్యవసాయ రంగానికి  కోతలు విధించిన 2022-2023 కేంద్ర బడ్జెట్  “రైతు కుటుంబాల ఆదాయం రెట్టింపు “లక్ష్యం మరచిన బడ్జెట్ ఇది ఎం‌ఎస్‌పి  చట్టబద్ధతకు ఏ హామీ ఇవ్వని కేంద్ర బడ్జెట్ ని తిరస్కరిద్దామ్ ---------------------------------------------------------------------------------- ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర రైతులకు రైతు స్వరాజ్య వేదిక పిలుపు ---------------------------------------------------------------------------------   వ్యవసాయ ,అనుబంధ రంగాలకు 4.26 శాతం నుండి 3.84 శాతానికి బడ్జెట్ తగ్గింది   పి‌ఎం ఆశా , ఇతర రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలకు బడ్జెట్ లో కోత అమానుషం ------------------------------------------------------------------------------ దేశ రైతాంగానికి ఇచ్చిన హామీల
పత్రికా ప్రకటనలు

విరసం మహాసభలను విజయవంతం చేసిన సాహితీ మిత్రులకు, రచయితలకు, ప్రజాసంఘాలకు, విప్లవాభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు.

అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ళ మధ్య విరసం 28వ మహాసభలు నెల్లూరులో విజయవంతంగా ముగిశాయి. *సాంఘిక విముక్తి కోసం ప్ర‌త్యామ్నాయ సంస్కృతి* ల‌క్ష్యంగా సంస్కృతి - మార్క్సిజం ఇతివృత్తంగా త‌ల‌పెట్టిన ఈ మ‌హాస‌భ‌ల‌ సన్నాహాల దగ్గరి నుండి చివరి దాకా నెల్లూరు మిత్రుల సహకారం మరువలేనిది. వీళ్లంతా విర‌సం ప‌నిని త‌మ ప‌నే అనుకొని ముందుకు వ‌చ్చారు.అడిగిన వెంటనే వేదిక ఇవ్వడానికి ముందుకొచ్చిన సంఘమిత్ర స్కూల్ యాజమాన్యం అర్ధరాత్రి పోలీసుల‌ బెదిరింపులు ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఏకంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయిస్తామనే దాకా పోలీసులు వెళ్లారు. ఇది రాజ్య దుర్మార్గానికి పరాకాష్ట.భిన్నాభిప్రాయాలను చర్చించలేనితనం, సహించలేనితనం ఫాసిస్టు లక్షణం. గత కొన్నేళ్లుగా
పత్రికా ప్రకటనలు

కమ్యూనిస్ట్ వ్యతిరేక “పవిత్ర విచారణ”*ను తిరస్కరించండి!

పెరూ కమ్యూనిస్టులకు సంఘీభావం! అభిమయేల్ గుజ్మన్ పార్థివ శరీరాన్ని అతని సహచరులకు అప్పగించండి! అరెస్ట్ నుండి నేటి వరకు మొత్తం 29 సంవత్సరాల పాటు అమెరికా సహాయంతో, చిత్రహింసలపాలు చేసి నిదానంగా నిర్మూలించే అల్పసంఖ్యాత ప్రభుత్వాల విధానం ఫలితంగా ఖైదు చేయబడిన పెరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడి మరణించాడు. అభిమయేల్ గుజ్మన్‌ను అక్షరాలా కొన్ని మీటర్ల వెడల్పు ఉన్న భూగర్భ బోనులో ఖననం చేసారు; ఒక విస్తృత, ప్రజాదరణ పొందిన సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు మాత్రమే కాకుండా, ప్రతిఘటించినందుకు, తనని బందీ చేసినవారికి లొంగిపోనందుకు, తన భావజాలాన్ని విడవనందుకు కూడా అతన్ని శిక్షించారు. ఇన్ని సంవత్సరాలనుండి జైలులో
పత్రికా ప్రకటనలు

No to the anticommunist “Holy Inquisition”!

Solidarity to the Peruvian communists! Hand over the body of Abimael Guzman to his comrades! The death of the imprisoned leader of the Peruvian communist party, was the result of a slow and torturous extermination policy imposed by all the oligarchy governments, with the assistance of the USA, from his arrest to today, a total of 29 years. Abimael Guzman was buried literally in an underground cage of a few
పత్రికా ప్రకటనలు

గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫిలిప్పీన్స్‌ విప్లవ కళాకారుల హత్యలను ఖండిస్తూంది!

ఆగస్టు 16 న, విప్లవ చిత్రకారుడు కామ్రేడ్ పార్ట్స్ బగానీని ఫిలిప్పీన్స్ సైన్యం, పోలీసులు దారుణంగా హత్య చేశారు. కామ్రేడ్ పార్ట్స్ బగానీ న్యూ పీపుల్స్ ఆర్మీ (NPA) పోరాట యోధుడు. ఉద్యమంలో ప్రసిద్ధ కళాకారుడు, సామ్రాజ్యవాద, భూస్వామ్యవాద, పెట్టుబడిదారీ విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్న ఫిలిప్పీన్స్ ప్రజల పోరాటానికి తన జీవితాన్ని, ప్రతిభను అంకితం చేశాడు. ప్రజల రోజువారీ జీవితం, పోరాటాల నుండి అతను స్ఫూర్తిని పొందాడు. ప్రజాదరణ పొందిన అతని కళాకృతులు విప్లవకర ప్రచురణలు, పుస్తకాలు, సాహిత్య రచనలను అలంకరించాయి, విశాల ప్రజానీకానికి స్ఫూర్తినిస్తూ  పోరాట మార్గం వైపు ప్రోత్సహించాయి. ఫిలిప్పీన్స్ పాలకవర్గం ఆదేశాల మేరకు హత్యచేసి,
పత్రికా ప్రకటనలు

కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?

అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా? అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో