పత్రికా ప్రకటనలు

కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?

అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా? అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో
పత్రికా ప్రకటనలు

నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం

విరసం తదితర 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను వ్యతిరేకించండి 26.4.2021 విప్లవ రచయితల సంఘం సహా 16 ప్రజా సంఘాలను చట్టవ్యతరేక సంస్థలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకు, సంఘం పెట్టుకొనే హక్కుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ జీవో ప్రభుత్వ పాలనా పద్ధతులకు కూడా పూర్తి వ్యతిరేకంగా వెలుగులోకి వచ్చింది. జీవో ఎంఎస్ 73 పేరుతో మార్చి 30న ఈ ఉత్తర్వులను తయారు చేశారు. ఏప్రిల్ 28న పత్రికలకు విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో జీవోలు