సమీక్షలు

గుండె నెత్తురులతో పదునెక్కి  సాగుతున్న విముక్తి చరిత్ర

అల్లం రాజయ్య సాహిత్యం చదవడం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజయ్య ప్రతి నవల చారిత్రక మట్టి పొరలలో నుండి పుట్టుకొస్తాయి. కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారు అనుకుంటున్న మట్టిమనుసులు కళ్ళల్లో నలుసులై దొరలను,భూస్వాములను తద్వారా వారికి అండగా నిలబడ్డ రాజ్యంపై ఎదురు తిరిగిన చరిత్రకు అక్షరూపం ఇస్తాడు రాజయ్య. అది కొలిమంటున్నది కావచ్చు, వసంతగీతం కావచ్చు, ఊరు, అగ్నికణం, సైరన్ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన పోరాటాల చరిత్రే. అదే వరవడిలో విముక్తి నవల కూడా పోరాటాల చరిత్ర రచనలో భాగంగా వచ్చింది. నక్సల్భరి ఆరంభం గురించి నక్సల్భరి 
సమీక్షలు

అన్ని వైపులలో రాయలసీమ

ముందుగా పాఠకులకు విజ్ఞప్తి. మీరు చదవబోతున్నది పాణి నవల ‘అనేక వైపుల’పై విమర్శ  కాదు, కనీసం సమీక్ష కాదు. ఇది కేవలం ఒక సామాన్య పాఠకుని  హృదయ స్పందన మాత్రమే. ఎన్నడూ ఏ పుస్తకాన్ని పూర్తయ్యంత వరకు ఒకే మారు చదివే అలవాటు లేని నన్ను, ఈ నవల దాన్ని పూర్తి చేసేంతవరకు మరో పుస్తకాన్నే కాదు, కంప్యూటర్‌ జీవిగా బతికే నన్ను దానికీ దూరం చేసింది. అంత లావు నవల ఎలా చదువుతానా? అనుకున్న నన్ను దానికి కట్టిపడేసాడు పాణి. దానికి కేవల ఆ నవల శిల్పం కారణం కాదు. అందులోని సారమే నన్ను కట్టి పడేసింది.
పరిచయం

వొఖ్క భారతి.. అనేక ప్రశ్నలకు సమాధానం

‘ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో’  ఆడవాళ్ళో నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో  పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు  అర్థాలు వేరులే అని  పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ  కార్టూన్లు అనేకం. కానీ  ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన  వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల  వుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా
పరిచయం

వెలుగును హత్య చేసిన చీకట్ల కథలే మార్జినోళ్లు

సమాజం పట్ల బాధ్యత గల రచయితల్లో సమాజానికి ఏదో చేయలాని తపన పడి, సమాజం వైపు నిలబడి తమ గళాన్ని విప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సామాజిక సృహను కలిగి సాహిత్య సేవా దృక్పథంతో, సమాజం మార్పు కోసం ఎల్లప్పుడూ ముందుండే రచయితల కలం నుండి మాత్రమే భావోద్వేగమైన కథలు బయటికొస్తాయి.అలాంటి కథలే పి.శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్ళు కథలు.  ఈ కథలు సమాజంపై ప్రభావం చూపే కథలని చెప్పొచ్చు. ఇలాంటి రచయితలు ఒక నిబద్ధత, సమాజం పట్ల కొంత బాధ్యత వుండడం వల్ల కూడా ఇటువంటి కథలను రాస్తారు. నేటి కాలంలో ప్రేమ కవితలకో, కథలకో
పరిచయం

ఈ తరం జమీల్యా

నన్ను కట్టిపడేసి ఓ చోట కూర్చోబెట్టి ప్రేమగా నాకోసం ఓ పాట పాడి, నేను దాటొచ్చిన ప్రేమ కధ చెప్పి ఏడిపించి కళ్ళు తుడుచుకునేలోపే మాయమైంది. ఇప్పుడు ఆమె నా ప్రేయసి. జమిల్యా  అతి త్వరగా అతి తీవ్రంగా అతిగా నేను ప్రేమించిన తక్కువ పాత్రల్లో జమీల్యా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన నా ప్రియురాలు రాజేశ్వరిని మళ్ళీ చూసినట్టుంది. ఒక చిన్న పెయింటింగ్ చెప్పే కథ. అది గీసిన కుర్రాడి ప్రేమకథ. తన వదిన ప్రేమకథ. ఓ గాయపడిన ఒంటరి సైనికుడి కథ. చాలా మామూలుగా మొదట్లో వేసిన చిత్రం చూడడానికి ఎలా ఉన్నా,
సమీక్షలు

సీమ‌ కవిత్వంపై కొత్త వెలుగుల “రవ్వల సడి”

రాయలసీమ కవిత్వాన్ని పరిచయం చేస్తూ నేను ఒకానొక ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని గురించి చెప్పడం ద్వారా ఆ ప్రాంతాన్నీ, దాని వేదనలనూ,  ఆకాంక్షలనూ,  ఆశాభంగాలనూ, అక్కడే పుట్టిపెరిగిన ఆలోచనాపరుల రాతల్లో నుంచి పరిచయం చేసే పని చేశాను - జి. వెంకటకృష్ణ *** ఆధునిక రాయలసీమ కవిత్వాన్ని సమీక్షించడం చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే, కాల ప్రవాహంలో వచ్చి చేరిన కొత్త చేర్పులనూ, కొత్త మార్పులనూ, అవి కవిత్వం లో ప్రవేశింపజేసే విభిన్న వస్తు శిల్పాల పోకడలనూ డైసెక్ట్ చేస్తూ, మొత్తంగా ఆయా కవుల దృక్పధాన్ని అంచనా వేసి, పాఠకులకు చేరవేయడం శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని
సమీక్షలు

అనంత జీవనకథా ముకురం

ఒక రచనను దేశకాల నేపథ్యంలో వివేచించడం ఒక పద్ధతి. అలా వివేచించడం వల్ల ఆ రచన ఆదేశ స్థితిగతులను వివరించడంతో పాటు ఆ రచన ఆకాలాన్ని విశ్లేషిస్తున్న తీరులో వైరుధ్యాల్ని గమనించి ఆ వైరుధ్యాల స్వభావాన్ని విశ్లేషించిన తీరునూ గమనించవచ్చు. ఆ వైరుధ్యాలలో ఆ రచన ఎటువైపు నిలబడిందో రచయిత అవగాహనకుండిన శాస్త్రీయత ఏ పాటిదో అంచనా వేయవచ్చు. ఇటీవల మల్లెల నరసింహమూర్తి 'మాకూ ఒక నది కావాలి” కవిత్వాన్ని పై వివరించిన నేపథ్యంలో వివేచించడం ఈ వ్యాస పరిమితి. ఈ కవితలు రాసిన తేదీలను రచయిత ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ౨౦౦౪ లో ఈ కవి రాసిన
సమీక్షలు

నెత్తుటి తడి ఆరని బస్తర్‌

దేశం కార్పొరేట్లకు’ అనే 84 పేజీల చిన్న పుస్తకంలోని వ్యాసాల్లో ఆదివాసులు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టులు కనబడతారు. దాన్ని ఓర్వలేని పాలకులు చేసిన దురాగతాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇందులో  నాకు అనిపించిన నాలుగు విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. పుస్తకం చదువుతుంటే పాలకులు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజ ఆరోగ్యానికి అవసరమైన గాలీ, నీరు, ఖనిజాలు, కలపను కాపాడుతూ అవి ఈ దేశ ప్రజలకు దక్కాలన్నందుకే ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వాలకు కంటగింపయ్యారు. ఆ వనరులను కాపాడటానికి పోరాడటం పాలకుల
సమీక్షలు

ట్రాన్స్ జెండర్ జీవితానికి మరో పార్శ్వం

ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ సమస్యలు తెలుగు సాహిత్యంలో రావడం చూస్తున్నాం. ఇది ఆహ్వానించాలిసిన పరిణామం. కొన్ని కథలూ, కొన్ని కవితలూ, ఒక దీర్ఘ కవిత, స్వామి రాసిన "అర్ధనారి", వరలక్ష్మి తెలుగు లోకి అనువదించిన లైంగిక వైవిధ్యాలు, ఇప్పుడు సోలోమన్ విజయ కుమార్ రాసిన చిన్న నవల "సన్ ఆఫ్ జోజప్ప" ఈ కోవకి చెందినవి. భారత సమాజం ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని ఇంకా అంగీకరించలేక ఉంది. వారు కూడా మనుషులే అని గౌరవించలేక ఉంది. సమాజం సంగతి సరే, ఒక ట్రాన్స్ జెండర్స్ తన సొంత కుటుంబం నుంచి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. నిరాదరణ ఒక్కటే
సమీక్షలు

భావుకత, అన్వేషణ కలగలసిన కవిత్వం

ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి. శూన్యం కవితలో.. ‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’ అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’  కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ  వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు.