సమీక్షలు

రాజకీయాలే కథలైన సందర్భం

జైలు కథలు అనగానే నాకు ఎప్పుడో స్వతంత్ర సమయంలోనో, తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనో వెలువడిన కథలు అవ్వొచ్చు అనే ఆలోచన ఉండేది. మొదటిసారి బి. అనూరాధ గారి పుస్తకం హజారీబాగ్ జైలు కథలు చదివినప్పుడు "ఓహో నేను పుట్టిన తర్వాత కూడా జైలు కథలు వచ్చాయి, అవి నా కాలానికి సంబంధించిన జైలు కథలే" అనే అంశం మెదలగానే ఒకింత ఆశ్చర్యం మరో వైపు జైలు కథల్లోని పాత్రల జీవితాలు విస్మయానికి గురిచేశాయి. రచయిత్రి అనూరాధతో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఆమె కథల్లోనే ఒక గంభీరమైన వ్యక్తిత్వంగా నా మనసులో ముద్రించుకుపోయారు. హజారీబాగ్ జైలు కథలు పుస్తకం
సమీక్షలు

నిశిత విశ్లేష‌ణ‌

తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు.  ఈ పుస్త‌కం వ‌చ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర అవసరమైన సాహిత్య విమర్శ అయినందున ఈ వ్యాసాలకు కాలం తీరదు. "నిశిత" అనే ఈ పుస్తకం పేరు నూరుపాళ్ళు సార్థకమని మనం ఒప్పుకొని తీరుతాం. ఇందులో పరిశీలన నిశితమైనదే. కానీ చెంచయ్య గారి వ్యక్తిత్వం నుండి చెప్పిన తీరు "వ్యక్తిత్వమే సాహిత్య విమర్శ"  అనిపిస్తూంది.  "కవిలో చిత్తశుద్ధి ఉంది- అవగాహనే కొరవడింది" అనే సమీక్షా వ్యాసంలో కవిత్వం రాసే వాళ్లలోని గందరగోళాన్ని వివరించారు. సరియైన అధ్యయనం లేకపోవడం వల్ల కవిత్వంలో
సమీక్షలు

సజీవ సాంస్కృతిక పత్రం “తిరుపతి గంగ జాతర ”

2026, మే నెలలో తిరుపతి వేదికగా, రచయిత నాగపట్ల భక్తవత్సల రెడ్డి తన 'తిరుపతి గంగజాతర' పుస్తకాన్ని విడుదల చేశారు. జానపద విజ్ఞానం, గ్రామదేవతల ఆరాధన, జాతరల వంటి సాంస్కృతిక ఉత్సవాలను సాధారణంగా కేవలం మతపరమైన విశ్వాసాలుగా ప్రజల వినోద సాధనాలుగా మాత్రమే చూసే ఒక సంప్రదాయక దృక్పథం సమాజంలో ప్రబలంగా ఉంది. అయితే, “తిరుపతి గంగ జాతర” అనే ఈ పుస్తకం అత్యంత లోతైన సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకం కేవలం ఒక దేవత మహిమలను కీర్తించే పుస్తకం కాదు. ఇది ఒక గ్రామీణ సమాజపు ఉత్పత్తి సంబంధాలు, వర్గ, కుల నిర్మాణం, ప్రజల సామూహిక
సమీక్షలు

సామాజిక వాస్తవం “జోలెవిలువ”

హైమావతి కథల సంపుటి "జోలె విలువ".ఈ పుస్తకంలో సీతమ్మ, ప్రయాణం, విముక్తి మార్గం, మార్పు కోరే సహచర్యం, జోలెవిలువ అనే కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ వాస్తవానికి దగ్గరగా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పుస్తకం చదివితే ఇవి కేవలం కథలు కాదు. వాస్తవాలుగా, మన చుట్టూ జరిగిన సంఘటనలని మనకు అర్థమవుతుంది. రచయిత్రి తన చుట్టూ ఉన్న సమాజంలోని దోపిడి, పీడన, అంటరానితనం, ఆకలి మంటలు, పేదరికం, బాల్య వివాహాలు, వలసలు, కుల వివక్ష, జోగిని వ్యవస్థ, లింగ వివక్ష, వర్ణం మతం, అవిద్య, మరియు తన పరిసరాల్లోని వ్యక్తుల మనస్తత్వాలు ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో
సమీక్షలు

విముక్తి పోరాట కథలు

ఇటీవ‌ల *కొలిమి* ప్ర‌చుర‌ణ‌గా విడుద‌లైన *అల్లం రాజ‌య్య క‌థ‌లు-నేప‌థ్యం* పుస్త‌కానికి రాసిన ముందుమాట‌)  కొన్ని కథలు మనల్ని నిద్రపోనీయవు. వెంటాడతై. నిద్రలోనూ. మెలకువలోనూ. లోలోపల కల్లోలం రేపుతై. మనసంతా దిగులు నింపుతై. కన్నీళ్లు నింపుతై. జీవితాంతం గుర్తొస్తయి. అట్లాంటి కథకులు కొందరే ఉంట‌రు. తమ చుట్టూ ఉన్న జీవితాలను నిశితంగా పరిశీలించి రాస్తరు. లోలోపల దగ్దమవుతూ వెన్నెల కురిపించే వాక్యాలు రాస్తరు. తెలంగాణ నేలన ఉవ్వెత్తున ఎగసిన ప్రజాపోరాటాలను కథలుగా రాసిన అల్లం రాజయ్యదీ అదే దారి. ఆ దారి ప్రజా గర్జనై ఉరిమిన ఉత్తర తెలంగాణ భూపోరాటాల దారి. నాగేటి సాళ్లల్ల రగిలిన రైతుకూలీల జైత్రయాత్ర దారి.
సమీక్షలు

మట్టి పరిమళం వెదజల్లే కథలు

(ఇటీవ‌ల విడుద‌లైన తాయ‌మ్మ క‌రుణ   క‌థ‌ల సంపుటి *విభ‌జ‌న రేఖ‌*కు రాసిన ముందుమాట‌) రచయితగా కరుణ పాఠకులకి కొత్త కాదు. దాదాపు మూడు దశాబ్దాల కాలంగా కథలు రాస్తోంది. ‘తాయమ్మ కథ’తో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టిన కరుణ, మొట్టమొదటి కథతోనే చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ కథ పేరే ఇంటి పేరుగా మారిపోయి తాయమ్మ కరుణ అయ్యింది. ఇప్పటికే రెండు కథా సంకలనాలు ప్రచురించి ఉంది. విప్లవోద్యమం నేపథ్యంలో కథలు రాసిన తొలి తరం అజ్ఞాత విప్లవ మహిళా రచయితల్లో కరుణ కూడా ఒకరు. నక్సల్బరి ఉద్యమం భారత ప్రజల ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది
సమీక్షలు

గతం కూడా వర్తమానమే..

 కవిత్వ రచనలో అనేక ప్రాపంచిక దృక్పథాలు ఉంటాయి. సృజనాత్మకత ఏదో ఒక దగ్గర స్థిరం కాదు. కవి చుట్టు పరిభ్రమిస్తున్న సామాజిక స్థితి యొక్క వ్యక్తీకరణ ప్రధానం. అనుసంధానం కూడా ప్రధానమైనదే. ప్రాంతం, సామాజికత లేదా ఇతర భిన్న రూపాలు కవిత్వంలో ఇమడవచ్చు. ఆ ఇమడిక లో సాంధ్రత ముఖ్యమైనది. ఒకానొక ప్రాంతానికి ప్రాతినిత్య కవి అనలేము. దృక్పథానికి సంబంధించిన భావజాలం. కవి పుట్టుక, కవిత్వ రచన ఏచలనం దగ్గర మొదలైంది. కేంద్ర స్థానాన్ని వెతకాలి. ఈ వెతకడంలో కవి అంత రంగం కనబడతుంది. కేవలం సంవేదన మాత్రమేనా? ఈ రసాయినిక ప్రక్రియ వెనుక దాగిన కల్లోలం ఏదో
సమీక్షలు

త్యాగాల చరిత్ర తల్లులు-బిడ్డలు

తల్లులు బిడ్డలు రచించినది హుస్సేన్. సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసిన వ్యక్తి. తల్లులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ కన్నా, తల్లులకై బిడ్డలు చేసిన పోరాటాలు త్యాగాలే ఎక్కువ ఉన్నాయి ఇందులో. తల్లుల కొరకై బిడ్డలు,బిడ్డల కొరకై తల్లులు,తల్లడిల్లిన క్రమం, బిడ్డలు విప్లవంలో ఎదుగుతున్న తీరు చూసి సంతోషించిన తల్లులు, దూరమవుతున్న పిల్లలను చూస్తూ బాధపడతారు.బిడ్డల క్షేమాన్ని కోరుకుంటారు. ఈ పుస్తకం కేవలం తల్లులు బిడ్డల మధ్య జరిగినది కాదు. ఇది ఒక తరం ధైర్యానికి సాహసానికి, త్యాగనిరతికి, ప్రతీక ఈ పుస్తకం. ఉత్తర తెలంగాణ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల,మంచిర్యాల, ప్రాంతంలో చెలరేగిన ఉద్యమాల ఊట చెలిమ. సింగరేణి
సమీక్షలు

క‌థ‌ల సేద్యం

శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు,
సమీక్షలు

అశాంత, అవిశ్రాంత విజయగాథ

ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు?  విధింపులను కాదని ఎంపికలను సాధన చేయడం ఎట్లా? యథాస్థితికీ మార్పుకూ మధ్యనే కాదు, అనేక కొత్తదారుల మధ్య, అనేక మంచిదారుల మధ్య దిక్కుతోచని తనాన్ని అధిగమించడం సాధ్యమా? పై ప్రశ్నలను ఉదాహరణలతో సహా చర్చించుకుంటూ పోతే, అది శాంత జీవితం అవుతుంది. ఆమె ప్రయాణాన్ని  దాని ముళ్ల దారుల నుంచి కాలిబాటల నుంచి సొంతంగా వేసుకున్నరహదారుల దాకా,  ఆటుపోట్లు, జయాపజయాలు, రాజీలూ సర్దుబాట్ల తో సహా, బొమ్మకడితే అది ‘చుక్కపొడుపు’ నవల.  శాంత