పరిచయం

భారత రాజ్యాంగం తన విముక్తి వాగ్దానాలను నెరవేర్చిందా?

స్వేచ్ఛా భారత రాజ్యాంగ భావనలపై ప్రముఖ మేధావులు రాసిన పదకొండు చిన్న వ్యాసాల పరంపరలో చివరి పుస్తకాన్ని రాసేందుకు ఆనంద్ తేల్తుంబ్డేను ఆహ్వానించడం సముచితమని మేము భావించాము. ఆయన భారతదేశపు అత్యంత గౌరవనీయ మేధావులలో ఒకరు. ఇటీవలే ‘మనస్సాక్షి’ ఖైదీ (prisoner of conscience) గా ఆయన జైలు జీవితం అనుభవించారు. మేము తీసుకు వచ్చిన ఈ పుస్తక పరంపరలో రాజ్యాంగాన్ని నాయకులు ఎలా ఊహించారు, ఎలా చర్చించారు, ఎలా రచించారు అనే అంశాలను మేము పరిశీలించాము. అలాగే లౌకికత్వం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగ దృక్పథాన్ని, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమాఖ్య వ్యవస్థ, శాస్త్రీయ దృక్పథం
సమీక్షలు

సాయుధ మహిళలురాసిన కథలు

విప్లవం అనేది కేవలం బాహ్య పోరాటం మాత్రమే కాదు—అది అంతర్గత చైతన్యం, విద్య. తోటివారి మద్దతుకు సంబంధించిన విషయం కూడా. ఆయుధాలు చేపట్టిన మహిళల పోరాట మార్గంతోనూ, వారు ఆయుధాలు ధరించడాన్నీ మనం ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు. కానీ వారి జీవిత పోరాటాన్ని మనం తోసిపుచ్చలేము. ఉద్యమం, పోరాటం, ప్రతిఘటన సరైనవని నమ్మేవారు, పోరాటానికి లేదా ప్రతిఘటనకు ఒకే ఒక మార్గం ఉండదని గ్రహించాలి. ఏ ప్రాంతంలో ఉద్యమం ఎలా ఉంటుందనేది అక్కడి పరిస్థితులే నిర్ణయిస్తాయి. అంటే, అణచివేత స్వభావమే ప్రతిఘటన మార్గాన్ని కూడా నిర్దేశిస్తుంది. అందువల్ల, ఏ ఉద్యమాన్ని కూడా—ఉదాహరణకు మావోయిస్ట్ ఉద్యమాన్ని కూడా—అది ఆయుధాలు చేపట్టినంత
సమీక్షలు

సామాజిక సౌందర్యాత్మక సంగీతంమట్టి తంబూర

మల్లెల నరసింహమూర్తి మల్లె పువ్వు లాంటి కవిత్వాన్నే కాదు పాలకవర్గాల దోపిడీ విధానాల్ని, రాయలసీమ కరువును, వెనుకబాటుతనాన్ని, ముఠా కక్షల్ని నిరసిస్తూ సీరియస్ కవిత్వాన్ని రాసే అభ్యుదయవాది. “మట్టి తంబూర” అనే శీర్షికతో ఈ కావ్యాన్ని వెలువరించడమూ, ఒక జానపద సంగీత వాద్యంగా ఈ కావ్యాన్ని ప్రకటించడంతోనే మట్టితో కవి కవిత్వం ఎంతలా మమేకమైందో అర్థం అవుతుంది. 2004లో ప్రాంతీయ అస్తిత్వంలో భాగంగా “జలస్వప్నం” కావ్యాన్ని రాస్తే దానికి కొనసాగింపుగా 2024న రాయలసీమ నీటివ్యథలపై “మాకు ఒక నది కావాలి” రాశాడు. అదే పరంపరలోనే ‘మట్టి తంబూర ‘శీర్షికతో మరో కావ్యాన్ని వెలువరించాడు. ఈ మట్టి తంబూర కేవలం
పరిచయం

చరిత్రలో పాక హనుమంతు

ఈ మధ్యే అమరుడైన పాక హనుమంతు (గణేష్) స్మరణలో విప్లవోద్యమ సానుభూతిపరులు, మద్దతుదారులు ఆయన అమరత్వాన్ని స్మరిస్తూ, శ్లాఘిస్తూ చాలా దుఃఖంతో రాసిన వ్యాసాలివి. గతంలో కూడా అమరుల గురించి రచనలు వచ్చాయి. ఈ అమరత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. విప్లవోద్యమం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న దశలో హనుమంతు అసువులు బాశాడు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ ప్రమాణాలను పూర్తిగా విస్మరించి బాహాటంగా ఒక తిథి నిర్ణయించి, ఆ తిథి లోపల ఉద్యమాన్ని రూపు మాపుతామని రాజ్యం  ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే సాయుధ బలగాలకు పూర్తి అధికార మిచ్చి వందల సంఖ్యలో విప్లవకారులను హత్య చేసింది. ఆ నేపథ్యంలో పాక హనుమంతు
పరిచయం కొత్త పుస్తకం

संघर्षों में भारतीय महिलाओं का इतिहास

संघर्षों में भारतीय महिलाओं का इतिहास’ विषय पर ये नोट्स मुख्यतः 19वीं और 20वीं शताब्दी के आंदोलनों से संबंधित हैं, साथ ही इनमें समकालीन आंदोलनों को भी शामिल किया गया है। जब हम संघर्षों की बात करते हैं, तो हमारा आशय केवल उन आंदोलनों से होता है जिन्होंने समाज को आगे बढ़ाने में मदद की। इस बात को साफ-साफ समझना ज़रूरी है, ख़ासतौर पर इसलिए कि हमारे देश में अनेक
సమీక్షలు

మేదరి వృత్తి వెలుగు – నీడలు

"వెదురుతోని వేయి లాభాలు" అంటారు. వ్యవసాయ నాగరికత పెట్టుబడిదారి పూర్వ దశలో ఉన్నప్పుడు, దానికి ప్రధాన అనుబంధ వృత్తులుగా మాదిగ, కమ్మరి, వడ్రంగి వృత్తులు, కొంత అప్రధాన వృత్తులుగా కుమ్మరి, మేదరి, కౌంసాలి, కంచరి, శిల్పి వృత్తులు ఉనికిలో ఉన్నాయి. చాకలి, మంగళి వృత్తులు సేవా వృత్తులుగా ఉండేవి. వృత్తికారులు ప్రధానంగా మాదిగ, కమ్మరి, వడ్రంగి వారు సంవత్సరం పొడవునా పంటలు పండించడానికి అవసరమైన పనిముట్లు చేసి ఇచ్చేవారు. చెడిపోయిన వాటిని మరమ్మతు చేసే వారు. వీరికి పంటల మీద కళ్ళంలోనే, రైతుకు ఉన్న భూమిని కొలమానంగా తీసుకొని ప్రతిఫలం, ధాన్యం రూపంలో ముట్టజెప్పేవారు. ఈ ఏర్పాటును సామాజిక
సమీక్షలు

రాజకీయాలే కథలైన సందర్భం

జైలు కథలు అనగానే నాకు ఎప్పుడో స్వతంత్ర సమయంలోనో, తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనో వెలువడిన కథలు అవ్వొచ్చు అనే ఆలోచన ఉండేది. మొదటిసారి బి. అనూరాధ గారి పుస్తకం హజారీబాగ్ జైలు కథలు చదివినప్పుడు "ఓహో నేను పుట్టిన తర్వాత కూడా జైలు కథలు వచ్చాయి, అవి నా కాలానికి సంబంధించిన జైలు కథలే" అనే అంశం మెదలగానే ఒకింత ఆశ్చర్యం మరో వైపు జైలు కథల్లోని పాత్రల జీవితాలు విస్మయానికి గురిచేశాయి. రచయిత్రి అనూరాధతో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఆమె కథల్లోనే ఒక గంభీరమైన వ్యక్తిత్వంగా నా మనసులో ముద్రించుకుపోయారు. హజారీబాగ్ జైలు కథలు పుస్తకం
సమీక్షలు

నిశిత విశ్లేష‌ణ‌

తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు.  ఈ పుస్త‌కం వ‌చ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర అవసరమైన సాహిత్య విమర్శ అయినందున ఈ వ్యాసాలకు కాలం తీరదు. "నిశిత" అనే ఈ పుస్తకం పేరు నూరుపాళ్ళు సార్థకమని మనం ఒప్పుకొని తీరుతాం. ఇందులో పరిశీలన నిశితమైనదే. కానీ చెంచయ్య గారి వ్యక్తిత్వం నుండి చెప్పిన తీరు "వ్యక్తిత్వమే సాహిత్య విమర్శ"  అనిపిస్తూంది.  "కవిలో చిత్తశుద్ధి ఉంది- అవగాహనే కొరవడింది" అనే సమీక్షా వ్యాసంలో కవిత్వం రాసే వాళ్లలోని గందరగోళాన్ని వివరించారు. సరియైన అధ్యయనం లేకపోవడం వల్ల కవిత్వంలో
సమీక్షలు

సజీవ సాంస్కృతిక పత్రం “తిరుపతి గంగ జాతర ”

2026, మే నెలలో తిరుపతి వేదికగా, రచయిత నాగపట్ల భక్తవత్సల రెడ్డి తన 'తిరుపతి గంగజాతర' పుస్తకాన్ని విడుదల చేశారు. జానపద విజ్ఞానం, గ్రామదేవతల ఆరాధన, జాతరల వంటి సాంస్కృతిక ఉత్సవాలను సాధారణంగా కేవలం మతపరమైన విశ్వాసాలుగా ప్రజల వినోద సాధనాలుగా మాత్రమే చూసే ఒక సంప్రదాయక దృక్పథం సమాజంలో ప్రబలంగా ఉంది. అయితే, “తిరుపతి గంగ జాతర” అనే ఈ పుస్తకం అత్యంత లోతైన సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఈ పుస్తకం కేవలం ఒక దేవత మహిమలను కీర్తించే పుస్తకం కాదు. ఇది ఒక గ్రామీణ సమాజపు ఉత్పత్తి సంబంధాలు, వర్గ, కుల నిర్మాణం, ప్రజల సామూహిక
సమీక్షలు

సామాజిక వాస్తవం “జోలెవిలువ”

హైమావతి కథల సంపుటి "జోలె విలువ".ఈ పుస్తకంలో సీతమ్మ, ప్రయాణం, విముక్తి మార్గం, మార్పు కోరే సహచర్యం, జోలెవిలువ అనే కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ వాస్తవానికి దగ్గరగా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పుస్తకం చదివితే ఇవి కేవలం కథలు కాదు. వాస్తవాలుగా, మన చుట్టూ జరిగిన సంఘటనలని మనకు అర్థమవుతుంది. రచయిత్రి తన చుట్టూ ఉన్న సమాజంలోని దోపిడి, పీడన, అంటరానితనం, ఆకలి మంటలు, పేదరికం, బాల్య వివాహాలు, వలసలు, కుల వివక్ష, జోగిని వ్యవస్థ, లింగ వివక్ష, వర్ణం మతం, అవిద్య, మరియు తన పరిసరాల్లోని వ్యక్తుల మనస్తత్వాలు ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో