నెత్తుటి తడి ఆరని బస్తర్
దేశం కార్పొరేట్లకు’ అనే 84 పేజీల చిన్న పుస్తకంలోని వ్యాసాల్లో ఆదివాసులు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టులు కనబడతారు. దాన్ని ఓర్వలేని పాలకులు చేసిన దురాగతాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇందులో నాకు అనిపించిన నాలుగు విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. పుస్తకం చదువుతుంటే పాలకులు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజ ఆరోగ్యానికి అవసరమైన గాలీ, నీరు, ఖనిజాలు, కలపను కాపాడుతూ అవి ఈ దేశ ప్రజలకు దక్కాలన్నందుకే ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వాలకు కంటగింపయ్యారు. ఆ వనరులను కాపాడటానికి పోరాడటం పాలకుల