సమీక్షలు

క‌థ‌ల సేద్యం

శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్‌’ పదిహేను కథలు చ‌ద‌వ‌డ‌మంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావ‌డ‌మే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్‌, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వ‌రాచారి,  శాంతినారాయ‌ణ‌, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంక‌ట‌కృష్ణ‌, సుభాషిణి, రామ‌కృష్ణ‌, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా,  త్రిపురనేని శ్రీనివాస్‌, విష్ణు వంటి ఆత్మీయులంద‌రితో క‌లిసి తిరిగిన రోజుల‌వి.    విద్యార్థి ఉద్యమాలు,
సమీక్షలు

అశాంత, అవిశ్రాంత విజయగాథ

ముందే నిర్ణయమైన పరిస్థితుల మధ్య, నియంత్రించలేని పరిణామాల మధ్య, మనుషులు సొంత వ్యక్తిత్వాల్ని ఎట్లా తీర్చిదిద్దుకోగలరు? జీవితగమనాన్ని తామే నిర్దేశించుకునే ఇచ్ఛను ఎట్లా నెరవేర్చుకోగలరు?  విధింపులను కాదని ఎంపికలను సాధన చేయడం ఎట్లా? యథాస్థితికీ మార్పుకూ మధ్యనే కాదు, అనేక కొత్తదారుల మధ్య, అనేక మంచిదారుల మధ్య దిక్కుతోచని తనాన్ని అధిగమించడం సాధ్యమా? పై ప్రశ్నలను ఉదాహరణలతో సహా చర్చించుకుంటూ పోతే, అది శాంత జీవితం అవుతుంది. ఆమె ప్రయాణాన్ని  దాని ముళ్ల దారుల నుంచి కాలిబాటల నుంచి సొంతంగా వేసుకున్నరహదారుల దాకా,  ఆటుపోట్లు, జయాపజయాలు, రాజీలూ సర్దుబాట్ల తో సహా, బొమ్మకడితే అది ‘చుక్కపొడుపు’ నవల.  శాంత
సమీక్షలు

Renuka Becoming Midko

Comrade GumudavelliRenuka (Midko)’s literature is a great contribution to Telugu literature, especially revolutionary literature. It was through Renuka’s stories that everyone came to know that "Midko" means "a firefly." Today, these stories are no longer confined to Telugu speaking states but have crossed the linguistic and regional barriers in the country by being translated into multiple Indian languages. They are even crossing national boundaries and gaining a global readership. However,
సమీక్షలు

మన కాలపు తల్లులు-బిడ్డల కథే విప్లవోద్యమం

హుస్సేన్‌ రచించిన తల్లులు, బిడ్డలు చారిత్రిక స్మృతులు సింగరేణి విప్లవోద్యమ చరిత్రను ఈ తరానికి హృద్యంగా పరిచయం చేస్తుంది. “'తల్లులు-బిడ్డలు” చదువుతున్నసేపు గోర్కీ 'అమ్మ” నవల గుర్తుకు వస్తూ ఉంటుందని, ముందుమాట రాసిన విమల్‌ అంటాడు. ఇది వాస్తవమే. రష్యన్‌ విప్లవోద్యమలో   వచ్చిన సాహిత్యాగానికి   ఎంతో లోతు, విస్తృతి ఉంది. అది ప్రపంచంలోనే ఒక గొప్ప సాహిత్యంగా గుర్తించబడింది. అందులో అమ్మ నవల మహా రచయిత గోర్కీ కలం నుండి జాలువారింది. అమ్మ నవలను ప్రపంచంలో కోట్లాది మంది చదివారు. ఎంతో మంది ఆ నవల చదివి విప్లవకారులుగా మారారు. 1905 లో రష్యాలో విప్లవం ఓడిపోయి కార్మిక
సమీక్షలు

చరిత్ర పుటల్లోకి ..పోరాట దారి మలుపే ‘తిరుగబడు’ కవిత్వం

'తిరుగబడు' కవితా సంకలనం వచ్చిన 53 ఏళ్లకు  తిరుగబడు కవులమీద తిరిగి చర్చ జరగటం ఆహ్వానించదగిన విషయం. " ఇలా వచ్చి అలా వెళ్లిన 'తిరుగబడు కవులు...' " శీర్షికతో రజా హుసేన్ రాసిన విమర్శ చదివాక ఇది రాయాల్సి వచ్చింది. దిగంబర కవులకు లేని లక్ష్యశుద్ధి తిరుగబడు కవులకు ఉన్నది అని రచయిత స్వయంగా ప్రశంసించిన తర్వాత పై రెండు కవిత్వ పాయల లక్ష్యాలు వేర్వేరు అని తేటతెల్లం అవుతుంది వేర్వేరు పరిధుల్లోని  కవిత్వాలమధ్య పోలిక అసంబద్ధమైంది. దిగంబర కవులదికుళ్లిపోయిన సమాజం పట్ల ఒక బలమైన ప్రతిస్పందన. దాని వికృతిని పతనావస్థను  పదునైన మాటల్లో వర్ణించారు. కాని
పరిచయం

ప్ర‌జాస్వామ్యం కోసం అన్వేష‌ణ‌

కాలికి బలపం కట్టుకొని అన్నట్టుగా ఈ మధ్య కాలమంతా తెలుగు నేలంతా తెలంగాణ అడుగడుగునా దేశం నాలుగు చెరగులా శాంతి కపోతమై తిరుగాడుతూ, తన ఉపన్యాసాలతో మధ్య తరగతిని, యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూన్న, శాంతి చర్చల మేధావి మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల వ్యాసాల పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని  రచయిత శాంతి చర్చల సాధనలో నిత్య కృషీవలుడైన ఎస్ ఆర్. శంకరన్ గారికి అత్యంత గౌరవంతో అంకితం చేశారు. ఇది రచన ఆచరణ రెండు చేతులా  చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ.  నేటి వ్యవస్థీకృత హింసకు శాంతి చర్చలే
సమీక్షలు

రైతు ఆత్మహత్యల  బాధాతప్త  నవల

గత ఒకటి-ఒకటిన్న దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంలో, 2014లో ఆత్మహత్యల రేటు సగటున రోజుకు 52 అయిన చోట, దాదాపు 80లక్షల రైతులు వ్యవసాయం వదిలేసిన చోట, ఈ విషయంపై నలుదిశలా ఆవరించిన నిశ్శబ్దం భయానక భవిష్యత్తును, ప్రమాదకర ఆర్డిక-రాజకీయాలను సూచిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సీనియర్‌ నవలాకారుడు సంజీవ్‌ రాసిన కొత్త నవల “ఫాస్‌” (ఉరి) ఈ భయానక నిళ్ళబ్దం, మానవద్వేష ఆర్థిక-రాజకీయాలకు వ్యతిరేకంగా వేసిన ఒక పెనుకేక. నిజానికి వ్యవసాయం ప్రభుత్వాల, అధికార అంగాల ఆలోచనలూ, పథకాలకు మాత్రమే కాదు మధ్య తరగతి అవగాహనకు కూడా చాలా దూరం. ఏ
సమీక్షలు

దాచేస్తే దాగని యుద్ధం 

ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి.  ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు   నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి.    రాజ వంశీకులకు    ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక
సమీక్షలు

ఊరి మీదికి మరులుగొలిపే కథలు

చిన్నప్పుడు ఎమ్నూరు (ఎమ్మిగనూరు) అంటే నాకు రెండే కొండగుర్తులు. మా వూరి మిందనుంచి పొయ్యే ఎంజి (మాచాని గంగప్ప ట్రాన్స్పోర్ట్ సర్వీస్) బస్సు. అప్పట్లో నీటుగా వుండి  స్వీడు...గా పోయే బస్సని బో పేరు దానికి. చార్జిగాని గవుర్మెంటు బస్సు కాడికి రోంత తక్కువ. ఆ బస్సు వచ్చే తాలికి పెద్దింత మంది జమైతాండ్రి , ఆలీశం అయినా ఆ బస్సు కోసరమే ఎదురు చూస్తాండ్రి . రెండోది ప్రతీ ఎండాకాలం సెలవులకి మా రోజ పెద్దమ్మ కాడికి పోతే కర్నూలులో వెరైటీ, శ్రీరామా, ఆనంద్ టాకీసుల దారిలో, రాజ్ విహార్ సెంటర్లో రోడ్డు మింద బట్టల షాపుబైట 
సమీక్షలు

జీవిత కథలు

ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత