సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.
సంపాదకీయం

కార్పొరేట్ స్వామ్యంలో ప్రజలపై యుద్ధం

పాణి రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం. రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక
వ్యాసాలు

యుద్ధం మధ్య మనం…,

... కానీ మనకు ఆ సంగతి తెలియదు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. సరిగ్గా ఫాసిస్టు కాలంలో జరుగుతున్న యుద్ధం ఇది. జర్మనీలో  గ్యాస్‌ ఛాంబర్స్‌ గురించి విన్నాం. ఇటలీలో బ్లాక్‌ షర్ట్స్‌ గురించి విన్నాం. జనంలోంచే ఉన్మాద మూకను కూడగట్టి సమాజం మీదికి ఎగదోసిన చరిత్ర చూశాం.  ఇక్కడ  జనం మీదికి సైన్యాన్ని ఉసిగొల్పి, వైమానిక దాడులు చేస్తున్న ఫాసిస్టు యుద్ధం మధ్యలో మనం జీవిస్తున్నాం. జనవరి 11న తెల్లవారుజామున దండకారణ్యంలోని దక్షిణ బస్తర్‌ పామేడ్‌`కిష్టారం ప్రాంతంలో  భారత ప్రభుత్వం హెలికాప్టర్‌తో బాంబు దాడులు చేసింది. దేశాల మధ్య  సరిహద్దు యుద్ధాల్లో వాడే ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ చాపర్‌ను
కొత్త పుస్తకం సాహిత్యం

విధ్వంస, నిర్మాణాల కొత్త ప్రపంచపు కథలు

ఇవి ఈ తరం విప్లవ కథలు. సరిగ్గా ఇప్పటి మనందరి జీవితానుభవంతో సరిపోలే కథలు. మన అనుభవ పరిధికి ఆవల ఉన్న వాస్తవికతలోకి మనల్ని నడిపించే కథలు. అదే ఈ కథల ప్రత్యేకత. ఇందులో పదకొండు కథలే ఉన్నాయి. ఇవన్నీ విప్లవ దృక్పథ వైశాల్యాన్ని చూపిస్తాయి. ‘కొన్ని రంగులు ఒక కల’ అనే కథతో పావని కథా రచనలోకి అడుగుపెట్టింది. విరసం నిర్వహిస్తున్న కథల వర్క్‌షాపులు కథకుల కలయికకు, అభిప్రాయాల కలబోతకే పరిమితం కాకుండా కొత్త కథల, కథకుల తయారీ కేంద్రాలనడానికి ఒక ఉదాహరణ పావని. సాహిత్యం, రాజకీయాలు, ప్రజా ఉద్యమాలపట్ల ఇష్టంతో పావని సాహిత్యోద్యమంలోకి వచ్చింది. తన
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా
సమకాలీనం

దేశద్రోహుల జేబు సంస్థ ఎన్‌ఐఏ ముస్లింలను దేశద్రోహులని ఆరోపించడమా?

నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది.  హైదరాబాదులోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు  నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది.నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ముస్లింలకు లీగర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు
సాహిత్యం సమీక్షలు

మంజీర.. స‌జీవధార

చెరబండరాజు సాహిత్య సర్వస్వం, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ విశ్లేషణ ‘కల్లోల కవితా శిల్పం’ పనిలో ఉన్నప్పుడు వీరిద్దరికి కొనసాగింపుగా కౌముది, సముద్రుడు, మంజీర, ఎమ్మెస్సార్‌ గుర్తుకు వచ్చారు. విప్లవ కవిత్వంలోకి చెర, అలిశెట్టి ప్రభాకర్‌ తీసుకొచ్చిన విప్లవ వస్తు శిల్పాలు ఆ తర్వాతి కాలంలో మరింత గాఢంగా, ఆర్దృంగా, సౌందర్యభరితంగా విస్తరించాయి. 1990ల విప్లవ కవిత్వం మొత్తంగా తెలుగు కవితా చరిత్రనే సాంద్రభరితం చేసింది. ఇందులో అనేక మంది విప్లవ కవులు ఉన్నారు. వాళ్లలో కూడా ప్రత్యక్ష విప్లవాచరణను, కవితా రచనను ఎన్నుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణ నేపథ్యం, విభిన్న రంగాల్లో పోరాట అనుభవం,
వ్యాసాలు

కార్పొరేట్‌ రాజకీయాలు-ప్రత్యామ్నాయం : సిలింగేర్‌ ఉదాహరణ

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో కార్పొరేటీకరణ ఒకటి. హిందుత్వ ఫాసిజంలాగే ఈ మాట కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తయారు చేస్తున్నదనే అవగాహనకు ఇప్పుడు సాధారణ పరిశీలకులు కూడా వచ్చారు. ఆదానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి వచ్చాడనే వార్తతో పాపులర్‌ మీడియాలో కూడా కార్పొరేటీకరణ గురించిన చర్చ మొదలైంది. దేశ సంపదను  సంపన్నులకు  ప్రభుత్వం  కట్టబెట్టడం ఏమిటనే విమర్శ
సాహిత్యం సమీక్షలు

త‌ల్లుల బిడ్డ‌ల వీర‌గాథ‌

ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన
సంపాదకీయం

వాళ్లది విధ్వంస సంస్కృతి

కొందరు నిర్మిస్తుంటారు. మరి కొందరు కూలదోస్తుంటారు. ఇళ్లు, వీధులు, ఊళ్లు మాత్రమే కాదు. జీవితాన్ని కూడా కూలదోస్తారు. తరతరాలుగా మానవులు నిర్మించుకున్న సంస్కృతిని నేల మట్టం చేస్తారు. మానవాళి నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేస్తారు. పాలకులు కూలదోస్తుంటారు. ప్రజలు లేవదీస్తుంటారు. ఢల్లీిలో సంఘ్‌ ప్రభుత్వం ముస్లిం జనావాసాలను బుల్డోజ్‌ చేయడం కేవలం ఒక తాజా విధ్వంస ఉదాహరణ మాత్రమే. మైనారిటీల ఇండ్ల మీదికి బుల్డోజర్లను తోలడం, పేదల తల మీది నీడను తొలగించడం, బ‌తుకు తెరువును నేల‌మ‌ట్టం చేయ‌డం ఒక ప్రతీకాత్మక విధ్వంసం. అందువల్ల కూడా దేశమంతా ఈ విధ్వంస చిత్రాన్ని నేరుగా పోల్చుకోగలిగింది. అంతక ముందే సకల