పారుబాకీలతో బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం
భారతదేశంలో అధికార బదిలీకి ముందు, తర్వాత ప్రైవేట్ బ్యాంకుల చరిత్ర అంతా అక్రమాలతో, మోసాలతో ముడిపడి ఉంది. వలసపాలన కాలంలో దేశంలో ఏర్పడిన ప్రైవేట్ బ్యాంకులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డిపాజిట్లను తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాయి. ఆనాటికి ఉన్న 600 బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు, వాణిజ్య వర్గాలకు పరిశ్రమల నిర్మాణం, వర్కింగ్ కాపిటల్, ఇతర అవసరాలకు రుణాలు ఇస్తుండేవి. చిన్న వృత్తులు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు తదితరాలకు రుణాలు అందేవి కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవటం, వసూలుపై బ్యాంకులు తగినంత శద్ధ పెట్టకపోవటం, రుణాలు తీసుకున్న సంస్థలు చేసే మోసాలలో బ్యాంకులు కూడా భాగస్వాములు