ఆర్థికం

అదానీకి చట్టాలు వర్తించవా ?

గత రెండు దశాబ్ధాలుగా, బొగ్గు  సంబంధిత అవినీతి కథనాలను భారతదేశం చూసింది. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం పతనం కావడానికి, బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం బొగ్గు గనుల కుంభకోణం. ఇప్పుడు మోడీ ప్రభుత్వ హయాంలో మరో బొగ్గు కుంభకోణం బయట పడింది . మోడీకి అత్యంత నమ్మకస్తుడైన గౌతమ్‌ అదానీ దిగుమతి చేసుకున్న విదేశీ బొగ్గు ధరను అత్యంత ఎక్కువగా చూపించి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిన కథనాన్ని లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక దినపత్రిక పైనాన్షియల్‌ టైమ్స్‌ ‘ద మిస్టరీ ఆఫ్‌ అదానీ బొగ్గు దిగుమతుల విలువ నిశబ్దంగా రెట్టింపు అవుతోంది’ అనే శీర్షికతో
వ్యాసాలు

గాజాలో ఇజ్రాయెల్‌ నరమేథం

ఆధునిక చరిత్రలో ఒక దేశాన్ని మరోదేశం దురాక్రమించడం లేదా వలసగా మార్చుకోవడం చూశాం. కాని అత్యధిక ప్రపంచ దేశాలచే గుర్తించబడి, చారెడు నేలకు నోచుకోక పోవడమనే దుస్థితి ఊహకందని విషయం. అదోక వాస్తవమై పాలస్తీనాగా మన కళ్లముందు కనిపిస్తోంది. పాలస్తీనా ఐరాస సభ్యదేశం, అలీన దేశాలలో గుర్తింపు పొందిన దేశం. ఆ దేశానికి రాజధాని లేదు. దాని పాలనలో ఉన్న ప్రజలు ఒకచోట లేరు. పాలస్తీనా వెలుపల (40 లక్షలు) సగం మంది కాందీశీకులుగా ఉన్నారు. ఇది ఒక భయంకర పరిస్థితి, దీని చరిత్ర అంతా పోరాటాల, త్యాగాల, రక్తసిక్త చరిత్ర. తమ మాతృభూమి కోసం 75 ఏండ్లుగా
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

భారత దేశ ఆర్థిక, రాజకీయ చిత్రం పరిశీలిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకుందని తెలుస్తోంది. నిత్య జీవితావసర వస్తువులు గోధుమలు, బియ్యం, వంట నూనెలు, వంట గ్యాస్‌, పాలు వంటి వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కానీ సాధారణ కార్మికుల వేతనాలు సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. వేతన జీవుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతున్నది. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది.  గ్రామీణ నిరుద్యోగాన్ని కొంతమేర నిలువరించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 30శాతం ఈ సంవత్సరంలో తగ్గించి
ఆర్ధికం

కృత్రిమ మేధస్సు 

‘మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ’ అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ (ఏకశిలా, మాడ్యులర్‌, మల్టీ టాస్కింగ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కెర్నల్‌) సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌... సంక్షిప్తంగా చెప్పాలంటే ఎఐ.. దీని వినియోగం ప్రపంచానికి మేలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు... భవిష్యత్తులో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. మనిషి మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కృత్రిమ మేధ ఎన్నో రకాల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను నిలువునా ముంచేస్తున్నది. డిగ్రీలు చేత
ఆర్ధికం

ఆకలి కేకలకు అంతమెప్పుడు?

ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఎఒ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్య్లూఎఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మే 2న ప్రపంచ ఆహార సంక్షోభాలపై నివేదికను విడుదల చేశాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని
ఆర్ధికం

ప్రభుత్వ బ్యాంకుల మెడపై ప్రైవేట్‌ కత్తి

దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను
ఆర్ధికం

కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిచ్‌ వంటి రేటింగ్‌ సంస్థలు, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్‌) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం
ఆర్ధికం

డాలర్‌ కోటకు బీటలు!

గ్లోబల్‌ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. రిజర్వు కరెన్సీగా, కరెన్సీ మార్పిడి మాద్యమంగా ఏడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాక అమెరికా సైనిక, ఆర్థిక దండోపాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తనమాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్‌ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అగ్రరాజ్య అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇన్నాళ్లు ఏ డాలర్‌ అండతో అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమల దండులా కదం తొక్కుతున్నాయి. గ్లోబల్‌ కరెన్సీగా రాజ్యమేలుతున్న
ఆర్ధికం

గరిష్టానికి ప్రపంచ రక్షణ వ్యయం

ప్రపంచ సైనిక వ్యయం అల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం అత్యధికంగా 2.24 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ సైనిక వ్యయంపై స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) మార్చి 13న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశాల నుండి సైనిక పరికరాలు కొనడానికి భారత్‌ 2020-21 లో రూ|| 4 లక్షల 71 వేల కోట్లు, 2021-22 లో రూ|| 4 లక్షల 78 వేల కోట్లు, 2022-23 లో రూ|| 5 లక్షల 25 వేల కోట్లు, 2023-24 లో రూ|| 5 లక్షల 93 వేల
వ్యాసాలు

మోడీ అమ్ములపొదిలో మరోస్పైవేర్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన కుటిల రాజకీయ నీతిని పదేపదే ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వ అణచివేత పాలనపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలను కొట్టిపారేస్తూ తన నిరంకుశ, నియంతృత్వ వైఖరిని కొనసాగిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం  పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు రేపిన దుమారం సద్దుమణగక ముందే మోడీ సర్కార్‌ కొత్త స్పైవేర్‌ కోసం వేట మొదలెట్టింది. అందుకు రూ.986 కోట్లు కేటాయించింది. 2019 లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెగాసస్‌ స్పైవేర్‌ కూడ పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్‌ను చొప్పించారన్నది పలు నివేదికల సారాంశం. ఈ