స్పందన

ఐదు దశాబ్దాల విప్లవోద్యమ అనుభవం

తేదీ 31 మే, భారత విప్లవోద్యమ చరిత్రలో మరో తీవ్ర విషాద దినంగా నమోదైంది. కామ్రేడ్‌ ఆనంద్‌ (కటకం సుదర్శన్‌, దూలాదా) అనారోగ్యంతో 69వ ఏట కన్ను మూశాడని జూన్‌ 5 నాడు వార్తలలో చూసి నిర్ఘాంతపోయాను. ‘‘మన దేశాంలో చైనా అనుభవాలు మక్కికిమక్కి లేదా కొన్ని సవరణలతో అన్వయిస్తే సరైన ఫలితాలు రావు. మన దేశ నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి విప్లవోద్యమాన్ని నిర్వహించాలి. మూడు రంగాలలో ఎత్తుగడలు నూతనంగానే ఉండాలి. మనం ఈ నిర్బంధంలో నిర్మించే సంఘాలు ఒక కొత్త తరహాలో ఉండాలి. గతంలో మనకు లేని ప్రయోగాలు చేయాలి’’. అనే అభిప్రాయం ఆయనకు ఉండేది. తాత్కాలిక