పెట్టుబడి సంచయనంలో రక్తమొడుతున్న అడవులు
గత కొద్ది మాసాలుగా ఆపరేషన్ కగార్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఎందుకింత చర్చ జరుగుతుందనే సందేహానికే తావు లేకుండా శవాల కుప్పలు జవాబులు చెపుతున్నాయి. ఇప్పటికీ నాలుగు మాసాలుగా మధ్య భారతంలోని అడవులు ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులలోని అడవులు తుపాకీ మోతలతో దద్దరిల్లుతున్నాయి. ఈ అడవులు దండకారణ్యంగా మన దేశ రాజకీయ చిత్రపటంపై అనధికారికంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అనధికారికంగానే అత్యున్నత పోలీసు అధికారుల కనుసన్నలలో మీడియా అతి ఉత్సాహంతో ఆ అడవుల గుండా నేపాల్ సరిహద్దుల వరకు కొనసాగే రోడ్ మ్యాప్ ను రూపొందించి ఆ నడవాకు రెడ్ కారిడార్ గా