సమీక్షలు

రైతు ఆత్మహత్యల  బాధాతప్త  నవల

గత ఒకటి-ఒకటిన్న దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంలో, 2014లో ఆత్మహత్యల రేటు సగటున రోజుకు 52 అయిన చోట, దాదాపు 80లక్షల రైతులు వ్యవసాయం వదిలేసిన చోట, ఈ విషయంపై నలుదిశలా ఆవరించిన నిశ్శబ్దం భయానక భవిష్యత్తును, ప్రమాదకర ఆర్డిక-రాజకీయాలను సూచిస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సీనియర్‌ నవలాకారుడు సంజీవ్‌ రాసిన కొత్త నవల “ఫాస్‌” (ఉరి) ఈ భయానక నిళ్ళబ్దం, మానవద్వేష ఆర్థిక-రాజకీయాలకు వ్యతిరేకంగా వేసిన ఒక పెనుకేక. నిజానికి వ్యవసాయం ప్రభుత్వాల, అధికార అంగాల ఆలోచనలూ, పథకాలకు మాత్రమే కాదు మధ్య తరగతి అవగాహనకు కూడా చాలా దూరం. ఏ
సమీక్షలు

దాచేస్తే దాగని యుద్ధం 

ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి.  ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు   నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి.    రాజ వంశీకులకు    ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక
సమీక్షలు

ఊరి మీదికి మరులుగొలిపే కథలు

చిన్నప్పుడు ఎమ్నూరు (ఎమ్మిగనూరు) అంటే నాకు రెండే కొండగుర్తులు. మా వూరి మిందనుంచి పొయ్యే ఎంజి (మాచాని గంగప్ప ట్రాన్స్పోర్ట్ సర్వీస్) బస్సు. అప్పట్లో నీటుగా వుండి  స్వీడు...గా పోయే బస్సని బో పేరు దానికి. చార్జిగాని గవుర్మెంటు బస్సు కాడికి రోంత తక్కువ. ఆ బస్సు వచ్చే తాలికి పెద్దింత మంది జమైతాండ్రి , ఆలీశం అయినా ఆ బస్సు కోసరమే ఎదురు చూస్తాండ్రి . రెండోది ప్రతీ ఎండాకాలం సెలవులకి మా రోజ పెద్దమ్మ కాడికి పోతే కర్నూలులో వెరైటీ, శ్రీరామా, ఆనంద్ టాకీసుల దారిలో, రాజ్ విహార్ సెంటర్లో రోడ్డు మింద బట్టల షాపుబైట 
సమీక్షలు

జీవిత కథలు

ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత
సమీక్షలు

చీకటి రోజుల్లో గానాలుండవా…..

 1818 దీర్ఘ కావ్యంపై సామాజిక సాంస్కృతిక విశ్లేషణ శ్రీరామ్‌ పుప్పాల 1818 దీర్ఘ కవిత రాత ప్రతి దశ నుంచి అచ్చు పుస్తకం వరకు ఎన్నోసార్లు చదివాను. ప్రతిసారీ నాకు మరింత లోతైన అర్థం తోచేది. ప్రతి చరణమూ ఒక సంఘటననో, చరిత్రలోని కీలక పరిణామాన్నో గుర్తుచేసేది. మన దేశ ప్రజల పోరాటాలను, హక్కుల హననాన్నీ ఒక క్రమంలో రికార్డు చేసిన రచన ఇది. తనలో తాను మాట్లాడుకుంటూ, మనతో మాట్లాడుతూ భీమానది ఒక విస్మృత చరిత్రను పరిచయం చేస్తున్నది. నదులు నాగరికతా చిహ్నాలు. నదుల వెంట జనావాసాలు ఏర్పడి స్థిర వ్యవసాయం సమకూరే క్రమంలో ఉత్పత్తి సాధనాలు,
సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?
సమీక్షలు

బహిరంగ ప్రకటనే రాజ్య ధిక్కారం

రాజకీయ, నైతిక, మత, కళా సాహిత్య రంగాలలో ఆనాటికి ప్రబలంగా వుండిన అభి ప్రాయాలను ధిక్కరించేదెవరు? తన అత్మను తాకట్టు పెట్టని వాడే ధిక్కారి కాగలడు.                                                                                                - జార్జి ఆర్వెల్    అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. లోపల దాగిన సంవేదనలు, వినిపించాలనిసమాయత్తమవుతున్నాడు .గడ్డకట్టిన మనుషుల మధ్య సమస్త భూగోళాన్ని అరచేతిలో ఇముడ్చుకొని తనలో గూడు కట్టుకున్న అపరిచితతత్వాన్ని వ్యక్తీకరించాలనుకున్నాడు . ఇప్పుడేది రహస్యం కాదు అనే కవిత్వ సంపుటికి కొనసాగింపుగా  బహిరంగ ప్రకటన చేస్తున్నాడు . దేశం వినడానికి సమాయత్తమవుతోంది. మనుషులు తమ దైనందిక జీవితంలో  కిటికీ తెరిసినట్లు అతని కవిత్వాన్ని ఆలకించండి.  నాలిక పొడారిన తర్వాతనయినా సంభాషణ మొదలు
పరిచయం

సహదేవుని రక్త చలన సంగీతం

చాలా కాలం నుండి నేను "రక్త చలన సంగీతం " కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి (రిసారె) పుస్తకం కోసం ప్రయత్నాలు చేశాను. నాకు నిరాశే ఎదురైంది. రెండు సంవత్సరాల నా ప్రయత్నంలో మిత్రుడు శివరాత్రి సుధాకర్ సలహాతో నాకు " రక్త చలన సంగీతం" సంకలనం వీక్షణం వేణుగోపాల్ సార్ వద్ద దొరికింది. ఎంతో ప్రేమతో వేణుగోపాల్ సార్ పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకం మిత్రుడు నరేష్ ద్వారా నా చేతి మునివేళ్లు తాకింది. నాకు కామ్రేడ్ రిక్కల సహదేవ రెడ్డి గూర్చి ముందుగా పరిచయం చేసింది మాత్రం కామ్రేడ్ అమర్. నేను అమర్ దగ్గర నుండి
సమీక్షలు

భీమా నది ఘోష 

నేను భీమా నదిని మాట్లాడుతున్నాను! అంటూ 1818 నుండి మొదలైన ప్రస్థానం ఇది. ‘‘చరిత్ర కన్నులోంచి దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను మూగబోయిన అలల తీగలపై పురిటి బిడ్డల తొలి ఏడుపునై పెల్లుబుకుతున్నాను..’’ అనే దగ్గరి నుంచి ‘‘అంటరాని కళేబరాన్నై పైకి లేచే దాకా’’, ‘‘రష్యా సేనల పైకి ఉక్రెయిన్లో’’ అంటూ వర్తమానం దాకా! సాగుతుంది.             ‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని మళ్ళీ వూరేగిస్తున్న రాచ వీధుల్లోంచి నడచి వస్తున్నా!’’ అని మొదలై ఆనాటి నుంచి ఈనేటి ఏలికల గుట్టు  బయట పెట్టారు. ‘‘పేగు తెంపిన మంత్ర సాని చనుబాలు తాగనివ్వని పసి బాలుడి నోట్లోంచి బొటన వేలినై బయటికి
సమీక్షలు

జైలుగోడలపై రాసిన ప్రశ్నలే..‘‘ప్రేమతో మీ సుధ’’

‘‘ఇక మాటలు అనవసరం, కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం, విప్లవాత్మక దృక్పథంతో రచనలు చేయాలి’’ - శ్రీశ్రీ (8.10.1970 విరసం రాష్ట్ర మహాసభలు-ఖమ్మం) ఇప్పటివరకు అటువంటి మాటలు వింటూనే ఉన్నాం. కార్యశూరత్వం చూపటంలేదు. అసలు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే కవులే పలచబడుతున్నారు. మరి ఎవరు మట్లాడాలి. మాట్లాడుతున్నది అతి తక్కువమందే కావచ్చు..కానీ మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే..ప్రశ్నించకపోతే..గొంతెత్తి రణన్నినాదం చేయకపోతే రాజ్యం చేసే క్రూరత్వం రెట్టింపవుతుంది. ఇవాళ దేశంలో స్త్రీలు, దళితులు ఆర్థిక రాజకీయ దోపిడీలకు గురౌతున్నారు. డెబ్బై ఏళ్ళు దాటిన ముసలిభారతంలో సాంఘిక అణచివేత ఇప్పటికీ కొనసాగుతున్న పరంపరే. ఆర్థికదోపిడీ వల్ల పేదమధ్యతరగతి జీవితాలు దుర్భరమైపోతున్నా ప్రశ్నించకూడదా..? హక్కులకై కలబడకూడదా..?