సమీక్షలు

ఎవరికీ పట్టని మరో ప్రపంచపు కథలు

కథలకు సంబంధించి వస్తువు ఎంపికే ప్రధానమైనది. దానిని అనుసరించేవే మిగతా లక్షణాలు. నేరుగా జన జీవనంతో మమేకమైపోయి, వాళ్ళ బతుకు సాధకబాధలే ఇతివృత్తాలు గా, ఆయా సమూహాలను చరిత్రలో భాగం చేసే రచయితలు చాలా చాలా అరుదు. వాళ్ళ ఆరాటపోరాటాల్ని చాలా దగ్గరగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు కలిగే అనుభూతి చాలా భిన్నమైన మార్గంలో కథకుడ్ని నడిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాల్ని, ఇతరుల కన్నుకు కనబడని జీవితం తాలూకు ఘర్షణని చూసేలా చేస్తుంది.‌ ఖచ్చితంగా పాఠకుడికి ఆ సంఘటనలకు కారణమయ్యే శక్తుల మీద ఆగ్రహం కలుగుతుంది. జీవన విధ్వంసం దృశ్యాన్ని కథగా మలిచేటప్పుడు కథలో ఇలా ఎందుకు జరిగింది?జరగకూడదే?అనే మీమాంస
సమీక్షలు

అనంత జీవనకథా ముకురం

ఒక రచనను దేశకాల నేపథ్యంలో వివేచించడం ఒక పద్ధతి. అలా వివేచించడం వల్ల ఆ రచన ఆదేశ స్థితిగతులను వివరించడంతో పాటు ఆ రచన ఆకాలాన్ని విశ్లేషిస్తున్న తీరులో వైరుధ్యాల్ని గమనించి ఆ వైరుధ్యాల స్వభావాన్ని విశ్లేషించిన తీరునూ గమనించవచ్చు. ఆ వైరుధ్యాలలో ఆ రచన ఎటువైపు నిలబడిందో రచయిత అవగాహనకుండిన శాస్త్రీయత ఏ పాటిదో అంచనా వేయవచ్చు. ఇటీవల మల్లెల నరసింహమూర్తి 'మాకూ ఒక నది కావాలి” కవిత్వాన్ని పై వివరించిన నేపథ్యంలో వివేచించడం ఈ వ్యాస పరిమితి. ఈ కవితలు రాసిన తేదీలను రచయిత ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి ౨౦౦౪ లో ఈ కవి రాసిన
వ్యాసాలు సమీక్షలు

జీవితం మలచిన కవి

'పూలపరిమళం'లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన
సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో
సాహిత్యం సమీక్షలు

పురాతన యుద్ధ‌భూమి

(ఇటీవ‌ల విడుద‌లైన పి. చిన్న‌య్య క‌థా సంపుటి ఊడ‌ల‌మ‌ర్రి ముందుమాట‌) మిత్రులు పి.చిన్నయ్య తన ఊడలమర్రి కథల సంపుటికి ముందుమాట రాయమని, పదిహేనేండ్ల కాలంలో తాను రాసిన పదహారు కథలు పంపారు. ఈ కథల్లో దాదాపు అన్నీ విరసం కథల వర్క్‌ షాపుల్లో చదివినవే. కథల గురించి రకరకాల చర్చలు జరిగినవే. ఒక్కొక్క కథ చదువుతుంటే.. ఆ సన్నివేశాలన్నీ రూపుకడుతున్నాయి. సాధారణంగా రచయితలు కనపరిచే ఉద్విగ్నతలు, ఆవేశకావేశాలు ప్రదర్శించకుండా సీదాసాదాగా.. ఏమాత్రం డాంబికం లేకుండా చిన్నయ్య మాట్లాడే పద్ధతి - స్థిరమైన ఆ కంఠస్వరం నాకిప్పటికీ గుర్తే. ఇవి అంతిమ తీర్పులో... పరమ సత్యాలో... అనే భావనతో కాకుండా
లోచూపు సాహిత్యం సమీక్షలు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
వ్యాసాలు సమీక్షలు

కులం-బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ… కొన్ని ప్రశ్నలు, పరిమితులు

‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా  తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.        అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక
సమీక్షలు

గుండె నెత్తురులతో పదునెక్కి  సాగుతున్న విముక్తి చరిత్ర

అల్లం రాజయ్య సాహిత్యం చదవడం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజయ్య ప్రతి నవల చారిత్రక మట్టి పొరలలో నుండి పుట్టుకొస్తాయి. కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారు అనుకుంటున్న మట్టిమనుసులు కళ్ళల్లో నలుసులై దొరలను,భూస్వాములను తద్వారా వారికి అండగా నిలబడ్డ రాజ్యంపై ఎదురు తిరిగిన చరిత్రకు అక్షరూపం ఇస్తాడు రాజయ్య. అది కొలిమంటున్నది కావచ్చు, వసంతగీతం కావచ్చు, ఊరు, అగ్నికణం, సైరన్ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన పోరాటాల చరిత్రే. అదే వరవడిలో విముక్తి నవల కూడా పోరాటాల చరిత్ర రచనలో భాగంగా వచ్చింది. నక్సల్భరి ఆరంభం గురించి నక్సల్భరి 
సమీక్షలు

నెత్తుటి తడి ఆరని బస్తర్‌

దేశం కార్పొరేట్లకు’ అనే 84 పేజీల చిన్న పుస్తకంలోని వ్యాసాల్లో ఆదివాసులు తమ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టులు కనబడతారు. దాన్ని ఓర్వలేని పాలకులు చేసిన దురాగతాలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఇందులో  నాకు అనిపించిన నాలుగు విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను. పుస్తకం చదువుతుంటే పాలకులు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలరు అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఈ సమాజ ఆరోగ్యానికి అవసరమైన గాలీ, నీరు, ఖనిజాలు, కలపను కాపాడుతూ అవి ఈ దేశ ప్రజలకు దక్కాలన్నందుకే ఆదివాసులు, మావోయిస్టులు ప్రభుత్వాలకు కంటగింపయ్యారు. ఆ వనరులను కాపాడటానికి పోరాడటం పాలకుల
సమీక్షలు

ట్రాన్స్ జెండర్ జీవితానికి మరో పార్శ్వం

ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ సమస్యలు తెలుగు సాహిత్యంలో రావడం చూస్తున్నాం. ఇది ఆహ్వానించాలిసిన పరిణామం. కొన్ని కథలూ, కొన్ని కవితలూ, ఒక దీర్ఘ కవిత, స్వామి రాసిన "అర్ధనారి", వరలక్ష్మి తెలుగు లోకి అనువదించిన లైంగిక వైవిధ్యాలు, ఇప్పుడు సోలోమన్ విజయ కుమార్ రాసిన చిన్న నవల "సన్ ఆఫ్ జోజప్ప" ఈ కోవకి చెందినవి. భారత సమాజం ట్రాన్స్ జెండర్ అస్తిత్వాన్ని ఇంకా అంగీకరించలేక ఉంది. వారు కూడా మనుషులే అని గౌరవించలేక ఉంది. సమాజం సంగతి సరే, ఒక ట్రాన్స్ జెండర్స్ తన సొంత కుటుంబం నుంచి కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. నిరాదరణ ఒక్కటే