ఆర్ధికం

సంక్షోభం అంచున ప్రపంచ ఆర్థికం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాల ఒత్తిడి, పెరిగిన ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్ల కారణంగా తడబడుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తాజాగా వెల్లడిరచిన ప్రపంచ ఆర్థిక ధృక్కోణం(వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌) రానున్న రోజుల్లో ప్రపంచ ప్రగతి దిగజారనుందని జోస్యం చెప్పింది. ఇతరత్రా అనేక మంది ఆర్థికవేత్తల విశ్లేషణలు, దేశాలు, ప్రాంతాల పనితీరును చూసినా అధోగతి తప్ప పురోగతి కనుచూపు మేరలో కనిపించటం లేదు. గతేడాది (2022) ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం ఉండగా వర్తమానంలో (2023) మూడు, వచ్చే ఏడాది (2024) 2.9 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 2000 నుంచి 2019
కవిత్వం

పిల్లల దేశం

పిల్లలు దయాత్ములు ఎవరినైనా దేనిదైనా ఇట్టే క్షమించడం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ✤ పిల్లలు తప్ప ఇంకెవరు అల్లరి చేస్తారని వొక తల్లి నాకు సుద్దులు చెప్పింది ✤ పిల్లలతో ప్రయాణం చేయడమంటే పూలతో పక్షులతో కలిసి నడవడమే ✤ ఉమ్మెత్తపూలువంటి పిల్లలు ఈ పూట తరగతిగదిలోకి లేలేత కాడలతో వొచ్చారు ✤ పిల్లలు నక్షత్రాలు పగలూ రాత్రి వెంటాడుతూ నన్నూ కాస్తా వెలిగిస్తున్నారు ✤ పిల్లలు నవ్వితేనే భూమి నాలుగుకాలాలు బతుకుతుంది ✤ ఒక మహావృక్షం కింద పిల్లలంతా చేరిన తర్వాతే మహావృక్షం మహావృక్షంగా ఎదిగిందని నానుడి ✤ పూలగౌనుపిల్ల సీతాకోకచిలుకలతో ఆడుకుంటుంది ✤ నీడలు
కథావరణం

రైతు జీవిత చిత్రణలో రచయిత్రులు

 'మంచిదయ్యా మీరెల్లబారితే నేనూ నా పనికి పోతా' అంటుంది హనుమక్క . గ్రామీణ రైతాంగజీవితాన్ని చిత్రించిన సాహిత్యంలో  పురుషుడే కథానాయకుడు. ఆయా కథలు నవలలు నాటకాలలోని పాత్రలు సంఘటనలు సందర్భాలు పరిస్థితులు అన్నీ పురుషుడి కేంద్రంగానే కొనసాగాయి. రైతు సాహిత్యంలో మహిళారైతుల గురించి, రైతుకూలీల గురించి, వ్యవసాయేతర ,వ్యవసాయ అనుబంధరంగాల్లో నిరంతరం శ్రమించే దిగువ స్థాయి వారిని   కేంద్రంగా చేసుకొని వెలువరించిన సాహిత్యం చాలా తక్కువ. రైతు జీవితం పొడవునా అమ్మమ్మ నానమ్మ తల్లి పిన్నమ్మ పెద్దమ్మ అత్త భార్య వదిన మరదలు అక్క చెల్లెలు కూతురు మనవరాలు ఇట్లా అనేక రూపాల్లో కనిపించే స్త్రీ పాత్ర విస్మరించలేనిది,
ఎరుకల కథలు

“పదకొండు నెలల జీతగాడి కత”

(ఎంత చెప్పినప్పటికీ ఎంతగా చెప్పుకున్నప్పటికీ చెప్పుకోవాల్సిన జీవితాలు కొన్ని ఇంకా చీకట్లోనే ఉండిపోతాయి, మిగిలిపోతాయి. అలా చీకట్లో ఉండిపోయిన జీవితాల్లోని దుఃఖాలు నవ్వులు ఉద్వేగాలు సంతోషాలు ఆ కులం వాళ్లని మాత్రమే కాదు,  మనసున్న ఎవరైనా కదిలిస్తాయి, కలవరపెడతాయి, కన్నీళ్లు తెప్పిస్తాయి, నవ్విస్తాయి. ఆ దుఃఖ భాష తెలిసినప్పుడు, మనసుతో విన్నప్పుడు ఆ కతలను ఇంకా చదవాలనిపిస్తుంది,ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గిరిజనులు రాసిన గిరిజన జీవన వ్యథలను చదవడం ఎవరికైనా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. సాహిత్య విమర్శా వ్యాసాలు రాసే*కవి,కథకుడు,నవలాకారుడు పలమనేరు బాలాజీ (49)తన జాతి కతలను, వ్యథలను ఇక్కడ పంచుకుంటున్నారు. ఈ సంచిక నుండే ఎరుకల
సంపాదకీయం

పోతూ పోతూ కూడా..

.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు.  ఎగ్జిట్‌ పోల్‌ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి.  ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు  అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి,  పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా?  ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా?   అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు.  కాకపోతే  పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను  వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో
కవిత్వం

మళ్ళీ

వస్తున్నారొస్తున్నారు ఖద్దరు బట్టలేసి కహానిలు చేప్పనికి దొంగ లీడర్లంతా డోచోకొని తినడానికి వస్తున్నారొస్తున్నారు మీ నోటికాడి ముద్దలాగి ఓటునడగడానికి వొస్తున్నరొస్తున్నారు పాత లీడరొచ్చి మళ్ళీ ఛాన్స్ ఆడిగినాడు కొత్త లీడర్ ఒక్క ఛాన్స్ అడిగినడు పాత లీడర్ పార్టీ పనేమిచేసింది లేదు కొత్త లీడేర్ పార్టీ కొత్తగా చేసేదేం లేదు అన్ని పార్టీలు కలిసి అందినకాడికి దోచేవే వస్తున్నారొస్తున్నారు 70 ఏండ్ల నుండి ప్రజలను దోచుకునేదొక పార్టీ పొద్దంతా పొత్తులకోసం ఎదురుచూసేదొక పార్టీ కులం పేర మతం పేర చిచ్చుపెట్టేదోక పార్టీ సెంటిమెంట్ తోని చక్రం తిప్పేదొక పార్టీ వస్తున్నారొస్తున్నారు ఓట్లకోసం వస్తారు ఉద్యోగం ఊసేత్తరు నీళ్ల జాడలేదు
కవిత్వం

నేనొక ప్రపంచాన్ని కలగంటున్నాను

ఎక్కడా మనిషి మరో మనిషిని హీనపరచలేని ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుందో దాని దారులను శాంతితో అలంకరిస్తుందో ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ అందరూ తీయని స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగలరో ఎక్కడ ఆత్మ దురాశ రసి కారదో లేదా మన రోజు ధనాశ మడతలో చిక్కదో నేనా ప్రపంచాన్ని కలగంటున్నాను ఎక్కడ నలుపో తెలుపో మీది ఏ జాతైనా అవ్వొచ్చు భూమి వరాలు అందరికీ పంచబడాల ప్రతి మనిషీ స్వేచ్ఛాజీవి కావాల ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ దౌర్భాగ్యం తల వేలాడేయగలదో సంతోషం ముత్యంలా మెరవగలదో అందరి అవసరాలూ చూసే మానవత్వం
కవిత్వం

పువ్వులు

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! మనుషులు మనుషుల వాసన వేయడం లేదు అనేక వాసనల్లో వెలిగిపోతున్నారు అనుమానాల వాసన అబద్ధాల వాసన అసూయల వాసన ద్వేషాల వాసన... ఊపిరి సలపని వాసనల నుండి కొంచెం దూరం జరిగి- కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! సున్నితత్వాలు నామోషీ అయ్యాయి వజ్ర సదృశ పొరలలో నాగరికత నవ్వుతోంది ఎవరు పడిపోతున్నా ఎవరు వెనకపడిపోతున్నా ఎవరు చస్తున్నా ఎవరు ఏడుస్తున్నా కులాసాగా చూస్తున్న గొప్పతనాలకు కొంచెం దూరం జరిగి- కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! ఎంతైన పువ్వులు పువ్వులే కదా
వ్యాసాలు

కార్పొరేట్ విస్తరణ – ఆదివాసీల ప్రతిఘటన

మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌ గ్రామంలోనూ, మహారాష్ట్ర కొండలలోనూ ఆదివాసీ నిరసనకారులు, నాయకులు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సూర్జాగఢ్ ప్రాంతం కేంద్రంగా కార్పొరేటికరణ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లాయిడ్ మెటల్ కంపెనీ గణితవ్వకాల విస్తరణ కోసం సత్వర కార్పొరేటీకరణకు లొంగిపోవాలని స్థానిక సముదాయాల మీద రాజ్యం – కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. నవంబర్ 20న, మహారాష్ట్రలోని సుర్జాగఢ్‌లోని నిరసన ప్రదేశాన్ని పారామిలటరీ బలగాలు చుట్టుముట్టి విధ్వంసం చేసాయి. ఎనిమిది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలను వారి గ్రామాల్లో గాలించి పట్టుకుని, అరెస్టుచేసి,  జీపుల్లో తీసుకెళ్ళడం అనే సాధారణ పద్ధతిని వదిలేసి, హెలికాప్టర్ల ద్వారా అదే రాష్ట్రంలోని
కథలు

చరిత్ర మునుముందుకే…

"మావోయిస్టుల దిష్టి బొమ్మలను తగలబెడుతున్న ప్రజలు”. తన టాబ్‌ లో వార్తాపత్రికల హెడ్‌ లైన్స్‌ చదువుతూ ఆ వార్త దగ్గర జూమ్‌ చేసి చూసింది సుధ. ఆ వార్త కింద ఫోటోలో బి‌ఎస్‌ఎఫ్ పోలీసులు తలకు నల్లటి గుడ్డలు చుట్టుకుని ఎక్కువ మందే వున్నారు. కొంత మంది జనాలు కూడా నిలబడి వున్నారు. కొంత మంది చేతుల్లో ... "మావోయిస్టులారా ! మా గ్రామాలకు రాకండి!". అని రాసి వున్న ఫ్లెకార్డులున్నాయి. సాధారణ దుస్తుల్లో వున్న ఇద్దరు మనుషులచేతుల్లో గడ్డితో తయారు చేసిన మానవాకార బొమ్మలకు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తులు తొడిగి నిప్పు అంటించిఅవి దహనం అవుతుంటే పైకెత్తి