సమీక్షలు

దాచేస్తే దాగని యుద్ధం 

ఏ సమాజంలోనైనా భిన్నమైన అస్తిత్వ సమూహాలు ఉంటాయి.  ముఖ్యంగా పెట్టుబడిదారీపూర్వ యుగంలో భారతదేశంలోని వివిధ అస్తిత్వ సమూహాలు   నేరుగా రాజ్యంతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండానే వందలాది సంవత్సరాలు గడిపాయి.    రాజ వంశీకులకు    ప్రజా సమూహాలకు మధ్యన భూస్వాములో లేదా సామంత రాజులో మధ్యవర్తులుగా ఉండేవారు. పైన రాజులు, రాజ్యాలు మారుతూ ఉన్నప్పటికీ, కింద ప్రజలకు సంబంధించిన సామాజిక ఆర్థిక చట్రం మాత్రం ఎటువంటి కుదుపు(పెద్ద మార్పు)కు గురికాకుండానే ఒక స్థిరమైన నమూనా(template) ప్రకారం నిరంతరం పునరుత్పత్తి అవుతూ ఉండేది. ఈ వైపు నుంచి ఆదివాసులపై భారత ప్రభుత్వ యుద్ధాన్ని అర్థం చేసుకోడానికి ఇటీవల విరసం ప్రచురించిన *ఇక
నివేదిక

‘అదానీ గో బ్యాక్!’

 'గొందుల్‌పారా' బొగ్గు ప్రాజెక్టుకు ప్రతిఘటనపై నిజ నిర్ధారణ నివేదిక భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని 500 హెక్టార్లకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, అడవులను అదానీ ప్రతిపాదిత 'గొందుల్‌పారా' బొగ్గు గని నాశనం చేస్తుందని నిజ-నిర్ధారణ బృందం తెలియజేస్తోంది. ఐదు గ్రామాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. 780 కుటుంబాలు నిర్వాసితులవుతారు. అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడినందుకు ప్రభుత్వ అధికారులు తమను హింసించారని గ్రామస్థులు నివేదిక బృందానికి చెప్పారు. నిరసనకారులపట్ల పోలీసులు వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు  జీవనోపాధికోసం అందిస్తున్న  ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసారు. అదానీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని
వ్యాసాలు

భూమిని కాపాడుకునే పోరు

(ఈ వ్యాసం ఆజ్ తక్ మే రెండో వారం  సంచికలో అచ్చయింది . ఛత్తీస్ ఘడ్ లో క్షేత్ర పరిశీలన చేసి రాశారు. ఈ ప్రాధాన్యత రీత్యా  వసంత మేఘం పాఠకులకు దీన్ని  హిందీ నుంచి అనువదించి అందిస్తున్నాం. పాపులర్ జర్నలిజం లోని    అటు ఇటుకాని *సత్యాన్వేషణ*, పరస్పర వ్యతిరేక  వైఖరి,   కార్పొరేట్ల, పాలకుల   దృష్టి కోణం ఇందులో ఉన్నప్పటికీ కొన్ని నిజాలు కూడా ఉన్నందువల్ల దీన్ని ప్రచురిస్తున్నాం- వసంతమేఘం టీం ) *ప్రభుత్వ నలువైపుల దాడితో బలహీనపడ్డ మావోయిస్టులు; భద్రతా బలగాలు వైమానిక దాడి చేశాయని ఆరోపణ* తేదీ ఏప్రిల్ 25 న  దర్భా డివిజన్‌లో మావోయిస్టులు ఉన్నట్లు
నివాళి

సీమ కథా ఆధునికతలో దీపధారి

ప్రముఖ కథా, నవలా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మే 22న మృతి చెందారు. ఆయన కథ, నవల, సాహిత్య విమర్శ, సంపాదకత్వం వంటి అనేక ప్రక్రియల్లో విరివిగా పని చేశారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా వృత్తి సంబంధమైన పనుల్లో కూడా ఆయన ప్రత్యేకత ఉన్నది.  ఆయన సుదీర్ఘ సాహిత్య జీవితంలో అనేక ఉద్యమాలు, వాదాలు వచ్చినా ఆయన నేరుగా వాటితో ప్రభావితం కాలేదు.  తన తొలినాళ్ల గ్రామీణ జీవితానుభవం ఆయన కాల్పనిక రచనలకు చోదకంగా పని చేసింది. అక్కడి నుంచే ఆయన ప్రపంచంలో జరుగుతున్న చాల పరిణామాలను చూశారని ఆయన కథలనుబట్టి చెప్పవచ్చు. అట్లా రాయలసీమ ప్రాదేశిక జీవితానుభవం,
పత్రికా ప్రకటనలు

ఆయనకు ఆ శిక్ష చాలదు

యాసిన్‌మాలిక్‌ను ఉరితీయాలన్న ఎన్‌ఐఏ వాదనలను ఖండించండి  యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్‌ పోరాట నాయకుడు యాసిన్‌మాలిక్‌ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటీషన్‌ మీద తుషార్‌మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్‌ మాలిక్‌కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్‌ లాడెన్‌ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ
పత్రికా ప్రకటనలు

రాజ దండం పాలనలో క్రీడాకారులపై దాడి

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ, రాజ్యాంగ ఆదర్శాలను అవహేళన చేస్తూ, ఇది అధికారికంగా కూడా హిందుత్వ రాజ్యమని ప్రకటిస్తూ మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. అట్లాగే  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై   చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలంగా  పోరాడుతున్న క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రతిష్టను క్రీడాకారులు దశ దిశలా వ్యాపింపజేస్తారని పొగిడే పాలకులు న్యాయమైన డిమాండ్‌ మీద రాజీపడకుండా పోరాడుతోంటే తమ సహజమైన అణచివేత చర్యలకు