వ్యాసాలు

మల్లయోధుల  నిరసన

భారతదేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన మల్లయోధులు ఏప్రిల్ 5వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 2023 జనవరిలో బహిరంగం కావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ప్రభుత్వం లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందని వారికి హామీ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను
వ్యాసాలు

భూమిని కాపాడుకునే పోరు

(ఈ వ్యాసం ఆజ్ తక్ మే రెండో వారం  సంచికలో అచ్చయింది . ఛత్తీస్ ఘడ్ లో క్షేత్ర పరిశీలన చేసి రాశారు. ఈ ప్రాధాన్యత రీత్యా  వసంత మేఘం పాఠకులకు దీన్ని  హిందీ నుంచి అనువదించి అందిస్తున్నాం. పాపులర్ జర్నలిజం లోని    అటు ఇటుకాని *సత్యాన్వేషణ*, పరస్పర వ్యతిరేక  వైఖరి,   కార్పొరేట్ల, పాలకుల   దృష్టి కోణం ఇందులో ఉన్నప్పటికీ కొన్ని నిజాలు కూడా ఉన్నందువల్ల దీన్ని ప్రచురిస్తున్నాం- వసంతమేఘం టీం ) *ప్రభుత్వ నలువైపుల దాడితో బలహీనపడ్డ మావోయిస్టులు; భద్రతా బలగాలు వైమానిక దాడి చేశాయని ఆరోపణ* తేదీ ఏప్రిల్ 25 న  దర్భా డివిజన్‌లో మావోయిస్టులు ఉన్నట్లు
వ్యాసాలు

ఆంగన్‌వాడీల జీవితాన్నిపరిచయం చేసిన పోరాటం

(గత ఏడాది చివరలో దేశమంతా మొదలైన అంగన్ వాడీల, ఆశా వర్కర్ల పోరాటం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఈ వ్యాసం అప్పట్లో రాశారు. వసంత మేఘానికి ఆలస్యం గా చేరింది. విషయం ప్రాధాన్యత ఇప్పటికి ఉన్నందు వల్ల ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం ) మన దేశంలో చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో వుంటారు. వారంతా దిగువ శ్రేణిలోకే  వస్తారు. అలాంటి ఉద్యోగులలో అంగన్‌వాడీలు, వారి వద్ద సహాయకులుగా చిన్నారులకు వంటచేసి పెట్లే వారు, ఆశా (ఏ.ఎస్‌.హెచ్‌.ఏ - సాధికారిక సామాజిక అరోగ్య కార్యకర్త) వర్మర్లు కూడ
వ్యాసాలు

పోలవరంలో మునిగిపోతున్న ఆదివాసులు

తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో 'భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య' ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం
వ్యాసాలు

ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. 'మడోనార్ జన్ ఆందోళన్' బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం. నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల
వ్యాసాలు

స్మృతి చిహ్నాలతో మన ప్రయాణం – రాజ్యం నిర్భంధం.

ఏప్రిల్ 14,2023న రాష్ట్ర4 రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న డా||బి. అర్ అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ జరగడం ఒక మంచి పరిణామమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వలన తెలంగాణ పౌర సమాజం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో అంబేడ్కర్ నీ సమరించుకోవడం అనేది ఇక్కడి ప్రజల బాధ్యతగా భావించవచ్చు. అది వారి గుండెల్లో చెరగని ముద్రగా, ఇంటి పెద్దలను తలచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నేలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మెండు. ఎవరు ఏది సహాయం చేసిన వారి
వ్యాసాలు

భద్రతా బలగాలు వైమానిక  బాంబు దాడి చేశాయని బస్తర్ గ్రామస్థుల ఆరోపణ: వాస్తవం ఏమిటి?

ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం - అరుణాభ్ సైకియా ఛత్తీస్‌ఘడ్‌ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో "తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని" అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు
వ్యాసాలు

మనువాదం వర్సెస్ డార్విన్ జీవపరిణామ వాదం

(ఈ వ్యాస రచయితల్లో ఒకరైన కోట ఆనంద్ ను  ఏప్రిల్  28  తెల్లవారుజామున  3.00 గంటలకు  పోలీసులు అక్రమంగా  అరెస్ట్ చేశారు.  ఉస్మానియా యూనివర్సిటీ లో పరిశోధన విద్యార్థి గా విద్యారంగ సమస్యలపై , సామాజిక సమస్యలపై వివిధ దిన, మాస పత్రికలలో   రచనలు చేశారు. వసంత మేఘంలో కూడా ఆనంద్ వ్యాసాలు అచ్చయ్యాయి . అరెస్టుకు ముందు ఆయన ఆవుల నాగరాజుతో కలిసి ఈ వ్యాసం రాశారు ) దేశంలో నేడు విద్య ప్రవేటీకరణ, విద్య కాషాయీకరణ సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయి. భాజపా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా ప్రవేటీకరణను తీవ్రం చేయడానికి పూనుకున్నది.  రెండవసారి
వ్యాసాలు

‘స్టాలిన్‌యుగం’లో ఇండియా

రష్యాలో వానబడితే మనదేశంలో కమ్యూనిస్టులు గొడుగుపడతారు అని 1955కు ముందు ఇండియాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు వ్యాఖ్యానించే వాళ్లు. నిజానికి బోల్షివిక్‌ విప్లవం తర్వాత ఆరేళ్లకు గానీ ఇక్కడ కమ్యూనిస్టుపార్టీ పుట్టలేదు. లెనిన్‌ బతికుండగానే ఇండియా నుంచి ఎం.ఎన్‌.రాయ్‌ ఆసియా ఖండంలోనే మొదటివాడుగా ఇక్కడికి కమ్యూనిస్టుపార్టీని తెచ్చాడుగానీ ఆయనే అందులో నిలవక ఆ తర్వాత రాడికల్‌ హ్యూమనిస్ట్‌పార్టీ పెట్టి వేరుపడ్డాడు.  అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వలసపాలన దమనకాండ భరించచలేని ప్రజలు, ముఖ్యంగా జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం ఇంచుమించు అదేకాలంలో జరిగింది గనుక బోల్షివిక్‌ విప్లవంతో చాల ఉత్తేజితులయ్యారు. లెనిన్‌ను పీడితప్రజల, శ్రామికవర్గాల విముక్తిప్రదాతగా చూడసాగారు. అమెరికాలో ఉన్న సిఖ్కు మేధావులు కొందరు
వ్యాసాలు

ఎన్‌కౌంటర్‌లలో న్యాయ వ్యవస్థ జోక్యం

ఉమేష్ పాల్ హత్య నిందితుడు, మాజీ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల నుండి తన ప్రాణ రక్షణ కోసం చేసిన విజ్ఞప్తిని స్వీకరించడానికి గత నెలలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తరువాత ఆ రాష్ట్ర పోలీసులే  అతని కొడుకును ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు, ఆ తర్వాత అతనితో పాటు అతని సోదరుడిని పోలీసు కస్టడీలో వుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై విచారణకు విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 17న సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు