వ్యాసాలు

మరో సారి భారత ప్రజలపైబాంబు దాడి

భారత ప్రభుత్వం తన పౌరులపై మరోసారి బాంబు దాడి చేసిందని మీకు తెలుసా? “గత నెలలో అమిత్ షా బస్తర్‌ను సందర్శించి, ప్రతిఘటనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత 2023 ఏప్రిల్ 7 న దాడి జరిగింది. అమెరికా ఇతర దేశాలపై బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలో బాంబు దాడులు చేసినప్పుడు వారు మౌనంగాగా ఉన్నారు.” నిరసన! నిరసన! నిరసన! ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం, బస్తార్ జిల్లాలోని భట్టుం, కవురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాల ఆదివాసీల పైన భారత ప్రభుత్వం ద్రోణుల  సహాయంతో 2023 ఏప్రిల్ 23 నాడు వైమానిక బాంబులు
వ్యాసాలు

మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి

జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన  మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి
వ్యాసాలు

కార్పొరేటీకరణ, సైనికీకరణ – హక్కుల ఉల్లంఘన 

మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు సహితం విమానాలలో ప్రయాణించే స్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని ఈ రోజు పత్రికలలో ఒక వార్త వచ్చింది. అదేమేరకు నిజమో మీకూ, నాకూ అందరికీ తెలుసు. విమాన ప్రయాణం మాటేమోగాని తమపై కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తున్నదని, వాటిని ఆపమని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. . మనందరం దీన్ని పట్టించుకోవాలి. వాళ్లతో గొంతెత్తి అరవాలి. ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్త్రం బీజాపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 1, 2 వ తేదీలలో జరిగిన ఘటనను మీకు వివరిస్తాను. ఈ ఘటన చెబితే దీని ద్వారా
వ్యాసాలు

నిబద్ధ విమర్శకుడు కెవిఆర్

కెవిఆర్‍గా నిలిచి పోగోరిన కనుపూరు వెంకట రమణారెడ్డి కవి, విమర్శకుడు, నాటక కర్త, విరసం వ్యవస్థాపక కార్యదర్శి, పత్రికా సంపాదకుడు, అధ్యాపకుడు. మార్క్సిస్టు దృక్పద భూమికతో ఒక రచనను రచయితని అంచనా వేసే పద్ధతికి కె.వి.ఆర్ రచనలన్నీ తార్కానాలుగా నిలుస్తాయి . తెలుగులో వ్యాసం రాసినా, గ్రంథం రాసి నా, ఒక రచన వెలువడిన కాలం దాని ముందు వెనుకలు, సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య పరిణామాలు, రచయిత దృక్పథం ,సాహిత్య తత్వం వంటి అంశాలతో ముడిపెట్టి సమగ్ర దృష్టితో విమర్శ చేసిన వారు కెవిఆర్. మహోదయం, కవి కోకిల, జగన్నాథ రథచక్రాలు, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర వంటివి
వ్యాసాలు

వెచ్చఘాట్ లో సగం ఆకాశం

ఈ తరం మహిళలు నిర్మిస్తున్న పోరాట గాథ ఇది కొత్త తరం పోరాటాల యుగం.  సాంప్రదాయక విలువలను, దోపిడీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ మహిళలు పోరాటాల్లోకి వస్తున్నారు. తద్వారా పోరాటాలు కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో వెచ్చ ఘాట్ పోరాటం ఒకటి. ‌‌బహుళజాతి కంపెనీల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్  జిల్లాలోని చిత్రం, వెచ్చఘాట్, కాంధాడిల్లో బిఎస్.ఎఫ్ క్యాంపుల నిర్మాణం, పరాల్‌కోటని పర్యాటక కేంద్రంగా మార్చాలని, కోత్రి నది మీద వంతెన నిర్మాణం, మర్రొడ నుండి రోడ్డు నిర్మాణం చేయాలని ఆదివాసులు చాలా కాలంగా పోరాడుతున్నారు.   ఈ పథకాల  వల్ల ఆదివాసీ-మూలవాసీ
వ్యాసాలు

ఆదిలాబాద్ లో30 యాక్ట్ పోదా ?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2018 జనవరి నుండి 30 పోలీసు చట్టంను  అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నది. 30 పోలీసు ఆక్ట్‌ అనేది ఎమర్జెన్సీ పరిస్థితులను పోలిన చట్టం.  జిల్లా సూపరింటెండెంట్‌ లేదా అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ద్వారా ప్రతి నెల 1 నుంచి నెలాఖరు  వరకు నెలరోజుల పాటు పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సిదే. నెల రోజుల
వ్యాసాలు

ప్రియమైన అమ్మా…

ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్‌ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడునే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పథంలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తకు వచ్చాయి. నీతో, నాన్నతో, న కుటుంబసభ్యులతో, ఊళ్లో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడు మీ అందరి మీదా మరింత గౌరవం కలుగుతోంది.
వ్యాసాలు

హిందూయిజం ఒక అబద్ధం
హిందూ మెజారిటీవాదం అగ్రకులాల సృష్టి

1వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది. రామాలయ నిర్మాణానికి