వ్యాసాలు

మరో హిందుత్వ విషసర్పం 63 పేజీల కల్పిత రహస్య దస్తావేజు

భీమా కోరేగాం కేసును సృష్టించిన హిందుత్వ శక్తులు గత ఐదేళ్లుగా దేశ విదేశాలలో అత్యంత అప్రతిష్ట పాలు కావడంతో ఎన్ఐఏ ప్రస్తుతం మరో కేసుకు రంగం సిద్ధం చేస్తున్నది. భీమా కోరేగాం కేసులో అసలు నేరస్థులను పక్కన పెట్టి ఈ దేశంలోని లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను (కళాకారులు, రచయితలు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, ఆదివాసీ  శ్రేయోభిలాషులు, సామాజిక కార్యకర్తలు మున్నగువారు) కక్ష పూరితంగా కటకటాల వెనుకకు నెట్టిన హిందుత్వ శక్తుల కౌటిల్యం గతంలో ఏ కేసులోనూ కానంత నగ్నంగా వెల్లడైంది. భీమా కోరేగాం కేసు అనేక మలుపులు, మెలికలు తిరిగి హిందుత్వ శక్తుల థింక్ టాంకుల
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
వ్యాసాలు

జనశక్తి నాయకులు కామ్రేడ్ కూర రాజన్న అరెస్టు – కోర్టు వాయిదాలు- అనారోగ్యం  

ఆగస్టు 1, 2022న మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఓ ఇంటి వద్ద సిపిఐ (ఎం- ఎల్‌) జనశక్తి నాయకులు కామేడ్‌ కూర రాజన్నను సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారన్న విషయం విధితమే. ఈ అరెస్టు విప్లవ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించారు. అలాగే ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కామ్రేడ్‌ కూర రాజన్న అరెస్టును ఖండిస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 17న రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వక్తలందరు రాజన్న అక్రమ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తూ, రాజకీయ ఖైదీలందరిని బేషరతుగా విడుదల చేయాలని
వ్యాసాలు

కార్పొరేటీకరణ – అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పోరేషన్స్ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే "కార్పోరేషన్ కు ఆత్మ అంటూ ఉండదు" (a corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పోరేషన్స్ కు మార్కెట్ విలువ తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి
వ్యాసాలు

కార్పొరేట్‌ రాజకీయాలు-ప్రత్యామ్నాయం : సిలింగేర్‌ ఉదాహరణ

(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు) బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వినిపిస్తున్న మాటల్లో కార్పొరేటీకరణ ఒకటి. హిందుత్వ ఫాసిజంలాగే ఈ మాట కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తయారు చేస్తున్నదనే అవగాహనకు ఇప్పుడు సాధారణ పరిశీలకులు కూడా వచ్చారు. ఆదానీ ప్రపంచ కుబేరుల్లో నాలుగో స్థానంలోకి వచ్చాడనే వార్తతో పాపులర్‌ మీడియాలో కూడా కార్పొరేటీకరణ గురించిన చర్చ మొదలైంది. దేశ సంపదను  సంపన్నులకు  ప్రభుత్వం  కట్టబెట్టడం ఏమిటనే విమర్శ
వ్యాసాలు

రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి

కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ అమర్ రహే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహాసాలతో పోరాడిన జాతీయ విప్లవకారులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ ఒకరు. ఆయన కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలసి జైలులో అమరణ నిరహార దీక్షకు పూనుకొని 63 రోజుల తరువాత అసువులు బాసాడు. అంతర్జాతీయంగా మార్చ్ 18ని రాజకీయ ఖైదీల దినంగా పాటించడం మూడవ ఇంటర్నేషనల్ ప్రకటించిన విషయం విదితమే. ఆ పరంపరను కొనసాగిస్తూనే వారి త్యాగాల సృతిలో ఖైదీల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 13ను పోరాట దినంగా పాటించడం పరిపాటైంది. భారతదేశ విప్లవోద్యమంలో తమ ఆశయాల సాధనకై
వ్యాసాలు

ఆదివాసీ విద్యార్థుల మరణాలు

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము అని చెప్పుకుంటున్న గురుకులాలు, కస్తూర్బాగాంధీ పాఠశాలలు, తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ హాస్టళ్లు పేద విద్యార్థుల పట్ల శాపంగ మారాయి. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ కేసులు వందలలో నమోదు కాగా వేల మంది విద్యార్థులు అస్వస్థతకు గురై అనారోగ్యం బారిన పడినారు. ఈ పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలలో అత్యంత తీవ్రంగా ఉంది. ఫుడ్‌ ఫాయిజన్‌ ఘటనలతో పాటు ఈ జిల్లాలలో ఆగస్టు నెలలో ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, గురుకులాలలో జ్వరంబారిన పడి నలుగురు విద్యార్థులు చనిపోవడం
వ్యాసాలు

ఖాకీల సంరక్షణలో కార్పొరేట్ల విస్తరణ, ప్రజా పోరాటాల ప్రతిఘటన

ప్రపంచవ్యాపితంగా ఆర్థిక ద్రవ్య సంక్షోభం ఎంత తీవ్రం అవుతుందో అంత వేగంగా వెనుకబడిన దేశాలలోకి ప్రపంచ పెట్టుబడి ప్రవహిస్తున్నది. వెనుకబడిన దేశాలలోని లోతట్టు ప్రాంతాలను వెతుక్కుంటూ మరీ దూకుడుగా అది పరుగులు తీస్తోంది. సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి అది బయటపడడానికి చేపడుతున్న ప్రక్రియ ఇది. కాబట్టి అసలు సంక్షోభాల గురించి 1848 లోనే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ లు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాం. ‘‘సంక్షోభాలను మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకరమైన సంక్షోభాలకు బాట వేయడం ద్వారా, సంక్షోభ నివారణావకాశాలను తగ్గించడం  ద్వారా తాత్కాలికంగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా, 1. ఉత్పత్తి శక్తులలో
వ్యాసాలు

కార్పొరేట్ జగత్తు కోసం ఖాకీమయమవుతున్న అడవులు

భారతదేశంలోని మూల మూలకు ద్రవ్యపెట్టుబడి వేగంగా, దూకుడుగా విస్తరిస్తున్నఫలితమే మన దేశంలోని అడవుల కార్పొరేటీకరణ. పెట్టుబడి సంచయనం గురించి ప్రాథమిక అర్థశాస్త్ర పాఠాలు అర్థమైనవారికి ఈనాడు మన దేశంలో జరుగుతున్న అడవుల కార్పొరేటీకరణ గురించి ఆశ్చర్యమో, విచిత్రమో ఏమీ వుండదు. ఆఫ్రికా మూలవాసులు చెప్పుకునే అనుభవం జగమెరిగినదే. ఒక చేత్తో బైబిల్, మరో చేత్తో రైఫిల్తో వెళ్లిన యురోపియన్ పెట్టుబడిదారులు వారి చేతిలో బైబిల్ పెట్టి వారి భూములను కైవశం చేసుకున్నారని చెప్పుకోవడం తెలిసిందే. ఉత్పత్తి సాధనాలలో ఒకటైన భూమిని స్వంతం చేసుకోకుండా, ఆ భూమిపై ఆధారపడుతున్న రైతులను శ్రామికులుగా మార్చకుండా పెట్టుబడిదారీ విధానం వునికిలోకి వచ్చి వుండేదే
వ్యాసాలు

నీటి ప్రైవేటీకరణ-పర్యావరణం పై ప్రభావం

సకల జీవరాసులకు నీరు ఎంత ప్రాణదాయినో చెప్పవలసిన పని లేదు. నీరు లేకపోతే జీవపు ఉనికే లేదు. భూమి పై అత్యంత విస్తారంగా లభించే సహజ వనరు కూడా గాలితో పాటు నీరే. అటువంటి నీరు ప్రకృతి కారణాలతో తప్ప అందరికీ, సకల జీవరాసులకు సహజంగానే లభించాలి. నీటిని తాగు, సాగు అవసరాలకై ప్రజలందరికీ లభ్యమయ్యేలా చూడటం అన్ని ప్రభుత్వాల సహజ బాధ్యత. అవి తమ బాధ్యతను ఎంత వరకు నెరవేర్చాయనే విషయం పక్కన పెడితే గత మూడు దశాబ్దాలుగా ఇంతటి సహజమైన వనరును కూడా, ఏ వనరు లేకపోతే మానవ మనుగడే ఉండదో అటువంటి వనరును కూడా