సంపాదకీయం

అల్లూరి నుంచి హిడ్మా దాకా అదే రక్తసిక్త చరిత్ర

అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా! రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి! బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు. ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట. ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే
సంపాదకీయం

రాజ్యాంగమూ రాజదండమూ

మనుషుల్లోని నమ్మకాల ప్రపంచం చాలా లోతైనది. ప్రతీకలతో,  భావనలతో అది పటిష్టంగా పని చేస్తూ ఉంటుంది.  కళ్ల ముందు కనిపించే  వాస్తవాలకన్నా విశ్వాసాల ప్రపంచమే సాధారణంగా మనుషులను నడిపిస్తుంటుంది.  అది ప్రాచీనమైనదే కానక్కరలేదు. ఆధునిక, సమకాలీన జీవితంలో కూడా అట్లాంటి నమ్మకాల ప్రపంచం నిరంతరం నిర్మాణమవుతూ ఉంటుంది. వాస్తవ ప్రపంచం  ఘర్షణ పడినప్పుడు అది  పెటిల్లున రాలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన పద్ధతి చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అశాంతికి లోనయ్యారు. ఆగ్రహపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కార్యక్షేత్రమైన పార్లమెంట్‌ భవనాన్ని వైదిక క్రతువులతో, సాధు సంతులతో ఆరంభించడం ఏమిటనే ప్రశ్న
సంపాదకీయం

బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ గెలుపు

కొంచెం అటూ ఇటూగా బీహార్‌ ఎన్నికల ఫలితాలను ఇలాగే ఉంటాయని అనుకున్నారు. కేవల ఊహ కాదు.  ఓట్‌ చోరీ ఆధారం. అనుకున్నదే సత్యమని తేలినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ ఫలితాలు రాబోయే ప్రమాదాన్ని గాఢంగా సంకేతిస్తున్నాయి. ఓట్‌ చోరీ ఏ స్థాయిలో జరిగిందో, అదే స్థాయిలో అది బట్టబయలైంది. బీజేపీ అకృత్యాలను బైటపెట్టడంలో రాహుల్‌ గాంధీ  పరిణతి సాధించాడని చాలా మంది అనుకున్నారు. ఎన్నికల జాబితా అన్యాయాలపై  సాక్ష్యాధారాలతో, గంభీరమైన సూత్రీకరణలతో మాట్లాడి ఓట్ల నేతల్లో భిన్నమైన మనిషి అనిపించుకున్నాడు. ఆయన వాదనలేవీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని కూడా తేలిపోయింది. మనుషులు ఎంత అతార్కిక మన:స్థితిలో ఉన్నా
సంపాదకీయం

మణిపూర్‌లో మంటలు కాదు ..మాటలు కావాలి

మణిపూర్‌ మండుతోంది. అయితే అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డు తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి నివేదిక సమర్పించమని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా? లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా సమస్య అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేం. ఆ స్వభావం అర్థం
సంపాదకీయం

ఎందుకింత కోపం?

ఏకకాలంలో ఉద్రిక్తతా, నిశ్శబ్దామూ ఉంటాయా? ఆ రెంటి అర్థాలే పొసగవు. అయితే మానవ జీవితం నిఘంటు అర్థాలకు భిన్నమైనది. సామాజిక శాస్త్ర సూత్రాలకూ అది లోబడదు. సామాజిక, రాజకీయ సూత్రాలు జీవితాన్వేషణకు దారి చూపగలవు. జీవితాన్నీ, సమాజాన్నీ ఉన్నతీకరించే సాధనాలుగా ఉపయోగపడగలవు.  ఇది పరిమితి కాకపోగా,  విస్తృతికి అవకాశం ఇస్తుంది. దీన్ని ఎంతగా గ్రహించగలం?   పరస్పర విరుద్ధతల మధ్య సాగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ఎరుక ఒక్కటే మనం ఎటో ఒక వైపు కొట్టుకపోకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఎన్ని వాదనలైనా చేయవచ్చు. మానవాచరణను కేంద్రం చేసుకున్నవాళ్లు వాద వివాదాల్లో పై చేయి కోసం ప్రయత్నించరు. వాదనలు
సంపాదకీయం

స్వలింగ వివాహాలు- పితృస్వామిక కుటుంబ వ్యవస్థ

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Marriage equality case (వివాహ సమానత్వం)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కేసు సంప్రదాయ పితృస్వామిక సమాజంలో సంచలనం అనే చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ట్రాన్స్‌ జెండర్‌ సమాహాలు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల గుర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తాను బదిలీ చేసుకుంది. ఆ తర్వాత దీని విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివాహ చట్టాలపై వచ్చిన మౌలిక ప్రశ్నలను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్వచనాల దగ్గరికి
సంపాదకీయం

సాయుధ ప్రతిఘాతుకం.. ఉల్కా పతనం

 14 అక్టోబర్‌ కామ్రేడ్‌ అక్కిరాజు హరగోపాల్‌ రెండేళ్ల క్రితం దండకారణ్యం - బస్తర్‌లో మరణించిన రోజు - అమరత్వం పొందిన రోజు.  జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం..  మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం..  అని 11 అక్టోబర్‌ 2004లో గుత్తికొండ బిలం అమరుడు చారుమజుందార్‌ స్మారక స్థూపం దగ్గర వేలాది మంది ప్రజల ముందు దేశంలోని కోట్లాది పీడిత ప్రజలకిచ్చిన మాట ఆయన నిలుపుకున్నాడు. అప్పటికొక 25 ఏళ్లుగా సాయుధ విప్లవాచరణలో ఉన్నాడు.  నల్లమల విప్లవోద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించాడు. సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే రెండు విప్లవ పార్టీల
సంపాదకీయం

ఈసారి లోపలి నుంచి…

చుట్టుముట్టు యుద్ధంలో చిక్కుకపోయిన విప్లవోద్యమం మీద లోపలి నుంచి విమర్శలు మొదలయ్యాయి. విప్లవోద్యమం కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదన చేశాక అనేక వైపుల నుంచి సుదీర్ఘ చర్చ కొనసాగుతున్నది. అంతర్యుద్ధాన్ని పోలిన ఈ అణచివేతలో ప్రాణాలు కోల్పోవడం కంటే సాయుధ పోరాట విరమణ చేయడం మంచిదని చాలా మంది సూచించారు. సాయుధ పోరాటాలకు ఇది కానికాలమని, శాంతి చర్చల ప్రతిపాదనకు అనుగుణంగా సాయుధ పోరాటం వదిలేయాలని  కొందరు హితవు పలికారు.   వీటన్నిటికంటే ముఖ్యమైన విమర్శ మరోటి ఉంది. మావోయిస్టుపార్టీ ఎంచుకున్న పంథా వల్లనే ఈ అణచివేత, వైఫల్యాలు ఎదురయ్యాయని, మారుతున్న ప్రపంచాన్ని మావోయిస్టులు అర్థం చేసుకోలేకపోతున్నారని, పిడివాద,
సంపాదకీయం

జైలు గోడల మీదా, ఆడవి అంచుల మీదా..

మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాడో తెలియదుగాని ఖైదీల పోరాటానికి ఆయన సంకేతం. జాతీయోద్యమం కాలంలో జితేందాస్‌ తదితరుల జైలు పోరాటాల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ 26, 1994 నుంచి 21 ఫిబ్రవరి 1995 దాకా జరిగిన  రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల పోరాటమే గుర్తుకు వస్తుంది. విప్లవమంటే స్వేచ్ఛా మానవుల నిర్మాణం. దాన్ని  ఈ సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే జైలు తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తుంది. మానవులంటే మానవ సంబంధాల సమాహారం.
సంపాదకీయం

వాకపల్లి అత్యాచారం నుంచి వైమానిక దాడుల దాకా

వాకపల్లి ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన వాళ్ల మీద   కేసును  ఏప్రిల్‌ 6న కోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజు ఇంకా తెల్లారక ముందే చత్తీస్‌ఘడ్‌లోని పామేడ్‌ ప్రాంతంలో భారత ప్రభుత్వం రెండో విడత వైమానిక దాడులు చేసింది. ఈ రెండు ఘటనలు వరుసగా జరగడం యాదృశ్చికం కావచ్చు. కానీ వాటి మధ్య పోలిక ఉన్నది. సంబంధం ఉన్నది.  ఈ రెండు ఘటనలకు మధ్య పదహారేళ్ల ఎడం ఉన్నది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆదివాసీ గ్రామం వాకపల్లి. ఆగస్టు 20, 2007న ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో విప్లవకారులను హత్య చేయడానికి  కూబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి మహిళల