పత్రికా ప్రకటనలు

కేసీఆర్ రాజ్యంలో కన్నబిడ్డల అంత్యక్రియలు కూడా నేరమా?

అమరుల త్యాగాలను స్మరించుకోవడం చట్ట వ్యతిరేకమైపోయిందా? అమరుల బంధుమిత్రుల సంఘం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధాన్ని వ్యతిరేకించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల బంధు మిత్రుల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించింది. గత నెల 30వ తేదీ తయారు చేసుకున్న జీవో 73ను ఏప్రిల్ 28న విడుదల చేసింది. ఈ ప్రకటన మమ్మల్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. పాలకుల దుర్మార్గం మాకు చాలా బాగా తెలుసు. మా కన్న బిడ్డల్ని, సహచరుల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వం వెంటాడి హత్య చేస్తే, ఆ దు:ఖాన్ని మోస్తూ జీవిస్తున్నవాళ్లం. మాకు ఈ వ్యవస్థ, రాజ్యం ఎంత అమానుషమైనవో
ఇంటర్వ్యూ సంభాషణ

హక్కుల భావజాలాన్ని హిందుత్వ అంగీకరించదు

1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు? వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు
సాహిత్యం కవిత్వం

అక్షరాల పై నిషేధం

ఆకలి ఆక్రందనలుఅత్యాచారలు  అన్యాయపుకారు చీకట్లను చీల్చె అక్షరాలపై నిషేధమా..?అంటరాని పూరి గూడిసేలనెగడయి నిటారుగ నిలబడికందిలయి దీపమయినందుఅక్షరాలపై నిషేధమా..?నొసటి మీద చమట నేల చిందనిదేచదును కాని హలంసేద్యపు గింజల రాశులు పోసిన చొటకర్షకులు కాయకష్టంబయిన అక్షరాలపై నిషేధమా..?అణిచివేతలపై తిరుగుబావుట జెండాయైప్రజల గొంతుకల పోరు పాటలయిప్రతిధ్వనించిన నేలలో అక్షరాలపై నిషేధమా..?అసమానతల కంఠాన్ని తెగనరికితెలంగాణ ఉద్యమ రాగాన్ని పల్లవించియెల్లలు లేని ప్రపంచానికి చాటినఅక్షరాల మీద నిషేధమా..?ఆర్థిక రాజకీయ కోణాన్ని విడమర్చి చాటిహక్కులకై సల్పిన పోరులో నెగడయి మండుతున్నఅక్షరాలపై నిషేధమా..?అవునుఈఅక్షరాలు ఇప్పుడు నిషేధమెఅప్పుడు నిషేధమెరాజ్యాన్ని ప్రశించినందుకురాజ్యపు  నిషేధాలా కొలిమిలొంచికాగడాలయి అక్షరాల మంటలనుదావనంలా వ్యాపిస్తాయి... (విరసం పై నిషేధాన్ని ఖండిస్తూ....)
సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన
సంభాషణ

ఇది తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిపై నిషేధం!

తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జి ఓ ఎం ఎస్ నం 73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలు లోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు
సంభాషణ

అంతిమ వీడ్కోలుపై నిషేధమా ?

తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించింది. సాహిత్య రంగంలో పనిచేస్తున్న విరసం మొదలు విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలను తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధించింది. వీటిలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం, వారి అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో జరిపించేప‌ని ఈ సంఘం చేస్తోంది. చనిపోయిన వారికి చివరి వీడ్కోలును వారు నమ్మిన పద్ధ‌తుల‌లో జరపడం  ఒక మానవీయ విలువ‌.   ఇది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే నిషేధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విప్లవకారుల అంత్యక్రియలకు ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వపు పెద్దలలో అనేక మంది హాజరైన వాళ్లే.  అధికారంలోకి
సంభాషణ

ప్రజా సంఘాలపై నిషేధం ఫాసిస్టు చర్య

తెలంగాణ ప్రభుత్వం కొత్త గా నిషేధించిన ప్రజాసంఘాలన్నీ అణగారిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం నిబడ్డవే.  ఇన్ని సంఘాలపై ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో పనిచేసే రచయితలు కళాకారులు పౌరహక్కుల కార్యకర్తలు రైతులు కార్మికులు మహిళలు ఆదివాసీలు విద్యార్థులు రాజకీయ కార్యకర్తలు అందరూ ప్రభుత్వం దృష్టిలో సంఘ విద్రోహ శక్తులు కావడం ఆశ్చర్యం.  ఇప్పుడు నిషేధానికి గురైన ఈ ప్రజాసంఘాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో అగ్ర భాగంలో నిలబడినవే. అధికారంలో భాగస్వాములు కాకుండా ప్రజల పక్షంలో నిలబడి ఉండటమే నేరమైంది. ప్రజా
కాలమ్స్ కథ..కథయ్యిందా!

పితృస్వామ్యపు విరుగుడు ను చిత్రించిన చాయ్ గ్లాసు

చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని  కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి
సాహిత్యం కథలు

సుబ్రమణ్యం కంట తడి

ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది. అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం. ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు. 1 రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్‌
సమీక్షలు సాహిత్యం

కార్మికుల సామూహిక చైతన్యమే “స్ట్రైక్” సినిమా సారాంశం

“ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో.    1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ “స్ట్రైక్”. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”.  ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం! దీని నిడివి