సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

డాక్యుమెంట‌రీలో మాస్టారు

ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది. కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు
సంభాషణ కారా స్మృతిలో సాహిత్యం

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కుల సమస్యను చిత్రించడంలో కా.రా. సఫలమా? విఫలమా?

కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర,  భయం,తీర్పు  జీవితం తాలూకు మార్క్సిస్టు  ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు. 'ఆర్తి' కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప
సంభాషణ కారా స్మృతిలో

అవుట్ బరస్ట్!

ప్రపంచం ఎలా ఉండాలో అలా లేదు. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అందుకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం మన అభిప్రాయాల్ని స్పందనల్ని మనలోపల పెట్టుకొని దాచుకోలేక బయటపడుతూ ఉంటాం. ప్రభుత్వాలూ దాని వ్యవస్థలూ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ భావాల వినిమయం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే బలంగా ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడానికి మీడియా వాహకాలని నియంత్రిస్తుంది. కేసులు పెడుతుంది. అరెస్టులు చేస్తుంది. అణచివేస్తుంది. అదే మీడియా వాహకాలని తన సైన్యంతో అనుకూలంగా వొకవైపు వాడుకుంటూనే మరోవైపు తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికీ ప్రయత్నిస్తూవుంటుంది. మనకు ఇవాళ తక్షణ స్పందనల్ని బయట పెట్టుకొనే వీలూ వెసులుబాటూ ఉంది. ఏ మేరకు
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

లోచూపు!

జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే...’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు. అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

చదువు!

‘చదువు’ ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది. నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి. అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ  చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని
కాలమ్స్ లోచూపు

గుండెల్నిమండించే మంటో కథలు

మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి
సాహిత్యం వ్యాసాలు

డిజిటల్ పాఠాలు పేద విద్యార్థులకు చేర్చడంలో పాలకులు విఫలం

అంతర్జాతీయ కరోనా విపత్తు వలన గత ఏడాది నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యభోదన ప్రత్యక్ష తరగతిగది విధానంలో కాకుండా డిజిటల్ తరగతుల పేరుతో జరుపుతున్నారు.ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే తరగతుల భోదన ఉంటుందని విద్యశాఖ స్పష్టం చేసింది. అయితే రూపంలో డిజిటల్ విద్యభోదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సారంలో డిజిటల్ తరగతులు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయనేది నేడు మనందరి ముందున్నట్టి ప్రశ్న. వేల సంవత్సరములుగా మన దేశంలోని శోశితజనసమూహౕలపై జరుగుతున్న సామాజిక,ఆర్థిక అణచివేత వలన నేడు మెజారిటీ ప్రజలు డిజిటలైజేషన్ ఫలితాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. తరగతిగదిలో ప్రత్యక్ష భోదనకు స్కూల్ బిల్డింగ్, టీచరు, బెంచీలు,
సాహిత్యం వ్యాసాలు

రాష్ట్రబడ్జెట్-రాయలసీమ

గత రెండు సంవ‌త్స‌రాల జమా,ఖర్చుల విశ్లేషిస్తూ,రాబోయే సంవ‌త్స‌ర‌పు రాష్ట్ర అవసరాలే గాకుండా,భవిష్య‌త్తును దృష్టి లో పెట్టుకొని వివిధ రంగాలకు నిధులు కేటాయింపు చేయడమే బడ్జెట్ లక్ష్యం.ఇందులో,ప్రజల తక్షణ అవసరాలకై సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  దోహదపడేలా నిధుల (మూలధన పెట్టుబడి) కేటాయింపులుండాలి.అప్పుడే క్రమక్రమంగా ప్రజలు తమకాళ్ళపై తాము నిలబడగలుతారు. భవిష్యత్తరాలు,ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని కొనసాగించగలిగే అవకాశంవుంటుంది కూడా.అయితే.ఇక్కడ కేవలం ఆర్థికాభివృద్ధి చెందడమే సరిపోదు,అందులో ప్రజలకు వారి వాటకూడా దక్కాల్సివుంటుంది. అలా ఆశించడం ఈ వ్యవస్థలో పేరాశనే అవుతుందనేది మరో అంశం. పొతే, కేవలం ఓట్ల రాజకీయాల్లో,   మంది బలం పై నడిచే నేటి రాజకీయాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి  అనేది ఒక
కాలమ్స్ ఆర్ధికం

భావ స్వేచ్ఛ‌కు డిజిటల్ సంకెళ్లు

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.