కవిత్వం

వాడి మౌనం వెనుక

వాడి మౌనం వెనుక....ఎన్ని భయానక దృశ్యాలో ...ఎన్ని చెడు కాలాలో .....ఎన్ని నగ్నదేహాల ఊరేగింపులో .....ఎన్ని హృదయంలేని బుల్డోజర్లో ...తెగిపడ్డ మానవ దేహాల ‘ మణిపురా ‘ లెన్నో ...వాడి మౌనం వెనుక ....త్రవర్ణ పతాకంలోకాషాయ ' వర్ణా ' ధిపత్యంభారత జనేచ్ఛ రాజ్యాంగాన్ని ఆవరిస్తున్నమనువాద మహా రాజ్యాంగం !జైలు గోడల మధ్య బందీలవుతున్నమాట్లాడే నోళ్లుఆలోచించే మెదళ్లుప్రశ్నించే గొంతుకలుధిక్కరించే స్వరాలువాడి మౌనం వెనుక సూడో చరితలుసూడో శాస్త్ర విద్యలుసనాతన ధర్మ కుట్ర చట్రాలుమూఢ విశ్వాసాల ము క దాడులుమొత్తంగా వాడి మౌనం వెనుక ఉన్నదిఏకశిలా సదృశ జాతీయవాద గర్వం వాడి మౌనాన్ని బద్దలు చేయడానికివాడి ఫాసిస్టు గుట్టుమట్టులుబట్టబయలు చేయడానికిసిద్ధమవుతున్నాయిమాట్లాడే
దండకారణ్య సమయం

బస్తర్‍లో సైనికీకరణ

దేశంలోని ఆదివాసీ ప్రాంతాలలో అత్యధికంగా సైనికీకరణ జరుగుతున్న  ప్రాంతాలలో బస్తర్  ఒకటి. తరచుగా అక్కడ "తిరుగుబాట్లు",  పోలీసు "ఎన్‌కౌంటర్లు" జరుగుతుంటాయి. గణనీయమైన ఆదివాసీ జనాభా వున్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ దేశంలోని భారీ సైనికీకరణ జరుగుతున్నా ప్రాంతాలలో ఒకటి. ఇది తరచుగా సాయుధ పోరులు, ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ సైనికీకరణ ధోరణి దక్షిణ ఒడిషా వంటి పొరుగు ప్రాంతాలకు కూడా విస్తరించింది, ఈ ప్రాంతమంతటా సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అడ్డూ అదుపూ లేని ఈ సైనికీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి.  "ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ నిరసనలలో  ఎవరైనా అందులో భాగం కావచ్చు" అని
సంభాషణ

Mother’s anguish

That was January 2024 New Year. The world was full of happiness. Some people drunk at 12 midnight, may have drunk again in the morning before the dizziness subsided and drowned in happiness. We adivasis do not know such things. We have since 2005, tears of hardship, Greenhunt since 2017, Samadhaan since 2022 and then Surajkund attack. We don't know what the new year means. All we know is how
పత్రికా ప్రకటనలు

నిర్బంధంలో ఆదివాసీ నేతసుర్జు టేకమ్‌

సర్వ ఆదివాసీ సమాజ్ ఉపాధ్యక్షులు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్, సుర్జు టేకమ్‌ను 2024ఏప్రిల్ 2  న క్రూర ఉపా, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్  కింద అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. సుర్జు "మావోయిస్ట్ సానుభూతిపరుడు" అనే సాకుతో తెల్లవారుజామున 4 గంటలకు, ఛత్తీస్‌గఢ్‌లోని మన్‌పూర్-మొహ్లా-అంబగఢ్ జిల్లాలోని కల్వార్ గ్రామంలోని అతని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, అతని ఇంట్లో జరిగిన మొదటి దఫా సోదాలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి ఏమీ దొరకలేదు. కానీ ఆ తర్వాత వారు తిరిగి లోపలికి వెళ్లి, సర్జు టెకామ్ మావోయిస్టు సానుభూతిపరుడు,
కవిత్వం

కగార్  యుద్ధం

తల్లి అయితేనేం ఒడిలో పసిపిల్ల అయితేనేం తూటా తుపాకి నుంచి దూసుకొచ్చిందంటేనెత్తురు తాగకుండా నేల రాలదుముగ్గురయితేనేం మావోయిస్టులు పదముగ్గురయితేనేంపట్టాలు తప్పిన డబుల్‌ ఇంజన్‌ రైలురక్తదాహానికి నాలుగు నెలల్లో ఏభయి అయితేనేం ఎందరయితేనేంమనుషులుగా ఆటంకమైన వాళ్లందరూఅసువులు బాయందే అడవిలో కంపెనీ కాల్మోపలేదుపక్షులయినా అడవిలో కాయో పండో తిని విహాయసంలో ఎగిరినపుడు విత్తనాలు వెదజల్లుతాయిఎదురిచ్చే కృతజ్ఞతతో బాక్సైట్‌ దోచుకొని ఆకాశంలోకెగిరిన భారత్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానాలు మాత్రంచెట్టు చేమలనూ, జనావాసాలనేకాదునేల సారాన్ని ధ్వంసం చేసి ఆదివాసీ ఉసురు తీసిగానీ ఎగురవు అర్థంకాని పరాయి లోకపులోహ విహంగం ఆకారంగాహృదయ రహిత రాజ్యం నీడగామనుషుల మధ్య భీతావహంగా అసహ్యంగాలూటీ సర్కారు జనతన సర్కార్‌సరిహద్దుల్నే చెరిపేసేదాక
సంపాదకీయం

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర కోసమే కగార్‌

కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే
వ్యాసాలు

జెఎన్‌యు పరిణామాలు – రాజకీయ ప్రాసంగికత

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికలు - నాలుగు సంవత్సరాల తర్వాత - ఎట్టకేలకు ముగిశాయి. వాటిలో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. ‘జెఎన్‌యులో మళ్లీ ఎరుపు వర్ణం పుష్పించింది’ అని వారు, వారి మద్దతుదారులు అంటున్నారు. అయితే ప్రతి పదవిలోనూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే తమలో విభేదాలు ఉన్న వామపక్షాలు మితవాదులకి భయపడి ఒక్కటయ్యారని, అయినా తమకు, వారికీ మధ్య తేడా చాలా తక్కువగా ఉందని అందుకే తమదే విజయమని అంటున్నారు. గతంలోలాగా విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఏబీవీపీ
సంస్మరణ

కాకలు తీరిన యోధుడు సృజన్ సింగ్

భారత విప్లవోద్యమ చరిత్రలో 1980కి విశిష్ట స్థానం వుంది. దేశ విప్లవోద్యమ చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన సంవత్సరం. 1980 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన యువ విప్లవకారులు సరిహద్దులలోని దండకారణ్యంలో అడుగిడినారు. వారు, 35 మంది విప్లవకారులు 7 దళాల రూపంలో విశాల అటవీ ప్రాంతంలో తమ విప్లవ కార్యకలాపాలకు నాంది పలికారు. ఆ అటవీ ప్రాంతంలో భాగం పాత చంద్రపుర్ (చాందా) జిల్లా, వర్తమాన గడ్ చిరోలీ జిల్లా. గడ్ చిరోలీ జిల్లా ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదులు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధాన్ని కలిగివుంది. గడ్చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో 1980,
వ్యాసాలు

ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

ఇండియాలో స్త్రీలు అనగానే కట్టు బొట్టు అంటూ మొదలుపెడతారు. అందం మాటున అణచివేత ఉంది. సాంస్కృతిక కట్టడి ఉంది. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఆహార్యం స్త్రీలకు నిర్దేశితమైంది. తరాలు మారినా, ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా ఇష్టంగానో అయిష్టంగానో ఈ గుదిబండను స్త్రీలు మోస్తూనే ఉన్నారు. ‘తగలెయ్యాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్త్రీవాదులతో సహా. ఎందుకంటే అది వదిలించుకోవడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది సమాజంలో నీ ఉనికిని, గుర్తింపును, గౌరవాన్ని నిర్దేశించేది. ఒక కుటుంబానికి సంబంధించిన, సమూహానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల భారాన్ని మోయవలసింది స్త్రీలే.
సంపాదకీయం

టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం.  వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి