లోచూపు కాలమ్స్

పితృస్వామ్యంపై ఫేస్ ఆఫ్ ‘స్టోమా’

 కొన్ని పుస్తకాలు మనుషుల జీవిత గాథల్ని వినిపిస్తే,  మరికొన్ని పుస్తకాలు వాటిని వ్యాఖ్యానిస్తాయి. కానీ గీతాంజలి గారు రాసిన 'స్టోమా' పుస్తకం స్త్రీల విషాద లైంగిక గాథల్ని ఒక చలనచిత్రం వలె పాఠకుల కళ్ళముందు దృశ్యమానం చేస్తుంది. బయటకు కనబడని వికృత పురుష మానసికతను, అమానుష లైంగికతను లైవ్ గా చిత్రిస్తుంది. మన సమాజంలో స్త్రీల అనంత విషాదానికి ప్రత్యక్షంగా పురుషుడే కారకుడుగా కనిపించినప్పటికీ, పరోక్షంగా పురుషులను (స్త్రీలను) కూడా నడిపించే దుష్ట పీడక సంప్రదాయాలు, దోపిడి సామాజిక వ్యవస్థ ఉన్నాయనే వాస్తవాన్ని మనం పట్టించుకోకుండా ఉండలేము. ఇందులో చిత్రించిన 13 కథలకు ఎంతో వైవిధ్యపూరితమైన సామాజిక నేపథ్యం
ఓపెన్ పేజీ వ్యాసాలు

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

కుటుంబం-సొంత ఆస్తి- రాజ్యాంగ‌యంత్రం- 3

అమెరికాలోని పూర్వపు స్పానిష్ సన్యాసులవంటి మత ప్రచారకులకు ఈ ఆచారాలు ‘పరమ అసహ్యం’గా కనిపించాయి. అందుచేత వాటిని తోసేశారు. అలా కాక వారు కొంచెం విమర్శనా ద్రుష్టితో పరిశీలించి ఉన్నట్లయితే, ఈ మాదిరి క్రైస్తవేతర కుటుంబ రూపానికి నిదర్సనలు ‘పోలినీషియా’ అంతటా కనబడి ఉండేవి. [అంటే, మనం అసహ్యించుకున్నా, ఇష్టం లేకపోయినా చరిత్రను కాదనలేం. అన్నది ఎంగెల్స్ అభిప్రాయం. ఈ అవశేషం మన భారతంలో కూడా వుంది కదా! ద్రౌపదికి అయిదుగురు భర్తలు అన్నదమ్ములే] గుంపు పెళ్లి ఉన్నంత వరకు సంతానాన్ని తల్లి వైపునుంచే పరిగణిస్తారు. అందుచేత ‘ఆడ పరంపర’ మాత్రమే లెక్కలోకి వస్తుంది. అటవిక కాలం లోనూ,
కథ..కథయ్యిందా!

కరువు నిజంగా పీడించేదెవరినో చెప్పిన కథ ‘కరువెవరికి’

అనంతపురం జిల్లా (రాయలసీమ) కరువు గురించి చాలా కథలే వచ్చుంటాయి.ప్రకృతి చేస్తున్న విధ్వంసాన్నో , ప్రకృతిని సాకుగా చూపిస్తూ రాజ్యపు, దాని యంత్రాంగపు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, విషాదభరితమైన జీవితాలను చిత్రించిన కథలే అవన్నీ. ఒక  కథలో  సమాజంలోని ఒక స్తరాన్ని ( పొరను) చిత్రించడం ద్వారా సమాజాన్ని సాధారణీకరించడానికి  ఆకథలన్నీ ప్రయత్నించివుంటాయి. అయితే  ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ' కరువు ' అనే అవ్యవస్థ ఎట్లా వుంటుంది.దాని ప్రభావానికి ఆ సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజలు ఎట్లా వున్నారు. ఎవరికి యేమేరకు కరువుశాకం తాకింది , లేదా ఆ వేడిని కూడా  చలికాచుకోవడానికి వాడుకునే వెసులుబాటు ఎవరికుందీ ,
సమకాలీనం

శాంతి ప్రతిపాదనకు విరుద్ధంగా గుట్టల దిగ్బంధం

(మావోయిస్టులు కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్న సమయంలో భద్రతా బలగాలు అగ్రశ్రేణి తిరుగుబాటు నాయకులకు ఆశ్రయం కల్పిస్తున్న కొండలపై కాల్పులు జరిపాయి చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రధాన మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం నుండి ఒక క్షేత్రస్థాయి రిపోర్ట్) ఏప్రిల్ 21 నుండి, హెలికాప్టర్లు గిరగిరా తిరుగుతున్న శబ్దం, భారీ ఫిరంగి కాల్పులు పెద్ద పేలుళ్ల శబ్దాలు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేశాయి, ఇక్కడ భారత భద్రతా బలలు ప్రారంభించిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) శాంతి చర్చలలో పాల్గొనడానికి తన సంసిద్ధతను
సమకాలీనం

దేశద్రోహుల జేబు సంస్థ ఎన్‌ఐఏ ముస్లింలను దేశద్రోహులని ఆరోపించడమా?

నేషనల్‌ ఇన్‌వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది.  హైదరాబాదులోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు  నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది.నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ముస్లింలకు లీగర్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు
మీరీ పుస్తకం చదివారా ? ఈబుక్స్

మీరీ పుస్త‌కం చ‌దివారా?

ఈ పుస్త‌కం మీ కోసం. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాల తీరును అర్థం చేసుకోడానికి ఈ పుస్త‌కం ఉప‌క‌రిస్తుంద‌ని మీకు అందిస్తున్నాం. చ‌ద‌వండి.. చ‌ర్చించండి. భారతదేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి అయి పెట్టుబడిదారీ విధానంగా మారిందని, అయితే ఈ మార్చు సంప్రదాయ (క్లాసికల్‌) రూపంలో కాకుండా ఈ దేశ విశిష్ట లక్షణాలపై ఆధారపడి మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని చూడాలని కొంతమంది వాదిస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, చివరకు రష్యా దేశాలలో ఇలాగే జరిగాయని చారిత్రక ఉదాహరణలు చూపెడుతున్నారు. నేడు అర్ధ వలస, అర్ధభూస్వామ్య విధానంలో సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలో దేశంలో పెట్టుబడిదారీ విధానం వృద్ధి కావడం సాధ్యం
సాహిత్యం కథావరణం కాలమ్స్

” రైలు కూడా మొగోడే..అంటున్న వినోదిని కథ ‘కట్ట’ “

డాక్టర్ వినోదిని రాసిన "కట్ట" కథ అరుణతారలో 2015 జనవరిలో ప్రచురితమైంది. ఆమె రాసిన 11 కథలతో "బ్లాక్ ఇంక్" కథాసంపుటిని లిఖిత ప్రెస్ హైదరాబాద్ వారు 2015 అక్టోబర్ లో ప్రచురించారు. ప్రధాన స్రవంతి పత్రికలు అచ్చు వేయడానికి నిరాకరించిన  కథలివి.వాడల లోపలి కథలు.  అసలు కథలు ఎందుకు ప్రచురించడానికి భయపెడతాయి? కథలు ప్రచురించడంలో మొహమాటం ఏమిటి? దాపరికం ఏమిటి? నామోషీ ఏమిటి? తరతరాల సంప్రదాయ వాసనలు కొడుతున్న పత్రికల్లో పీతి వాసన గురించిన కథలంటే భయం కలగడం సహజమే.ఈనాడు మంచి రచయితలు తమ కథల్ని ప్రచురించడానికి మంచి పత్రికలను వెతుక్కోక తప్పని పరిస్థితి. పత్రికలకు మంచి
మీరీ పుస్తకం చదివారా ?

కనిపించని డైరీలో కవిత్వపు అంతరంగం

"ఇక మాటలు అనవసరం. కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం విప్లవాత్మక దృక్ఫథంతో రచనలు చేయాలి"-మహాకవి శ్రీశ్రీ(ఖమ్మంలో 8`10`1970న విరసం తొలిమహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతినిధుల సభలో..) నేటితరం కవులు అనివార్యంగా వర్తమాన సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, ఆక్రంధనలు, అత్యాచారాలులాంటి ఘటనలే కాక ప్రతీ సామాజిక దురాగతాలు, అసమానతలూ, దోపిడీ, ప్రపంచీకరణ, కార్పోరేటీకరణ లాంటి ప్రతి దుర్మార్గాన్ని ఎండగడుతూ కలమెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వపు కాన్వాసు మరింత విశాలంగా మారింది. ఎలా రాస్తున్నారనో ఏం రాస్తున్నారనో విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గూర్చైతే ఆలోచిస్తున్నారు. ఇటీవం కవిత్వంలోకి  మహిళలు వరదలా వస్తున్నారు..ఇది గొప్ప పరిణామం..అలా అనుకుంటున్న క్రమంలో ‘‘ నాడైరీ
క్యా చల్రా .? కాలమ్స్

సంస్కరించుకోకపోతే తాలీబన్లను కూడ తరిమేస్తారు

  1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా? సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి. మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ,