ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు
‘ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు’ పన్నెండేళ్ల పాలస్తీనియన్ బాలుడు పాడిన పాట (అబ్దుల్ రహ్మాన్ - ఇష్టంగా అందరూ పిలుచుకునే అబ్దుల్ 2021లో గాజాకు చెందిన 11 సంవత్సరాల పసిబాలుడు. ఇరవైలక్షలమంది పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్ ` (సముద్రతీరాన ఒక అంచువంటి భూఖండిక) చుట్టూ గాజాపై బ్లాకేడ్ విధించిన ఇజ్రాయిల్ భూభాగం చుట్టూ ఒక ఎత్తైన గోడ నిర్మించి గాజానొక బహిరంగజైలుగా మార్చింది. దశాబ్దాలుగా అత్యంత జనసమ్మర్ధం గల ఆ ప్రాంతంలో విమానదాడులు చేస్తూ ఇజ్రాయిల్ అలవిగాని హింసావిధ్వంసాలు సాగిస్తున్నది. ముఖ్యంగా 2007లో అక్కడ హమాస్ అనే మిలిటెంటు సంస్థ ఎన్నికలద్వారా అధికారానికి వచ్చినప్పటి నుంచీ మొదలుకొని అమెరికా