సంభాషణ

ఛత్తీస్ ఘడ్ లో మరో బూటకపు ఎన్కౌంటర్

మరణించిన మనురామ్ నూరేటి ‘మావోయిస్టు’ అన్న పోలీసులు ఆ తర్వాత కాదన్నారు . 2022 జనవరి 23న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోవున్న భరందా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మనురామ్ నూరేటి అనే యువకుడు చనిపోయాడని పోలీసుల కథనం. “ఎన్‌కౌంటర్  ప్రారంభమైనప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్ లో ఉంది. అర్ధరాత్రి 1 గంటలకు, మావోయిస్టులు డిఆర్‌జిపై కాల్పులు జరపడంతో  ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆగిపోయిన తరువాత, సంఘటన స్థలం నుండి ఒక మావోయిస్టు మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్ (ఎమ్‌ఎల్‌జి)ను స్వాధీనం చేసుకున్నది, ”అని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ చెప్పారు, ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. “రాత్రి 10 గంటల ప్రాంతంలో, నా భర్త పక్షులను వేటాడేందుకు స్లింగ్‌షాట్‌తో బయటికి వెళ్లాడు. అతను స్వెటర్‌ సాధారణ  చెప్పులు వేసుకున్నాడు, కానీ  పోలీసులు చూపించిన మృత దేహానికి యూనిఫాం వుంది, రైఫిల్‌
ఇంటర్వ్యూ

వ్య‌క్తి స్వేచ్ఛలేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీకి అవ‌కాశ‌మే లేదు

ప్రొ. ప‌ద్మ‌జా షా (ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా
ఇంటర్వ్యూ సంభాషణ

రాజ్యాంగాన్ని విమ‌ర్శ‌నాత్మ‌కంగా చూడాలి

(భార‌త రాజ్యాంగానికి ఈ వ్య‌వ‌స్థ‌ను య‌థాత‌ధంగా ప‌ట్టి ఉంచే స్వ‌భావం ఉంద‌ని ఎన్ వేణుగోపాల్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఉన్న ప్ర‌జానుకూల ఆద‌ర్శాలు అమ‌లు కాగ‌లిగే స్థితిలో మ‌న రాజ‌కీయార్థిక, సాంఘిక వ్య‌వ‌స్థ లేద‌ని అంటున్నారు. కాబ‌ట్టి రాజ్యాంగాన్ని మొత్తంగా నెత్తికెత్తుకోవ‌డ‌మో, తిర‌స్క‌రించ‌డ‌మోగాక విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఉండాల‌ని ఈ ఇంటర్వ్యూలో అంటున్నారు..వ‌సంత మేఘం టీం) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది? రాజ్యాంగాన్ని మార్చాలని కె సి ఆర్ స్పష్టంగానే అన్నప్పటికీ అన్న సందర్భం మాత్రం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పెత్తందారీ వైఖరిని ఖండించే సందర్భం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య
ఇంటర్వ్యూ సంభాషణ

స‌ర‌ళీక‌ర‌ణ స‌న్నివేశంలో ఉద్యోగుల ఉద్య‌మం, లొంగుబాటు

(పీఆర్సీ సాధ‌న‌కు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇటీవ‌ల గ‌ట్టి పోరాట‌మే చేశారు. కానీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల పేరుతో నాయ‌క‌త్వం వంచించింద‌నే అభిప్రాయం ఉన్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కూ చ‌ర్చ‌ల వ్య‌వ‌హారం ఏమిటి? ఉద్యోగ‌, ఉపాధ్యాయ ఉద్య‌మాల స్థితిగతులు ఏమిటి? అనే కోణంలో ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు ర‌మ‌ణ‌య్య ఈ ఇంట‌ర్వ్యూలో వివ‌రిస్తున్నారు..- వ‌సంత‌మేఘం టీం) 1. పి.ఆర్‌.సి. సాధన సమితి స్టీరింగ్‌ కమిటీ ప్రభుత్వంతో చేసిన చర్చల లోగుట్టు ఏమిటి? “లోగుట్టు అంటూ ప్రత్యేకంగా అనకోవడానికి లేదు. అంతా బహిరంగ రహస్యమే. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలు, పరిపాలనా విధానాలకనుగుణంగా వీరు మౌల్డ్‌ కావడము అందుకనుగుణంగా పాలకవర్గాలకు సహకరించినందుకు
సంభాషణ

నిమ్మలపాడు దీర్ఘకాలిక పోరాటం

న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మలపాడు గ్రామ ప్రజలు 1997లో అనూహ్యమైన ఒక విజయాన్ని సాధించారు. మైనింగ్‌ కార్యకలాపాల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ప్రైవేటు కంపెనీకి వ్యతిరేకంగా సాగిన న్యాయపోరాటంలో వాళ్ళు విజయం పొందారు. సుప్రీంకోర్టు 1993లో, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా యిచ్చిన తీర్పును కొట్టివేసింది. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఖనిజ సంపదను వెలికితీసే హక్కు కొండదొర తెగకు చెందిన ప్రజలకు మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలకు మాత్రమే వుందని,  ప్రభుత్వం
ఇంటర్వ్యూ సంభాషణ

భార‌త రాజ్యానికి ఆధునిక స్వ‌భావం లేదు

(రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు, మార్పు గురించి ముమ్మరంగా చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలోవ‌సంత‌మేఘంతో ప్ర‌ముఖ న్యాయ‌వాది, సామాజిక ఉద్య‌మ‌కారుడు వై.కే పంచుకున్న విమ‌ర్శ‌నాత్మ‌క అభిప్రాయాలు మీ కోసం..) 1. రాజ్యాంగాన్ని మార్చాల‌ని కేసీఆర్ అన‌గానే ఇంత ప్ర‌తిస్పంద‌న ఎందుకు వ‌స్తోంది?  రాజ్యాంగాన్ని మార్చాలనడం, సవరించాలనడం - ఈ రెండూ ఒకటి కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను సవరించడానికి ఆర్టికల్‌ ౩68 ద్వారా రాజ్యాంగమే అవకాశం కల్పించింది. అయితే, సాధారణ బిల్లును ఆమోదించటానికి భిన్నంగా రాజ్యాంగ సవరణ చేయటానికి ఒక ప్రత్యేక ప్రొసీజర్‌ను 368లోనే పొందుపరిచారు. ఆ ప్రకారం 107 రాజ్యాంగ సవరణ చట్టాలను ఇప్పటికే పార్లమెంట్‌ ఆమోదించింది. కానీ, కెసిఆర్‌ చెబుతున్న కొత్త
సంభాషణ

విప్లవోద్యమ వ్యక్తిత్వమే సాకేత్‌

‌అక్టోబర్‌ 14వ తారీఖు భారతదేశ విప్లవోద్యమానికి, విప్లవ శ్రేణులకు, విప్లవ కార్యకర్తలకు అత్యంత దుఃఖదాయకమైన రోజు. ఒక ఆత్మీయుడు, ఒక స్నేహశీలి, ఒక ఓదార్పు, ఒక ఊరట, ఒక నిరాడంబర, నిస్వార్థజీవి,  ఒడిదుడుకుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఒక ఆపన్నహస్తం, మచ్చుకైనా కోపతాపాలు ప్రదర్శించని సహన సౌమ్యశీలి, ఒక అన్వేషి, ఒక ఆర్గనైజర్‌, ఒక సైద్ధాంతిక రాజకీయ వ్యూహాకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రామకృష్ణగా చిరపరిచితుడైన  ప్రియతమ నాయకుడు కామ్రేడ్‌ సాకేత్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌ (యస్‌.వి.), గోపాలం మాష్టారు (అక్కిరాజు హరగోపాల్‌) తీవ్రమైన కిడ్నీ జబ్బుతో 2021వ సంవత్సరం అక్టోబర్‌ 14వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు అమరత్వం చెందారు.  
ఇంటర్వ్యూ సంభాషణ

పాత జీతాల కోసం పోరాడాల్సి వ‌స్తోంది

 ( ప్ర‌జాధ‌నాన్ని అనుత్పాద‌క రంగానికే ఎక్కువ‌గా త‌ర‌లిస్తున్నార‌ని, అందువ‌ల్లే ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కూడా భార‌మైపోయింద‌ని పీఆర్‌సీ ఉద్య‌మంలో ప‌ని చేస్తున్న డీటీఎఫ్ నాయ‌కుడు కె. ర‌త్నం ఏసేపు అంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన పిఆర్‌సి కోసం  చేస్తున్న ఉద్యమం కార్మికవర్గ సంక్షేమంతో ముడిపడి వుంద‌ని అంటున్నారు. దాదాపుగా నూరు శాతం ఉద్యోగ‌వ‌ర్గాలు ఈ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయ‌ని ఆయ‌న అంటున్నారు. అయితే గ‌తంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద‌, రైతు ఉద్య‌మం లాంటి వాటి మీద ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాలు క‌లిసి వ‌చ్చి ఉంటే ఇప్ప‌డు పీఆర్సీ పోరాటానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు దొరికేది. దీన్ని అడ్డంపెట్టుకొనే పాల‌కులు ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా
సంభాషణ

త‌మ‌ల‌పాకు రైతుల‌పై లాఠీ

2022 జనవరి 14న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఒడిస్సా రాష్ట్రం లోని జగసింగ్ పూర్ జిల్లా ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాల త‌మ‌ల‌పాకు రైతుల‌పై భారీ సంఖ్యలో పోలీసు బలగాలు విరుచుక‌ప‌డ్డాయి. వాళ్ల‌ను తోట‌ల‌కుకు వెళ్లకుండా  అడ్డంప‌డ్డాయి. అక్క‌డితో ఆగ‌లేదు. ఘోరంగా లాఠీ చార్జి చేశారు.   పైకి క‌నిపించే ఈ ఘ‌ట‌న వెనుక చాలా క‌థ ఉంది.  దాన్ని తెలుసుకోడానికి  నిజ‌నిర్ధార‌ణ‌కు దేశంలోని ప‌లు పౌర‌హ‌క్కుల సంస్థ‌లు, వేదిక‌లు 2022, జనవరి 29-30 న వెళ్లాయి. ఇందులో కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్(CDRO) సభ్యులు  ఏడుగురు, గణతంత్రిక్ అధికార్ సురక్ష్య‌ సంఘటన్ (GASS) సభ్యులు
సంభాషణ

ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌ను కలవడానికి వెళ్లిన ఆదివాసుల అరెస్టు

సిలిగేర్‌ ఆందోళనగా మొదలై చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌లలో తొమ్మిది నెలలుగా సాగుతున్న సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటంపై పోలీసుల అణచివేత తీవ్రమైంది. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ సభల నిర్ణయం లేకుండా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోడానికి వీల్లేదు. ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణలో రాజ్యాంగం గవర్నర్లకు విశేష అధికారాలను కట్టబెట్టింది. అయితే  సైనిక క్యాంపుల వ్యతిరేక పోరాటం పట్ల అటు ప్రభుత్వంకానీ, గవర్నర్లుగాని, రాజకీయ నాయకులుగాని  స్పందించడం లేదు.  దీంతో తమ సమస్యను గవర్నర్‌కు వివరించడానికి ఆదివాసీ యువకులు సిద్ధమయ్యారు. గవర్నర్‌ అనసూయ ఉయికే కొండగావ్‌లో ఉన్న విషయం తెలుసుకొని ఆదివాసులు ఈ ఉదయం (శుక్రవారం) బయల్దేరారు. వాళ్లు అక్కడికి