సంభాషణ

ఈ మట్టిని తొలుచుకొని లేచిన ఆదివాసీ రైతు వీరుడు

(అమరుడు కామ్రేడ్‌ కేండ్రుక సింగన్న స్మృతిలో...) అది సెప్టెంబర్‌ మాసం మధ్య రోజులు. మేము నారాయణ పట్నా గుండా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. నారాయణ పట్నా బ్లాక్‌ వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపిస్తున్నది. దారి పొడుగునా ప్రజల నుండి అమితమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. మేము బహిర్గతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మా అలికిడి ఏ మాత్రం అర్థమైనా, జనం నిద్ర మంచాలపై నుండి లేచి బారులు తీరి చేతులు కలుపుతున్నారు. ఈ ఆప్యాయత మా అలసటను మాయం చేస్తున్నది. ఎక్కడకు వెళ్లినా  మా సంఖ్యకు మించి ‘డొప్ప’ల్లో ఆహారం వస్తున్నది. మా ప్రయాణం కొంచెం ముందుకు
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా
సంభాషణ

ఇద్దరు మిత్రులు – విప్లవోద్యమంలో రెండు స్రవంతులు

కత్తి మోహన్‌ రావు స్మృతిలో ఎంఎస్‌సి కెమెస్ట్రీ విద్యార్థిగా, ఆర్‌ఎస్‌యు నాయకుడుగా 1982 నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసిన సన్నిహిత మిత్రుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించి ఇప్పటికీ ఏడాదిన్నర కావొస్తుంది. ఆయన స్మృతిలో గుర్తుచేసుకోవాల్సిన విషయాలు రెండు - కాకతీయ యూనివర్సిటీలో కెమెస్ట్రీ ల్యాబ్‌ తగులబడినపుడు పోలీసులు ఆయనను అందుకు బాధ్యుణ్ణి చేసి ముద్దాయిని చేయడం. ఒకే ఊరు, సహ విద్యార్థులు చైతన్య పూర్వకంగా ఎంచుకొని ఒకరు మెడిసిన్‌లోకి ఒకరు కెమెస్ట్రీలోకి వచ్చిన ఒకే ఊరు విదార్థులు డా. ఆమడ నారాయణ, మోహన్‌రావుల ఆదర్శ జీవితం. చివరిసారి ఆయనను వరంగల్‌ జైలు నుంచి బెయిల్‌ మీద
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
సంభాషణ

వాళ్లేం నేరం చేశారు?

గోమియా, న‌వాదీయ్ ఆదివాసుల గురించి  ఆలోచిద్దాం జార్ఖండ్‌ జనాధికార మహాసభ తన సహచర సంస్థలు (ఆదివాసి , మూలవాసి సంఘటన్‌, బోకారీ, ఆదివాసి ఉమెన్స్‌ నెట్‌వర్క్‌, బగైచా తదితర సంస్థలు) కలిసి ఆగస్ట్‌ 2021- జనవరి 2022 మధ్యకాలంలో బోకారీ జిల్లా  గోమియా & నవాదీయ్‌ డివిజన్‌ పరిధిలో (బ్లాక్‌లో) అమాయకులైన, నిర్దోషులు ఆదివాసీలు, నిర్వాసితులు మావోయిస్టులని, ఇతర తప్పుడు ఆరోపణపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసింది. దాదాపు 31 మంది పీడిత కుటుంబాలను, బాధితులను విచారణ చేసింది. ఈ నిజనిర్ధారణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాధితుల పరిస్థితులను అర్థం చేసుకోవడం,
సంభాషణ

అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!

ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
సంభాషణ

ఆయుధాల బలంపై అధికారాన్ని నిలుపుకోలేరు

ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి....... మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు! పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం. పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం? గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు? వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం
సంభాషణ

యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది?

2021 మే 12, దండకారణ్య ఉద్యమాల చరిత్రలో ఒక విశిష్ట స్టానాన్ని సంతరించుకున్న దినంగా నిలిచిపోతుంది. ఆ రోజు దక్షిణ బస్తర్‌ (సుక్మా), పశ్చిమ బస్తర్‌ (బీజాపుర్‌) జిల్లాల సరిహద్దు గ్రామం సిలింగేర్‌లో గ్రామ ప్రజల ప్రమేయం లేకుండా అర్ధరాత్రి రహస్యంగా పోలీసులు తమ క్యాంపును నెలకొల్పిన రోజు. ఆ రోజు నుండి ఈనాటి వరకు గడచిన సంవత్సర కాలమంతా ఆ సిలింగేర్‌ ప్రజలు తమకు తెలువకుండా, తాము కోరకుండా తమ ఊళ్లో పోలీసు క్యాంపు వేయడాన్ని వ్యతిరేకిస్తునే వున్నారు. అందుకు నెత్తురు ధారపోశారు. గత యేడాది కాలంగా సాగుతున్న ఆ పోరాటంలో వాళ్లు లాఠీ దెబ్బలు తిన్నారు.
సాహిత్యం సంభాషణ

అమ్మల దినం తల్లుల గుండెకోత

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులకు, తల్లులను కోల్పోయిన బిడ్డలకు సాంత్వన చేకూరాలనీ కోరుకుంటూ సామ్రాజ్యవాదుల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన తల్లులకు, బిడ్డలకు అమ్మలదినపు విషాద ఘడియలలో శిరస్సు వంచి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన పిల్లల కోసం, భవిష్యత్‌ తరాల కోసం దోపిడీ యుద్ధాలు ఎరుగని శాంతిమయ ప్రపంచ సాధనకై పోరాడుదామనీ గట్టిగా అమ్మలమంతా శపథం చేద్దాం. అమెరికా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా