సంభాషణ

కగార్ అమరుల స్థూపాల కూల్చివేత సందర్భంలో ఇంద్రవెల్లి, హుస్నాబాద్

చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు. చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్థూపాలను డైనమెట్లతో కూల్చేసాడు. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు నాతో చేతులు కలిపితే ఢల్లీి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం సభల్లో వాగ్దానం చేసిన (విప్లవకారుల దృష్టిలో ప్రగల్బాలు పలికిన) ఎన్‌.టి.ఆర్‌. 1985 సెప్టెంబర్‌ 3న డాక్టర్‌ రామనాథం హత్యతో తీవ్ర నిర్బంధం ప్రారంభించాడు. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకుల హత్యలను, టాడా ప్రయోగాన్ని, మిస్సింగ్‌ కేసులను (కొడవటి సుదర్శన్‌ ఆర్‌.వై.ఎల్‌. కార్యకర్త) కె.ఎస్‌. వ్యాస్‌ నాయకత్వంలో కుఖ్యాతి వహించిన గ్రేహౌండ్స్‌ను
సంభాషణ

మాడ్‌లో 112 గ్రామాల్లోనిరవధిక ఆందోళన

(బస్తర్ జంక్షన్ యూట్యూబ్ చానెల్ హిందీ వీడియో అనువాదం) బస్తర్ లో వివిధ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యమాలు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆదివాసీలు తమ వివిధ డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు.  అణచివేత ద్వారా లేదా ఒత్తిడి తీసువచ్చి కొన్ని ఉద్యమాలను పోలీసులు, ప్రభుత్వమూ ధ్వంసం చేశారు, అంతం చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్యమాలు నేటికీ కొనసాగుతూనే వున్నాయి. వాటిలో ఒకటి నారాయణపూర్‌లోని ఓర్చాలో కొనసాగుతోంది. ఓర్చాలో వందలాది మంది ఆదివాసీలు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. వందలాది గ్రామాల నుంచి వందలాది మంది గ్రామస్తులు యిక్కడ వున్నారు, భోజన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
వ్యాసాలు సంభాషణ

అణ‌చివేత మ‌ధ్య‌నే నూత‌న పోరాట ప్ర‌పంచం

2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం.  విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత
సంభాషణ

వాళ్లేం నేరం చేశారు?

గోమియా, న‌వాదీయ్ ఆదివాసుల గురించి  ఆలోచిద్దాం జార్ఖండ్‌ జనాధికార మహాసభ తన సహచర సంస్థలు (ఆదివాసి , మూలవాసి సంఘటన్‌, బోకారీ, ఆదివాసి ఉమెన్స్‌ నెట్‌వర్క్‌, బగైచా తదితర సంస్థలు) కలిసి ఆగస్ట్‌ 2021- జనవరి 2022 మధ్యకాలంలో బోకారీ జిల్లా  గోమియా & నవాదీయ్‌ డివిజన్‌ పరిధిలో (బ్లాక్‌లో) అమాయకులైన, నిర్దోషులు ఆదివాసీలు, నిర్వాసితులు మావోయిస్టులని, ఇతర తప్పుడు ఆరోపణపై  క్రిమినల్‌ కేసులు నమోదు చేసిన ఘటనపై నిజనిర్ధారణ కమిటీ విచారణ చేసింది. దాదాపు 31 మంది పీడిత కుటుంబాలను, బాధితులను విచారణ చేసింది. ఈ నిజనిర్ధారణ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాధితుల పరిస్థితులను అర్థం చేసుకోవడం,
సంభాషణ

ప్రహార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌పంచ ప్ర‌తిస్పంద‌న‌

భారత విప్లవోద్యమంపై ప్ర‌భుత్వ దాడికి వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ దేశాల్లోని ప్ర‌జాస్వామిక వాదులు స్పందించారు. విప్ల‌వ ప్ర‌జా పోరాటాల‌ను నిర్మూలించ‌డానికి ఇటీవలే భార‌త పాల‌కులు ప్రారంభించిన నూతన ప్రహార్‌-3ని నిరసిస్తూ “ఇంటర్నేషనల్‌ కమిటీ టు సపోర్ట్‌ పీపుల్స్‌ వార్‌ ఇన్‌ ఇండియా” (ఐసీఎస్‌పీడబ్య్యూఐ-భారత ప్రజాయుద్ధానికి మద్దతుగా అంతర్జాతీయ కమిటీ) పిలుపు మేర‌కు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనేక దేశాలలో చాలా క్రియాశీలంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఇట‌లీ నుండి టునీషియా వరకు, ఈక్వడార్‌ నుండి కెనడా వరకు, అమెరికా నుండి జర్మనీ వరకు, బ్రెజిల్‌ నుండి డెన్మార్క్‌ వరకు, కొలంబియా నుండి నార్వే వరకు, స్పెయిన్‌ నుండి స్విట్టర్‌లాండ్‌
సాహిత్యం సంభాషణ

సాహ‌సోపేతంగా పురోగ‌మించండి

(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయ‌న త‌త్వ‌శాస్త్ర ఆచార్యుడు. విశ్వ‌విద్యాల‌యంలో పాఠాలు చెప్పేవాడు.  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర పాఠాలు నేర్చ‌కోడానికి  యూనివ‌ర్సిటీని వ‌దిలేశాడు.    నేర్చుకోవ‌డం అంటే నేర్పించ‌డం అనే గ‌తిత‌ర్కం తెలిసిన‌వాడు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు నేర్పించాడు. ఆయ‌నే పెరూ విప్ల‌వ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్ర‌జా యుద్ధ మార్గ‌ద‌ర్శి. ప‌థ నిర్దేశితుడు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పెరూ ప్ర‌పంచ పీడిత వ‌ర్గానికి ఆశారేఖ‌లాగా వెలుగొందింది. ఆ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి అమెరికా, పెరూ పాల‌క‌వ‌ర్గాలు  ఆయ‌న‌ను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా క‌ఠిన కారాగార శిక్ష  అనుభ‌విస్తూ ఈ నెల 11న అమ‌రుడ‌య్యాడు.  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు   కాల‌పు ప్ర‌పంచ మేధావుల్లో ఒక‌రు. 
ఇంటర్వ్యూ సంభాషణ

రాజకీయ చదరంగంలో ప్రజలే పావులు

అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని  కోస్తా ఆధిపత్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతి పక్షాలు  మద్దతు ఇస్తున్నాయి. దీనిని ఎట్లా చూడాలి? జవాబు: మేం ఆ డిమాండ్ ను అప్రజాస్వామికమైనదిగా పరిగణిస్తున్నాం. అయితే, గత ప్రభుత్వ ఆ నిర్ణయపు తప్పొప్పులకు అన్నీ రాజకీయ పార్టీలూ బాధ్యులే. అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆర్ పి పార్టీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.  అందువల్ల  ఆపార్టీ  గతంలో తాము అమరావతి రాజధాని ప్రతిపాదనకు మద్ధతునివ్వడం తప్పని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సంబంధిత ప్రజలను చర్చలకు పిలిచి సముచిత నష్టపరిహారం ఇవ్వాలి. రాజకీయ చదరంగంలో ప్రజలని, వారే పార్టీ వారైనా పావులను 
ఇంటర్వ్యూ

ప్రమాదకరమైనా సరే అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందే

(దశాబ్ద కాలం తరువాత ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు నిర్దోషిగా విడుదలైన్ హేమ్ మిశ్రా తన జైలు శిక్ష, విచారణ, అనుభవాల గురించి ‘అవుట్ లుక్’కు చెందిన విక్రమ్ రాజ్ తో మాట్లాడారు) హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో
సాహిత్యం సంభాషణ

మరణానంతర ప్రేమ లేఖ

యాప నారాయణ హరిభూషణ్‌గా ఎదిగిన క్రమం మనసు తెరమీద రూపు కడుతున్నది. మానుకోట దొరల గడీల చుట్టూ మర్రి ఊడల కింద మొలిచిన గడ్డి మొక్కలు ఆంబోతులను బంధించిన ముకుతాళ్లలో బిగిసిన పిడికిళ్లు గుర్తుకొస్తున్నాయి. ఆదివాసి జీవితం ఒక విప్లవ పాఠశాల అయిన క్రమం వరంగల్‌ ఆర్ట్స్‌ సైన్స్‌ కాలేజీ విద్యార్థిగా జ్ఞానం అంటే రాడికల్‌ మార్పు అని నేర్చుకున్న  చదువులు. అప్పటి అధ్యాపకులు అందరు ఆ విద్యార్థుల దగ్గరే నేర్చుకున్నామన్నారు. సమాజాన్ని చదువుకోవడం.  ఖమ్మం జిల్లాలో చేపట్టిన విప్లవోద్యమ విస్తరణ,  తెలంగాణా మీదుగా దండకారణ్యం దాకా రెండడుగులు నాలుగు అడుగులుగా నడిచింది. రెండు గుండెలు ఒక దండోరాగా
సాహిత్యం సంభాషణ

ఛైర్మన్ గొంజలో వర్ధిల్లాలి , అతని శక్తివంతమైన, ప్రభావశాలియైన ఆలోచనా విధానం వర్ధిల్లాలి!

సాధారణ రాజకీయ పంథాలో ఛైర్మన్ గొంజలో వివరణలు,  ప్రపంచ విప్లవానికి అందించిన రచనలు: మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం లేకుండా, గొంజలో ఆలోచనా విధానాన్ని ఊహించలేము, ఎందుకంటే అది మన వాస్తవికతక మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానపు సృజనాత్మక అనువర్తనం. శ్రామికవర్గ భావజాలపు చారిత్రక అభివృద్ధిని, మావోయిజం ప్రధానమైనదిగా ఆ భావజాలం మార్క్సిజం-లెనినిజం-మావోయిజంగా రూపుదిద్దుకున్న మూడు దశలను అర్థం చేసుకోవడం అనేది ఇందులో కీలకాంశం. సారాంశంలో, మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని ఒక విశ్వజనీన సత్యంగా పెరూ విప్లవ నిర్దిష్ట  పరిస్థితులకు అన్వయించడం అనేది ప్రధానమైనది. అందువల్ల గొంజలో ఆలోచనా విధానం పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న విప్లవానికి ప్రత్యేకంగా ప్రధానమైనది. గొంజలో ఆలోచనా విధానంలోని