ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్తకం చదివారా ?

సుప్ర‌సిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్త‌కం *భార‌త బ‌డా బూర్జువా వ‌ర్గం.పుట్టుక -పెరుగుద‌ల‌-స్వ‌భావం*.  ఈ పుస్త‌కం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్ల‌వాభిమానులు, కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ అర్థ శాస్త్ర విద్యార్థులు త‌ప్ప‌క చ‌ద‌వాల్పిన పుస్త‌కం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మ‌రింత తాజా స‌మాచారంతో రెండో కూర్పు విడుద‌ల చేశారు. దానికి ఆయ‌న ఒక సుదీర్ఘ‌మైన ముందుమాట రాశారు. ఇప్ప‌డు మీకు అందిస్తున్న‌ది ఆ ముందుమాటే. కా. ఆశాల‌త ఈ పుస్త‌కాన్నిచ‌క్క‌గా తెలుగులోకి అనువ‌దించారు. 2018లో విప్ల‌వ ర‌చ‌యితల సంఘం  ప్ర‌చురించింది. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాలు, భార‌త బూర్జువా వ‌ర్గ స్వ‌భావం,  విప్ల‌వ ద‌శ
కాలమ్స్ కవి నడిచిన దారి

మిట్టిండ్ల క‌య్య‌ల నుంచి..

బతికిన బతుకులో ప్రేమకంటే ఎక్కువ ఛీత్కారాలే మెండుగా గురైనవాడు,ఆనందం కన్నా దుఃఖాల్ని ఎక్కువగా మోసుకుని తిరిగిన వాడు,చుట్టుముట్టిన పేదరికంలో ఈదినవాడు, చదువుకోవడం ఎంతో ఇష్టం వున్నా చదువుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకపోతే దీపంపట్టి మరీ వెదికి చదువును చేతులారా పట్టుకున్నవాడు, ఈ దేశంలో ఈ మారుమూల పల్లెలో వెనకకు నెట్టివేయబడిన దళిత వాడల్లో రెండు మూడు దశాబ్దాల ముందు ఖచ్చితంగా కనిపించడం వాస్తవవమైతే,! అచ్చం అటువంటి అనుభవాల్లోంచి, అటువంటి అవమానలోంచి,అటువంటి పేదరికంలోంచి,జీవిత పోరాటంలోంచి ఇప్పటిదాకా నడిచిన పల్లిపట్టు నాగరాజుగా మీ ముందు నిలబడి నాలుగు మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన వసంత మేఘం సంపాదకులకు ధ‌న్య‌వాదాలు చెప్పుకుంటూ... నేను
కాలమ్స్ బహుజనం

ముస్లిం బ‌తుకు గుబాళింపు

ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్‌’. షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్స్‌ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలున్నాయి. ముందు పేజిలో చెప్పినట్టుగా మొహర్‌ ` అనుమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణిచివేతల మధ్య అనేక గాయాలను మోసుకుంటూ ఉనికి కోసం పెనుగులాడే ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. ‘వెతుకులాట’ శీర్షికతో ఎ.కె. ప్రభాకర్‌ చక్కని ముందుమాట రాశారు. ‘తెలుగు సాహిత్యంపై కొత్త ముద్ర’గా షాజహానా పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరించారు, తొలి పేజీలలో. ఇక పుస్తకం లోపలికి వెళ్తే ‘మొహర్‌’ కథల్లో రచయిత్రులు అనేక అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లో కేంద్రీకృత
కాలమ్స్ * వి క‌లం*

వైకల్యం ఒక అస్థిత్వం

  ఇది క‌రుణ అనుభ‌వం.. అవ‌గాహ‌న‌.. సిద్ధాంత దృక్ప‌థం. త‌న‌లోకి తాను చూసుకుంటూ ఈ ప్ర‌పంచంలోకి, త‌న వంటి వారి ప్ర‌త్యేక అస్థిత్వంలోంచి స‌క‌ల పీడిత అస్థిత్వాల్లోకి క‌రుణ విస్త‌రించిన తీరు ఇది. ఒక‌ మార్క్సిస్టు మేధావి విస్త‌రింప‌ద‌ల్చుకున్న వైక‌ల్య రాజ‌కీయ‌మిది.   అర్థాంత‌రంగా ఆగిపోయిన ఆయ‌న ఆలోచ‌నా ధార ఇది.  వ‌సంత‌మేఘం అంత‌ర్జాల ప‌త్రిక ఆరంభమైన‌ప్ప‌టి నుంచి క‌రుణ అనేక అభిప్రాయాలు పంచుకునేవాడు. మా కోరిక మేర‌కు ఒక కాలం రాస్తాన‌న్నారు. ఏం రాయాలి? అని అనేక ఆలోచ‌న‌లు పంచుకున్నారు. చివ‌రికి *వైక‌ల్య అస్తిత్వ రాజ‌కీయాలు* రాస్తాన‌న్నారు. మ‌ర‌ణానికి ముందు రోజు *వి క‌లం* కాలానికి తొలి ర‌చ‌న పంపించారు. అందులో ఒక
కాలమ్స్ సమకాలీనం

టిప్పుసుల్తాన్ పై హిందూత్వ దాడి

గత జూన్ నెలలో కడప జిల్లా పొద్దుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మొదలు పెట్టిన తొలి దశ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అడ్డుకున్నది. ఇది కేవలం ముస్లింలను సంతృప్తి పరచడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా ఆ పార్టీ పేర్కొన్నది. టిప్పు సుల్తాన్ హిందూ మత ద్వేషి అని, హిoదువులను ఊచకోత కోయించిన హంతకుడు, హిందు స్త్రీల పైన అత్యాచారాలు జరిపించిన దుర్మార్గుడు, అతనొక ఉన్మాది అని అసలు ఈ దేశ వాస్తవ్యుడే కాదనేది బీజేపీ వాదన. అలాంటి చారిత్రక చెడ్డ పురుషుని విగ్రహం నెలకొల్పడం జాతీయ స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నది. నిజానికి బీజేపీ
కాలమ్స్ కథా తెలంగాణ

‘ఎర్రదుక్కి’లో పాలమూరు వలస దు:ఖం

సమాజంతో సంబంధం కలిగిన రచయితలు మాత్రమే తమ సాహిత్య సృజనలోకి సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకొని ప్రజల్ని ఆలోచింపచేస్తారు. సామాజిక బాధ్యత, నిబద్దత కలిగిన రచయిత అట్టడుగు శ్రామిక వర్గాలవైపు నిలబడి అక్షరీకరిస్తాడు. ఇలాంటి కోవకు చెందినవారే  నాగర్‍కర్నూల్‍ జిల్లా అచ్చంపేటకు చెందిన రచయిత మడుమనుకల నారాయణ. పాలమూరు అధ్యయన వేదికలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నారాయణ వేదిక ద్వారా పొందిన సామాజిక జ్ఞానంతో కవిత్వం, పాటలు, కథల ద్వారా సాహిత్య సృజనతో సామాజిక చలనాలను ఆవిష్కరించారు. రచయితగా తన అనుభవాలను, తన చుట్టు జరుగుతున్న పరిణామాలను సమాజంతో పంచుకోవడానికి నారాయణ కథా పక్రియను ఎంచుకున్నారు. ‘ఎర్రదుక్కి’
కాలమ్స్ కొత్త కవిత్వం

అనేక అస్థిత్వాల కలనేత యాలై పూడ్చింది

కవిత్వం గురించి మాట్లాడుతున్నాప్పుడు ఇటివల చదివిన  కవితా సంపుటులు జ్నాపకమౌతున్నాయి.అజంతా స్వప్న లిపి .పల్లె పట్టు నాగరాజు యాలై పూడ్చింది. .జీవిత కాలమంతా నలభై కవితలను రాసి కవిత్వ స్వప్నలిపిని  వదిలివెళ్లిన అజంతా ,వర్తమాన కాలంలో నిలబడి కవితా రచనలో వున్న పల్లి పట్టు నాగరాజు. అసలు వీరిద్దరి భాధ ఏమిటి?. వీరి మధ్య సారూప్యత ఏమిటి? అజంతా  కవితా రచన స్థల ,కాలాలు  వేరు .నాగరాజు కవిగా కొనసాగుతున్న కాల సoధర్భం వేరు. కవి వీరిద్ద‌రి  ప్రపంచం, దాని మనుగడ ఒకే స్తితిలో ఉన్నాయా?  అజంతా కవిత్వంలో అంతర్ముఖీనత ఉండవచ్చు. ఆ లోపలి  చూపు సామాజిక శకల౦తో  ముడి
కాలమ్స్ కథ..కథయ్యిందా!

‘పొదగని గుడ్ల‌’లో పర్యావరణ విధ్వంపం

అభివృద్ధి ని అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు.మానవ సౌకర్యాల కల్పనలో అభివృద్ధి అనే ప్రక్రియ మనం వూహించలేనన్ని రూపాలను సంతరించుకుంది. ఆ అభివృద్ధి పాదాల వొత్తిడి కింది ప్రకృతి, వ్యక్తులూ నలిగిపోవడం కూడా అనేక రూపాలుగా వుంది. ఒక వైపునేమో కావాల్సినంత, రావాల్సినంత అభివృద్ధి అందనితనం వెక్కిరిస్తుంటే మరోవైపు అదే అభివృద్ధి కొందరికి యెక్కువగా అంది , దానివల్ల విపరీత పరిణామాలు కూడా చోటుచేసుకోవడం కన్పిస్తుంది. ఈ అసమ అభివృద్ధి మనుషుల జీవితాలను కల్లోలం చేయడంతో పాటు ప్రకృతిలో కూడా దుష్పరిణామాలకు దారితీయడాన్ని సునిశిత దృష్టి గల రచయితలు పట్టుకుంటారు. తమ సృజనతో  చదువరులలో  ఎరుక కల్గిస్తారు.అలాంటి కథ కె.వీ.కూర్మ‌నాథ్ 
కాలమ్స్ కవిత్వంలోకి

కొంచెం స్వేచ్ఛ కోసం క‌వితాలాప‌న

“You need a body to preserve your soul, not a set of abstract principles.”― Ahmed Mostafaచాలా విరామం త‌ర్వాత మ‌ళ్లీ.  క‌విత్వంలోంచి, క‌విత్వంలోకి.  జీవితంలోకి.  ఒకింత ధైర్యంతో  పునః ప్రారంభిస్తున్నాను. శివారెడ్డిగారి గారి కవితను నాకున్న పరిమితులలో మీతో పంచుకోవడం. అదీ ఒక కవితా సంపుటిలోంచి ఒక్క కవితనే. తనొచ్చిన దారిని మరువని వ్యక్తిత్వంతో అదే వాక్యంతో అదే గొంతుతో నిరంతరం జ్వలించడం, అక్షరాకాశంలో  మెరవడం శివారెడ్డి గారి సొంతం. ఇది తనకు తానుగా ఏర్పరచుకున్న దారి. ఆ దారిలో అనేక కొత్త పుంతలను చూపుతూ నడిపించడం తన ప్రత్యేకత. తనకు తానుగా ఎప్పుడూ
కాలమ్స్ కథావరణం

” హత్యకు గురైంది ఎవ‌రు? పిచ్చివాడు అయింది ఎవరు? నిజాలు తెలిసేది ఎప్పటికీ? “

కథలను చివరి వరకూ  బ్రతికించేది..జీవద్భాషే అనిపిస్తుంది ఈ కథలను చదివినప్పుడు.అవును!కథా లక్షణాల బరువులను సూత్రీకరణలను,  నియమాలను, వస్తువు ,శైలి, శిల్పంఇలాంటివి కాసేపు పక్కన పెడితేనికార్సయిన జీవద్భాష లో మనుషులు సహజంగా మలినం లేకుండా మాట్లాడుకుంటే, రచయిత ప్రమేయమే లేదనేంత  సహజత్వం ఉంటేఅవి "మునికాంతనపల్లి" కథలు అవుతాయి.ఇవి కథలు కావు కతలు. ఊహించి రాసినవి కావు, కల్పనలు అసలే కావు. కొంచెం అలా నెల్లూరు జిల్లా దాకా వెళ్లి వస్తే, అక్కడ  మనం వినాల్సిన గుండెలు గొంతులు,మనసులు చాలా ఉన్నాయని, మనం తప్పకుండా వినాల్సిన సత్యాలు చాలా కాలం చాలా  మరుగునే ఉండిపోయాయని, ఇన్నేళ్లకు ఆ గొంతుల్ని ఆ గుండెల్ని