బహుజనం కాలమ్స్

ముస్లిం బ‌తుకు గుబాళింపు

ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్‌’. షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్స్‌ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలున్నాయి. ముందు పేజిలో చెప్పినట్టుగా మొహర్‌ ` అనుమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణిచివేతల మధ్య అనేక గాయాలను మోసుకుంటూ ఉనికి కోసం పెనుగులాడే ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. ‘వెతుకులాట’ శీర్షికతో ఎ.కె. ప్రభాకర్‌ చక్కని ముందుమాట రాశారు. ‘తెలుగు సాహిత్యంపై కొత్త ముద్ర’గా షాజహానా పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరించారు, తొలి పేజీలలో. ఇక పుస్తకం లోపలికి వెళ్తే ‘మొహర్‌’ కథల్లో రచయిత్రులు అనేక అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లో కేంద్రీకృత
ఆర్ధికం

ఎలక్టోరల్‌ ఆటోక్రసీగా భారత్‌

స్వీడన్‌(గోథెన్‌బర్గ్‌) ఆధారిత వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘డెమోక్రసీ రిపోర్ట్‌ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్‌ డేటాసెట్‌లను ఉపయోగించుకుంది. వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ ఆటోక్రసీ,  క్లోజ్డ్‌ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో
ఆర్ధికం

టారిఫ్‌ ఉత్పాతానికి షేర్‌మార్కెట్‌ పతనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం... అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ
* వి క‌లం* కాలమ్స్

వైకల్యం ఒక అస్థిత్వం

  ఇది క‌రుణ అనుభ‌వం.. అవ‌గాహ‌న‌.. సిద్ధాంత దృక్ప‌థం. త‌న‌లోకి తాను చూసుకుంటూ ఈ ప్ర‌పంచంలోకి, త‌న వంటి వారి ప్ర‌త్యేక అస్థిత్వంలోంచి స‌క‌ల పీడిత అస్థిత్వాల్లోకి క‌రుణ విస్త‌రించిన తీరు ఇది. ఒక‌ మార్క్సిస్టు మేధావి విస్త‌రింప‌ద‌ల్చుకున్న వైక‌ల్య రాజ‌కీయ‌మిది.   అర్థాంత‌రంగా ఆగిపోయిన ఆయ‌న ఆలోచ‌నా ధార ఇది.  వ‌సంత‌మేఘం అంత‌ర్జాల ప‌త్రిక ఆరంభమైన‌ప్ప‌టి నుంచి క‌రుణ అనేక అభిప్రాయాలు పంచుకునేవాడు. మా కోరిక మేర‌కు ఒక కాలం రాస్తాన‌న్నారు. ఏం రాయాలి? అని అనేక ఆలోచ‌న‌లు పంచుకున్నారు. చివ‌రికి *వైక‌ల్య అస్తిత్వ రాజ‌కీయాలు* రాస్తాన‌న్నారు. మ‌ర‌ణానికి ముందు రోజు *వి క‌లం* కాలానికి తొలి ర‌చ‌న పంపించారు. అందులో ఒక
ఆర్ధికం

కొలువుల సంక్షోభం

అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసతం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్‌ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ‘కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌( సిబిఐ) జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం నడుస్తున్న సంవత్సరం (2024) అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని వెల్లడిరచింది. ఫలితంగా 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడుతుందని తెలిపింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 2023లో 3.9 శాతం ఉండగా 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని సిబిఐ వెల్లడిరచింది.
సమకాలీనం కాలమ్స్

టిప్పుసుల్తాన్ పై హిందూత్వ దాడి

గత జూన్ నెలలో కడప జిల్లా పొద్దుటూర్ పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా మొదలు పెట్టిన తొలి దశ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అడ్డుకున్నది. ఇది కేవలం ముస్లింలను సంతృప్తి పరచడానికి ఉద్దేశించిన కార్యక్రమంగా ఆ పార్టీ పేర్కొన్నది. టిప్పు సుల్తాన్ హిందూ మత ద్వేషి అని, హిoదువులను ఊచకోత కోయించిన హంతకుడు, హిందు స్త్రీల పైన అత్యాచారాలు జరిపించిన దుర్మార్గుడు, అతనొక ఉన్మాది అని అసలు ఈ దేశ వాస్తవ్యుడే కాదనేది బీజేపీ వాదన. అలాంటి చారిత్రక చెడ్డ పురుషుని విగ్రహం నెలకొల్పడం జాతీయ స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నది. నిజానికి బీజేపీ
కథా తెలంగాణ కాలమ్స్

‘ఎర్రదుక్కి’లో పాలమూరు వలస దు:ఖం

సమాజంతో సంబంధం కలిగిన రచయితలు మాత్రమే తమ సాహిత్య సృజనలోకి సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంపిక చేసుకొని ప్రజల్ని ఆలోచింపచేస్తారు. సామాజిక బాధ్యత, నిబద్దత కలిగిన రచయిత అట్టడుగు శ్రామిక వర్గాలవైపు నిలబడి అక్షరీకరిస్తాడు. ఇలాంటి కోవకు చెందినవారే  నాగర్‍కర్నూల్‍ జిల్లా అచ్చంపేటకు చెందిన రచయిత మడుమనుకల నారాయణ. పాలమూరు అధ్యయన వేదికలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న నారాయణ వేదిక ద్వారా పొందిన సామాజిక జ్ఞానంతో కవిత్వం, పాటలు, కథల ద్వారా సాహిత్య సృజనతో సామాజిక చలనాలను ఆవిష్కరించారు. రచయితగా తన అనుభవాలను, తన చుట్టు జరుగుతున్న పరిణామాలను సమాజంతో పంచుకోవడానికి నారాయణ కథా పక్రియను ఎంచుకున్నారు. ‘ఎర్రదుక్కి’
మీరీ పుస్తకం చదివారా ?

ఉచ్చల జలధి వర్తమానం 

ఈ దేశం గమనం ఎటు ? ఈ దేశం భవిష్యత్తు ఎటు? ఎన్నాళ్ళీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళీ దుర్మార్గాలు. అభం  శుభం తెలియని బాలికపై ఒకడు అత్యాచారం చేస్తాడు. ఇంకొక గుంపు వచ్చి కుటుంబాలకు కుటుంబాలను దౌర్జన్యం చేసి, ఆత్యాచారం చేస్తారు. కాదంటే హత్య చేస్తారు. 2012లో జలంధర్‌లో వొక దళిత విద్యార్థితో ఉచ్చ తాగిస్తారు. నొయిడాలో పోలీసులే దళితవర్గానికి చెందిన విద్యార్థితో ఉచ్చతాగిస్తారు. తమిళనాడులోని తిరుచ్చిలో లా చదువుతున్న దళిత విద్యార్థితో తోటి విద్యార్థులే ఉచ్చ తాగించారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ నడిబొడ్డున జనవరి 26న బహిరంగ ప్రదేశంలో రీల్‌ వేయడానికి ప్రయత్నించిన మైనర్‌ దళిత బాలుడిని వేధించి
ఓపెన్ పేజీ కాలమ్స్

ఏ వెలుగులకు ఆ వెన్నెల?

కళ కళ కోసం కాదు. ఎప్పటి మాట ఇది! ఈ నినాదం వెనక ఎంత పోరాటం! ఈ నినాదం వెంట ఎన్ని త్యాగాలు! కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేయాల్సి వస్తోంది. చర్చ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తోంది. సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతించాడు. ఆయన పని చేసిన రంగంలో తనదైన బలమైన ముద్ర వేసిపోయాడు. దాని గురించి మీడియా ఆలపిస్తూనే ఉంది. దాన్నలా ఉంచితే రచయితగా ఆయనేమిటి, ‘వ్యక్తిగత’ రాజకీయ విశ్వాసాలపరంగా ఆయనేమిటి, ఈ రెండిటినీ కలిపి చూడాలా, వేరువేరుగా చూడాలా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఆయన స్వయంగా ప్రకటించి ఉన్నాడు గనక
మీరీ పుస్తకం చదివారా ?

ఎవడ్రా ఈ నేల నాది కాదన్నది..?

‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.అధర్మం. అన్యాయం.’ ‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.’ ఈ