ఆర్ధికం

పెరిగిన నిరుద్యోగం – తగ్గిన నిజ వేతనం

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, మోడీ గొప్పగా ప్రకటించిన మేక్‌-ఇన్‌-ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి పథకాలు ఏవి యువత ఉపాధికి తోడ్పడలేదు. పైగా పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయని ఇటీవల మానవాభివృద్ధి సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో మనదేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను కళ్లకు కడుతున్నది. పలు అంతర్జాతీయ నివేదికలు ఉపాధి దెబ్బతిన్నదనీ, అసమానతలు ఆకాశాన్నంటాయని, సగం బలం అనుకున్న సంతోషానికి కూడా ఈ దేశపౌరుడు
క్లాసిక్స్ ప‌రిచ‌యం

కుటుంబం – సొంత ఆస్తి – రాజ్యాంగ యంత్రం

(మార్క్సిస్టు సిద్ధాంత ర‌చ‌న‌ల్లో ఏంగెల్స్ రాసిన కుటుంబం, సొంత ఆస్తి, రాజ్యాంగ‌యంత్ర ఆవిర్భావం చాలా ముఖ్య‌మైన‌ది. చాలా తొలి రోజుల్లోనే ఈ పుస్త‌కం తెలుగులోకి వ‌చ్చింది. అనేక ప్ర‌చుర‌ణ‌లుగా వెలుబ‌డింది. వి. వెంక‌ట‌రావు వ‌సంత‌మేఘం కోసం దీన్ని స‌ర‌ళంగా ప‌రిచ‌యం చేస్తున్నారు.  ఈ సీరియ‌ల్   ఈ సంచిక‌తో ఆరంభ‌వుతున్న‌ది. వీలైతే ఇలా కొన్ని మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాల‌ను ప‌రిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నాం- వ‌సంత‌మేఘం టీ)  ●  ఈనాడు   అమలులో వున్నకుటుంబ వ్యవస్థ గతంలో ఎలా ఉండేది? ఎప్పుడూ ఇలాగే ఉండేదా?మన సాంప్రదాయ వాదులు వాదిస్తున్నట్లు ఇది భారతదేశానికి మాత్రమే సొంతమా? బయట ప్రపంచంలో ఇతర దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎలా
లోచూపు కాలమ్స్

మ‌ర‌ణానంత‌ర వాస్త‌వం

మరణానంతర  జీవితం అనగానే కొంతమందికి అది ఒక ఆధ్యాత్మిక విశేషంగా స్ఫురించవచ్చు. కానీ  వ్యక్తుల  జననానికి ముందూ, మరణం తర్వాతా  కొనసాగే సామాజిక జీవితం గురించి,  అమానవీయ దోపిడీ పీడక  మానవ సంబంధాల గురించి నందిగం కృష్ణారావు గారి ఈ నవల అద్భుతంగా దృశ్యీకరిస్తుంది. ఈ నవల ప్రోలోగ్ (ప్రారంభం)లో ప్రస్తావించినట్టుగా  శవం కుళ్లకుండా ఉండటమేమిటి? కుళ్లకుండా చెట్టుకు వేలాడుతున్న శవం తానే ఒక ప్రశ్నయి  చ‌రిత్రను వేధించడం ఏమిటి? అట్టి  చరిత్ర  ‘ఆ శవం ఎందుకు కుళ్ళి   పోలేదు?’ అన్న ప్రశ్నను కాలాన్ని అడగడం అంటే అర్థం  ఏమిటి? ఆ  కాలం జీవమై శవం లోకి ప్రవేశించి
ఆర్ధికం కాలమ్స్

సంప‌ద ఒక వైపు – ఆక‌లి మ‌రో వైపు

ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు ఆర్థిక సంక్షోభం... కారణాలేమైనా దేశంలో సగటు జీవుల‌ బతుకు ఆగమైంది. ఉపాధికి దూరమై, ఆదాయం లేక పస్తులుంటున్నారు. ఆకలి అనేది ప్రభుత్వాల దుష్టత్వానికి నిదర్శనం. ఆకలి సమస్యను పరిష్కరించే చర్యలకు పాలకులు పూనుకోకపోవడం విషాదం. ఆకలితోనో, పోషకాహార లోపంతోనో మరణించడానికి కారణం తగినన్ని ఆహారధాన్యాలు లేకపోవడం కాదు. ఏప్రిల్‌ 2021 నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఆకలితో ఉన్నవారికి ఆహార పదార్థాల్ని అందించలేని పాలకుల వైఫల్యం. సమాజ మనుగడకు  విరామ మెరుగక పరిశ్రమిస్తూ మానవజాతి పురోగమనానికి దారులు వేస్తున్న ప్ర‌జ‌ల  ఆకలి చావు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం
సాహిత్యం కథావరణం కాలమ్స్

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
కథావరణం సాహిత్యం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం
మీరీ పుస్తకం చదివారా ? ఈబుక్స్

మీరీ పుస్తకం చదివారా ?

సుప్ర‌సిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్త‌కం *భార‌త బ‌డా బూర్జువా వ‌ర్గం.పుట్టుక -పెరుగుద‌ల‌-స్వ‌భావం*.  ఈ పుస్త‌కం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్ల‌వాభిమానులు, కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ అర్థ శాస్త్ర విద్యార్థులు త‌ప్ప‌క చ‌ద‌వాల్పిన పుస్త‌కం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మ‌రింత తాజా స‌మాచారంతో రెండో కూర్పు విడుద‌ల చేశారు. దానికి ఆయ‌న ఒక సుదీర్ఘ‌మైన ముందుమాట రాశారు. ఇప్ప‌డు మీకు అందిస్తున్న‌ది ఆ ముందుమాటే. కా. ఆశాల‌త ఈ పుస్త‌కాన్నిచ‌క్క‌గా తెలుగులోకి అనువ‌దించారు. 2018లో విప్ల‌వ ర‌చ‌యితల సంఘం  ప్ర‌చురించింది. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాలు, భార‌త బూర్జువా వ‌ర్గ స్వ‌భావం,  విప్ల‌వ ద‌శ
కవి నడిచిన దారి కాలమ్స్

మిట్టిండ్ల క‌య్య‌ల నుంచి..

బతికిన బతుకులో ప్రేమకంటే ఎక్కువ ఛీత్కారాలే మెండుగా గురైనవాడు,ఆనందం కన్నా దుఃఖాల్ని ఎక్కువగా మోసుకుని తిరిగిన వాడు,చుట్టుముట్టిన పేదరికంలో ఈదినవాడు, చదువుకోవడం ఎంతో ఇష్టం వున్నా చదువుకునే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించకపోతే దీపంపట్టి మరీ వెదికి చదువును చేతులారా పట్టుకున్నవాడు, ఈ దేశంలో ఈ మారుమూల పల్లెలో వెనకకు నెట్టివేయబడిన దళిత వాడల్లో రెండు మూడు దశాబ్దాల ముందు ఖచ్చితంగా కనిపించడం వాస్తవవమైతే,! అచ్చం అటువంటి అనుభవాల్లోంచి, అటువంటి అవమానలోంచి,అటువంటి పేదరికంలోంచి,జీవిత పోరాటంలోంచి ఇప్పటిదాకా నడిచిన పల్లిపట్టు నాగరాజుగా మీ ముందు నిలబడి నాలుగు మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన వసంత మేఘం సంపాదకులకు ధ‌న్య‌వాదాలు చెప్పుకుంటూ... నేను
బహుజనం కాలమ్స్

ముస్లిం బ‌తుకు గుబాళింపు

ముస్లిం స్త్రీల తొలి తెలుగు కథా సంకలనం ‘మొహర్‌’. షాజహానా సంపాదకత్వంలో పర్‌స్పెక్టివ్స్‌ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 26 కథలున్నాయి. ముందు పేజిలో చెప్పినట్టుగా మొహర్‌ ` అనుమానాల మధ్య, అభద్రతల మధ్య, అసమానతల మధ్య, అణిచివేతల మధ్య అనేక గాయాలను మోసుకుంటూ ఉనికి కోసం పెనుగులాడే ముస్లిం స్త్రీల అస్తిత్వ ప్రకటన. ‘వెతుకులాట’ శీర్షికతో ఎ.కె. ప్రభాకర్‌ చక్కని ముందుమాట రాశారు. ‘తెలుగు సాహిత్యంపై కొత్త ముద్ర’గా షాజహానా పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరించారు, తొలి పేజీలలో. ఇక పుస్తకం లోపలికి వెళ్తే ‘మొహర్‌’ కథల్లో రచయిత్రులు అనేక అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లో కేంద్రీకృత
ఆర్ధికం

ఎలక్టోరల్‌ ఆటోక్రసీగా భారత్‌

స్వీడన్‌(గోథెన్‌బర్గ్‌) ఆధారిత వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘డెమోక్రసీ రిపోర్ట్‌ 2024’ ని మార్చి 7న విడుదల చేసింది. ప్రజాస్వామ్య నివేదిక 2024 ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది ప్రతిభావంతుల సహకారంపై ఆధారపడిరది. 1789 నుండి 2023 వరకు 202 దేశాలకు సంబంధించిన 31 మిలియన్‌ డేటాసెట్‌లను ఉపయోగించుకుంది. వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశాలను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. అవి: లిబరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ డెమోక్రసీ, ఎలక్టోరల్‌ ఆటోక్రసీ,  క్లోజ్డ్‌ ఆటోక్రసీ. 2023 నాటికి, ప్రపంచ జనాభాలో 71 శాతం (5.7 బిలియన్ల ప్రజలు) నిరంకుశ పాలనలో నివసిస్తున్నారు. ఇది దశాబ్దం క్రితం ఉన్న 48 శాతం కంటే గణనీయమైన పెరుగుదల. ప్రపంచ జనాభాలో