మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ లబ్ధి కొరకు వాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం..
మహిళలకు చట్టసభ ల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును డి లిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ)బిల్లుతో ముడి వేసి 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశపెట్టగా, అది వీగిపోయింది.. మరు సటి రోజు ప్రధానమంత్రి మోడీ, "మహిళా బిల్లుపై మేము నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు బ్రూణ హత్య చేశాయి మహిళలారా క్షమించండి" అని సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇది కోట్లాది మహిళలకు జరిగిన ద్రోహం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్ణించాడు.. శాసనసభ హాజరుకాని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం










