ఫీజు రీయింబర్స్మెంట్ మోసం ఇంకెన్నాళ్ళు ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీల్లో సైతం ప్రభుత్వమే పూర్తి ట్యూషన్ ఫీజును చెల్లించేది. దీంతో తెలంగాణలో వందల కళాశాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నాణ్యత లేని ఇంజనీంగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మెజారిటీ కళాశాలలు పాలక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులవే.










