వ్యాసాలు

ఫీజు రీయింబర్స్మెంట్ మోసం ఇంకెన్నాళ్ళు ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీల్లో సైతం ప్రభుత్వమే పూర్తి ట్యూషన్ ఫీజును చెల్లించేది.  దీంతో తెలంగాణలో వందల కళాశాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నాణ్యత లేని ఇంజనీంగ్, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు‌ కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కొల్లగొట్టాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మెజారిటీ కళాశాలలు పాలక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులవే.
వ్యాసాలు

మామిడి సాగులో కౌలు రైతు కన్నీళ్లు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆశించిన స్థాయిలోనే దిగుబడి ఇచ్చినప్పటికీ, మార్కెట్ మాయాజాలంలో మామిడి కౌలు రైతుకు తీరని చేదు అనుభవమే ఎదురైంది.     ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 84 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోందని చెబుతున్నప్పటికి, అనధికారికంగా 1లక్ష ఎకరాల కు పైనే ఉంటుందని మరికొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేలు తెలియజేస్తున్నాయి.   మామిడిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ అందులో బెనిష రకాన్ని మన రాయలసీమలో రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ రకం మామిడి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో పండించినప్పటికీ మన రాయలసీమలోని అనంతపురం, మదనపల్లి ప్రాంతాలకు
వ్యాసాలు

Eradication of Scientific Education in Hindutva Fascist Regime

Every year, millions of students across India are given the same promise: study hard and make necessary sacrifices now, so that education can secure a better future. Families spend enormous sums on school fees, coaching centres and competitive examinations in the hope that all this sacrifice will eventually be rewarded. Students spend day and night studying hard to clear competitive exams, often sacrificing their social lives, hobbies, and even adequate
వ్యాసాలు

స్వేచ్చపై దాడి చేస్తే సహించేది లేదు

 మిత్రులార! విరసం ఆవిర్భావ సభను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జరగనివ్వక పోవడమనేది చాలా బాధాకరమైన విషయం.  గత ఎన్నికల్లో మేము అందరం కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసమని ఎంతో ప్రయత్నించాం. అంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని చిన్నచిన్న సభల్ని,16సంస్థల్ని కూడా నిషేధించడం అన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆ పార్టీ మళ్లీ కొనసాగితే ప్రజాస్వామ్య విలువలు ఏమాత్రం కూడా దక్కవనే ఉద్దేశంతో మనమంతా కూడా చాలా సభలు నిర్వహించి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని అంటూ మనం కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్ పెట్టినప్పుడు ఆ పార్టీ ఈ అంశాన్ని
వ్యాసాలు

కనీస హక్కులు కోల్పోవడమే ప్రజాస్వామ్యం

 నిజానికి ఒక వేటు ఎప్పుడూ ముందు సిఎల్సి మీద విరసం మీద పడుతూ ఉంటుంది. తర్వాత మిగతా సమూహాలన్నీ వస్తూ ఉంటాయి. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినటు వంటి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటు వంటి ఏడో హామి. వర్ధిల్లుతోంది అని చెప్పి నేను నిన్నగాక మొన్న పెట్టాను. చాలా చిన్న చిన్న విషయాలు దృష్టిలోకి కూడా రావు. ఇప్పుడు ఇది విరసం సభ కాబట్టి మనందరి దృష్టిలోకి వచ్చింది.     ఒక 18 ఏళ్ళ అమ్మాయి తన తల్లితో గొడవపడి గొడవ అంటే వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తానంది,ఈ అమ్మాయి పెళ్లి చేసుకోను అన్నది. అది పోలీసుల
వ్యాసాలు

మనమందరం ఐక్యమవ్వాలి

ఆగస్టు 24, 2025 వరంగల్లో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఒక సభ ఏర్పాటు చేశాం. అప్పుడూ నిన్న పోలీసులు సడన్ గా ఎట్లైతే చెప్పిన్రో , ఆ రోజు కూడా వరంగల్ సభ జరగటానికి వీలులేదు అనుమతిలేదు అని వరంగల్ పోలీసులు ప్రకటించిన్రు. కనుక సభ జరగలేదు, అయితే ఆ సందర్భంగా ఒక సూచన ఏమొచ్చిందంటే, సభ జరగలేదు గానీ వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తారు, అక్కడ ఏదో రకంగా  చిన్నపాటి నిరసన చేస్తే బాగుండేది అని. సరే పౌరహక్కుల సంఘం అంత ధైర్యం చేయలేక పోయిందానాడు కానీ విరసం ఇవ్వాళ ఇక్కడ చేస్తున్నట్టు ఈ ఫామ్ లో
వ్యాసాలు

వేగుచుక్క

అల్లూరి సీతారామరాజు (4-7-1897 : 7-5-1924) భారత స్వాతంత్ర్య పోరాటంలో వేగుచుక్క అల్లూరి సీతారామరాజు, ఆదివాసుల గుండెల్లో ఆరని జ్యోతి అల్లూరి సీతారామరాజు. అలనాటి తెల్ల ప్రభుత్వానికి సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు, అందుకే తెలుగునాట తొలి బూటకపు ఎన్ కౌంటర్ సీతారామరాజుది. నేలతల్లి బిడ్డల విముక్తి కోసం నేలకొరిగిన వీరుడు సీతారామరాజు, అయినా చావులేని సమరశీలి సీతారామరాజు. ఇంతకీ సీతారామరాజు జీవితకాలం కేవలం ఇరవై ఏడేళ్ళు. కాని అల్లూరి ఊసులు, వాసనలు నూరేళ్ళయినా మాసిపోలేదు, మాయం కాలేదు. ఎందుకని ? అప్పుడు నా చిన్నప్పుడు రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నాజీలు నరజాతిని నెత్తురు టేరుల్లో ముంచెత్తు తున్నప్పుడు
వ్యాసాలు

లందలో పొడిచిన రాడికల్ సూర్యుడు “కర్రెం నర్సప్ప”

నల్లమల విప్లవోద్యమం ఏమి మిగిల్చుకోలేదని అది ఒక పరాజిత గాథ అని మాట్లాడే మేధావులు చాలా మందే ఉన్నారు సమాజంలో. నిజానికి నల్లమల ఉద్యమం ఏమి మిగిల్చుకోలేదా! సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేదా?అది ఓడిపోయిన కథ మాత్రమేనా? ఎందుకని సో కాల్డ్ మేధావులకు ఈ వివక్ష? ఉత్తర తెలంగాణ,విప్లవోద్యమాన్ని రొమాంటిక్ గా గంటలు గంటలు ఎత్తిపాడుతూ, ఉపన్యాసాలు దంచే వారికి నల్లమల్ల విప్లవోద్యమం ఎందుకని చిన్నగా కనిపిస్తుందో వింతగా తోస్తుంది. బహుశా నేను అనుకుంటాను నల్లమల్ల విప్లవోద్యమంలో మొదటి తరాన్ని మినహాయిస్తే ఆ విప్లవోద్యమం సెట్ బ్యాక్ గురయ్యేవరకు దళితుల ముఖ్యంగా మాల మాదిగల కొందరు బీసీల
వ్యాసాలు

అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం

ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గాంధీ శకం శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రారంభమై, ఒక ఉప్పెన పొంగిన కొద్దికాలానికే చౌరీచౌరా ఘటనతో వాటిని ఉపసంహరించడం జరిగింది. 1922 మార్చిలో గాంధీ బందీ అయ్యాడు. మరొక ఐదారు మాసాలలోనే సీతారామరాజు పోరాట పతాకం ఎత్తాడు. తెలుగుదేశానికి సంబంధించి పల్నాటి పుల్లరి సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ పోరాటం, చీరాల-పేరాల మునిసిపాలిటీ వ్యతిరేక పోరాటం, మధ్యతరగతి ప్రజల వరకైనా జాతీయ స్వాతంత్ర్య
వ్యాసాలు

ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల కుమ్మక్కు.

రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జూన్ 15 వ తేదిన పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేకంగా లేకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రిగా ఉండటంతో విద్యశాఖపై పర్యవేక్షణ కరువైంది. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు  నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువుల అమ్మకం యదేచ్ఛగా సాగిస్తున్నారు. వీటితో పాటు పాఠశాలల అనుమతులకు సంబంధించిన(ఎన్వోసి) నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ, బస్సుల పిట్నేష్ సర్టిఫికెట్, పైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లు పొందుటకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ రాజకీయ