ప్రాణాలని తీస్తూ అభివృద్ది అంటే ఎలా
వేదాంత మైనింగ్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళడం కోసం జరుగుతున్న రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక ఆదివాసీ, దళిత సముదాయాలు నిరసన తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు నికితా జైన్తెలుగు : పద్మ కొండిపర్తి 2026 ఏప్రిల్ 10 ఇళ్లను, ప్రాణాలను, గౌరవాన్ని బలిపెట్టి అభివృద్ధి చేస్తామంటే ఏమవుతుంది? ఒడిశాలోని రాయగడ జిల్లాలో, ఆదివాసీ, దళిత సముదాయాలు భారీ పోలీసు అణచివేతను ఎదుర్కోవడంతో కాంతమాల్ గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 2026 ఏప్రిల్ 7న, వందలాది మంది పోలీసులు కాంతమాల్ గ్రామంపై ఒక్కసారిగా దండెత్తారు. గ్రామస్తులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న నరేంద్ర అనే కార్యకర్త 'మక్తూబ్'తో మాట్లాడుతూ, ఇళ్లపై దాడి










