తొలికెరటాలు

నల్లింకు పెన్నులో తొణికిన భావోద్వేగాలు

హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా అన్యాయం పట్ల ప్రతిఘటనగా జీవన గాయాలపై ఓదార్పుగా కవి రచనా శైలి సాగింది. ఈ కవి రచన శైలి చాలా ప్రత్యేకం ఆయన కవిత్వంలో అలంకారాలు తక్కువే కానీ ప్రతి పదం వెనుక జీవన సత్యాలు కన్నీళ్లు కనిపిస్తాయి. ఆయన రాసే ప్రతి కవితలో సూటితనం గాఢమైన లోతు కూడా కనిపిస్తుంది తన అనుభవాలను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజపు అనుభవాలను కూడా పాఠకులకు అనుభవింపచేస్తాడు..  గుండెకు
తొలికెరటాలు

జీవిత అనుభవాల కేరాఫ్ బావర్చి

కథ రాయడం ఒక కళ, కానీ అందరికి సులభం కాదు. ప్రతి మనిషి రాయగలడు, కానీ ఆ కథలు పాఠకుడి హృదయానికి తాకేలా, వారి జీవిత అనుభవాలతో అనుసంధానం అయ్యేలా రాయడం కష్టమే. రాయడం అంటే ఆలోచించే, భావించే మనసు ఉండాలి. చరణ్ పరిమి గారి కథలు ఈ విషయంలో ప్రత్యేకంగా నిలిచాయి. ఆయన కథలలోని ప్రతి సంఘటన, ప్రతి మాట పాఠకుడి హృదయానికి చేరి, జీవిత అనుభూతులను పంచేలా ఉంటాయి. కాలింగ్ సప్తవర్ణం - కథలో మనసును పునరుజ్జీవనంగా చూపించారు. ప్రతి రోజు కొత్తగా ప్రేమించడం, జీవితం పట్ల ఆశ కలిగి ఉండడం ప్రధాన అంశాలు. 40
తొలికెరటాలు

పాలన ముసుగులు తీసిన ‘నియంత అంతం’

నియంత అంతం ఒక కాల్పనిక వాస్తవం. వాస్తవిక కల్పన. ఈ నవలలో ఉన్న ప్రతీ పాత్ర కల్పితమే అయినా నవల చదువుతున్నంత కాలం వాస్తవిక పాత్రలను, పరిస్థితులనే స్పురణకు తెస్తూ ఉంటాయి. చదువుతున్న కల్పిత రచన కంటే స్పురణకు వస్తున్న వాస్తవిక ఘటనలే ఎక్కువగా ఆలోచింపచేస్తాయి. ఈ నవల చదివాక ఎప్పుడో చదివిన కథ ఒకటి గుర్తుకువచ్చింది. రాచరిక వ్యవస్థ బలంగా ఉన్న కాలంలో ఒక నిరంకుశ రాజు. రాజుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ధైర్యం కూడా నాలుగు గోడల మధ్య దాక్కునే అంత భయంకరమైన పాలన. లక్ష మంది జనాభా ఉన్న రాజ్యం, వంద మంది సైనికులకు బయపడి
తొలికెరటాలు

కవితా నిరసన అగ్నివేశ్

"కేవలం జీవితంలోని బాధలను చిత్రించడమే ప్రధానం కాదు.అది చదివినా, విన్నా, తిరగబడాలనే కసిని పెంచకపోతే, ఆ రచన నిరుపయోగం" అంటాడు కొండపల్లి సీతారామయ్య.కవిత్వంలో ప్రతీకారేచ్చ ఉంటుంది. ఎవరిపై!?అసమానతలపై, వాటి దొంతరలపై,దాని దృష్టి కేంద్రీకృతం అవుతుంది. అది శక్తివంతమైన భావాలుగా విస్పోటనం చెందుతుంది. సరిగ్గా బాలు అగ్నివేష్ కవితా సంకలనం నా చేతికి వచ్చే నాటికి, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు తను దళితుడు అయిన కారణంగానే తనకు రూమ్ దొరకలేదని, కులం తెలిశాక దొరికిన రూమ్ లో నుంచి, ఆ ఊరి వాళ్ళు వెళ్ళగొట్టారని, అంతేకాకుండా, ఆ ఇంటి అల్లుడు సైతం,తను ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఆ ఇంటికి రానని
తొలికెరటాలు

ఆమె చేసిన చర్చ మెట్ల మీద ఆగిపోలేదు

మన సమాజంలో  మహిళ నిర్మాణమయ్యె క్రమం ప్రత్యేకమైనది. పురుషుడి నిర్మాణ క్రమానికి భిన్నమైనది.  పురుషుడితో సమానమైన స్వేచ్ఛ, సొంత అభిప్రాయాల ప్రకటన ఈ నిర్మాణక్రమంలో నిషేధం. అణచివేతలు, ఆంక్షలు ఈ నిర్మాణక్రమానికి ఉన్న ప్రత్యేకతలు. సహజంగానే సమాజంలోకి వచ్చిన ప్రతి మహిళా ఈ నిర్మాణ క్రమం నుండి వేరుపడదు. వేరుపడాలని ప్రయత్నించినా సమాజం అంగీకరించదు. కానీ అట్లాంటి నిర్బంధ క్రమాన్ని బద్దలు కొట్టే సామాజిక చైతన్యం తెచ్చుకున్న స్త్రీలు సమాజంలో ఉంటారు. వీరే సమాజాన్ని నూతన ప్రపంచంలోకి తీసుకువెళ్తారు.  ఏ ఆంక్షలు లేని ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి తీవ్రమైన సంఘర్షణ పడతారు. ఆ ప్రయాణంలో భాగంగా నూతన మానవులుగా
తొలికెరటాలు

అందరు చదవాల్సిన కథలు

కలవపూడి కథలు రచయిత సాoబశివతడవర్తి గారు రాసిన మొదటి కథ సంపుటి. ఉభయకుశలోపరి అని ఒక పిల్లవాడి ఉత్తరం తో మొదలై హంస మేడ అనె కథ లో..ఒక యువకుడి విరహ ప్రేమ లేఖలకు తన ప్రేయసి ప్రత్యుత్తరం తో ఈ కథ సంపుటి ముగిసిద్ది. ఈ కథ సంపుటి లో కృష్ణప్ప, కటారి, తారకం అనే పాత్రలతో వాటితో పాటు మధ్యలో వివిధ కథల్లో ఆ పాత్రధారులు  మనల్ని పలకరించి వాళ్ళ జ్ఞాపకాలు, అనుభవాలు, కథలు , స్మృతులు అన్ని మనతో పంచుకుంటూ వెళ్తారు. ఆ కథలతో పాటు మనమూ కలవపూడి కెళ్తామూ. మొదటి కథ నుండి
తొలికెరటాలు

సామాజిక స్పృహ కలిగించే ఖయ్యుం కొడుకు

చాలా సులభమైన విధంగా చాలా అర్థవంతంగా ఇందులో మొత్తం 15 కథలు ఉన్నాయి.  ప్రతి కథ తాత్వికచింతనతో కూడుకున్నది. ప్రతి  కథలో రాజకీయాలు ఉంటాయి.  మత రాజకీయం, ఎన్నికల రాజకీయం, కుల రాజకీయం, ప్రేమ రాజకీయం, సాహిత్య రాజకీయం, అనేక కోణాలలో అన్ని రకాల రాజకీయాలు మనకు  ఈ కథలో కనిపిస్తాయి.  దేశంలో రాజకీయం ఏ వైపుగా సాగుతుందో ఆ రాజకీయం వల్ల జరిగే అనర్ధం ఎంతగా జరుగుతుందో ఫాసిజాన్ని ఎంత వేగంగా విస్తరింపజేస్తున్నారో నియంత ప్రజల ఆలోచనలను ఏ వైపుగా డైవర్ట్ చేస్తున్నారో, ఎన్నికలలో గెలుపు ఓటముల మధ్య జరిగే విధానం కూడా EVM ను, అక్కడున్న
తొలికెరటాలు

స్వేచ్ఛ కోసం విరబూసిన ఎర్రమల్లెలు

ఎర్ర మల్లెలు, వాక్యం పాతదైనప్పటికి యి పుస్తక ముఖచిత్రం మాత్రం ఆకర్షించే విధంగా చదవాలని ఆత్రుత పెంచే విధంగా, ముఖ్యంగా యీ కాలపు జనరేషన్ ను  ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ముందుగా యి పుస్తకం నవలగా మారిందా అనే సందేహం చదివింతరువాత  కలిగింది నాకు. సరే అది చివరకు మాట్లాడుకుందాం. కథలో ప్రధాన పాత్రలు మూడు. వారి చుట్టూతా తిరుగుతుంటుంది కథ. అయితే కథ వస్తువు కొత్తదేమీ కాదు. అయినప్పటికీ ఆ కథని చెప్పే విధానంలో రచయిత్రి గారికి మార్కులు వేయొచ్చు. నేనేమీ మాష్టారు కాదు, ఆవిడ రాసింది పరీక్షా కాదు, కానీ తిన్న తిండి మీద
తొలికెరటాలు

ఉచ్చ నీతికి చెంప పెట్టు ‘ఉచ్చల జలధి తరంగ’

 “కవితలు చెప్పుకునే వేళ కాదిది, కాళ్లు కడుక్కునే వేళ కూడా కాదు, ఇది ఒక శిశ్నచ్చేద సమయం “ నిజమే ఇది ఒక  విపత్కర  కాలం మొన్నటి వరకు వాడి గురి అంతా అడవుల మీదే అనుకున్నాం. అడవుల్ని నాశనం చేసీ అక్కడి సహజ వనరుల్ని మొత్తంగా పెట్టుబడి వర్గాలకు అందించడమే వాళ్ళ లక్ష్యమన్న భ్రమల్లో ఉన్నాము. మనిషీ తత్త్వాన్ని వేర్లతో సహా పెకిలించాలనే ఉద్ధేశంతో ఇక్కడి మనుష్యుల్ని కులాలుగా,మతాలుగా, జాతిగా, ప్రాంతంగా ఎన్ని రకాలుగా విడగొట్టుకుంటూపోవాలో అన్ని రకాలుగా విభజిస్తూ వస్తున్నారు. అలా విభజించడానికి  విద్వేషాన్ని పంచుకుంటూ వెళ్తున్నారు.వెళ్ళే దారిలో కనిపించేవన్ని వాళ్ళు పంచే విద్వేషానికి మాధ్యమాలుగా
తొలికెరటాలు

విప్లవోద్యమంలాగే  మేరువు సావిత్రమ్మ  జీవితం

అనాదిగా భారతీయ సమాజం అనేక రకాల ఆధిపత్యాలను, అసమానతలను తనలో నింపుకుని కాలంతో పాటు ప్రయాణం చేస్తుంది. ఇట్లాంటి అసమానతలకు, ఆధిపత్యాలకు వ్యతిరేఖంగా పీడిత సమూహాల పోరాట పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సాగుతున్న ఈ పోరాటాలలో ఎంతో మంది మనుషులు కుల, వర్గ, జాతి, లింగ భేదం లేకుండా తమ జీవితాలను త్యాగమయ జీవితాలుగా మార్చుకున్నారు. ఏ అసమానతలు లేని సమాజం కోసం తమ ప్రాణాలను సైతం యుద్ధంలో ఉంచారు. అట్లాంటి మార్పుకోసం జరిగే యుద్ధంలో పాల్గొన్న మనుషులు కూడా అనేక సార్లు సమాజం విధించిన అణచివేతల భావజాలం నుండి తప్పించులేకపోయారు.