కథలు

లోప‌లి ప్ర‌పంచం

          "ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది" ఆంజనేయులు అది మూడో సారి అరవడం మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది. "ఇంకెప్పుడు  నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా " పద్మ కోపంగా అంది. "ఈ తిట్లకేం గాని  నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో"
సాహిత్యం కవిత్వం

బంగారు బుడతలు

కలలు కనే కళ్ళు ఆచ్చాదన లేని వళ్ళు లోకం తెలియని పరవళ్ళు అల్లరి పిల్లలు కాదు వాళ్ళు నవనాగరికులు వాళ్ళు సమిష్టి ఆశల సౌధం వాళ్ళు కాలం రైలు పట్టాలెక్కి జీవితాన్ని బాలెన్స్ చేస్తు విశ్వయాత్ర చేస్తారు వాళ్ళు నింగి, నేలంతా వ్యాపించి మూసిన కిటికీలు తెరిచి మేఘాలతో వూసులు చెబుతారు వాళ్ళు పాలపుంత లాంటి సుదూర కాంతి కిరణాలు వాళ్ళు తేనె జల్లుల పరవశం వాళ్ళు ప్రకృతి ఒడిలో పారవశ్యపు కాంతులు వాళ్ళు పాలకుల నైజానికి సాక్షులు వాళ్ళు ఎవరి సానుభూతి అర్థించని వాళ్ళు ఆత్మగౌరవానికే అందం వాళ్ళు బంగారు బుడతలు స్వేచ్ఛా విహంగాలు ఊహలకు రెక్కలు
కారా స్మృతిలో సాహిత్యం

మాస్టారితో నా గ్యాపకాలు కొన్ని !

మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు  జ్యోతిశ్యం  చెప్పారు నమ్మకంగా.  అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి   ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు.    ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట
సాహిత్యం కవిత్వం

నేనే మీ కవిత్వం

నా పెదవులపై తేనెపట్టు లాంటి మాటలేవీ?అవి పక్షులై ఎగురుతుంటాయి హృదయమూ మాటల మధుపాత్రే ఇపుడు మనమధ్య పదాల ప్రసారంఓ అమూల్యమైన అనుభవానికి వాగ్ధానం నిజానికి నా మాటలన్నీప్రాణవాయువుతో పాటు ఆయుష్షు గానాలోకి మీ నుంచి వచ్చి చేరినవే నా ప్రాణం లోపలుందని అనుకునేరుఅది బయటే ఉందినాతో కలిసి నడుస్తున్న వాళ్ళూనా భాగానికి ఇన్ని గింజలు పండిస్తున్న వాళ్ళూనా నడక కోసం దారుల్ని పరిచినవాళ్ళూనేనేదైనా చౌరస్తాలో నిలబడి ఉద్యమాచరణలో భాగంగా నినదిస్తున్నపుడు ప్రతిధ్వనిని అందించేవాళ్ళూ మీరు మీరు మీరంతా నా ప్రాణసమానులుమీరే నా మాటలలోని బరువుకు కారణమైనవారునా పద్యపాదాల్లో జీవం నింపే బతుకుపోరాటంలో నిండా మునిగిఉన్నవాళ్ళు మీ నవ్వులు నా
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను
సాహిత్యం వ్యాసాలు

Let Oppressed Identities and Class struggles be united Against Fascism.

Over the past few years, we have been experiencing the nature of fascismin India. It has similarities and differences to fascism in history. Now we have reached some consensus that Brahminical Hindutva has become fascism in our country. The Hindutva forces have been making preparations for about a hundred years to get to the current state. This added to the crises in the post-colonial Indian political system. Based on these
కథలు

అంటరాని బతుకమ్మ

అనగనగా ఒక కథ కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . నిన్న చదివిన కథ ఇవాళ మరోసారి  చదివితే  కొత్తగా ఉంటుంది. నిన్న గ్రహించలేని అర్థాలు వినిపిస్తాయి . కవి నాగేశ్వర్ తాను మరో  సారి చదువుతున్న కథలను మనకు పరిచయం చేసే శీర్షిక ఇది - వసంత మేఘం టీం కథలో జీవితం కనిపిస్తుంది . ఆ జీవితాన్ని కథ   మన అనుభవంలోకి తెస్తుంది .  ఆ అనుభవం మనల్ని ఆలోచనల్లోకి నెట్టి ఆచరణ వైపు నడిపిస్తుంది . కథ జీవితం లాంటిది. కథ లాంటిది  జీవితం. అదే విప్లవ కథ. అట్లాంటి విప్లవ
కథలు

రాంకో

ఉదయం ఏడుగంటలు కావస్తున్నది. తనతో ఉన్న వారిలో నుండి ఇద్దరిని తీసుకుని ఊళ్లోకి బయలుదేరింది. అది నాలుగు గడపలున్న కుగ్రామం. పేరు మాకడిచూవ్వ.  గడ్చిరోలీ జిల్లా చాముర్షి తాలూకాలో ఉన్నది. రాయగఢ్‌ నుండి వలసవచ్చిన ఉరావ్‌ ఆదివాసులవి రెండు ఇళ్లు.  స్టానికులవి రెండు గడపలు. వర్షాలు జోరుగా కురుస్తూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలం. ఎడ్ల భుజాల మీదికి కాడిని ఎక్కించిన రైతులు పొలానికి పోవటానికి తయారవుతున్నారు. ఆడ‌వాళ్లు  వంటపని ముగించుకుని అన్నం డొప్పల్లోకి సర్దేశారు.  దానికి విడిగా ఆకు మూత వేసి గంపలో అన్ని డొప్పలనూ పెట్టుకున్నారు. పొలానికి పోవటానికి సిద్ధమవుతున్నారు.  రణితను దూరం నుండే
కారా స్మృతిలో సాహిత్యం

ప్రపంచ కథకుడు

నాకు బాగా ఇష్టమైన కథా రచయితలు ఇద్దరే ఇద్దరు. ఒకరు మహాస్వేతాదేవి ఇంకొకరు కాళీపట్నం రామారావు. ఇద్దరి కథలని ఇష్టంగా చదువుకుంటాను. చాల సార్లు కథ రాస్తున్నప్పుడు ఎక్కడైనా తోచక పొతే వీళ్ళ పుస్తకాలలోకి తొంగి చుస్తాను. చిక్కులు కాస్త తొలిగి పోతాయి. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు నాకు రెడీరెకనర్ లాగ ఉపయోగపడుతుంటారు. వీళ్లిద్దరు నాకు సాహిత్యంలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏదైనా కథ నచ్చాలంటే కథలోని ఇతివృత్తంతో బాటు కథ నడిపే తీరు కూడా నచ్చాలి. దాన్ని బట్టే కథలో readability పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలని సైతం పట్టుకోవడంలో వీళ్ళు ఇద్దరు సిద్ధహస్తులు. అంటే
ఎరుకల కథలు

ధర్నా

"ఇదంతా అయ్యేపని కాదులేన్నా" నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్పై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా ఉన్నాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. ఎడమచేతికి వున్న వాచీకేసి రోడ్డుకేసి మాటిమాటికి తలతిప్పి చూస్తున్నాడు. అతడి కళ్లు చురుగ్గా వున్నాయి. మొహం ప్రశాంతంగా వుంది. ఎంఆర్ఓ ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయారు. ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎంఆర్ఒ జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా ఉన్నారు.కొన్ని సీట్లు ఖాలీగా కనపడుతున్నాయి.ఒక ఉద్యోగి దినపత్రికని తల పైకెత్తకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అతడి ముందు బిక్క మొహంతో ఒకామె నిలబడి