సంభాషణ

అసలు ‘హక్కులు’ అనడమే నేరం. ముస్లిం హక్కులు అనడం ఇంకెంత నేరం!

ఆదివారం ఉదయాన్నే ఒక మీడియా మిత్రుడి ఫోను. మీ ఇంటికి ఎన్. ఐ. ఏ. వాళ్ళు వచ్చినారా అక్కా అని. పొద్దున్నే ఏదో పనిమీద బైటికొచ్చి ఉన్నా. ఇంటికి పోతే అప్పటికే కొంత మంది మీడియా వాళ్ళు ఇంటికొచ్చి ఇదే విషయం అమ్మను అడిగి వెళ్లారని తెలిసింది. తర్వాత నిదానంగా తెలిసిందేమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, సభ్యుల ఇళ్ళలో సోదాలు జరిగాయని, ఒకర్ని అరెస్టు చేశారని. ఆ సంఘం ముస్లింలది కావడమే ఇందుకు కారణం. కొంచెం ఆలోచిస్తే.. ఇప్పుడు ఇక్కడ, తెలుగు సమాజంలో హిందూ ముస్లిం విభజన వేగంగా జరగాల్సిన అవసరం
ఇంటర్వ్యూ

మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?    మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ 
సంభాషణ

ఆయుధాల బలంపై అధికారాన్ని నిలుపుకోలేరు

ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ మిత్రుడు హిమాంశు కుమార్ ఫేస్ బుక్ పేజీ నుండి....... మన దేశంలో రానున్న కొద్ది సంవత్సరాలలో కోట్లాది ప్రజల భూములను తన్ని తన్ని వారి నుండి స్వాధీనం చేసుకుంటారు! పోలీసులతో పేదలను తన్నించి మేం వారి భూములు గుంజుకుంటాం. పేదల భూములు స్వాధీనం చేసుకొని మేం మా కోసం హైవే, షాపింగ్ మాల్, విమానాశ్రాయాలు, రిజర్వాయర్లు, కార్ఖానాలు నిర్మిస్తాం, అభివృద్ధి సాధిస్తాం. మేం బలసంపన్నులం, అందుకే మేమేదైనా చేయగలం? గ్రామీణులు బలహీనులు, వాళ్ల మాట వినే వాడెవడు? వాళ్లు బలసంపన్నులనేది నిజమనుకుందామా? దీని కోసం తలబద్దలు కొట్టుకోవలసిన పనేం లేదు? వాద- సంవాదాల అవసరం
సంభాషణ

యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది?

2021 మే 12, దండకారణ్య ఉద్యమాల చరిత్రలో ఒక విశిష్ట స్టానాన్ని సంతరించుకున్న దినంగా నిలిచిపోతుంది. ఆ రోజు దక్షిణ బస్తర్‌ (సుక్మా), పశ్చిమ బస్తర్‌ (బీజాపుర్‌) జిల్లాల సరిహద్దు గ్రామం సిలింగేర్‌లో గ్రామ ప్రజల ప్రమేయం లేకుండా అర్ధరాత్రి రహస్యంగా పోలీసులు తమ క్యాంపును నెలకొల్పిన రోజు. ఆ రోజు నుండి ఈనాటి వరకు గడచిన సంవత్సర కాలమంతా ఆ సిలింగేర్‌ ప్రజలు తమకు తెలువకుండా, తాము కోరకుండా తమ ఊళ్లో పోలీసు క్యాంపు వేయడాన్ని వ్యతిరేకిస్తునే వున్నారు. అందుకు నెత్తురు ధారపోశారు. గత యేడాది కాలంగా సాగుతున్న ఆ పోరాటంలో వాళ్లు లాఠీ దెబ్బలు తిన్నారు.
సాహిత్యం సంభాషణ

అమ్మల దినం తల్లుల గుండెకోత

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులకు, తల్లులను కోల్పోయిన బిడ్డలకు సాంత్వన చేకూరాలనీ కోరుకుంటూ సామ్రాజ్యవాదుల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన తల్లులకు, బిడ్డలకు అమ్మలదినపు విషాద ఘడియలలో శిరస్సు వంచి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన పిల్లల కోసం, భవిష్యత్‌ తరాల కోసం దోపిడీ యుద్ధాలు ఎరుగని శాంతిమయ ప్రపంచ సాధనకై పోరాడుదామనీ గట్టిగా అమ్మలమంతా శపథం చేద్దాం. అమెరికా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా
సంభాషణ

పోరుకు ప్రేరణనిచ్చే మేడే

మేడే అమరగాథ నేటికి 136 ఏండ్ల క్రితం 1886లో మే 1న అమెరికాలోని చికాగో నగర కార్మికులు 'ఎనిమిది గంటల పనిదినం' కోసం చారిత్రాత్మక పోరాటానికి నాంది పలికారు. ఆ రోజుల్లో పని గంటలకు ఏ నియమమూ లేకుండింది. పొద్దు పొడిచింది మొదలు చీకటయ్యే దాకా కార్మికులు కార్ఖానాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ వుండేవాళ్లు. ప్రారంభ దినాల్లో అమెరికాలో కార్మికులకు రోజుకు 12 నుండి 18 గంటల వరకూ శ్రమించవల్సి వచ్చేది. అత్యధిక కార్మికులు చిన్న వయసులోనే ప్రమాదకరమైన రోగాల బారినపడేవారు. చనిపోయేవారు కూడా. దీనికి వ్యతిరేకంగా పోరాడిన కార్మికులపై  ప్రైవేటు గూండాలూ, పోలీసులూ, సైన్యంతో దాడులు చేయించేవాళ్లు. పరిస్థితి
సంభాషణ

సాహ‌సిక మేధావి, ప‌త్రికా ర‌చ‌యిత న‌ర్మ‌ద‌

రాలిపడుతున్న ప్రతి పువ్వు తన అమరత్వపు గుబాళింపులతో ప్రజల మనసులను ఆవహిస్తుంది ఎగిసిపడుతున్న ప్రతి కన్నీటి చుక్క అమరుల ఆశయాల సాధనకై ఆదేశిస్తున్నది, శాసిస్తున్నది           2022 ఏప్రిల్‌ 9, మహారాష్టలోని గడ్‌ చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో మరో విషాదకర దినంగా మిగిలిపోతుంది. ఆ ఉద్యమానికి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం అలుపెరుగని విప్లవ సేవలు అందించి దండకారణ్య విప్లవ ప్రజలు అపార ప్రేమాభిమానాలను చూరగొన్న  కామ్రేడ్‌ నర్మదక్క తుదిశ్వాస విడిచింది.  గత మూడు సంవత్సరాలు గా అనేక తప్పుడు కేసులలో ఇరికించబడి విచారాధీనంలో వున్న 61 సంవత్సరాల  న‌ర్మ‌ద కేన్సర్‌ వ్యాధికి సరైన చికిత్స దొరుకకుండా పోయి,
సంభాషణ

జైలు జీవితపు భయంకర వాస్తవాలు

నిరాకర్ నాయక్ — వాస్తవిక కథనం నేను -2011 నుండి 2015 వరకు, సుమారుగా మూడున్నరేళ్లు, 'దేశద్రోహ' తప్పుడు ఆరోపణల కింద వేర్వేరు జైళ్లలో మొదట సోర్డా సబ్-జైలులో, తర్వాత బ్రహ్మపూర్ సర్కిల్ జైలులో, ఆ తరువాత ఒడిశాలోని భంజానగర్ స్పెషల్ సబ్-జైలులో ఉన్నాను. ఎనిమిదేళ్ల నాటి పూర్తిగా తప్పుడు, కల్పిత కేసుకు సంబంధించి నన్ను రెండవసారి 2019లో మళ్లీ అరెస్టు చేసి మరో ఏడాదిన్నర పాటు సొరాడ, భంజానగర్ జైళ్లలో ఉంచారు. నేను ఇప్పుడు బెయిల్‌పై ఉన్నాను. నాపై దాఖలైన మొత్తం పది కేసుల్లో మూడింటిలో నేను నిర్దోషిగా విడుదలయ్యాను, మిగిలిన ఏడు కేసులు విచారణలో ఉన్నాయి.
సంభాషణ

పూచిన చెట్టుకిందనే రాలిన పువ్వు

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి. నాలుగు సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి పీడితురాలైన నిర్మల, ఆ చికిత్స కోసం హైదరాబాదు వచ్చి ఉన్న సందర్భంలో 2019 లో అరెస్టయింది. బొంబాయిలోని బైకుల్లా జైలులో కరోనా రెండు సంవత్సరాలూ సరైన చికిత్స కూడా అందక కాన్సర్ వ్యాధి ముదిరిపోయి, అనేక అవయవాలకు వ్యాపించింది. ఇక కొద్ది నెలల కన్న ఎక్కువ బతకదని వైద్యులు చెప్పిన తర్వాత, బొంబాయి హైకోర్టు ఆదేశం మేరకు ఆమెను జైలు నుంచి, హాస్పైస్ (చికిత్స కూడా అవసరం లేని స్థితికి చేరినవారిని
సంభాషణ

ప్రభాతభేరి

మమతలు కరిగి మానవత్వం మసకబారుతున్నప్పుడు మనుసును ఏదో చీకటి పురుగు కొరికిన బాధ.కనుల ముందటి మనుషులు ఉన్మాద ప్రతీకలుగా  మారుతున్నప్పుడు గుండె పుండవుతోంది.ఉక్కిరిబిక్కిరై ఊపిరి సలపదు.ఏటి ఊట చెలిమెలా గొంతుతడిపిన మనుషులూ బీటలువారిన ర్యాగడిలా బిర్రబిగిసి పోతున్న కాలం.భయం పురుగు కరిసి మాటలురాక మ్రన్పడినట్లనిపిస్తోంది.హరితవనం మధ్యనున్నా ఆకులురాలిన మోడులమధ్యున్నట్లనిపిస్తోంది.మనుషులు మాట్లాడుకుంటున్న మార్కెట్ సక్సెస్ మంత్రాలు కనపడని రేసులు తోడేళ్లు కొండ్రగాళ్ల ఊళ్లాలనిస్తున్నయ్. ఆకురాలిన కాలంలో మండుటెండలను ధిక్కరిస్తూ చిగురించే పూసుగుమానుల ఊసులినాలన్పిస్తోంది.వడగాడ్పులను వెక్కిస్తూ ఎదిగే ఇప్పవనాల లేతాకుల ఎరుపు చూడాలనిపిస్తోంది. పట్టపగలు మిట్టమధ్యాహ్నం నీరవ కమ్మిన నిషిని తలపిస్తున్నప్పుడూ జలపాతహోరునలుముకున్న  వెలుగువెన్నెల ఎంత అద్భుతం. భయం కమురువాసన మధ్య