వ్యాసాలు

జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ఓయూలో విద్యార్థినుల పోరాటం

ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న జెండర్ వివక్షతను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినులకు సంఘీభావం ప్రకటించి అండగా నిలవాల్సిన భాద్యత మనందరిపై ఉంది.మార్చి నెల ప్రాంరంభంలో హౕస్టళ్ళలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రారంభమైన విద్యార్థినుల ఉద్యమం నేడు స్వేచ్చ,సమానత్వం,ఆత్మగౌరవం వైపు ప్రయాణం చేస్తూ తెలంగాణ సమాజం మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ వైపు మరోసారి చూసే పరిస్థితి నెలకొంది.మార్చి 27 నాడు మద్యాహ్నం నుండి లేడిస్ హస్టల్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరవధిక దర్నాలో మద్దతుగా మేము పాల్గొన్నపుడు విద్యార్థులు లేవనెత్తిన అంశాలు మమ్మల్ని పోరాటంలోకి కదిలించాయి.ఆ దర్నాలో పాల్గొన్న విద్యార్థినులు వారిపై ఏ విధంగా అణచివేత సాగుతున్నదో చెబుతుంటే
పత్రికా ప్రకటనలు

జయితా దాస్‌ను తక్షణమే, బేషరతుగా విడుదల చేయాలి

పశ్చిమ బెంగాల్ 30.03.2022 29.03.2022 రాత్రి కోల్‌కతా పోలీసుల స్పెషల్  టాస్క్ ఫోర్స్ (STF) సామాజిక కార్యకర్త జయిత దాస్‌ను అరెస్టు చేసింది. నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి జయిత నదియా జిల్లాలోని జగులియా క్రాసింగ్ దగ్గర ఆటో రిక్షా కోసం చూస్తుండగా జాగులియా పోలీస్ స్టేషన్ పోలీసులు వచ్చి తెల్ల రంగు  కారులో ఎక్కించుకెళ్ళారు. ఆమె చేతిలో వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కొంత డబ్బు ఉన్న బ్యాగును తీసేసుకున్నారు. తరువాత  ఆమెను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకువెళ్ళి, అరెస్టును ధృవీకరించడానికి STF అధికారి రాత్రి 8 గంటలకు వచ్చే వరకు కూర్చోబెట్టారు.
కవిత్వం

కవితా పరాగం

కిటికీ కవితలు - 1 ఒట్టి కిటికీ అనే అనుకుంటామా..ఏదో కాసింత గాలీ , వెలుతురు ఇస్తుందని ప్రేమ దానిపై..కానీ ..నాకనిపిస్తుంది..కిటికీకి దేహం ఉంది.హృదయమూ ..కళ్ళూ ఉన్నాయి.అది ఎలా చూస్తుందనుకున్నారు?బయట భళ్ళున తెల్లవారటాన్ని?లోపల ..కలలు కరిగి కన్నీరైన చీకటి రాత్రుళ్ళని?కిటికీకి ఉపిరితిత్తులున్నాయి..గది లోపలి మనుషుల ఆశ నిరాశలను…ఊపిరాడ ని ఉక్కిరిబిక్కిరి తనాలను తను కాదూ శ్వాసించేది..శ్వాసఇచ్చేది? కిటికీ..ఒకసారి అమ్మ అయిపోయి..మరోసారి నాన్నగా మారి పోతుంది.కిటికీ ..తనని పట్టుకుని వేలాడే మనుషుల దుఃఖంతో….దీర్ఘ సంభాషణ చేస్తుంది… వాదోపవాదాలు చేస్తుంది.రెక్కలు చాచి..ఒంటరి మనుషుల్ని కావలించుకుంటుంది.అమ్మ దేహం మీది వంటింటి వేడి సెగలని.. చమట ను చల్లని గాలితో చల్ల బరుస్తుందివిరహాన వేగిపోయే
సంభాషణ

ఛత్తీస్ ఘడ్ లో మరో బూటకపు ఎన్కౌంటర్

మరణించిన మనురామ్ నూరేటి ‘మావోయిస్టు’ అన్న పోలీసులు ఆ తర్వాత కాదన్నారు . 2022 జనవరి 23న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోవున్న భరందా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మనురామ్ నూరేటి అనే యువకుడు చనిపోయాడని పోలీసుల కథనం. “ఎన్‌కౌంటర్  ప్రారంభమైనప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్ లో ఉంది. అర్ధరాత్రి 1 గంటలకు, మావోయిస్టులు డిఆర్‌జిపై కాల్పులు జరపడంతో  ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆగిపోయిన తరువాత, సంఘటన స్థలం నుండి ఒక మావోయిస్టు మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్ (ఎమ్‌ఎల్‌జి)ను స్వాధీనం చేసుకున్నది, ”అని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ చెప్పారు, ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. “రాత్రి 10 గంటల ప్రాంతంలో, నా భర్త పక్షులను వేటాడేందుకు స్లింగ్‌షాట్‌తో బయటికి వెళ్లాడు. అతను స్వెటర్‌ సాధారణ  చెప్పులు వేసుకున్నాడు, కానీ  పోలీసులు చూపించిన మృత దేహానికి యూనిఫాం వుంది, రైఫిల్‌
వ్యాసాలు

ప‌డిపోతున్న‌  విశ్వవిద్యాలయాల ప్రమాణాలు

రాయలసీమ  విద్యా పరిరక్షణ కమిటీ,  అమ్మకు తిండి  పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానని చెప్పాడంట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. కర్నూలు  జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ఐఐటిడిఎం, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ విశ్వ విద్యాలయం ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 2008 లో 16 విభాగాలతో ఏర్పడ్డ  రాయలసీమ విశ్వ విద్యాలయం పట్టుమని పది మంది అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి.  అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె దిగగానే ప్రభుత్వంలో ఉన్న సెక్రెట్రీలు కూడా అధికారం
కవి నడిచిన దారి

నా అన్వేష‌ణే నా క‌విత్వం

జీవితం చాలా నేర్పిస్తుంది. పట్టుతప్పి పడిపోతున్న సమయంలో, పోరాడి పోరాడి అలసి విసిగిపోయిన సమయంలో ఏదో చిన్న ఆశ దృక్పధమై నిలబెడుతుంది. ఎత్తు పల్లాలు దాటుకుని ముళ్ళ దారుల్లో గాయాలను మాన్పుకుని ముందుకు సాగే మార్గమొకటుందని మనమూహించకుండా తారసపడే ఒకానొక సమయం పట్టి పలకరిస్తుంది. గమ్యమేదైనా ప్రస్తుతం నేను నడవాల్సిన దారిని విస్మరించకుండా అదే సమయంలో నాకు నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానమింకా వెతుకుతూనే ఉన్నాను. ఆ అన్వేషణే నా యీ కవిత్వం. 2015 లో మొదలు పెట్టిన సాహితీ ప్రయాణం 2019 లో ఏడవ రుతువుగా రూపు దిద్దుకుని దేశమంతా వాళ్ళ ఊరు నుంచి అటుగా వంగిన
ఆర్ధికం

యుద్ధ ఆవరణలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

  యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా, ఇయు, నాటో దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి. కొవిడ్‌ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్భణానికి దారి తీస్తోంది. కొవిడ్‌ కాలంలో దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇప్పటికి పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరు చుట్టుపై రోకలి పోటులా ఇంతలోనే యుక్రెయిన్‌ సంక్షోభం వచ్చి పడింది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతగా నష్టం వాటిల్లనుంది. యుద్ధం దీర్ఘకాలం
వ్యాసాలు

డప్పు క‌ళ‌

డప్పు-డోలక్ ల‌ను జననాట్యమండలి ఎందుకు స్వీక‌రించింది? ఎలా వినియోగించింది? ఏం ప్రయోజనం నెరవేరింది? వాటిని వినియోగించడంలో ఏ లక్ష్యం సాధించారు? శబ్దం, దరువు – ప్రదర్శనలో గాని పాత్ర బాణీలు మారినప్పుడు ఏ విధంగా డప్పుశాస్త్రం రాయడం, నాలుగు తాళాలు అభివృద్ధి చేయడం ఇంకా భవిష్యత్‌లో అవకాశాలు. పాటకు ఈ వాయిద్యానికి మధ్య సమన్వయం గురించి వివరణలో రాగాలు మారినపుడు ఎలా? జననాట్యమండలి రచయితలు, కళాకారులు ప్రజల జానపద బాణీలతోనే తమ మెజారిటీ పాటలను, రాశారు. కాబట్టి ప్రధానంగా జానపద పాటలకు ప్రధానంగా ప్రజలు వాడే  వాయిద్యం డప్పు కనుక జననాట్యమండలి కూడా అదే వాయిద్యాన్ని తన ప్రధాన
కవిత్వం

ఒక ఎండా కాలపు దాహం    

ఈ వేసవి కాలందోసిళ్ళ లోంచి క్షణాల్ని ఒంపుకుంటూగొంతులోని తడిని ఎగరేసుకుపోతూఎండను రాల్చుకుంటుంది .ఇంటిలోంచి కళ్ళు బయట ఆరేస్తే చాలుపిల్లలు మూగిన ఐస్ క్రీం బండిబాధ్యత రెక్కల్ని విప్పుతుంది .కన్నీటి దుఃఖాల్నిలోలోపల ఆరేసుకుంటుంది .ఇంటి  లోపల ఉతికిన వస్త్రాల్ని చూస్తే చాలు బయట ఎండలోవయసు భారాన్ని లెక్కచేయనిఇస్తిరి పెట్టి ముసలివాడుబొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు .ఎండ పేలిపోతున్నబండి కదలదు .శ్వాస ఆగిపోతున్నబతుకు పోరాటం ఆగదు .చూపులు తిప్పుకునినీటి టబ్బు వైపు చూస్తే చాలు గడపలో నీటి కోసం కాకులుఊగుతుంటాయి.నీట మునుగుతుంటాయి . ఒక ఎండా కాలం నీటి స్పర్శ కోసంగొంతులు మధన పడుతుంటాయి .నా చుట్టూ ఎండను తీసిగొడుగులా  కాసిఒక్కో గొంతులో నీటినిపోసిస్వచ్ఛంగా  స్వేచ్ఛగాపక్షిలా బతకాలనుంటుంది .ఒక ఎండాకాలపు దాహంమనిషిని కాల్చకుంటే ఎంతబావుణ్ణు.చినుకునై కురిస్తే ఇంకెంత బావుణ్ణు . ===========================
కవిత్వం

కవితా పరాగం

తేనె ఫలం1.ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లోపడ్డ నీ పాద ముద్ర లోఒలికిన నా చూపు లోసగం చీకటిసగం వెలుతురు ఇప్పుడు..2.ఎంత తీరైన నడకఇసుక పై రంగవల్లి అల్లినట్టుఏ తోట్రుపాటు లేదురంగు జాతీయత పట్టింపు లేనిఆలింగనపు మహత్తుపాదాన్ని నేల ముద్దాడుతుందిమాటని పెదవి విహంగం చేస్తుందిభాష కు భవబంధాలు తెలియవుపరిస్థితులతో సంబంధం లేని పయనం నీదిమన్ను దేహంగా పొందిన నదిలాంటిది నీ ప్రయాణంఎడారి స్థితికి వాన మీదావానకి ఎడారి మీదా మమకారం పెంచిఒకే రకమైన ప్రేమ ను పంచిప్రేమ తెలియని ప్రాంతాల్లోనీ కనుచూపును చిలకరించినవ్వుల్ని మొలిపించేసేద్యం నీ పధంవెలుతరూ చీకటి విత్తులుగా నాటిమానవత్వపు పంట పండించడంనీ వృత్తి3.ఎడారి తిన్నెల మీంచి మట్టి వేణువు