మోడీ అమ్ములపొదిలో మరోస్పైవేర్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన కుటిల రాజకీయ నీతిని పదేపదే ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వ అణచివేత పాలనపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలను కొట్టిపారేస్తూ తన నిరంకుశ, నియంతృత్వ వైఖరిని కొనసాగిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్ కొనుగోలు రేపిన దుమారం సద్దుమణగక ముందే మోడీ సర్కార్ కొత్త స్పైవేర్ కోసం వేట మొదలెట్టింది. అందుకు రూ.986 కోట్లు కేటాయించింది. 2019 లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెగాసస్ స్పైవేర్ కూడ పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్ను చొప్పించారన్నది పలు నివేదికల సారాంశం. ఈ