వ్యాసాలు

మోడీ అమ్ములపొదిలో మరోస్పైవేర్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన కుటిల రాజకీయ నీతిని పదేపదే ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వ అణచివేత పాలనపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలను కొట్టిపారేస్తూ తన నిరంకుశ, నియంతృత్వ వైఖరిని కొనసాగిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం  పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు రేపిన దుమారం సద్దుమణగక ముందే మోడీ సర్కార్‌ కొత్త స్పైవేర్‌ కోసం వేట మొదలెట్టింది. అందుకు రూ.986 కోట్లు కేటాయించింది. 2019 లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెగాసస్‌ స్పైవేర్‌ కూడ పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్‌ను చొప్పించారన్నది పలు నివేదికల సారాంశం. ఈ
వ్యాసాలు

నాణేనికి ఒకవైపు

వాకపల్లి ఘటనకు పదిహేనేళ్లు  నిండింది. న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు సుదీర్ఘకాలం వేచి ఉండిన తర్వాత న్యాయం తమకు అందదని ఈ దేశ న్యాయస్థానాలు కేవలం ఎంక్వయిరీ ఆధారిత తీర్పులు ఇస్తాయని వాకపల్లి బాధితులకు అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. ఇక్కడ   న్యాయ స్థానం,పోలీసులు ఒక  సాకు మాత్రమే.                                                    2007 ఆగస్టు 20న తెల్లవారుజామున నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కూంబింగ్ కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులకు కనిపించిన గ్రామం వాకపల్లి. విశాఖ మన్యం ప్రాంతంలో తమదైన జీవితం గడుపుతున్న ఆదివాసి స్త్రీలు ఈ పోలీసులకు తమ లోపల వాంఛను తీర్చేవారిగా కనబడ్డారు. పోలీసులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఈ
వ్యాసాలు

నిరంతర శ్రామికవర్గ పోరాట స్ఫూర్తే మేడే

పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమిస్తూ ఉండేవారు. ఆనాడు శ్రమ జీవులపై పనిభారమే కాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేది. వారు రోజూ 16 గంటలు శ్రమించేవారు. కొంత మంది పెట్టుబడి దారులు కార్మికులచేత రోజూ 20 గంటలు కూడా పని చేయించేవారు. పారిశ్రామికాధిపతులు శ్రమజీవులకు అతి తక్కువ జీతాలు ఇచ్చేవారు. ఆనాడు ఫ్యాక్టరీలలో శ్రామికులకు ఎటువంటి భద్రతగానీ, సౌకర్యాలుకానీ ఉండేవి కావు. ఫ్యాక్టరీలలో గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ ఉండేది కాదు. అందుచేత తరచుగావారు ప్రమాదాలకు గురై మరణిస్తుండేవారు. కార్మికులు
సంభాషణ వ్యాసాలు

శ్రమ సంబంధాలఅమ్మ

నవంబర్‌ 1 నాడు మల్లోజుల మధురమ్మ తన వందవ ఏట కన్నుమూసింది. ఆమె నిండా నూరేళ్లు బతికింది. బతికినన్నాళ్లు ఆమె విప్లవ సానుభూతిరాలుగానే బతికింది. ఇటీవలి కాలంలో చాల మందే అమ్మలు, నాన్నలు కన్నుమూస్తున్న వార్తలు వినాల్సి వస్తున్నది. కొద్ది రోజుల క్రితం మా సహచర కామ్రేడ్‌ హన్మంతు తండ్రి  పాక చంద్రయ్య 90వ ఏట సెప్టెంబర్‌ 30నాడు కన్ను మూసిన విషయం వార్త పత్రికల ద్వార తెలిసింది. ఆయన తొమ్మిది పదులు నిండిన వయసులో కన్ను మూశాడు. ఆయనకు ఆరుగురి సంతానంలో మా కామ్రేడ్‌ హన్మంతే పెద్ద కుమారుడు. ఆయన మరణం బాధాకరం.  కానీ ప్రతి జీవికి
వ్యాసాలు

“మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమినివ్వం”

ఉత్తరప్రదేశ్ అజంఘడ్‌లో విమానాశ్రయ విస్తరణ వ్యతిరేక పోరాటం ఉడే దేశ్ కా ఆమ్ నాగ్‌రిక్ (ఉడాన్-దేశ సాధారణ పౌరుడు ఎగరాలి) పథకం కింద మండూరి అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్‌ను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌స్ట్రిప్ విస్తరణకు మొదటి దశలో 310 ఎకరాలు, రెండవ దశలో 264 ఎకరాలు అవసరమవుతాయి, ఇది తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్లను ప్రభావితం చేస్తుంది. ఉడాన్ పథకం కింద అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్ విస్తరణ కోసం మొత్తం 600 ఎకరాలు అవసరం -- దశ-I కోసం 310.338 ఎకరాలు, దశ-II కోసం 264.360 ఎకరాలు. అదనంగా, ఎనిమిది-తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్ళు కూడా ప్రభావితమవుతాయి. ఈ ప్రాజెక్టు
వ్యాసాలు

మరో సారి భారత ప్రజలపైబాంబు దాడి

భారత ప్రభుత్వం తన పౌరులపై మరోసారి బాంబు దాడి చేసిందని మీకు తెలుసా? “గత నెలలో అమిత్ షా బస్తర్‌ను సందర్శించి, ప్రతిఘటనను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసిన తరువాత 2023 ఏప్రిల్ 7 న దాడి జరిగింది. అమెరికా ఇతర దేశాలపై బాంబు దాడులు చేసినప్పుడు చాలా మంది కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం దేశంలో బాంబు దాడులు చేసినప్పుడు వారు మౌనంగాగా ఉన్నారు.” నిరసన! నిరసన! నిరసన! ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రం, బస్తార్ జిల్లాలోని భట్టుం, కవురుగట్ట, మీనగట్ట, జబ్బగట్ట గ్రామాల ఆదివాసీల పైన భారత ప్రభుత్వం ద్రోణుల  సహాయంతో 2023 ఏప్రిల్ 23 నాడు వైమానిక బాంబులు
వ్యాసాలు

మహిళా సాహిత్య చరిత్రలో శోభారాణి

జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన  మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం
వ్యాసాలు సంభాషణ

మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

‌ (వాకపల్లి మహిళల కు  న్యాయం జరిగిందా ?  ఆదివాసులకు, అందునా ఆదివాసీ మహిళ లకు న్యాయం చేసే వ్యవస్థలోనే మనం ఉన్నామా? కోర్టు తీర్పు నేపథ్యంలో విరసం . ఆర్గ్ జూన్ 1 , 2016 లో గతంలో అచ్చయిన ఈ వ్యాసం పాఠకుల కోసం.. - వసంతమేఘం టీం ) విశాఖపట్నం దగ్గర కరకవానిపాలెంలో అమరుడు కామ్రేడ్‌ అజాద్‌ ‌సంస్మరణ సభ భావోద్వేగాలతో జరుగుతున్నది. ఆ సమయంలో నా పక్కన కూర్చున్న లాయర్‌ ‌బాలక్రిష్ణ ‘వాకపల్లి వెళుతున్నాం వస్తారా?’ అని అడిగాడు. ఛిద్రమైపోతున్న ప్రజల జీవితం గురించి దాదాపుగా రెండు గంటలుగా ఆ సభ జరుగుతున్నది.
వ్యాసాలు సంభాషణ

అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

(డానియల్ అడుగుతున్నాడు.. మా ఊరి మహిళకు న్యాయం జరిగిందా? అని. న్యాయం అంటే ఏమిటని అమరుడు డానియల్ మనలను నిలదీస్తున్నాడు.. ఈ రోజు ఆయన కూడా లేకపోవచ్చు..    బాధిత మహిళల్లో కొందరు మరణించి ఉండవచ్చు..  కానీ వాళ్ళ కన్నీరు, దుఃఖం , నెత్తురు, అమరత్వం  మనలను నిలదీయడం లేదా? న్యాయం అంటే ఏమిటో చెప్పమని ..18.11.2016 (virasam.org లో ప్రచురి తమైన ఈ వ్యాసం పాఠకుల కోసం.. వసంత మేఘం టీం) విశాఖ ఏజెన్సీలో విస్తరించి ఉన్న 2వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయికి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేందుకు 1999లో అప్పటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి
వ్యాసాలు

కార్పొరేటీకరణ, సైనికీకరణ – హక్కుల ఉల్లంఘన 

మన దేశంలో హవాయి చెప్పులు వేసుకునే వారు సహితం విమానాలలో ప్రయాణించే స్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించిందని ఈ రోజు పత్రికలలో ఒక వార్త వచ్చింది. అదేమేరకు నిజమో మీకూ, నాకూ అందరికీ తెలుసు. విమాన ప్రయాణం మాటేమోగాని తమపై కేంద్ర ప్రభుత్వం వైమానిక దాడులు చేస్తున్నదని, వాటిని ఆపమని ఆదివాసులు డిమాండ్‌ చేస్తున్నారు. . మనందరం దీన్ని పట్టించుకోవాలి. వాళ్లతో గొంతెత్తి అరవాలి. ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి. ఛత్తీస్‌ఘడ్‌ రాష్త్రం బీజాపూర్‌ జిల్లాలో ఫిబ్రవరి 1, 2 వ తేదీలలో జరిగిన ఘటనను మీకు వివరిస్తాను. ఈ ఘటన చెబితే దీని ద్వారా