వ్యాసాలు

సీమ అస్తిత్వ చరిత్రలో వెలుగు కెరటం సుబ్బరాయుడు

( రాయ‌సీమ విద్యావంతుల వేదిక  మూడో బులిటెన్‌కు రాసిన ముందుమాట‌. జ‌న‌వ‌రి 4న క‌ర్నూలులో జ‌ర‌గ‌నున్నఆర్ వి వి రాష్ట్ర మ‌హాస‌భ‌లో ఆవిష్క‌ర‌ణ‌) చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో  మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్‌ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని
వ్యాసాలు

వందేమాతర స్వరం మారుతున్నది

వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది.   ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998) నరేంద్ర మోదీ (2025) పరిపాలనా కాలంలో ఒకానొక చర్చగా ముందుకు వస్తుంది.  వందేమాతరం గీతం సారాంశం ఏమిటి? కాలంతో పాటు ఎందుకు వివాదాస్పదం అవుతోంది. బకించంద్ర ఆనందమఠం  నవలలో వందేమాతర గీతాన్ని రాశారు. జాతీయోద్యమ కాలంలో ప్రజల పాడుకునే విధంగా గీతం ప్రాచుర్యం పొందింది. అధికార మార్పిడి తర్వాత అధికారక దేశభక్తి గీతం అయింది. దేశంలోని భిన్న మతాల ప్రజలలో కొన్ని మినహాయింపులున్నా వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. వందేమాతర గీతాన్ని
వ్యాసాలు

జైలు ఆకాంక్షల్లో రచన రూపేష్ అముద్రిత నవల ‘ఖైదీల జ్ఞాపకాలు’

అక్ర‌మ కేసులో  జైల్లో ఉన్న కేర‌ళకు చెందిన రాజ‌కీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం. జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు.
వ్యాసాలు

ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన – కొన్ని ఆలోచనలు

(ఇది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పేట్రియాటిక్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ – పిడి ఎం) మార్చ్ 26న గుంటూరులో జరిపిన సదస్సులో ‘ఫాసిజం – ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన’ అనే అంశం మీద చేసిన ఉపన్యాస పాఠం. సమయం లేకపోవడం వల్ల ఆ విశాలమైన అంశాన్ని మాట్లాడలేనని, ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఆవశ్యకత అనే అంశంలో కొన్ని కోణాలను, చరిత్ర అనుభవాలను మాత్రమే వివరిస్తానని ఉపన్యాసకుడు ముందే సూచించాడు) ఫాసిజం అంటే ఏమిటి? ఇవాళ దేశంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించవలసిన అవసరమేమిటి? ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనను ఎట్లా నిర్మించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
వ్యాసాలు

భారతి సాహిత్య ధమ్మం

సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో  చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో  సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్  మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు  తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా
వ్యాసాలు

ఎవరిదీ  తెలంగాణ ? ఎవని పాలైంది ?

డెబ్బై ఏళ్ళ తెలుగు రాష్ట్రం రెండు బలమైన ఉద్యమాలను చూసింది.ఒకటి నక్సల్బరీ రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.  సిద్దాంత రిత్యా రెండూ వైరుధ్యమైన ఉద్యమాలు అయినప్పటికీ  రెండు ఉద్యమాలూ సుధీర్గ కాలం నడిచాయి. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నాయి అవి ఒక దానికి మరొకటి సంబంధ భాంధవ్యాలను కలిగి ఉంది. తొలివిడత తెలంగాణ మిగిల్చిన అసంతృప్తుల దావాలనమే  నక్సల్బరీ ఉద్యమాన్ని కొనసాగించాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి గొంతూ ఈ రెండు ఉద్యమాలను గుండెలకు హత్తుకున్నాయి. ఇది పోరు భూమి, ఆట పాట సైదోడై కదన రంగాన్ని కవాతు తొక్కేలా చేసాయి.  సీమాంధ్ర దోపిడీ సాంస్కృతిక అభిజాత్యం పాలకుల నిర్లక్ష్యం
వ్యాసాలు

వాకపల్లి మహిళలపై అత్యాచారం – కోర్టు తీర్పు

పర్వత శ్రేణిలో,  మేఘాలతో దోబూచులాడే సుదూర కుగ్రామం వాకపల్లి. లోతట్టు అడవిలో ఎత్తైన కొండల దరి; గుంటలు, వాగులు, వంకలు కలయికతో; పాడేరుకు పోయే రోడ్డుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరాన గల వాకపల్లి వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక దారి; ఆదిమ ఆదివాసీ తెగకు చెందిన కోందుల ఆవాసాలలో ఒకటి. వాళ్ళకు తెలుగు రాదు; వాళ్ళది కోండు భాష; అనాది కాలం నాటిది. నాగరిక జీవనానికి దూరంగా; దారీ, తెన్నూ తెలియని ఆదిమ ఆదివాసీ గిరిజన గూడెం వాసులపై నాగరికులు, అధునాతన సాయుధులు, ముష్కరులైన ప్రభుత్వ రక్షక దళాలు దాడి చేయడమేమిటి; వాళ్లపై అత్యాచారాలకు
వ్యాసాలు

గుడి కట్టి దేశం గాయాన్ని మాన్పగలమా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్  సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు. ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది;
వ్యాసాలు

కుల నిర్మూలన – నూతన ప్రజాస్వామిక విప్లవం

(కా. డప్పు రమేశ్ మొదటి సంస్మరణ సభ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం) 1967 లో నక్సల్బరీ తిరుగుబాటుతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా మనదేశంలో స్థిరంగా వేళ్లూనుకుంది. ఇది ‘నూతన మానవుల’ నిర్మాణం అనే భావనను దేశంలో బలంగా ప్రవేశ పెట్టింది. రాజకీయంలో విప్లవ పథాన్ని ఆవిష్కరించడంతో పాటు సాహిత్యం, కళలు, సినిమా వంటి అన్ని రంగాలలో వినూతన కోణంతో ఆలోచించడం నేర్పింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అంటూ చరిత్ర రచనలో పీడిత వర్గాల కోణం నుండి చరిత్రను చూడటం నేర్పించింది. ఆ నూతన దృక్కోణం స్పృశించని రంగమంటూ లేదు.
వ్యాసాలు

అన్ని వర్సిటీలనూ అభివృద్ధి చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా డిసెంబర్ 10 వ తేదీన, ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సందర్శించారు.అంతకు మూడు నెలల ముందు ఆగస్టు 25 వ తేదీన కూడా ఓయూలో పర్యటించి ఓయూ అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తామని, తాను మళ్లీ డిసెంబర్ 10 నాడు ఓయూ ఆర్ట్స్ కళాశాల వస్తానని, భారీ బహిరంగసభ నిర్వహిస్తానని ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా క్యాంపస్ లో వుండకూడదని,ఆ రోజు విద్యార్థులు నిరసన వ్యక్తం