వ్యాసాలు

మీ ఇంటిపైనే ఎందుకు దాడి చేశారు.. మా ఇంటిపై ఎందుకు చేయలేదు?

సెప్టెంబరు 5న మా ఇంటితో పాటు ఎనిమిది చోట్ల ఎన్‌ఐఏ దాడులు చేసిన తర్వాత.. ‘మీ ఇంటిపైనే ఎందుకు దాడులు చేశారు.. మా ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు?” అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ముందుగా, ఈరోజు మేం పడుతున్న మానసిక వేదన మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నామని చెప్పాలి. అయితే, అది మన యిష్టాయిష్టాలపై  ఆధారపడి ఉండదు. కానీ ఎవరైనా ముస్లింలని అరెస్టు చేసినప్పుడు లేదా వారి యింటిపై దాడి జరిగినప్పుడు, సాధారణంగా ముస్లింలు మీ యింటి మీదనే ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నించరు. సూరత్‌లో అరెస్టయిన ముస్లింలను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల చేసిన తర్వాత ప్రముఖ
వ్యాసాలు

గనుల తవ్వకాన్ని వ్యతిరేకించినందుకు ..

గడ్‌చిరోలిలో గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన నేతలు వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. వారికి మావోయిస్టులు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తోడ్‌గట్టకు వెళ్ళే దారి సుదీర్ఘమైన, రాళ్ళు రప్పలతో, మలుపులతో వుంటుంది. ఈ గ్రామం మహారాష్ట్రలోని గడ్‌చిరోలి జిల్లాలోని ఏటపల్లి తాలూకాలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంది. గడ్‌చిరోలి పట్టణం నుంచి తోడ్‌గట్ట వరకు కారులో వెళ్లదగిన మార్గం గూగుల్ మ్యాప్‌లో కనిపించలేదు. ఆగష్టు 27 నాడు మధ్యాహ్నం సుమారు 150 కిలోమీటర్లు కారులో ప్రయాణించడానికి మాకు ఆరు గంటలు పట్టింది. ఏటపల్లి పట్టణం దాటిన తరువాత ఇరుకైన 
వ్యాసాలు

కృష్ణా జలాల పంపిణీ, పునః పంపిణీ సాధిద్దాం 

ఎంత  పెద్ద సమస్యయినా, ఎంత చిన్న సమస్యయినా పంపిణీ దగ్గర బిగుసుకు పోతున్నాయి. ఆ సమస్య తెగకుండా అనేక ఉచ్చులు బిగించటంలో ఎవరి మానాన వారు వాద ప్రతివాదాలు తీవ్రం చేస్తూనే ఉంటారు. ఈ నాలుగు దశాబ్దాలుగా కృష్ణానదీ జలాల పంపిణీకి, పున:పంపిణీకి సంబంధించి అనేకానేక చిత్రవిచిత్ర వాదనలు వినవలసి వచ్చింది. ఆ సంభాషణలో  ఘర్షణలో చిన్నచిన్న మెట్లుగా సమస్య పరిష్కారం వైపు ముందడుగు వేస్తూ వచ్చింది కానీ ఓ కొలిక్యిరాలేదు. రాలేదు అనేకంటే పట్టించుకోగల బాధ్యత ఉన్నవారు రానీయలేదు అనటమే సరిగా ఉంటుంది. కృష్ణానది నీళ్ళ విషయంలో అన్ని వనరుల సంపదల పంపిణీల చర్చ సందర్బం కాదు
వ్యాసాలు

ఒక జిజ్ఞాసి లోతైన ఆలోచనలు

చిరకాల మిత్రుడు రమేష్ పట్నాయక్ తాను రాసిన ఐదు వ్యాసాలను ఒక సంపుటంగా ప్రచురిస్తూ దానికి ముందుమాట రాయమని నన్ను అడగడం ఒక ఆశ్చర్యం. ఈ ఐదు వ్యాసాలలో రెండు నా సంపాదకత్వంలోని ‘వీక్షణం’ లోనే వెలువడినప్పటికీ, ఆ రచనల్లో వ్యక్తమైన రాజకీయావగాహనలతో నాకు ఏకీభావం లేదని కొత్తగా చెప్పనవసరం లేదు. అలా ఏకీభావం లేకపోయినా ప్రగతిశీల శిబిరంలోని అన్ని భావాలనూ, భావఛాయలనూ ఆహ్వానించే ఒక వేదిక సంపాదకుడుగా ఆ వ్యాసాలను ప్రచురించడం వేరు, నేరుగా ఆ రచనల సంపుటానికే ముందుమాట రాయడం వేరు. అయితే ఎంత ఏకీభావం లేని విషయంతోనైనా చర్చ, సంభాషణ, సంవాదం జరపాలని, స్థూలంగా
వ్యాసాలు

దేశవాళీ ప్రాంతీయ ప్రాతినిధ్య కథకుడు సభా

ఇది కె. సభాగారి శత జయంతి సంవత్సరం (01-07-1923  -  04-11-1980) దేశవాళీ గుభాలింపును, రాయలసీమ నుడికారాన్ని మానవ సంబంధాల వైచిత్రిని, పల్లె సొగసులని, సంస్కృతి సంప్రదాయాలని ఆటపాటలని వంటలని, పండుగలని, ప్రకృతి అందాలను ఇలా సమస్తాన్ని తన రచనల్లో అత్యంత హృద్యంగా చిత్రీకరించిన తెలుగు రచయిత కె .సభా గారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా, రైతు ఉద్యమాలలో ప్రత్యక్షంగా ప్రజలు, రైతులు, దళితులు వైపు నిలబడి పోరాడడానికి  పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉపాధ్య వృత్తి నుండి   బయటపడి  పత్రికా రంగాన్ని ఎన్నుకొని ఉద్యమ స్పూర్తితో పాత్రికేయుడుగా, సంపాదకుడిగా ఒక సామాజిక కార్యకర్తగా పనిచేసిన
వ్యాసాలు

పాఠ్య ప్రణాళిక సమస్యలు

పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అంశాల్లో సమస్యలు కొనసాగుతుండగా లేదా తీవ్రతరం అవుతుండగా,  ఇప్పుడు కొత్తగా పాఠ్య ప్రణాళిక సమస్య ముందుకు వచ్చింది. పూర్వ పరాలు పరిశీలిస్తే: 1986 లో ‘‘విద్యలో జాతీయ విధానం 1986’’, దానిననుసరించి 1989లో ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 1989’’ వచ్చాయి. అది ప్రధానంగా కాంగ్రెస్‌ జాతీయ వాదం, కాంగ్రెస్‌ సెక్యులరిజం, కాంగ్రెస్‌ శాస్త్ర దృక్పథంపై ఆధారపడి ఉండిరది. కొన్ని ప్రముఖ ప్రగతిశీల విషయాలు కూడా ఉండినాయి. ఏదేమైనా ఆనాటి విధానాలు భారత రాజ్యాంగ విలువలను స్పష్టంగా పునరుద్ఘాటించి, అట్టి విలువల సాధనకై రూపొందించబడినట్లు ప్రకటించాయి. ఆచరణలో చాలా సమస్యలుండినాయనేది
వ్యాసాలు

ప్రజా యుద్ధకల్పనా రూపం అజ్ఞాత కథ

 (2010 జనవరిలో  మొదటిసారి, 2016  ఫిబ్రవరిలో మరోసారి విరసం పునర్ముద్రించిన *ముప్పై ఏళ్ళ దండకారణ్య సాహితి సాంస్కృతోద్యమ చరిత్ర (1980 -2010) పుస్తకంలో అజ్ఞాత కథ గురించి దండకారణ్య రచయితలు రాశారు. దండకారణ్య సాహిత్య కళా ప్రచార వేదిక ఝన్కార్ గురించీ రాశారు. వియ్యుక్క కథా సంపుటాలు విడుదల అవుతున్న సందర్భంలో అజ్ఞాత విప్ల కథా వికాసాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని ఈ భాగాలను పునర్ముద్రిస్తున్నాం -వసంత మేఘం టీం) దండకారణ్య సమాజంలో ప్రజల జీవితాలతో, ప్రకృతితో ముడిపడిన కథలు కోకొల్లలు. మనిషికీ-ప్రకృతికీ ఉండే సంబంధాలను, ఉత్పత్తి సంబంధాలను తెలిపే కథలు ప్రజలు ఎన్నైనా చెపుతారు. అలాగే
వ్యాసాలు

94 ఏళ్ల ‘గ్రోవ్’ వాసు అరెస్టు-విడుదల

ఏడేళ్ల నాటి కేసులో ఇటీవల అరెస్టయిన 94 ఏళ్ల కేరళ మానవ హక్కుల కార్యకర్త  'గ్రోవ్' వాసు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బెయిల్ తీసుకో నిరాకరించాడు. అనేక మంది న్యాయవాదులు, సహచరులు, పోలీసులు, కార్యకర్తలు జైలుకు వెళ్ళకుండా ఉండటానికి అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కాని వాసు ‘నిరసన అనేది నేరం కాదు’ అనే తన రాజకీయ వైఖరిపై ధృఢంగా నిలబడ్డాడు.   ఎన్‌కౌంటర్ జరిగిన రోజున వాసు మీడియాతో మాట్లాడుతూ, "ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మేము నమ్ముతున్నాము. ఎన్‌కౌంటర్ అరిగిన తరువాత పాత్రికేయులను ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తించింది. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వేరే
వ్యాసాలు

అంతర్లీన సత్యాలను దాచడానికి వాస్తవాలను ఉపయోగించడం

చాలా  సముచితమనిపించే పదాలు మరియు పదబంధాలను శక్తిమంతులు తెలివిగా ఉపయోగించడంలో, ప్రజలను మోసం చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని చూడవచ్చు. ది హత్రాస్ దారుణం, జాతీయ మనస్సాక్షిపై  లేదా దానిలో యింకా ఏదైనా  మిగిలివుంటే  దానిపై బలమైన ముద్ర  వేసింది. సాంఘిక అణచివేతపు అత్యంత క్రూరమైన పార్శ్వాన్ని ప్రజలకు చూపింది.అంతేకాకుండా,  ప్రభుత్వ యంత్రాంగాన్ని నిసిగ్గుగా మరియు నిస్సంకోచంగా అణచివేతదారులకు మద్దఇవ్వడానికి ఉపయోగించడాన్ని ప్రజలు చూశారు. యుక్తవయసులో ఉన్న దళిత బాలికపై అమానుషంగా దాడిచేసి –(  ఆమెను భారతి అని పిలుద్దాం) - చివరికి  చంపడమేగాక, ప్రథమ సమాచార నివేదికనివ్వడంలో కూడా తటపటాయించారు .అంతేగాక, నిర్దయతో  వైద్యపరీక్షను ఆలస్యంజేసారు, మరణవాంగ్మూలాన్ని పరిగణలోకి
వ్యాసాలు

అజ్ఞాత అమర కథా రచయిత్రులు

(*వియ్యుక్క* అంటే గోండిలో వేగుచుక్క. తెలుగు అజ్ఞాత  విప్లవ కథా చరిత్రకు దారులు వేసిన రచయితలు ఎందరో. వాళ్లలో మహిళల పాత్ర గణనీయం. విప్లవంలో  సగానికి పైగా ఉన్న మహిళలు విప్లవోద్యమ చరిత్రలో, విప్లవోద్యమ కథా చరిత్రలో ప్రముఖంగా ఉండటం సహజమే. విస్తారమైన అజ్ఞాత కథా గమనానికి నిజంగానే వేగుచుక్కలవంటి రచయిత్రులు ఉన్నారు. వాళ్ళ సాహసోపేత, సృజనాత్మక, ఆదర్శప్రాయ ఆచరణా రచనా జీవితాన్ని సగౌరవంగా స్మరించుకోకుండా ఈ వియ్యుక్క సంకలనాలు ఎలా తీసుకరాగలం? అలాంటి తొమ్మిదిమంది అమర కథా రచయిత్రుల జీవిత, రచనా విశేషాలను ఈ పుస్తకాల చివర ప్రచురించాం. *వియ్యుక్క*  అందడానికంటే  ముందు వాళ్ళ వివరాలను వసంత మేఘం