వ్యాసాలు

సనాతనవాద సంకెళ్లు తెంచుకుందాం!

క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుండి పశుపాలక ఆర్యులు భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చారు.   ఆ తదనంతర పరిణామ క్రమంలో ఇక్కడ పితృస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. మాతృస్వామ్యం లేదా మాతృప్రధాన సింధూ నాగరికత ఆర్యుల దాడులతో దెబ్బతిని వారి పితృస్వామ్యమే ఇక్కడ క్రమంగా వేళ్లూనుకుంది. అయితే ఆర్యుల దాడులకు దూరంగా కొండ కోనలలో ఉండిపోయిన ఆర్యేతర మూలవాసీ ప్రజలలో మాతృ ప్రధాన లక్షణాలు నేటికీ అవశేషాలుగానైనా మిగిలి ఉన్నాయి. 19 -20వ శతాబ్దాలలో మూలవాసులలోకి బ్రాహ్మణవాదం వేగంగా చొచ్చుకురావడం, మూలవాసీ ప్రజలను బలవంతంగా హైందవీకరించడం జరుగుతోంది. భారతదేశానికి ఆర్యుల వలసతో అంతకు పూర్వపు నాగరికత చరిత్ర
వ్యాసాలు

జతీన్ దా మన స్ఫూర్తి

మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలర్పించిన వేలాది సమరయోధులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ (జతీన్ దా) ఒకరు. ఆయన జైలులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ అమరణ నిరహారదీక్షకు పూనుకొని 63 రోజుల తర్వాత అమరుడైనాడు. ఆయన సంస్మరణలో సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటించడం మన దేశంలో ఒక పోరాట సంప్రదాయంగా నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు కూడ రాజకీయ ఖైదీల హక్కుల దినం సెప్టెంబర్ 13నాడు దేశ వ్యాప్త జైళ్లలోని ఖైదీలు, విచారణలోని ఖైదీలు  సంకల్ప దినంగా పాటించాలనీ. బయట ప్రజలు కూడ
వ్యాసాలు

స్త్రీల కథావికాసపు అత్యున్నత దశ *వియ్యుక్క*

తెలుగులో ఆధునిక కథకు ఆరంభం  1910 లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అని చాలాకాలంగా అనుకొంటూ వచ్చాం. కానీ భిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీలను వెతికి కేంద్రంలోకి తీసుకువచ్చే పూనిక పెరిగిన క్రమంలో 1901 నాటికే కథలు వ్రాసిన భండారు అచ్చమాంబను తెలుసుకోగలిగాం. 1879 నుండి ఆధునిక స్వరూప స్వభావాలను సంతరించుకొంటూ తెలుగు కథ ప్రయాణం ప్రారంభం అయితే ఆ ప్రయాణంలో అడుగులు కలిపిన  తొలి మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల జీవిత చైతన్య వికాసాలకు కేంద్రమైన సంఘ సంస్కరణోద్యమ ఆశయ ప్రచార నిబద్ధత నుండి ఆమె కథలు వ్రాసింది.
వ్యాసాలు

విప్లవ సాంస్కృతికోద్యమం – గద్దర్

జననాట్యమండలి నిర్దిష్ట విప్లవోద్యమ నిర్మాణ సాంస్కృతిక సంస్థ.  నక్సల్బరీ పంథాను రచించిన చారు మజుందర్ నాయకత్వాన్ని స్వీకరించిన సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆట-మాట-పాట అది. ఆ విప్లవ పంథాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవంతో శ్రీకాకుళం సెట్‌బ్యాక్ తర్వాత ఆచరణలో పెట్టాలనుకున్నపుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థగా డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి అనుభవాల వెలుగులో జననాట్యమండలిని రూపొందించింది. అయితే దీనికి ఇతర ప్రజాసంఘాల వంటి కార్యనిర్వాహక, కార్యవర్గ నిర్మాణం లేదు. 1986లో హైదరాబాదులో రాంనగర్‌లో అప్పటి పీపుల్స్ వారి కార్యదర్శి శ్యాం (నల్లా ఆదిరెడ్డి) అరెస్టయినపుడు పెట్టిన రాంనగర్
వ్యాసాలు

హేతువును కూల్చివేయడం

*తమ నేరాలను తప్పించుకోవడం, అస్పష్టత, విక్షేపం, పక్కదారి పట్టించడం(Deflection), తిరస్కరణ లాంటి  వివిధ వ్యూహాలను దత్తత తీసుకోవడాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం* మనుషులకు   హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంవల్ల  యితరులతో  విభిన్నంగా వుంటారు. అయితే, మానవులంతా  హేతుబద్ధoగా వుండటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కానీ, మానవులందరూ ప్రయోజనకరమైన పరిణామాలతో తర్కిస్తారని  అనడం అతిశయోక్తి . హేతువుకు  అనేక విధులు ఉంటాయి. (Reasons have many functions.)  ఒక సాధారణ అవగాహనకు రావడానికి,   ఏకాభిప్రాయ నిర్ణయానికి చేరుకోడానికి  హేతువు సహాయపడుతుంది.  ఈ క్రమానికి  ఏది  సంబంధించిందో , ఏది కానిదో గుర్తించడంలో   హేతువు సహాయపడుతుంది.  మన లోతైన
వ్యాసాలు

ప్రజల ఊసులేని కొత్త చట్టాలు

20 జులై 2023 నుండి వర్తమాన లోకసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలలో అటవీ సంరక్షణ చట్టం, 1980కి గత సంవత్సరం 2022 జూన్‌ 28 నాడు ఆర్దినెన్స్‌ రూపంలో రూపొందించిన అటవీ నియమాలకు చట్ట రూపం ఇవ్వడానికి ఆ బిల్లును మొదట లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ  తరువాత  ఆగస్టు 2నాడు రాజ్యసభలో ఆమోదం పొందడంతో చట్టం ఉనికిలోకి వచ్చింది. చట్టం పూర్వాపరాలు: మన దేశంలో బ్రిటిష్‌ వారి హయాంలో రూపొందిన అటవీ సంరక్షణ చట్టం 1927ను ఆధారం చేసుకొని అధికార మార్పిడి తరువాత అటవీ సంరక్షణ చట్టం, 1980 ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం అడవులను రెండు
వ్యాసాలు

విమర్శనాత్మక దృక్పథం లేకపోతే విప్లవమే లేదు

రచయితలారా మీరెటు వైపు అని శ్రీ శ్రీతో సహా రచయితలను ప్రశ్నించకపోతే విప్లవ రచయితల సంఘమే లేదు. ఆ శ్రీ శ్రీ అయినా ఇరవై సూత్రాల పథకాన్ని పొగుడుతూ కవిత్వం రాసినప్పుడు విరసం ఆయనను సస్పెండ్ చేసింది. అంతెందుకు విప్లవోద్యమంలో ప్రజాపంథాకు, దండకారణ్య ఉద్యమానికి సైద్ధాంతిక బీజాలు నాటి సెట్ బ్యాక్ కు గురైన విప్లవోద్యమాన్ని పునాదుల నుండి నిర్మించిన కొండపల్లి సీతారామయ్యపై కూడా విమర్శనాత్మక దృక్పథం లేకపోతే ఈనాటి విప్లవోద్యమం 1990 ల తరువాత ఏ దిశలో వెళ్ళేదో ఊహకు కూడా అందని విషయం. భారత విప్లవోద్యమానికి ‘లెజెండరీ’గా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ను ఎవరు కాదనగలరు?
వ్యాసాలు

హర్యానాలో ఇళ్ళ కూల్చివేత- కోర్టులో కేసు

హర్యానాలో జూలై 31 హింసాకాండ తరువాత, నూహ్, గురుగ్రామ్ ప్రాంతాలలో ప్రభుత్వం అక్రమ భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లను నడిపింది. 57 ఎకరాలకు పైగా అక్రమ ఆక్రమణను ప్రభుత్వం తొలగించినట్లు చెబుతున్నారు. అయితే, హైకోర్టు ఈ విషయాన్ని గమనించి, బుల్డోజర్ ఆపరేషన్‌పై నిషేధం విధించింది. హర్యానాలోని నూహ్‌లో  జరిగిన హింసాకాండ తర్వాత బుల్డోజర్ చర్యపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు వాయిదా పడ్డాయి. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో హైకోర్టు సుమోటో (స్వయంచాలకం)గా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. దీనిపై 2023, ఆగస్టు 13న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
వ్యాసాలు

చినబోయినలచ్చుమమ్మ కొడుకు

గద్దరన్న ఇక లేడని తెలిసినప్పటి నుండి చాలా బాధగా  వుంది. ఏ పనిలో ఉన్నా ఆయనే తెగ గుర్తుకొస్తున్నాడు. ఆయన గత కొంత కాలంగా విప్లవోద్యమానికి భిన్నమైన  దిశలో పనిచేయడం, తన పాత దృక్పథానికి భిన్నంగా మాట్లాడడం చూస్తున్నాం. ఒకప్పుడు మీడియాలో ప్రచారం కావడానికి ఇష్టపడన కళాకారుడు ఆయన. ఇప్పుడు మీడియాలో ప్రచారానికి అభ్యంతరం చెప్పకపోవడం, ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనని గమనిస్తున్న అభిమానులంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా 2014 నుండి   ఆయన విప్లవ పంథాకు, భౌతికవాద భావాజాలనికి పూర్తిగా స్వస్తి పలికి, పార్లమెంట్ పంథాకి, భావవాదంలోకి మారిపోయాడని సాహసల్  మీడియాలో ఆయన వీడియోల్లో పాటలు, మాటలు
వ్యాసాలు

పోరాట ప్రజల గుండె  డప్పులు

(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ