వ్యాసాలు

హర్యానాలో ఇళ్ళ కూల్చివేత- కోర్టులో కేసు

హర్యానాలో జూలై 31 హింసాకాండ తరువాత, నూహ్, గురుగ్రామ్ ప్రాంతాలలో ప్రభుత్వం అక్రమ భవనాలను కూల్చివేసేందుకు బుల్డోజర్లను నడిపింది. 57 ఎకరాలకు పైగా అక్రమ ఆక్రమణను ప్రభుత్వం తొలగించినట్లు చెబుతున్నారు. అయితే, హైకోర్టు ఈ విషయాన్ని గమనించి, బుల్డోజర్ ఆపరేషన్‌పై నిషేధం విధించింది. హర్యానాలోని నూహ్‌లో  జరిగిన హింసాకాండ తర్వాత బుల్డోజర్ చర్యపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు వాయిదా పడ్డాయి. ఈ కేసు ఇప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో హైకోర్టు సుమోటో (స్వయంచాలకం)గా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. దీనిపై 2023, ఆగస్టు 13న హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
వ్యాసాలు

చినబోయినలచ్చుమమ్మ కొడుకు

గద్దరన్న ఇక లేడని తెలిసినప్పటి నుండి చాలా బాధగా  వుంది. ఏ పనిలో ఉన్నా ఆయనే తెగ గుర్తుకొస్తున్నాడు. ఆయన గత కొంత కాలంగా విప్లవోద్యమానికి భిన్నమైన  దిశలో పనిచేయడం, తన పాత దృక్పథానికి భిన్నంగా మాట్లాడడం చూస్తున్నాం. ఒకప్పుడు మీడియాలో ప్రచారం కావడానికి ఇష్టపడన కళాకారుడు ఆయన. ఇప్పుడు మీడియాలో ప్రచారానికి అభ్యంతరం చెప్పకపోవడం, ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనని గమనిస్తున్న అభిమానులంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా 2014 నుండి   ఆయన విప్లవ పంథాకు, భౌతికవాద భావాజాలనికి పూర్తిగా స్వస్తి పలికి, పార్లమెంట్ పంథాకి, భావవాదంలోకి మారిపోయాడని సాహసల్  మీడియాలో ఆయన వీడియోల్లో పాటలు, మాటలు
వ్యాసాలు

పోరాట ప్రజల గుండె  డప్పులు

(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ
వ్యాసాలు

నిర్ధాక్షిణ్యమైన కార్పొరేటీకరణ, హైందవీకరణ ఫలితం మణిపుర్ విధ్వంసం. 

అమానవీయ మనువాద పర్యవసానం మహిళల నగ్నప్రదర్శన మణిపుర్ లోని కాంగ్పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళల నగ్న ప్రదర్శన, వారిలో 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. ఆమె 56 ఏళ్ల తండ్రిని, 19 ఏళ్ల సోదరున్ని కాల్చి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ప్రదర్శనను చూపుతూ 26 సెకన్ల వీడియో వైరల్ కావడంతో మణిపుర్ లో మనువాదం ఎలా బుసలు కొడుతుందో వెల్లడైంది. యావద్దేశవాసులు ఆ దారుణానికి చలించిపోయారు. విదేశీయులు సైతం నిర్ఘాంతపోయారు. ‘‘కనిపిస్తే కాల్చివేత’’ ఆదేశాలు, 10 వేల మంది అదనపు భారత సైన్యాల మొహరింపు మధ్య ఈ దారుణం జరిగింది. దేశంలోని
వ్యాసాలు

నిజం చెప్పడం నేరమా?

కేరళ పౌరహక్కుల కార్యకర్త అయినూరు వాసుకు జైలు నిర్బంధం కేరళకు చెందిన అయినూరు వాసు పౌరహక్కుల కార్యకర్త. వయసు 94సంవత్సరాలు. ఆయన్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కొజికోడ్‌ న్యాయస్థానం ఆయన్ను 14రోజుల పాటు జైలులో వుంచాలని ఆదేశించింది. ఈయన గ్రో వాసు అనే పేరుతో అందరికీ చిరపరిచితుడు. గ్రో అంటే గ్వాలియర్‌ రేయాన్స్‌ కార్మిక సంస్థ అని అర్థం. ఆ కార్మిక సంఘానికి ఆయన నాయకుడిగా వ్యవహరించేవాడు. తన రాజకీయ భావాల కారణంగా బెయిల్‌ వ్యవహారంలో న్యాయస్థానంతో సహకరించడానికి నిరాకరించాడన్న కారణంగా కామ్రేడ్‌ వాసును జైలుకు పంపారు. 2016 నవంబర్‌లో కొజికోడ్‌ వద్ద కామ్రేడ్‌ కుప్పు దేవరాజ్‌,
వ్యాసాలు

సుప్రీం కోర్టు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి

ఒక రాష్ట్రంలో అలజడి సృష్టించి, అల్లకల్లోలానికి  అనుమతించి, ఆపై కోర్టు ముందు నిలబడి పరిస్థితి అదుపు లో ఉన్నట్లు నటించడం అధికారపార్టీకే చెల్లింది. ఏది ఏమైనా ఈ దారుణహింసకు కారణాలు తెలుసుకోవాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు కు ఉంది. భద్రతా సిబ్బంది శుక్రవారం మణిపూర్ లోని హిల్స్ వ్యాలీ సెక్టార్ లోని సున్నిత ప్రాంతాల్లో  జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న  వీడియోలు మణిపూర్ లోని ఒక సమూహానికి చెందిన మహిళలపై బహిరంగంగా దాడి చేసిన నివేదికలు మతోన్మాద వ్యక్తీకరణలో ఒకటి. భారత అత్యున్నత న్యాయస్థానం ఆలస్యంగా అయినా పరిస్థితి పై స్పందించింది. "మేం తీవ్ర
వ్యాసాలు

మణిపూర్ – మత, కార్పొరేట్  మారణకాండ

“మేరా భారత్ మహాన్ ” ఎవరు కాదంటారు?”దేశం వెలిగిపోతుంది ”ఎవరు ప్రశ్నించగలరు?మనo మహోన్నత భారతీయ సంస్కృతీ పునరుద్దరించాం - మీరు లేదనగలరా? అవును, నాడు నాలుగోడలమధ్య నిండు సభ(నాటి పార్లమెంటు)లో ఒక మహిళను వివస్త్రను చేస్తుంటే హాహాకారాలు, ఆక్రందనలు లేకపోయినా, మౌననిరశన కనపడిండి.  మరిప్పుడు మణిపూర్ లో నట్ట నడివీధిలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తుంటే అప్పటిలాగా కనీసం మౌనం రాజ్యమేలడం లేదు .హాహాకారాలు, ఆక్రందనల బదులు హాహాలు, శభాష్ లు, అదీ తోటి మహిళల నోటివెంట వినపడడం ఎంత పురోగతి? ఇక దేశం మోదీ పాలనలో విశ్వగురు స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే. హిట్లర్ ,ముస్సోలినీలకు మారుపేరైన మోదీ, మణిపూర్
వ్యాసాలు

ఫాసిస్ట్ యుగంలో యూఏపీఏ కేసులు

“నేరమే అధికారమైప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటేఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే” - వరవరరావు  భారతదేశంలోని జాతీయ భద్రతా చట్టాలు సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతిస్తాయి. అయినప్పటికీ, అవి మరింత బలోపేతమవుతూనే ఉన్నాయి. ఎటువంటి న్యాయపరమైన ప్రక్రియను అనుసరించకుండా వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడానికి రాజ్యానికి అనుమతినిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967కు చట్టపరమైన హక్కుల చట్టబద్ధమైన వినియోగాన్ని నిరోధించే, “నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించాలి" అనే ప్రాథమిక భావనను ఉల్లంఘించే సవరణను 2019లో చేశారు.  2023 మార్చి లో, UA(P)A కింద నేరంగా పరిగణించటానికి నిషేధిత సంస్థలో సభ్యత్వం మాత్రమే
వ్యాసాలు

కార్మిక వర్గ మేధావి,  మేటి విప్లవ నాయకుడు ఆనంద్

భారతదేశంలో విప్లవోద్యమం పీడిత తాడిత కులాలకు, వర్గాలకు చెందిన ఎందరినో ప్రజానాయకులుగా, విప్లవ నాయకులుగా తీర్చి దిద్దింది. తరతరాల కుల, వర్గ పీడనలను తుదముట్టించాలని, భారతదేశాన్ని ఒక సుందర సామ్యవాద దేశంగా మార్చాలనే స్వప్నాలను లక్షలాది యువకులు, విద్యార్థులు కనేలా చేసింది నక్సల్బరీ తిరుగుబాటు. ఆ స్వప్నాన్ని కంటూ దాన్ని సాకారం చేసేటందుకు విప్లవ బాట పట్టిన అసంఖ్యాక యువకుల్లో కా. కటకం సుదర్శన్‌ ఒకరు. అలాంటి వారిలోని అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు. నక్సలైట్‌ ఉద్యమ మలి దశలోని తొలి రోజులలోనే 19 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి వచ్చిన కా. సుదర్శన్‌ యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమానికే తన
వ్యాసాలు

బతుక్కి అర్థం చెప్పిన ఆనంద్‌ మరణం

మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నా ఆ బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి. మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్న బెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవాచరణలోకి వెళ్లారు.  అందులో ఒకరు కామ్రేడ్‌   కటకం  సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌. రాష్ట్రంలో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్‌, హైదరాబాద్‌ పట్టణాలలో ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ కోర్సుల కోసం వెళ్లేవారు