వ్యాసాలు

పాఠ్య ప్రణాళిక సమస్యలు

పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అంశాల్లో సమస్యలు కొనసాగుతుండగా లేదా తీవ్రతరం అవుతుండగా,  ఇప్పుడు కొత్తగా పాఠ్య ప్రణాళిక సమస్య ముందుకు వచ్చింది. పూర్వ పరాలు పరిశీలిస్తే: 1986 లో ‘‘విద్యలో జాతీయ విధానం 1986’’, దానిననుసరించి 1989లో ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 1989’’ వచ్చాయి. అది ప్రధానంగా కాంగ్రెస్‌ జాతీయ వాదం, కాంగ్రెస్‌ సెక్యులరిజం, కాంగ్రెస్‌ శాస్త్ర దృక్పథంపై ఆధారపడి ఉండిరది. కొన్ని ప్రముఖ ప్రగతిశీల విషయాలు కూడా ఉండినాయి. ఏదేమైనా ఆనాటి విధానాలు భారత రాజ్యాంగ విలువలను స్పష్టంగా పునరుద్ఘాటించి, అట్టి విలువల సాధనకై రూపొందించబడినట్లు ప్రకటించాయి. ఆచరణలో చాలా సమస్యలుండినాయనేది
వ్యాసాలు

ప్రజా యుద్ధకల్పనా రూపం అజ్ఞాత కథ

 (2010 జనవరిలో  మొదటిసారి, 2016  ఫిబ్రవరిలో మరోసారి విరసం పునర్ముద్రించిన *ముప్పై ఏళ్ళ దండకారణ్య సాహితి సాంస్కృతోద్యమ చరిత్ర (1980 -2010) పుస్తకంలో అజ్ఞాత కథ గురించి దండకారణ్య రచయితలు రాశారు. దండకారణ్య సాహిత్య కళా ప్రచార వేదిక ఝన్కార్ గురించీ రాశారు. వియ్యుక్క కథా సంపుటాలు విడుదల అవుతున్న సందర్భంలో అజ్ఞాత విప్ల కథా వికాసాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని ఈ భాగాలను పునర్ముద్రిస్తున్నాం -వసంత మేఘం టీం) దండకారణ్య సమాజంలో ప్రజల జీవితాలతో, ప్రకృతితో ముడిపడిన కథలు కోకొల్లలు. మనిషికీ-ప్రకృతికీ ఉండే సంబంధాలను, ఉత్పత్తి సంబంధాలను తెలిపే కథలు ప్రజలు ఎన్నైనా చెపుతారు. అలాగే
వ్యాసాలు

94 ఏళ్ల ‘గ్రోవ్’ వాసు అరెస్టు-విడుదల

ఏడేళ్ల నాటి కేసులో ఇటీవల అరెస్టయిన 94 ఏళ్ల కేరళ మానవ హక్కుల కార్యకర్త  'గ్రోవ్' వాసు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బెయిల్ తీసుకో నిరాకరించాడు. అనేక మంది న్యాయవాదులు, సహచరులు, పోలీసులు, కార్యకర్తలు జైలుకు వెళ్ళకుండా ఉండటానికి అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కాని వాసు ‘నిరసన అనేది నేరం కాదు’ అనే తన రాజకీయ వైఖరిపై ధృఢంగా నిలబడ్డాడు.   ఎన్‌కౌంటర్ జరిగిన రోజున వాసు మీడియాతో మాట్లాడుతూ, "ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మేము నమ్ముతున్నాము. ఎన్‌కౌంటర్ అరిగిన తరువాత పాత్రికేయులను ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తించింది. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వేరే
వ్యాసాలు

అంతర్లీన సత్యాలను దాచడానికి వాస్తవాలను ఉపయోగించడం

చాలా  సముచితమనిపించే పదాలు మరియు పదబంధాలను శక్తిమంతులు తెలివిగా ఉపయోగించడంలో, ప్రజలను మోసం చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని చూడవచ్చు. ది హత్రాస్ దారుణం, జాతీయ మనస్సాక్షిపై  లేదా దానిలో యింకా ఏదైనా  మిగిలివుంటే  దానిపై బలమైన ముద్ర  వేసింది. సాంఘిక అణచివేతపు అత్యంత క్రూరమైన పార్శ్వాన్ని ప్రజలకు చూపింది.అంతేకాకుండా,  ప్రభుత్వ యంత్రాంగాన్ని నిసిగ్గుగా మరియు నిస్సంకోచంగా అణచివేతదారులకు మద్దఇవ్వడానికి ఉపయోగించడాన్ని ప్రజలు చూశారు. యుక్తవయసులో ఉన్న దళిత బాలికపై అమానుషంగా దాడిచేసి –(  ఆమెను భారతి అని పిలుద్దాం) - చివరికి  చంపడమేగాక, ప్రథమ సమాచార నివేదికనివ్వడంలో కూడా తటపటాయించారు .అంతేగాక, నిర్దయతో  వైద్యపరీక్షను ఆలస్యంజేసారు, మరణవాంగ్మూలాన్ని పరిగణలోకి
వ్యాసాలు

అజ్ఞాత అమర కథా రచయిత్రులు

(*వియ్యుక్క* అంటే గోండిలో వేగుచుక్క. తెలుగు అజ్ఞాత  విప్లవ కథా చరిత్రకు దారులు వేసిన రచయితలు ఎందరో. వాళ్లలో మహిళల పాత్ర గణనీయం. విప్లవంలో  సగానికి పైగా ఉన్న మహిళలు విప్లవోద్యమ చరిత్రలో, విప్లవోద్యమ కథా చరిత్రలో ప్రముఖంగా ఉండటం సహజమే. విస్తారమైన అజ్ఞాత కథా గమనానికి నిజంగానే వేగుచుక్కలవంటి రచయిత్రులు ఉన్నారు. వాళ్ళ సాహసోపేత, సృజనాత్మక, ఆదర్శప్రాయ ఆచరణా రచనా జీవితాన్ని సగౌరవంగా స్మరించుకోకుండా ఈ వియ్యుక్క సంకలనాలు ఎలా తీసుకరాగలం? అలాంటి తొమ్మిదిమంది అమర కథా రచయిత్రుల జీవిత, రచనా విశేషాలను ఈ పుస్తకాల చివర ప్రచురించాం. *వియ్యుక్క*  అందడానికంటే  ముందు వాళ్ళ వివరాలను వసంత మేఘం
వ్యాసాలు

 ప్రపంచ వర్గ పోరాట సాహిత్యానికి చేర్పు

విస్మరణ, వక్రీకరణలతోపాటు  విధ్వంసమై పోయిన   ఆదివాసుల, దళితుల, బహుజనుల, మహిళల వర్గ పోరాట చరిత్ర, సాహిత్యం సిపాయి తిరుగుబాటుతోనే  తిరిగి  వెలుగులోకి రావడం మొదలైంది .  యూరప్‌లో జరిగిన పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు, పారిస్‌ కమ్యూన్‌, రష్యా, చైనాల్లో జరిగిన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలు ప్రపంచ  పీడిత ప్రజలను ప్రభావితం చేశాయి. 1967 నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి సాయుధ పోరాటాలు చైనా సాంస్కృతిక విప్లవం, గ్రేట్‌ డిబేట్‌ నేపథ్యంలో అర్ధవలస, అర్ధ భూస్వామిక పార్లమెంటరీ దగుల్బాజీ రాజకీయాలతో నలిగిపోయిన పీడితప్రజల ముందుకు విప్లవ శ్రేణులు వర్గపోరాటాన్ని  సాయుధ  రూపంలో బలంగా ముందుకు తెచ్చాయి. పదేండ్ల పోరాట అనుభవసారంతో 1977లో
వ్యాసాలు

సనాతనవాద సంకెళ్లు తెంచుకుందాం!

క్రీ.పూ. రెండు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా నుండి పశుపాలక ఆర్యులు భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చారు.   ఆ తదనంతర పరిణామ క్రమంలో ఇక్కడ పితృస్వామ్యం ఉనికిలోకి వచ్చింది. మాతృస్వామ్యం లేదా మాతృప్రధాన సింధూ నాగరికత ఆర్యుల దాడులతో దెబ్బతిని వారి పితృస్వామ్యమే ఇక్కడ క్రమంగా వేళ్లూనుకుంది. అయితే ఆర్యుల దాడులకు దూరంగా కొండ కోనలలో ఉండిపోయిన ఆర్యేతర మూలవాసీ ప్రజలలో మాతృ ప్రధాన లక్షణాలు నేటికీ అవశేషాలుగానైనా మిగిలి ఉన్నాయి. 19 -20వ శతాబ్దాలలో మూలవాసులలోకి బ్రాహ్మణవాదం వేగంగా చొచ్చుకురావడం, మూలవాసీ ప్రజలను బలవంతంగా హైందవీకరించడం జరుగుతోంది. భారతదేశానికి ఆర్యుల వలసతో అంతకు పూర్వపు నాగరికత చరిత్ర
వ్యాసాలు

జతీన్ దా మన స్ఫూర్తి

మన దేశ స్వాతంత్ర్యం కోసం తమ అమూల్యమైన ప్రాణాలర్పించిన వేలాది సమరయోధులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ (జతీన్ దా) ఒకరు. ఆయన జైలులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన విప్లవకారులందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ అమరణ నిరహారదీక్షకు పూనుకొని 63 రోజుల తర్వాత అమరుడైనాడు. ఆయన సంస్మరణలో సెప్టెంబర్ 13ను రాజకీయ ఖైదీల హక్కుల పోరాట దినంగా పాటించడం మన దేశంలో ఒక పోరాట సంప్రదాయంగా నిలిచింది. ఎప్పటిలాగే ఈ యేడు కూడ రాజకీయ ఖైదీల హక్కుల దినం సెప్టెంబర్ 13నాడు దేశ వ్యాప్త జైళ్లలోని ఖైదీలు, విచారణలోని ఖైదీలు  సంకల్ప దినంగా పాటించాలనీ. బయట ప్రజలు కూడ
వ్యాసాలు

స్త్రీల కథావికాసపు అత్యున్నత దశ *వియ్యుక్క*

తెలుగులో ఆధునిక కథకు ఆరంభం  1910 లో గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు అని చాలాకాలంగా అనుకొంటూ వచ్చాం. కానీ భిన్న సామాజిక సాహిత్య సాంస్కృతిక రంగాలలో చరిత్ర అంచులకు నెట్టివేయబడిన స్త్రీలను వెతికి కేంద్రంలోకి తీసుకువచ్చే పూనిక పెరిగిన క్రమంలో 1901 నాటికే కథలు వ్రాసిన భండారు అచ్చమాంబను తెలుసుకోగలిగాం. 1879 నుండి ఆధునిక స్వరూప స్వభావాలను సంతరించుకొంటూ తెలుగు కథ ప్రయాణం ప్రారంభం అయితే ఆ ప్రయాణంలో అడుగులు కలిపిన  తొలి మహిళ భండారు అచ్చమాంబ. స్త్రీల జీవిత చైతన్య వికాసాలకు కేంద్రమైన సంఘ సంస్కరణోద్యమ ఆశయ ప్రచార నిబద్ధత నుండి ఆమె కథలు వ్రాసింది.
వ్యాసాలు

విప్లవ సాంస్కృతికోద్యమం – గద్దర్

జననాట్యమండలి నిర్దిష్ట విప్లవోద్యమ నిర్మాణ సాంస్కృతిక సంస్థ.  నక్సల్బరీ పంథాను రచించిన చారు మజుందర్ నాయకత్వాన్ని స్వీకరించిన సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆట-మాట-పాట అది. ఆ విప్లవ పంథాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవంతో శ్రీకాకుళం సెట్‌బ్యాక్ తర్వాత ఆచరణలో పెట్టాలనుకున్నపుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థగా డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి అనుభవాల వెలుగులో జననాట్యమండలిని రూపొందించింది. అయితే దీనికి ఇతర ప్రజాసంఘాల వంటి కార్యనిర్వాహక, కార్యవర్గ నిర్మాణం లేదు. 1986లో హైదరాబాదులో రాంనగర్‌లో అప్పటి పీపుల్స్ వారి కార్యదర్శి శ్యాం (నల్లా ఆదిరెడ్డి) అరెస్టయినపుడు పెట్టిన రాంనగర్