వ్యాసాలు

ప్ర‌మాద‌క‌ర‌మైన వికసిత్ భారత్

1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత సుమారు 8 దశాబ్దాల గణతంత్ర రాజ్యంలో సుమారుగా 58 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 21 సంవత్సరాలు కాంగ్రేసేతర పార్టీల కూటములు  భారతదేశంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఆర్ఎస్ఎస్ భావజాల బిజెపి కూటమి 18 సంవత్సరాలు పాలన సాగిస్తూ నేడు వారే అధికారంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పంచవర్ష ప్రణాళికలు, జమీందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, సంస్థానాల విలీనం, భూ సంస్కరణలు, గరీబీ హటావో మొదలగు వాటిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది.1975 ఎమర్జెన్సీ తదనంతర  పరిణామాలలో ముఖ్యంగా 
వ్యాసాలు

లొంగిపోయినా త‌ప్ప‌ని దాడులు,  దర్యాఫ్తులు  

Figure 1 ఉపర్పరలోని భీమా మాద్వి ఇంటి బయట రేఖపల్లి వాసులు డిసెంబర్ 4న, రేఖపల్లి గ్రామంలో భద్రతా బలగాలు తీసుకువెళ్తున్నప్పుడు భీమా మాడ్వీని అతని కుటుంబ సభ్యులు చివరిసారిగా చూశారు. మూడు రోజుల తర్వాత, వాట్టేవాగు దగ్గర ఉన్న  సెక్యూరిటీ క్యాంపులో ఒక మంచంపైన చనిపోయి ఉండటాన్ని అతని బంధువు సుక్రామ్ మాడ్వీ గమనించాడు. 46 ఏళ్ల భీమా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే, భద్రతా బలగాలు కొట్టి చంపి ఉంటాయని  అతని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఉసూర్ బ్లాక్‌లో ఉన్న రేఖపల్లి, వాట్టేవాగు గ్రామాల మధ్య  సుమారు మూడు కిలోమీటర్ల
వ్యాసాలు

నా జీవితానికి దారి దీపాలు – రాఘ‌వ‌

బాగా రాసే వారు కాదు, బాగా చదివేవారే బాగా లోతుగా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలుగుతారు. బాగా చదివే వారే బాగా రాయగలుగుతారు. మంచి పుస్తకం మనిషి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతుంది. కొత్త చూపునిస్తుంది కొత్త ఆలోచనలను ఇస్తుంది ,ఆచరణ దిశగా చైతన్యవంతంగా నడిపిస్తుంది. మంచి పుస్తకం మాట్లాడుతుంది. మాట్లాడనిస్తుంది. అక్షరానికి గొంతు నిస్తుంది. * తెలుగు సమాజాలకు అవసరమైన ఎన్నో విలువైన వ్యాసాలను తెలుగులో నేరుగాను ,అనువాదం ద్వారానూ అందిస్తున్న రాఘవ కొత్త పుస్తకం 'ప్రశ్నించే గొంతులు'. ఈ పుస్తకం సోమవారం తిరుపతిలో ఆవిష్కరించబడుతుంది.  'మాట్లాడే పుస్తకాలు శీర్షికన'  పుస్తకాల గురించి తన అభిప్రాయాలను వసంతమేఘం కోసం అందించారు రాఘవ.
వ్యాసాలు

ఫాసిస్ట్ యుగంలో యూఏపీఏ కేసులు

“నేరమే అధికారమైప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటేఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే” - వరవరరావు  భారతదేశంలోని జాతీయ భద్రతా చట్టాలు సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా వ్యక్తులను అరెస్టు చేయడానికి అనుమతిస్తాయి. అయినప్పటికీ, అవి మరింత బలోపేతమవుతూనే ఉన్నాయి. ఎటువంటి న్యాయపరమైన ప్రక్రియను అనుసరించకుండా వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడానికి రాజ్యానికి అనుమతినిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967కు చట్టపరమైన హక్కుల చట్టబద్ధమైన వినియోగాన్ని నిరోధించే, “నేరం రుజువయ్యే వరకు నిర్దోషిగా భావించాలి" అనే ప్రాథమిక భావనను ఉల్లంఘించే సవరణను 2019లో చేశారు.  2023 మార్చి లో, UA(P)A కింద నేరంగా పరిగణించటానికి నిషేధిత సంస్థలో సభ్యత్వం మాత్రమే
వ్యాసాలు

వి. ప్రతిమ, సుంకర గోపాలయ్య , పల్లిపట్టు నాగరాజు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు. పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా
వ్యాసాలు

ప్రజా ఉద్యమాలు – రాజ్యాధికార ప్రాసంగికత

"సేవ్ ఆరావళి" ఉద్యమం ఉత్తర భారత దేశంలో పెద్ద ఎత్తున జరిగి లక్షలాదిమంది ప్రజలు పాల్గొని, ఆ ఉద్యమం తాకిడికి కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు కూడా దిగి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలలో సాయుధ పోరాటయేతర ఉద్యమాల పట్ల విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం విజయాల పట్ల కూడా ప్రస్తావనలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన చర్చల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, "భారతదేశంలో సాయుధ పోరాటాలు యొక్క ప్రాసంగికత ఏమిటన్న అంశం ప్రధానంగా చర్చనీయాంశం అయింది." అయితే ఇక్కడ సేవ్ ఆరావళి, ఢిల్లీ రైతు ఉద్యమం అన్నవి
వ్యాసాలు

కార్మిక వర్గ మేధావి,  మేటి విప్లవ నాయకుడు ఆనంద్

భారతదేశంలో విప్లవోద్యమం పీడిత తాడిత కులాలకు, వర్గాలకు చెందిన ఎందరినో ప్రజానాయకులుగా, విప్లవ నాయకులుగా తీర్చి దిద్దింది. తరతరాల కుల, వర్గ పీడనలను తుదముట్టించాలని, భారతదేశాన్ని ఒక సుందర సామ్యవాద దేశంగా మార్చాలనే స్వప్నాలను లక్షలాది యువకులు, విద్యార్థులు కనేలా చేసింది నక్సల్బరీ తిరుగుబాటు. ఆ స్వప్నాన్ని కంటూ దాన్ని సాకారం చేసేటందుకు విప్లవ బాట పట్టిన అసంఖ్యాక యువకుల్లో కా. కటకం సుదర్శన్‌ ఒకరు. అలాంటి వారిలోని అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు. నక్సలైట్‌ ఉద్యమ మలి దశలోని తొలి రోజులలోనే 19 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి వచ్చిన కా. సుదర్శన్‌ యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమానికే తన
వ్యాసాలు

బతుక్కి అర్థం చెప్పిన ఆనంద్‌ మరణం

మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నా ఆ బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి. మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్న బెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవాచరణలోకి వెళ్లారు.  అందులో ఒకరు కామ్రేడ్‌   కటకం  సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌. రాష్ట్రంలో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్‌, హైదరాబాద్‌ పట్టణాలలో ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ కోర్సుల కోసం వెళ్లేవారు
వ్యాసాలు

మాట్లాడే పుస్తకాలు

పుస్తకాలను చదవకుండా పుస్తకాలను  తాకకుండా చాలామందికి ఒక్కరోజు కూడా గడవదు.పగలంతా పనులతో బాధ్యతలతో అటు ఇటు తిరుగుతూ గడిపేసినా, ఎంత రాత్రయినా సరే, కొన్ని పేజీలైనా చదవటం, ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఎంపిక చేసుకుని వెతికి పెట్టుకున్న పుస్తకాన్ని చదవటం కొందరికి అలవాటు. ఈ ప్రపంచంలో పుస్తకాలు చదవడానికి నిర్ణీత సమయం అంటూ లేదు. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా పుస్తకాలు చదవడానికి అలవాటు పడిన వాళ్లే. చాలామందికి పుస్తకాలను దాచి పెట్టుకోవడం అలవాటు. కానీ చాలా కొంతమంది మాత్రమే తాము చదివిన తర్వాత పుస్తకాలను ఇతరులకు చదవడానికి ఇచ్చేస్తారు. చదివిన తర్వాత వాళ్లు కూడా అలా..
వ్యాసాలు

వందేళ్ల ఆర్‌ ఎస్‌ ఎస్‌ కుట్ర- జైలుపాలయిన రాజకీయ ఖైదీలు

జులై 2 చెరబండరాజు అమరత్వం రోజు విరసం ఆవిర్భావసభ  సంఘపరివార్‌ వందేళ్ల ఫాసిజం పై సాంస్కృతిక ప్రతిఘటనా వ్యూహం ప్రకటించే ప్రతిజ్ఞ తీసుకోవడం చాల అర్థవంతంగా ఉంది. ఆయన విరసంలో తన కవిత్వం ద్వారా రచనల ద్వారా ‘ఏ కులమబ్బీ మాది ఏ మతమబ్బీ’ , ‘జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త’ వంటి పాటలు, కవితల ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో తలపడినాడు. జీవితాచరణలో ప్రతిఘటించాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు విరసం, మరికొందరు విప్లవ పార్టీల,  ప్రజాసంఘాల కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి డిటెన్యూలు అందరినీ ఒకే ఆవరణలో ఉంచారు. అట్లా దేశభక్తులను, దేశద్రోహులతో కలిపి ఉంచడాన్ని టైగర్‌