ఎరుకల కథలు

అదే ప్రశ్న

ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని  పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే  ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది. మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ? ముగ్గురు
సంభాషణ

వియ్యుక్క వెలుగులో మరికొంత ముందుకు

వియ్యుక్క సంకలనాలను ఆదరిస్తున్న పాఠకులకు విప్లవాభినందనలు తెలియజేస్తూ మరికొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను. ముందుగా సంకలనాలలో దొర్లిన కొన్ని పొరపాట్లను, కొత్తగా అందిన సమాచారం  వల్ల గుర్తించిన వాటిని పాఠకుల దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధక విద్యార్థులు, ఒక విద్యార్థిని తమ థీసిస్ విషయవస్తువుకు ప్రధాన వనరుగా వియ్యుక్క సంకలనాలను స్వీకరించామని మరింత సమాచారం కోసం సంపాదకురాలిని సంప్రదించారు. నేటి తరం యువతను వియ్యుక్క సంకలనాలు ఆకర్షించటం, వారి బాధ్యతగా వారు విప్లవ సాహిత్యంలో మరింత సూక్ష్మ పరిశోధనలు చేపట్టటం చాలా సంతోషించవలిసిన విషయం. వారికి, వారిని ప్రోత్సహిస్తున్న ఆచార్యులకు విప్లవాభివందనాలు.  ఇటువంటి పరిశోధనలను
వ్యాసాలు

రాజకీయాలు – సామాజిక మాధ్యమం

రాజకీయ, సాంస్కృతిక వ్యక్తీకరణలో  చొరబడిన ‘సామాజిక మాధ్యమం’ అనేక మానవీయ విషయాలలో గందరగోళం సృష్టిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియా ప్రజల ఆలోచనాధారలోకి ప్రవేశించింది. ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయంగా మనిషి చేతికి సామాజిక మాధ్యమం అంది వచ్చింది. సృజనాత్మక అభినివేశం గల మానవుల సాంస్కృతిక, రాజకీయ వికాసపు వ్యక్తీకరణకు సోషల్‌ మీడియా ఆలంబనగా నిలిచింది. పదేళ్ల కాలంలో సోషల్‌ మీడియా భారత సమాజంపై తనదైన ముద్ర వేయగలిగింది. మన ఇంటి పక్క అమ్మాయి, లేదా అబ్బాయి తమకున్న సృజనాత్మతతో లక్షలాది వీవర్స్‌ను సంపాదించకోగలుగుతున్నారు. కొందరికి ఆర్ధిక వనరయింది కూడా.  సోషల్‌ మీడియాకు సమాజమే ప్రతిబింబం. దిన పత్రికలను,
కవిత్వం

అన్యాయం

బంగారు డేగ వర్ణంలోనే బంగారంవనరులున్నా ఉన్మాదం కోరల్లో విలవిలతన భూభాగం కోసమే తాను శ్రమిస్తూ ఆశ్రయం కోసం ఎంతో దూరం వెళ్తుంటేఊసురోమని నీరసిస్తుంటేకాసింత ఊరట కోసం జానెడు చోటు కోసంవెంపర్లాడుతుంటే ఉసూరమనిపిస్తుంది జామ్ మీనార్ సాక్షి గాచుకర్ పార్ట్రిడ్జ్ హిమాలయాల్లోనేబతకగలదుఅది ఆ సరిహద్దు నుండి రాలేదువచ్చిందంటే బతుకు మృగ్యమైతేనేఅక్కున చేర్చుకునే నేల కోసంనెలవంక ను వేడుకుంటుంది షాలిమార్ ఉద్యాన వనంలోఅడవి కోడి సెంబగం పోరులో సెంబగం అలసిపోయి అడుగులు నెమలివైపు యల్పనం మీదుగాసేదతీర దారులు మూసుకుపోయాయిప్రజాస్వామ్యం అంపశయ్య పై నుండగాబూడిద నెమళ్ళు పడవల్లో సకల కష్టాలతోఘోష వినలేక ఇర్రవాడ జీవం కోల్పోగానెమలి పంచన ఒదిగితేతరిమే నయా మత స్వామ్యం
కీనోట్

ఆదివాసీ పరిరక్షణకు ఐక్య వేదిక ఏర్పాటుకు ప్రయత్నిద్దాం

(మధ్య భారతదేశంలో ఆదివాసులపై ప్రభుత్వ బలగాల హత్యాకాండ కు వ్యతిరేకంగా  ఐక్య కార్యాచరణ సన్నాహాల్లో భాగంగా  25, శనివారం ఉదయం 10 గంటలకు, హైదరాబాదులో ని సుందరయ్య విజ్ఞానకేంద్రం, షోయబ్ హాల్లో   ఏర్పాటు చేసిన సమావేశంలో  పౌరహక్కుల సంఘం ప్రవేశపెట్టిన కీనోట్ ) మితృలారా.. ఆదివాసులకు భారత రాజ్యాంగం హామీ పడిన హక్కులు తీవ్రమైన సంక్షోభంలో పడిపోయాయి. అడవి, సహజ వనరులు, పర్యావరణం, ఆదివాసుల జీవనోపాధులతో సహా వాళ్ల జీవించే హక్కును సహితం భారత ప్రభుత్వం  ఉల్లంఘిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పీడిత సమూహాలన్నిటి రక్షణ కోసం అనేక ప్రత్యేక చట్టాలను రాజ్యాంగం ప్రకటించింది. ఇందులో ఆదివాసల