సంపాదకీయం

అనాగరిక అన్యాయ నేర చట్టాలు

ఇంకో అయిదు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా బిజెపి ప్రభుత్వం భారతదేశ క్రిమినల్‌ చట్టాలను మారుస్తూ పార్లమెంటులో బిల్లు పాస్‌ చేసుకుంది. అప్పుడు 143 మంది సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదు. ప్రజా జీవితాన్ని ఎంతగానో శాసించే ఈ చట్టాల కోసం ప్రజాభిప్రాయాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు. కనీసం న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన పాత ప్రభుత్వానికి మూడొంతుల మెజారిటీ లేదు. కనుక ప్రతిపక్ష సభ్యుల మద్దతు లేకుండా చట్టాలు చేయలేదు. అయితే దానికి మెజారిటీ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మూడు నేర చట్టాలు జులై 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ
లోచూపు

మన కాలపు యుద్ధ సంక్షోభ విశ్లేషణ

 ఏ పోరాటమైనా ఒకానొక నిర్దిష్ట స్థలంలో, కాలంలో జరుగుతుంది. కాబట్టి అది తత్కాలీనమే. కానీ అన్ని పోరాటాలు తత్కాలీనమైనవి మాత్రమే కావు. ఉదాహరణకు నాటి నక్సల్బరీ, నేటి దండకారణ్య ఆదివాసీ పోరాటాలు ఆ కోవలోకే వస్తాయి. ఎందుకంటే-అవి స్వీయ అస్తిత్వ పోరాటాలు మాత్రమే కావు. యావత్ సామాజిక ఉమ్మడి అస్తిత్వం కోసం, సమూలమైన సామాజిక పరివర్తన కోసం జరిగే పోరాటాలవి. కనుక అవి తత్కాలీనత్వాన్ని అధిగమించి ఆగామీ పోరాటాలుగా, భవిష్యత్కాల పోరాటాలుగా, భవిష్యత్ ప్రపంచాన్ని నిర్మించేవిగా నిరంతర పురోగమనం లో ఉంటాయి . విపులీవోద్యమాన్ని లాంటి నేపథ్యంలో చూడాలి . అందుకే మధ్య భారతంలో ఆదివాసులపై ప్రభుత్వం  చేస్తున్న
నివేదిక

సునీతా పొట్టంను ఎందుకు అరెస్ట్ చేశారు ? 

బస్తర్ ఆదివాసీ  హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడితే జైలుకు పంపిస్తారు - ఎందుకని? తమ నీరు, అడవి, భూమిపైన  ఆదివాసులకు  హక్కు వుంది. కానీ అడవి చెట్లను నరికివేయవద్దంటే,  సహజ నదులను కలుషితం చేయవద్దంటే, తమ పూర్వీకుల భూమి నుండి వెళ్లగొట్టడానికి వీల్లేదనిఅంటే  ఆదివాసులను  అభివృద్ధి వ్యతిరేకులని అంటారు. ఈ అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు పోలీసు బలగాల క్రూర ప్రయోగానికి వ్యతిరేకమగా మాట్లాడితే మావోయిస్టులని,  మావోయిస్టుల మద్దతుదారులని  ప్రకటించి ఖైదు చేస్తారు. సునీతా పొట్టం యిందుకు ఒక ఉదాహరణ. ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ప్రభుత్వమూ, పాలనాయంత్రాంగం దృష్టిలో నేరస్థులేనని ఆమె అరెస్టు స్పష్టం
కరపత్రాలు

కా. గంటి ప్రసాదంగారి 11వ వర్ధంతి సందర్భంగా..

కార్పొరేట్‌ హిందుత్వ కగార్‌ యుద్ధాన్ని ఎదిరిద్దాం భారత విప్లవోద్యమానికి అండగా నిలబడదాం సంస్మరణ సభ జూలై 6 శనివారం ఉదయం 11 గంటల నుంచి, బొబ్బిలి కా. గంటి ప్రసాదంగారు అమరుడై పదకొండేళ్లు. ఆయన నక్సల్బరీ చైతన్యంతో ఉత్తరాంధ్రలో సుదీర్ఘకాలం వివిధ రంగాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించారు. విప్లవ పార్టీల ఐక్యతా క్రమంలో   అజ్ఞాత విప్లవోద్యమంలోకి వెళ్లారు. 2015లో అరెస్టయ్యాక జైలు జీవితం గడిపి విడుదలయ్యారు. అప్పటి నుంచి తిరిగి బహిరంగ ప్రజాపోరాటాల్లో భాగమయ్యారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడిగా విప్లవ భావజాల ప్రచారానికి కృషి చేశారు. వివిధ రంగాల్లో ప్రజాస్వామిక పోరాటాలు నిర్మించేందుకు ప్రయత్నాలు చేశారు. విప్లవోద్యమానికి
కవిత్వం

ఏమి మాట్లాడగలను వీటి గురించి

అక్కడ యుద్ధాలు రక్తపు ఎరులైపారుతున్నాయి కూలిన నిర్మాణాలమధ్య నలిగిన పసిహృదయాలసంగతి నేను రాయలేను..బాంబుల శబ్దంలో కలిసిపోయినఆర్తనాదాల గురించి ఏం చెప్పమంటావ్?అల్లారు ముద్దుగా ఆటలాడే బిడ్డలుశవాలుగా స్మశానానికి సాగనంపుతుంటే నేనేం మాట్లాడగలనుఅక్కడ శ్వాసలు ఆగిపోయాయిప్రాణాలు వాయువులో కలిసిపోయాయిఇప్పుడు బిడ్డలు అమ్మేదని అడిగితేసమాధానం ఎవరు చెప్పాలి నాన్నెక్కడ అని అడిగితే సమాధానంఏమని చెప్పాలిఅక్కడ గాయాలు లేకుండాబయటపడిన వారెవరులేరు హృదయానికో, శరీరానికో తుపాకీ తూట్లు దిగుతూనే ఉన్నాయి.
కవిత్వం

కొత్తగా నిర్మించుకున్న నేను

రాతన్నాక అప్పుడప్పుడులోకాన్ని నగ్నపరచి రాయాలనగ్నంగా విన్న దాన్ని వాస్తవీకరించాల్ననలిగిన దేహాల్నిమాటల్ని గాకసరికొత్త వాక్యం పుట్టించాల్నకోపమొస్తే కొవ్వొత్తిలా కరిగిఅగ్నిలా వెలుగొందాల్న నిప్పులు చిమ్మాల్న చపాతిముద్దలా పిసకబడ్డ కోమల జీవితాలను వర్ణించాల్న నీవొకకొత్త వాక్యాన్ని నిర్మించావంటేనువ్వొక నూతన రూపం ధరించాల్సిందే మట్టి పిసికినప్పుడల్లా నూతన రూపంధరించలేదా..?మనిషి మనిషి కానప్పుడు మట్టే కదా.!నీచేతిలో ఎదిగినాక్షరాలుకూసింతమందికైనా గొడుగుపట్టాలసెగలుగక్కే డ్రైనోసర్ల నుంచి పీడుతుల్ని రాసిన పదాల ధైర్యంతో వారిచుట్టూరాఒక్కొక్క ముళ్ళకంచయి వలయాన్ని చుట్టాల్నఅధికార మొత్తు మేఘాల్నిపదాల ఉరుముల్తో కిందాకి దించాల్నా.ఒక్కొక్క పాదంలో నువ్వొక కొత్తప్రాణిలాజన్మించాలా.పదాల్లో జీవించాలాపదాల్ని జీవింపచేయాలతొలకరి జల్లుల తాకిడికి విత్తు వికసించినట్లుపాఠకునిలోభిన్నత్వాన్ని విసర్జించి ఏకత్వాన్ని బోధించాల్నా.కవిత్వమంటే అంతరాల్లో మధించి మధనపర్వతం నుండొప్పోంగే లావానే కదాకవి
కవిత్వం

య్య..స్..

య్యస్ ... మీరు నన్నునక్సలైటు కొడుకనిఅన్నప్పుడల్లా ....నా కాలర్ ఎర్రజండాలా ఎగురుతుంది.! *** అర్బన్ నక్సలైటు అనివేలెత్తి చూపినప్పుడల్లాఆత్మవిశ్వాసంతోతిరగబడుతున్న దండకారణ్యపిడికిళ్ల రూపమవుతా ! ***నన్ను నాస్తికుడనిమీరు నవ్వినప్పుడుమీ నవ్వే చెప్పింది ...నాస్తికత్వం మనిషికినవ్యానంద జీవన మార్గమని !
ఆర్ధికం

డీ-డాలరైజేషన్

మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం 1920ల నుండి అమెరికా డాలర్‌, బ్రిటన్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ను అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా   స్థానభ్రంశం చేయడం ప్రారంభించింది. యుద్ధం తర్వాత బంగారం ప్రవాహాలలో అమెరికా గణనీయమైన గ్రహీతగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరింత బలమైన సూపర్‌ పవర్‌గా అవతరించింది.1944 నాటి బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థాపించింది. దీంతో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోని ప్రాథమిక రిజర్వ్‌ కరెన్సీగా మారింది. యుద్ధానంతర కరెన్సీ బంగారంతో ముడిపడి ఉన్న ఏకైక అంతర్జాతీయ కరెన్సీ, ట్రాయ్‌ ఔన్సుకు 35 డాలర్లుగా స్థిరీకరించింది.
వ్యాసాలు

సోషలిస్టు సమాజ విజయాలు: విద్య – ఉపాధి

నేడు మన నిరుద్యోగ యువత ప్రభుత్వం ఉపాధి కల్పించమని రోడ్లపైకి వస్తే పోలీసుల లాఠీదెబ్బలు తిని చేసి జైలుకు వెళ్లాల్సి వస్తున్నది . కానీ కేవలం ఏడు దశాబ్దాల క్రితం, పూర్తిగా యిందుకు భిన్నంగా పాలన ఉన్న దేశాలు ఉన్నాయి. అంటే, మీరు పని లేదా ఉద్యోగం చేయకూడదనుకుంటే, మిమ్మల్ని అరెస్టు చేసి 'లేబర్ క్యాంపు'లో శ్రమ చేయడానికి పంపిస్తారు. మీరు పరాన్నజీవి వర్గానికి  చెందినవాళ్ళు కాబట్టి  మీరు పని చేయకూడదని అనుకుంటున్నారని భావిస్తారు. ఈ దేశాల్లో, 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలందరికీ ఉపాధి హామీ వుండింది. ఈ దేశాలను సోషలిస్టు దేశాలు అని పిలిచేవారు, ఆ
ఎరుకల కథలు

దేనికీ భయపడొద్దు

“ దీన్ని టీ అంటారా ?  ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది. పైకి గట్టిగానే  అంటున్నట్లున్నా  ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి,  కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ  గొంతులో ఏదో మొహమాటం, బెరుకు. నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని  బెరుగ్గా  “ స్టీల్ గ్లాస్ లోనే టీ  ఇవ్వు రెడ్డీ , వేడిగా  వుంటుందని ఎన్నోసార్లు చెప్పింటా.  అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ ..  ” అంటున్నాడు