మీరీ పుస్తకం చదివారా ?

దేహం కూడా పొయ్యిలాంటిదే..

దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి
వ్యాసాలు

ఛత్తీస్గఢ్లో ‘చట్టవ్యతిరేక’ కార్యకలాపాలు

ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద ( సిఎస్‌పిఎస్ఎ) మూలవాసి బచావో మంచ్ (ఎంబిఎమ్)ని 'చట్టవ్యతిరేకమైన సంస్థ'గా ప్రకటిస్తూ 2024నవంబర్ 8 నాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది . చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం (యుఎపిఎ)- 1967 లాగానే, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం భావించే  సంస్థలను నిషేధించడానికి సిఎస్‌పిఎస్ఎ ప్రభుత్వానికి అధికారాన్నిస్తుంది. ఈ చర్య చేపట్టడానికి ఆ  నోటిఫికేషన్ రెండు కారణాలను పేర్కొంది: ఒకటి, "మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల "లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మంచ్ వ్యతిరేకిస్తోంది;  రెండు, తమ భూముల్లో సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తోంది.
సమకాలీనం

ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థల బహిష్కరణ

"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్,
ఆర్ధికం

‘బేరు’ మంటున్న రూపాయి

విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా... పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది.