సమీక్షలు

అన్ని వైపులలో రాయలసీమ

ముందుగా పాఠకులకు విజ్ఞప్తి. మీరు చదవబోతున్నది పాణి నవల ‘అనేక వైపుల’పై విమర్శ  కాదు, కనీసం సమీక్ష కాదు. ఇది కేవలం ఒక సామాన్య పాఠకుని  హృదయ స్పందన మాత్రమే. ఎన్నడూ ఏ పుస్తకాన్ని పూర్తయ్యంత వరకు ఒకే మారు చదివే అలవాటు లేని నన్ను, ఈ నవల దాన్ని పూర్తి చేసేంతవరకు మరో పుస్తకాన్నే కాదు, కంప్యూటర్‌ జీవిగా బతికే నన్ను దానికీ దూరం చేసింది. అంత లావు నవల ఎలా చదువుతానా? అనుకున్న నన్ను దానికి కట్టిపడేసాడు పాణి. దానికి కేవల ఆ నవల శిల్పం కారణం కాదు. అందులోని సారమే నన్ను కట్టి పడేసింది.
సంపాదకీయం

ఈ యుద్ధంతో చరిత్ర సమాధానపడుతుందా ?

ఇది చివరి అంకమని, అంతులేని నష్టమని అనేక వ్యాఖ్యానాలు ఒక పరంపరగా వస్తున్నాయి.    ఈ విషయాన్ని హృదయగతం చేసుకున్నవారు  బహువిధాలుగా స్పందించవచ్చు. ఈ దుఃఖ తీవ్రతకు కాస్త విరామం దొరికాక    మనుషులు తమదైన సమయాలలోకి వెళ్ళిపోతారు.  అమరత్వం చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయి నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . మానవ పోరాటమంతా ఇలానే నడిచింది .   మనుషులు ఎండిన ఆకులలా రాలిపోతారు . నాలుగు దశాబ్దాలుగా విప్లంలో భాగమైనవారు , అడవితో  స్నేహం చేసినవారు, అరణ్యం తమదే అనుకున్నవారు, ఒక నిర్మాణంలో ఉన్నవారు హఠాత్తుగా కాలంలో కలిసిపోతారు .  ఇవాళ చాలా అభిప్రాయాలు వస్తున్నాయి. కాలం చెల్లిన పోరాటం
పత్రికా ప్రకటనలు

‘ఏ దేశము తన పౌరులనుతానే చంపుకోకూడదు’

మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు  సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి. అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా
కరపత్రాలు

విరసం 24వ సాహిత్య పాఠశాల కరపత్రంసంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్రకా. సాయిబాబా సందర్భం

ఈసారి సాహిత్య పాఠశాల ఇతివృత్తం ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారులు’. ఇటీవలే మనకు దూరమైన ప్రియతమ కామ్రేడ్‌, కవి , విప్లవ మేధావి ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా తన జీవితంతో, మరణంతో రగిలించిన ఉత్తేజమూ, సమాజంపైకి సంధించిన చురుకైన ప్రశ్నలూ ఒక కొత్త సందర్భాన్ని మన ముందుకు తీసుకొచ్చాయి. సంకెళ్లలోనే స్వేచ్ఛాగానం చేయడం, చీకటిలో వెలుగును కలగనడం, అణచివేస్తే విముక్తిని ప్రకటించుకోవడం, అంతిమంగా మృత్యువులో కూడా చావును నిరాకరించడం అనేవి ఇంకెంత మాత్రం రొమాంటిక్‌ వ్యక్తీకరణలు కాదని ఆయన నిరూపించారు. ఆయనకంటే ముందు అత్యంత దుర్భర స్థితిలో, వైద్యం అందక జైలులో మరణించిన మావోయిస్టు రచయిత్రి నర్మద(ఉప్పుగంటి నిర్మల) కూడా
పత్రికా ప్రకటనలు

“A republic must not kill its own children”: Supreme Court of India

CDRO, a coordination of democratic rights organisations that are active in different parts of the country, has been working since 2007 to highlight the status of democratic rights of the people and to protect these rights. Though the oppression of weaker sections of the society is a continuous saga, the past situations pale in the front of the atrocities carried out by the central and state governments in Chhattisgarh at
కవిత్వం

అతనిప్పుడు మాటాడుతున్నాడు

అతనిప్పుడు మాటాడుతున్నాడుఒరిగిపోయాడన్న ప్రతిసారి మాటాడుతూనే వున్నాడు దేశమంతా అతన్ని ప్రతిబింబిస్తూనే వుంది శత్రువూ మాటాడుతున్నాడు తనవారూ మాటాడుతున్నారు నలుగురు కలిసిన చోట అతనే సంభాషణవుతున్నాడు అన్నం ముద్దలో అతని వెన్నెల వంటి ముఖం కనిపిస్తూ అడవి అంతా అతను అల్లుకుపోయిన తోవంతా కబుర్లలో అతనిప్పుడు మాటాడుతున్నాడు అతని చుట్టూ ముళ్లపొదను నాటిన ప్రతిసారీ మరల అతను మోదుగ పూల వనంలో ఎర్రని దేహంతో పుష్పిస్తూనే మనతో మాటాడుతున్నాడు నువ్వలిసి సేదదీరుతానన్న కాలంలో నీ అలసటను తన భుజానెత్తుకొని కాళ్ళ సత్తువగా మారుతూనే వున్నాడు ఎండలో వానలో చలిలో రుతువులన్నిటా అతను ముందు నడుస్తూనే వున్నాడు గాయపడ్డ సమయంలో తను
కవిత్వం

సెంట్రి..!

రాత్రి చెందురుడు మా పల్లె మీద రాబందులు వాళ్ళకుండా డేగ కండ్లతో కాపు కాస్తున్నవాళ్ళు..!పూరి గుడిసెల వాడల్లోనిట్టాడుగా నిలిచిన చోట అర్ధరాత్రి అలికిడికి ఉయ్యాల నుండి లేచిన పసికూన కూతకు తుఫాకి మోన పెట్టి కాల్చాలని కలగన్న ఈ దోపిడీ రాజ్యాన్ని ధిక్కరించే తెగువైకాచిన కందిలి వెలుగులు వాళ్ళు..!!అడవి కాచిన వెన్నెల సంద్రాలను ఈదుతూ సెలయేరు పాయలుగా పారుతూ కొండలు, కోనలను తడుముతూ సకల జీవరాశులను ఓల్లో ఒంపుకుంటూ చుక్కాని అయిన వాళ్ళు ఈ దేశ పీడిత ప్రజలకు సెంట్రియే...!దిక్కు తెలియని వాళ్ళకు దిక్కై నలుదిక్కుల న్యాయముకై విముక్తి నావనెంచి సాగుతున్న వాళ్ళకు పోరు సమరంలో వాళ్లో స్నేహితులు
ఆర్ధికం

ఆక్స్ఫామ్: ప్రజల్ని దోచేసున్న గుత్త సంస్థలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్‌) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్‌ఫామ్‌ సంస్థ ‘టేకర్స్‌ నాట్‌ మేకర్స్‌’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని