మీరీ పుస్తకం చదివారా ?

పదునెక్కిన ఆయుధం కదా జీవితం..!

స్వేచ్ఛ నాకు జీవితం మించిన కల అంటూ లోసారి సుధాకర్‌ ‘ఆయుధంలాంటి మనిషి’ కవిత్వం తెచ్చారు. జీవితం ఎలా పదునక్కుతుంది అని ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కన్నీళ్ళు, ఇంకొన్ని దు:ఖాలు, మరికొన్ని విషాదాలు కవిత్వంలో కనబడతాయి. వర్తమాన కవిత్వలోకంలో విస్తృతంగా కవిత్వం వస్తునే వుంది. నవతరం యువ కవులు కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిగమ్యం, కవిత్వ పరిణామం ఏమిటి అని ప్రశ్నించినపుడు జవాబు మనికిప్పుడు అస్పష్ట్టంగానే వినబడుతుంది.  సామాజికవాస్తవాన్ని నొక్కి చెప్పగలిగిన కవిత్వం వర్తమాన సాహిత్యంలో చాలా అరుదుగా కనబడుతుందన్న విషయం కొద్ది మందికే తెలుసు. సామాజిక వాస్తవాన్ని కవిత్వంలో చెప్పాలనుకున్నప్పుడు కవికి సైద్దాంతికబలం ఉండాలి. అలా ఉన్నప్పుడే కవి
వ్యాసాలు

చీకట్లో మిణుగురులు

(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు  రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) మిడ్కో అంటే గోండు భాషలో మిణుగురు పురుగుఅట. అంటే చీకట్లో మెరిసే ఒక ప్రాణి. ఒక నక్షత్రం. ఒక ప్రాణి తాను చీకటిలో మెరిసి వెలుగుచూపే ఒక ప్రక•తి నిర్మాణం విచిత్రమైనది. అద్భుతమైనది. గాలిలో అడవిలో ముఖ్యంగా చీకట్లో చూసినపుడు కాని దీని విశిష్టత అర్థంకాదు. అట్లే ఒక ఆరిద్ర పురుగుంది. మ•గశిర కార్తె రాగానే పొలాల్లో బిలబిల వచ్చే కుంకుమపువ్వు వంటి ఒక పురుగు. నిజానికి
వ్యాసాలు

విప్లవాచరణ కథలు

(డిసెంబర్లో విరసం ప్రచురించిన మిడ్కో కథల సంపుటి *మెట్లమీద *కు రాసిన ముందుమాట ఇది . అమర యోధ రేణుక స్మృతిలో పాఠకుల కోసం .. వసంతమేఘం టీం ) ముందుమాట కోసం పోస్టులో వచ్చిన పద్దెనిమిది కథలు గత అయిదు నెలలుగా చదువుతూ ఆలోచిస్తున్నాను. ఈ కథలు చదువుతూ ఉంటే మేము ఇదివరకు యువ రచయితలకు నిర్వహించిన పాఠశాలలు ముఖ్యంగా 1997 వేసవికాలంలో అరకులోయలో శ్రీ కాళీపట్నం రామారావు, ఆర్.యస్. రావుగారి లాంటివారు విచ్చేసి పదిరోజులు నడిపిన పాఠశాల గుర్తొచ్చింది. రాష్ట్రం మొత్తం నుండి వచ్చిన యువ రచయితలు, రచయిత్రులు (అర్ధ రాత్రుల దాకా చదివిన కథలు)
కరపత్రాలు

మధ్య భారతదేశంలో ఆదివాసుల హననానికి వ్యతిరేకంగా పోరాడుదాం

ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, చత్తీస్‌ఘడ్‌లో ఉన్న కోట్లాది విలువైన సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసీలపై అతిక్రూరంగా మారణకాండను దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. అలాగే వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో లక్షలాది బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధ స్థితిని కొన సాగిస్తుంది. ఇది గాజా, ఉక్రెయిన్‌ల కన్నా దారుణ స్థితిని దాటిపోయింది. మనపక్కన ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీల జీవితాలపై పై భారతసైన్యం తీవ్రంగా దాడి చేస్తున్న విధానాన్ని మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష
సమీక్షలు

గుండె నెత్తురులతో పదునెక్కి  సాగుతున్న విముక్తి చరిత్ర

అల్లం రాజయ్య సాహిత్యం చదవడం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. రాజయ్య ప్రతి నవల చారిత్రక మట్టి పొరలలో నుండి పుట్టుకొస్తాయి. కాళ్ళ కింద దుమ్ములా పడి ఉంటారు అనుకుంటున్న మట్టిమనుసులు కళ్ళల్లో నలుసులై దొరలను,భూస్వాములను తద్వారా వారికి అండగా నిలబడ్డ రాజ్యంపై ఎదురు తిరిగిన చరిత్రకు అక్షరూపం ఇస్తాడు రాజయ్య. అది కొలిమంటున్నది కావచ్చు, వసంతగీతం కావచ్చు, ఊరు, అగ్నికణం, సైరన్ ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా ఉత్తర తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన పోరాటాల చరిత్రే. అదే వరవడిలో విముక్తి నవల కూడా పోరాటాల చరిత్ర రచనలో భాగంగా వచ్చింది. నక్సల్భరి ఆరంభం గురించి నక్సల్భరి 
కథలు

ప్రవాహం

(కా. మిడ్కో గా పాఠకులకు సుపరిచితమైన కా. జి.రేణుక స్వస్థలం వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామం. తిరుపతిలో ఎల్‌ఎల్‌బి చదువుతుండగా “మహిళాశక్తి” సభ్యురాలిగా మహిళా ఉద్యమంలో పనిచేసింది. 1995 లో మహిళా శక్తి మరొక 9 సంఘాలతో కలిసి చైతన్య మహిళా సంఘంగా ఏర్పడిన తరవాత రాష్ట్రవ్యాప్త మహిళా ఉద్యమంలో తిరుపతి కేంద్రంగా 2000 వరకూ విశాఖపట్నం కేంద్రంగా 2004 వరకూ పనిచేసింది. మహిళామార్గం పత్రిక లో సంపాదక వర్గ సభ్యురాలుగా పనిచేసింది. తరవాత 2004 లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుని ఆంధ్ర ఒడిష బోర్డర్ జోన్ లోనూ, దండకారణ్యంలోనూ పనిచేసింది. అనేక కలం పేర్లతో 30 కి
stories

Mother’s Love

(About The Author Com. G. Renuka well known to readers as Midko, hails from Kadivendi village in Warangal district. While pursuing her LLB in Tirupati, she was involved in the women's movement as a member of "Mahila Shakti." In 1995, when Mahila Shakti merged with nine other organizations to form Chaitanya Mahila Sangham, she actively participated in the statewide women's movement, working from Tirupati until 2000 and from Visakhapatnam until
సమకాలీనం

అటవీ హక్కుల చట్టంపై పొంచి ఉన్న ముప్పు; రాజ్యాంగబద్ధతపై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

షెడ్యూల్డ్ తెగలు (అనుసూచిత తెగలు- ఆదివాసులు) ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006, (దీనిని సాధారణంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తారు) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 2న కేసున విచారణ చేపట్టనుంది. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులను అటవీ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో తరలించడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్టపరమైన అడ్డంకులు, పర్యావరణ విధ్వంసం పెరుగుతున్న ముప్పులు, ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మరోవైపు, అటవీ హక్కుల చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పైన ప్రశ్నలు లేవనెత్తుతూ,
కవిత్వం

కుట్ర చేసినవాడు సమాధిలో ఉన్నా తవ్వితీస్తాం

అది నాగాజాతి రాజధాని కాదునాకపురం దేవేంద్రుని స్వర్గానికి రాజధాని అక్కడ దేవతలు, వాళ్లకోసం ఇహ లోకంలో పుణ్యం చేసుకొని వచ్చిన భోగ లాలసులుంటారు - విప్రులు, ద్విజులు సనాతన ధర్మ రక్షకులు. అక్కడ బాధితులెవ్వరూ ప్రతీకారానికి సాహసించరు అమృతం దొరకక చచ్చిపోతారు దొంగిలించబోయి చంపబడతారు అనామకంగా మట్టిలో కలిసిపోతారు కాష్ఠంలో కాల్చినా, బొందపెట్టినా‘బాబ్రీ మసీదును కూల్చినప్పుడు కూడా నాగపూర్ లో హింస చెలరేగలేదు’1ఈ కుట్ర ఎవడో సమాధిలో ఉన్నవాడు చేశాడు పీష్వాల కాలం నుంచి చూస్తూనే ఉన్నాం కంపెనీతో యుద్ధంలో ఓడిపోయినప్పటి నుంచీ స్నేహంగానే ఉన్నాం ఛత్రపతి శంభాజీ మహారాజ్ను చంపినాతండ్రిని చంపి తనను చెరసాలలో పెట్టినాఛత్రపతి సాహు
కవిత్వం

అతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు

అరణ్యమిప్పుడు ఒక్కసారిగా చిన్నబోయిందిఅతని కవాతు ధ్వని వినపడకఅతని కోసం ఎదురు చూస్తూతెల్ల మద్దె చెట్టు బోసిపోయిందికాసింత విశ్రాంతి తీసుకునే చోటును కదా అని నెత్తురు ముద్దయిన అతని దేహాన్ని చూసిపక్షులన్నీ రెక్కలు తెగినట్లుగా గూటిని దాటి రాలేక రోదిస్తున్నాయి అతని పాఠం వినిపించకతరగతి గది మూగపోయింది అతని దేహాన్ని స్పృశిస్తూ నెత్తురంటిన వెన్నెల ముఖంరంజాన్ మాసపు దుఃఖపు ఆజాలో గొంతు కలిపింది చావు ఎదుట పడినా తన నిబ్బరాన్ని చూసి నిట్ట నిలువునా కుంగిపోయాయిబైలదిల్లా పర్వత సానువులుమనందరి ఆదరువుగా మరలాఅతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు తరాలపల్లి తరతరాల వారసునిగా (అమరుడు కామ్రేడ్ సారయ్య @ సుధాకర్ స్మృతిలో)27-3-2025