కథలు

భయం, అభద్రత

ఇవ్వాల్టి  సగటు ముస్లిం జీవితం ఈ కథలో ఉంది. నేటి పెహెల్గాం సందర్భమే కాదు. నిన్నటి కరోనా సందర్భమూ కూడా ముఖ్యంగా మోషాల నాయకత్వంలో బీజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భయం! అభద్రత! మరీ ఎక్కువయ్యింది. చదువుకున్నవారు చదువురానివారు అనే తేడా లేదు. వయసు బేధం అంతకూ లేదు. మతం మత్తు ఎక్కితే చాలు. అందులో భాగమే చదువుకున్న రఘు"రోజూ చాలా మంది ముస్లింలు మన దేశానికి వస్తున్నారట. అట్లా వచ్చి ఇక్కడే ఉండిపోయి బాంబులు పెట్టి జనాలను చంపేస్తున్నారట" అంతా "అట" ప్రచారమే. వాస్తవ  పరిశీలన ఉండదు. మంచీ చెడుల ఆలోచన ఉండదు. నిజనిజాలకు తావేలేదు.
కవిత్వం

బిడ్డడితో తల్లి

బిడ్డానా జీవితం ఎప్పుడూఅందమైన పాల రాతి మెట్ల మీదుగా విలాసంగా సాగింది కాదు నేనెక్కిన మెట్లలో ఎన్నో పగుళ్లున్నాయిఅతుకులున్నాయిఅంచులు పగిలి ఉన్నాయి నేనడిచిన నేలంతా ఉత్త దిబ్బ నేల ఎర్ర తివాచిపరిచి నన్నెవరూ ఆహ్వానించింది లేదు కానీ నేను మెట్టెక్కుతూనే ఉన్నానుఅవరోధాలు అధిగమిస్తూనే ఉన్నానుగమ్యాలు చేరుతూనే ఉన్నానుఒక్కొక్కసారి గాఢాంధకారంలో నడక చేతిలో దీపముండదు బిడ్డామడమ తిప్పొద్దు మెట్ల మీద చతికిల పడొద్దు పగుళ్ళ మధ్యా, అతుకుల మధ్యా పడిపోయినాలేచి నిలబడు అరికాళ్ళు చీలినానడక సాగించునేను పడిపోయినానడుస్తూనే ఉంటానుమెట్లెక్కుతూనే ఉంటాను జీవితమెప్పుడు పూలపాన్పు కాదని గుర్తుంచుకోసాహసం గానే సాగిపో .. *** లాంగ్ స్టన్ హాఫ్ "Mother to Son
సమీక్షలు

కమిలిన కన్నీటి చారిక మంగలిపల్లె

సంగరేణి అనగానే లోకానికి వెలుగునిచ్చే నల్లబంగారం గర్తొస్తుంది. నరేష్ కుమార్  సూఫీ దీనిని బంగారు భూమి అన్నాడు. ఆ బంగారు భూమితో తన అనుబంధం, ఆడిపాడిన బాల్యం, ఊహ తెలిసే వయసులో ఉక్కిరి బిక్కిరి చేసిన జీవిత కాఠిన్యం, తీపిని, చేదును పంచిన మనుషులు, నిలువెత్తు త్యాగమై ధగధగ మండిన వాళ్లు, బతుకుపోరాటంలో నిట్టనిలువునా కూలిపోయిన వాళ్లు, బొగ్గుట్టల కింద మాయమైన ఊరితో పాటు కనుమరుగైన వాళ్లు -అన్నిటిని సజీవ జ్ఞాపకాలుగా పరిచయం చేశాడు సూఫీ.     నరేష్ కుమార్  సూఫీ కి తాను పుట్టి పెరిగిన ఊరు ఇదని మిత్రులతో చెప్పుకోడానికి ఇప్పుడక్కడ ఊరు లేదు. ఒక మానవ
నివాళి

ప్రపంచ పీడిత ప్రజల ప్రియ మిత్రుడు,విప్లవ రచయిత గూగీకి జోహార్లు

గూగీ వా థియాంగో తన 87 ఏళ్ల ధిక్కార జీవితాన్ని ప్రపంచ పీడిత ప్రజల బలమైన సాంస్కృతిక ప్రతిఘటనగా నిలిపి మే 28, 2025 న భౌతికంగా నిష్క్రమించాడు. తూర్పు ఆఫ్రికా కెన్యా దేశంలోని ఒక చిన్న తెగలో జన్మించిన గూగీ తన ప్రజల గురించి, వారి బాధల గురించి, అణచివేతల గురించి రాస్తే అది తమ గురించే రాసినట్లు తెలుగు పాఠకులు భావించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజల ‘మౌ మౌ’ గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ పోరాటాన్ని తలపింపజేస్తుంది. అందులో పాల్గొన్న విప్లవ వీరుడి కుటుంబం గూగీ ది. ఆ కారణంగా ఆయన
ఆర్థికం

ప్రపంచ సామాజిక నివేదిక

ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం, యునైటెడ్‌ నేషన్స్‌ విశ్వవిద్యాలయ ప్రపంచ అభివృద్ధి ఆర్థిక పరిశోధనా సంస్థతో కలిసి రూపొందించబడిన  ‘ప్రపంచ సామాజిక నివేదిక -2025’ ని ఏప్రిల్‌ 24న విడుదల చేసింది. ఇందులో  సామాజిక పురోగతిని వేగవంతం చేయడానికి నూతన విధాన రూపకల్పనను ప్రోత్సహిస్తుంది. పెరుగుతున్న అసమానత, ఉద్యోగ అభద్రత, సామాజిక అపనమ్మకం వంటి అంశాలు ఇందులో చర్చిస్తుంది. పెరుగుతున్న ఆర్థిక అభద్రత, అస్థిరమైన అసమానత స్థాయిలు, క్షీణిస్తున్న సామాజిక విశ్వాసం, సామాజిక విచ్ఛిన్నం ప్రపంచవ్యాప్తంగా సమాజాలను అస్థిరపరుస్తున్నాయి. ప్రపంచ సామాజిక నివేదిక 2025, సమాజాలను భయపెడుతున్న ధోరణులను వెల్లడిస్తుంది. తక్షణ, నిర్ణయాత్మక విధాన చర్యను డిమాండ్‌
నివేదిక

బస్తర్ ఆదివాసులకు ఆంతర్జాతీయ సంఘీభావం

మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో వేగవంతమవుతున్న రాజ్య అణచివేత సంక్షోభాన్ని ఎత్తి చూపడానికి 2025 మే 6న, ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్ (జర్మనీ), ఫౌండేషన్ ది లండన్ స్టోరీ (నెదర్లాండ్స్), లండన్ మైనింగ్ నెట్‌వర్క్ (యుకె), ఇండియన్ అలయన్స్ పారిస్‌లతో కలిసి ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా (ఇన్‌సాఫ్ ఇండియా) అంతర్జాతీయ వీడియో సమావేశాన్ని నిర్వహించింది. భారత రాజ్యం అమలుచేస్తున్న తిరుగుబాటు నిరోధక ప్రచారం అయిన "ఆపరేషన్ కగార్" కింద అనేక స్వదేశీ ఆదివాసీ సమాజాలకు నిలయంగానూ ఖనిజాలతోనూ సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం ఇంతకుముందెన్నడూ లేనంతగా సైనికీకరణను చూస్తోంది. భారత
కవిత్వం

వస్తున్నాను

లేను నేను ఏ కర్రెగుట్టల్లో మధ్య భారతాన్ని ఏలే ఏ దండకారణ్యంలో దిక్కులు దద్దరిల్లే ఏ యుద్ధ క్షేత్రంలో తిరగపడ్డ ఏ గలాల గర్జన పరిధిలో దూసుకొచ్చే ఏ తూటాల దారిలో అయినా నాలో యుద్ధ చురకలు ఉరకలెత్తుతున్నాయి అమరుల గుండె నెత్తుటి వేడి నాలో ప్రవహిస్తుందివెనుతిరగని వీరత్వం అటు వైపుగా నడిపిస్తుందినా ప్రశ్నకు నీ సమాధానం తూట అయితే నా ధైర్యాన్ని చంపే ఆయుధం నీ దగ్గర లేదంటాను నా గమనాన్ని నిలిపే ముగింపు మరణమే అయితే నా ఆలోచనలను ఆపే నీ బలగాలు సరిపోవంటాను తిప్పుతాను దిక్సూచినై నీ వైపు అందరి చూపులని కాల్చుతాను నిప్పునై
సమకాలీనం

మావోయిస్టులు ఎందుకు ఆయుధాలు విడిచిపెట్టరు?

భారత ప్రభుత్వానికి ప్రకటన రూపంలో శాంతి చర్చలు ప్రారంభించడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తమ సంసిద్ధతను తెలియజేసిన తరువాత,  భారత ప్రభుత్వ నాయకత్వం తాను బస్తర్‌లో శాంతి కోసం కట్టుబడి ఉన్నానని విశాల ప్రపంచానికి చూపించడానికి అనేక వాక్చాతుర్య ప్రకటనలు చేసింది. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల పైన కూడా 'అర్బన్ నక్సల్స్'గా ఎర్ర ముద్ర వేసే పనిలో తీరిక లేకుండా ఉన్న గృహమంత్రి అమిత్ షా, నక్సలైట్లను తన సోదరులుగా భావిస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు. అమిత్ షా బహిరంగంగా శాంతి కేకలు వేస్తున్నప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని భద్రతా బలగాలు బస్తర్‌లో మావోయిస్టుల ఊచకోతను
వ్యాసాలు

ఆదర్శమే అందం నిత్య నిర్వచనం  

స్త్రీ అంటే శరీరం కాదు అనుభవించే హృదయం, ఆలోచించే మెదడు ఉన్న మానవజీవి అని నమ్మే  వ్యక్తుల, సంస్థల తీవ్ర  నిరసనల మధ్య మరే ప్రజోపయోగ కార్యక్రమాలు లేవన్నట్లు తెలంగాణ ప్రభుత్వం  హైద్రాబాద్ లో ఈ ఏడాది మే7 నుండి  72వ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించ తల పెట్టింది. దీనిని తెలంగాణకు ఆదాయం తెచ్చిపెట్టగల ఉత్సవంగా చూస్తూ 200కోట్ల పెట్టుబడి పెట్టటానికి సిద్ధం అయింది. ఈ సందర్భంలో అందం గురించిన, శాస్త్రీయమైన , మానవీయమైన అవగహన కోసం  నిత్య వ్రాసిన “అందం - ఆదర్శం”  అనే కవితను పరిచయం చేయాలనిపించింది.  నిత్య కలం పేరు. తల్లిదండ్రులు పెట్టిన
విశ్లేషణ

కళింగ దళిత వర్తమానం ‘గొడిముక్క’ ప్రాసంగికత

కళింగనేల మీద దళితచైతన్యంలోంచి వచ్చిన కవిత్వం తక్కువ. గరిమెళ్ళ సత్యన్నారాయణ,శిల్లా రాజులరెడ్డి, తిమోతి జ్ఞానానందకవి, వంగపండు ప్రసాదరావు మొదలైన కవులు వాళ్లదైన భూమిక నుంచి దళిత కవిత్వం రాయడం జరిగింది. 1990-2000కు అటుఇటు తెలుగు నేల మీద జరిగిన దళితోద్యమాల వెల్లువ కళింగాంధ్ర సాహితీకారుల మీద పడాల్సినంతగా పడకపోవడానికిఒక కారణం- ప్రపంచీకరణ వలన తలెత్తిన వ్యవసాయ సంక్షోభాన్ని కళింగాంధ్ర రచయితలు కవిత ద్వారా, కథ ద్వారా చెప్పే పనిలో నిమగ్నమై వుండటం, రెండో కారణం- దళిత నేపథ్యం నుంచి బలమైన సృజనకారులు రాకపోవడం. అందుకు సామాజిక అంతరాల నిచ్చెనమెట్ల వ్యవస్థ ప్రధాన కారణంగావుంది. కళింగాంధ్ర సాహిత్యానికి ఒక చారిత్రక