ఆర్ధికం

ఎటూ తేలని చర్చలు.. ఆగని యుద్ధం

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్‌ పైబర్‌ డ్రోన్‌ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది.  రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్‌ రష్యా మధ్య శాంతి
సమకాలీనం

ఈ మరణాలు ప్రజాస్వామ్య సంక్షోభానికి సూచికలు

కొద్దికాలంపాటు నేను మౌన జీవితంలోకి వెళ్లిపోయాను. కానీ రాజ్య ప్రాయోజిత హింస పెరుగుదల, భారతదేశం అంతటా పునరావృతమయ్యే సంఘర్షణ మరింత లోతైన ప్రతిస్పందనకు బలవంతం చేసింది. మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన హత్యలు విడి ఘటనలు కావు. ప్రజాస్వామ్య ఆరోగ్యం, అట్టడుగు వర్గాలతో వ్యవహారానికి సంబంధించిన విస్తృతమైన, కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవ రావు @ బసవరాజ్ సహా మావోయిస్టులుగా గుర్తించిన పలువురు వ్యక్తుల మరణానికి దారితీసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలు మరోసారి ఆదివాసుల ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణపట్ల దృష్టిని ఆకర్షించాయి. విభేదాలు, తిరుగుబాటులను
సంస్మరణ

50 ఏళ్ల గిరాయిపల్లి అమరుల స్మృతి

ఈనెల 25వ తేదీన కామ్రేడ్ సూరపనేని జనార్ధనరావు పుట్టిన ఊరు గరికపర్రు (కృష్ణా జిల్లా)లో ఆయన అన్నయ్య పూర్ణ మోహనరావు (ఆయన కూడా వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థియే) ఆర్‌ఇసి పూర్వ విద్యార్థులు. గ్రామస్తులు విరసం వంటి ప్రజాసంఘాలు గిరాయిపల్లి మృతవీరుల ఏభయ్యో వర్ధంతి జరుపుకుంటూ విప్లవ సంప్రదాయాన్ని స్మరించుకుంటున్నారు. జనార్థన్ తలిదండ్రులు బతికుండగానే గరికపర్రులో ఇంట్లోనే చిన్న స్మారకం నిర్మించుకున్నారు. ఉయ్యూరులో ఎపిసిఎల్‌సి అధ్యక్షులు బోసుగారు, అనసూయమ్మగారి పూనికపై గిరాయిపల్లి అమరుల స్థూపం నిర్మాణమై బహిరంగ సభ కూడ జరిగింది. ఈ రెండు చోట్లా విరసం పాల్గొన్నది. పూర్ణమోహనరావు ఉద్యోగ విరమణ తర్వాత గరికపర్రులో ఆయన
సందేశం

సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడు చలసాని

(జులై 27న వైజాగ్‍లో కామ్రేడ్ చలసాని ప్రసాద్ పదో వర్థంతి సందర్భంగా జరిగిన 'శాంతి చర్చలు -విప్లవ పంథా ' సదస్సుకు పంపిన సందేశం ...)  ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఉంటూ సి. రాఘవా చారి నేను శ్రీశ్రీ కి కాపలాగా ఉన్నప్పుడు ఆయనను రైల్లో స్టాలిన్  ప్రజాశక్తి దగ్గరికి లాక్కపోయిన వాడు చలసాని. మా ఊళ్లో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇంకా కొత్త స్నేహితులను భరించలేను అంటున్న కాళోజీని కె.ఎస్,కృష్ణక్క కుటుంబాల్లో భాగం చేసింది ప్రసాదు. ఆయన తొలి ఉద్యోగాలు హైదరాబాదులో ఫిషరీస్ కాజీపేటలో రైల్వేస్. నీళ్ళల్లో చేపలా ఈదడం  ఆయనకు తెలంగాణ సాయుధ పోరాట
వ్యాసాలు

మంజీర అడుగుజాడలు

(విప్లవ రచయిత, విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ మంజీర స్మృతి వ్యాసాలతో, కొన్ని తన  రచనలతో విడుదలైన 'వివా కామ్రేడ్ రవి' పుస్తకం ముందుమాటలోని ఒక భాగం ఇది . ఈ పుస్తకం శనివారం ఆగస్టు 2 న హైదరాబాదులో విరసం ఆవిష్కరిస్తోంది ) రవి అమరుడయ్యి 19 నిండి 20వ యేడు నడుస్తున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలని మొదలుపెట్టిన. నిజానికి దీనికి మూలం 2025 ఫిబ్రవరిలో జరిగిన విరసం జనరల్‌ బాడీ మీటింగ్‌లో... నవలలు చాలా తక్కువగా వస్తున్నాయని, రాయాలని, వీలైనంత మంది నవలలు రాయాల్సి ఉన్నదనే చర్చ జరిగింది. అందులో భాగంగా నేనూ రాస్తానని చెప్పాను.