కథనం

విప్లవ  రచయిత , పాత్రికేయుడు, బహుముఖ అనుభవ సంపన్నుడు  గౌతందా

మధ్య రీజియన్ లోని గాలికొండ నుండి తిప్పాగఢ్ వరకు, దక్షిణ బస్తర్, పశ్చిం బస్తర్, మాడ్ కొండలను, సుర్జాగడ్, దంకోడివాహి అడవులను దాటుకొని తిప్పాగఢ్ వరకు ఆరు పదులు దాటిన ఆ విప్లవకారుడు తన బాధ్యతల నిర్వహణలో భాగంగా, అలుపెరుగక గెరిల్లాలతో కాలు కలిపేవాడు. ఆగినచోట యువ గెరిల్లాలంతా పొలోమంటూ తన చుట్టూ చేరితే వారి ముందు ప్రపంచాన్ని ఆవిష్కరించేవాడు. తన అపార అనుభవాల యవనికను పరిచేవాడు. ఒక భుజానికి ఏకే తుపాకి, మరో భుజానికి కుర్చీ, నడుంకు పోచ్, వీపున కిట్టు, కిట్లో అనేక పుస్తకాలు, జబ్బ సంచిలో కంప్యూటర్, మొబైల్ ఫోన్ తో కొద్దిగా వంగి
సంపాదకీయం

జైలు గోడల మీదా, ఆడవి అంచుల మీదా..

మోడెం బాలకృష్ణ అంటే జైలు పోరాటం గుర్తుకు వస్తుంది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం దాకా ఎదిగే క్రమంలో ఎన్నెన్ని ప్రజా పోరాటాలు చేశాడో తెలియదుగాని ఖైదీల పోరాటానికి ఆయన సంకేతం. జాతీయోద్యమం కాలంలో జితేందాస్‌ తదితరుల జైలు పోరాటాల తర్వాత మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ 26, 1994 నుంచి 21 ఫిబ్రవరి 1995 దాకా జరిగిన  రాజకీయ ఖైదీల, జీవిత ఖైదీల పోరాటమే గుర్తుకు వస్తుంది. విప్లవమంటే స్వేచ్ఛా మానవుల నిర్మాణం. దాన్ని  ఈ సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే జైలు తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తుంది. మానవులంటే మానవ సంబంధాల సమాహారం.
అనువాదం

జైలులంటే ఆశ నిరాశల కూడలి:  ఒక ప్రొఫెసర్, ఒక గాయని

భీమా-కోరేగావ్ కేసులో నిందితులైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ షోమా సేన్ (బెయిలు మీద విడుదల ఆయారు), గాయని, కార్యకర్త జ్యోతి జగతప్‌లు  జైలులో సమస్యల గురించి చర్చించారు.  జైళ్ళలో ఉండే రద్దీ, సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, పేద జీవన పరిస్థితులు, విద్య అందుబాటులో లేకపోవడం, వ్యవస్థాగత అసమానతలు, భారతదేశంలోని జైలు వ్యవస్థలో అట్టడుగున ఉన్న మహిళలు, ఎల్‌జిబిటి+క్యూ వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి వివరించారు. వారిద్దరూ స్త్రీల మధ్య సహోదరీత్వం, తట్టుకోగల సమర్థతల  ప్రాముఖ్యత గురించి మాట్లాడారు; మార్పు వస్తుందనే ఆశను వ్యక్తం చేసారు.  భారతదేశంలోని ఐదు రాష్ట్రాలలోని జైళ్లలో నా క్షేత్ర అధ్యయనంలో భాగంగా, జైలులోకి ఎందుకు
సమకాలీనం

సొంత భూమిపై హక్కులు కోరుతున్న జేను కురుబలు

పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో వచ్చే పర్యాటకులకు “మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు” అనే తమ సందేశాన్ని అందించడానికి డజన్ల కొద్దీ జేనుకురుబ ప్రజలు నాగరహొళె టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం దగ్గర వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని నిలబడి ఉన్నారు: నాగరహొళె పులులను చూస్తారని పర్యాటకులకు హామీ ఇచ్చే సఫారీ పర్యటనలను ఆపడం వారి లక్ష్యం;  అటవీ సంరక్షణ పేరుతో తమను తరిమికొట్టిన పూర్వీకుల స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగించారని జేనుకురుబలు అంటున్నారు. కర్ణాటక అటవీశాఖ, కర్ణాటక
ఇంటర్వ్యూ

హింసా నివారణకు శాంతి చర్చలే మార్గం

1. పాలకులు కాల్పుల విరమణ ప్రకటన చేయాలని ఇటీవల పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తరపున పెద్ద ఎత్తున సంతకాలు సేకరించారు కదా? ఈ ప్రయత్నంలో మీ వేదిక అనుభవం ఏమిటి? కాల్పుల విరమణ ప్రకటన చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ సంతకాల సేకరణ కోసం మేం కలసిన వారిలో చాలా మంది తెలంగాణలో కాల్పులు జరగడం లేదు కదా ...మీరు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు పైగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులపట్ల సానుభూతిగానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కనిపించడం మాత్రమే కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్ సమస్య శాంతి భద్రతల
సంస్మరణ

దండకారణ్యమే పాండన్న చిరునామా

నిన్న (14 సెప్టెంబర్‌) యాప్రాల్‌ వెళ్లి పాండన్న మృతదేహాన్ని చూసినప్పుడు దుఃఖం ఆగలేదు. చెదరని చిరునవ్వు మొఖం గుర్తుపట్టలేకుండా వుంది. అసలు ఏ ఆనవాలు కనిపించలేదు. ప్రభుత్వాల అమానవీయతకు, దిగజారుడుతనానికి ఇంతకంటే చేయడానికి ఇంకేమీ మిగిలివుంది గనుక. 1985 ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లిన తమ్ముడి చిన్నప్పటి మొఖం మాత్రమే తోబుట్టువులకు గుర్తు. 40 ఏండ్ల తర్వాత నిర్జీవమై వచ్చిన తమ్ముడిని చూసుకుందామంటే... అక్కడ కుళ్లిపోయిన మాంసపుముద్ద తప్ప మరేమీ లేదు. వారి దుఃఖం చెప్పనలవి కాదు. పాండన్న అక్క, చెల్లెలు ప్రతి ఒక్కరు మాట్లాడేదాన్ని శ్రద్ధగా వింటున్నారు. దుఃఖపడుతూనే తమ్ముడి గురించిన జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. పాండన్న 1967లో
స్పందన

శాంతి కోసం పౌర సమాజ ప్రతినిధులు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి,  మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ  దాదాపు 7500 మంది సంతకాలు చేశారు. అందులో కొందరి  పేర్లు కింద ఇస్తున్నాం 1)  ప్రొ. హరగోపాల్‌               2)  జస్టిస్‌ చంద్ర కుమార్‌ 3) ప్రొ. డి. నర్సింహా రెడ్డి 4)  ప్రొ. ఘంటా చక్రపాణి, వైస్‌ ఛాన్స్‌లర్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 5)  కె. శివారెడ్డి, కవి 6)  కె. శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మెన్‌, తెలంగాణ 7)  అల్లం నారాయణ, మాజీ సంపాదకుడు, నమస్తే తెలంగాణ, మీడియా అకాడమీ మాజీ చైర్మెన్‌ 8)  కె. శ్రీనివాస్‌, మాజీ సంపాదకుడు, ఆంధ్రజ్యోతి 9)  పాశం
పత్రికా ప్రకటనలు

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

యుద్ధం మానవాళిని భయపెడుతున్నది. స్వేచ్ఛా జీవులైన మానవులను ఆందోళనకు గురి చేస్తున్నది.  పాలస్తీనాలో, ఉక్రెయిన్‌లో, మధ్య భారతదేశంలో ప్రజల ఉనికిని పాలకులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. లక్షలాది ప్రాణాలను బలిగొంటున్న యుద్ధాలు మానవతను ధ్వంసం చేస్తున్నాయి. అట్టడుగు సమూహాల ఉనికినే రద్దు చేస్తున్నాయి. మానవ ప్రాణానికన్నా  ఆధిపత్యం,  ఆయుధ వ్యాపారం,  కార్పొరేట్‌ లాభాలే పాలకులకు ముఖ్యమని ఈ హింసాకాండ నిరూపిస్తున్నది. మరీ ముఖ్యంగా  ఇజ్రాయిల్‌ దాడుల్లో వేలాదిగా పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్నారు. భారతదేశంలో  సొంత ప్రజలపైనే పాలకులు యుద్ధం ప్రకటించి నెత్తుటేరులు పారిస్తున్నారు. 2026 మార్చ్‌ నాటికి నక్సలిజాన్ని
కవిత్వం

కొత్తాట నేర్చుకుందాం

ఆకురాలు కాలం,అడవిలో రాలుతున్న ఆకుల సవ్వడిఆ సవ్వడికిసుడిగాలి తోడవుతూఆ సుళ్ల చక్రబంధంలో రాలిన ఆకులుసుళ్లు తిరుగుతూ దుమ్ము లేపుతూగలగల పైకెగురుతున్న శబ్దాల మోత ఆ మోత మరే శబ్దాలను విననివ్వడమే లేదురాలిన ఆకులతో బోసిపోయిన అడవివన్నెలుడిగి, గ్రీష్మ తాపానికి తహతహలాడుతోంది.ఆరు రుతువులలో అడవిఆరు రకాలుగా ముస్తాబవుతోందికానీ, గ్రీష్మమే దాని వన్నెలన్నీ దోచుకుంటుందిచిందులన్నీ చెరిపివేస్తుంది.నిన్నటి వరకు పచ్చదనాన్ని కప్పుకున్న మానులన్నీఆకుల సోయగాలు మటుమాయమైనట్టే,బోసిపోయిన అడవి పల్చబడిందా అనే సందేహం....లేదుకదూ!పచ్చని ఆకులు పండుటాకులై రాలడం సహజంరాలిన ఆకులు ఎండటం,ఎండిన ఆకులు ఎలుగడితో కాలడం అడవిలో అంతకన్నా సహజంఆకులు రాలిన చెట్లు వసంతంలోచిగురిస్తాయి, అడవి వన్నెలన్నీ మళ్లీ మొదలవుతాయిచిగురించిన ఆకులు, మొగ్గ తొడుగుతాయి,మొగ్గలు,
కవిత్వం

కోయ కవితలు రెండు

విప్లవం ఒక చిన్నారిని కవిగా మలిచింది . విప్లవకారుడిగా తీర్చి దిద్దింది . ఈ కవి సల్వాజుడుం రోజుల్లో తల్లి వేలు పట్టుకొని వచ్చి బీ.ఆర్.ను తొలిసారి చూశాడు , తరువాత ఉద్యమంలో చేరాడు. కంప్యూటర్ గురూజీగా పేరు పొందిన సుప్రసిద్ధ రచయిత్రి, అమర యోధ రేణుక అలియాస్ మిడ్కో వద్ద కంప్యూటర్ శిక్షణ పొందాడు. 1 . మా ప్రాణం బీ.ఆర్నా కళ్ల నుండి నెత్తుటి ధారలునేల రాలుతుంటే,నీ త్యాగం, నీతో, నే గడిపిన క్షణాలనుపదే పదే గుర్తు చేస్తున్నాయినీతో గడిపిన ప్రతి క్షణంనాలో నీ త్యాగాన్ని ఎత్తిపడుతోందినీ అమర స్మృతులనువిశ్వ పీడిత ప్రజ సదా స్మరిస్తారురణభూమిలో