కవిత్వం

చలనం

స్వప్నం సాకారమవుతుందనిసంబరపడుతున్న వేళ...కల చెదిరి, నిజం బొట్లు బొట్లుగా కారిపోతూవుంది.వేదన కన్నీరు మున్నీరుగా ఉబికివస్తూ వుంది.ఇప్పుడిప్పుడే..మొలకెత్తి,ఎదుగుతున్న విశ్వాసం..ఊపిరి సలుపక..ఉక్కిరి బిక్కిరి అవుతూ వుంది.ఉత్సాహ జవనాశ్వాలతో పరిగెడుతున్న వేళ..కాళ్ళు నరికివేయబడ్డఖండిత దేహం రోదిస్తూ వుంది.ఈ నేల బిడ్డలుపోరాడి, సాధించుకున్నపిడికెడు మట్టి, దోసెడు నీళ్లు, చారెడు నేల....కాసింత స్వేచ్ఛలనుకసాయి కర్కశత్వం...ఆసాంతం కబళిస్తూ వుంటే...ఏ జయ గీతాలను ఆలపించగలను ?బొడ్డు పేగు కూడా తెగని,పసికందుల కుత్తుకలను కోసే కంసులకు ఇక్కడ కొదువ లేదు.పాలుగారే పసిబుగ్గలకు..ముదిమి దేహాలకు...తేడా లేదిక్కడ !అన్నీ చిద్రం కావలసిందే !బ్రతుకే భారమైన చోట...త్యాగాలకు లెక్కలేదు..విలువ లేదు !ఇక్కడ యుద్ధం చేస్తున్న కపోతాలను...శాంతి పేరిట కసాయి డేగలు మట్టు బెడుతూ ఉన్నాయి.ఇక్కడ
సంస్మరణ

అరుదైన ప్రజల ఇంజనీర్ సుబ్బరాయుడు సార్

" సర్వే జనా సుఖినోభవంతు "                 ( సెప్టెంబర్, 2014 ) " మనం ఎన్నుకున్న సీమ ప్రజా ప్రతినిధుల చొక్కాలు పట్టుకుని.. ప్రజలు నిలదీసినప్పుడే.. సీమ సమస్యలు పరిష్కారమవుతాయి "              ( సెప్టెంబర్, 2025 )  ఈ రెండు మాటలు ఇంజనీర్ సుబ్బరాయుడు సార్ చెప్పిన మాటలే ! మొదటి మాట 2014 లో నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు... కర్నూల్ సిల్వర్ జూబిలీ కళాశాలలో...సీమ కార్యకర్తల సమావేశం జరిగినప్పుడు ఆయన అప్పుడు ప్రత్యేక ఆహ్వానితులు.. ఆ సందర్భంగా ఆయన తన ఉపన్యాసాన్ని... ప్రారంభించడానికి చెప్పిన ముందుమాటలు ! బహుశా మేము ప్రత్యేక రాయలసీమ వాదుల
నివాళి

మానవతా చైతన్యం, రాయలసీమ మూర్తిమత్వం

కొందరిలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. అద్భుతం ఉంటుంది. వాటి ముందు ఎవరంతకువారు వినయంగా, ప్రియంగా, గౌరవంగా ఉండిపోవాల్సిందే. అలాంటివారిలో కర్నూలు రిటైర్డ్‌ ఇంజనీర్‌ సుబ్బరాయుడు సార్‌ ఒకరు. ఆయనను ఎవరైనా ‘సుబ్బరాయుడు  సార్‌’ అనే అంటారు. ఆయనలోని నైతిక విలువలకు, మానవతా చైతన్యానికి, రాయలసీమ  అభివ్యక్తికి దక్కిన గౌరవం అది. ఆయన సమక్షంలో ఎవరైనా సరే సౌకర్యంగా మెలగడానికి కారణం ఆయన నమ్రత, నెమ్మదితనం. తనకు ఇరిగేషన్‌ మాత్రమే తెలుసని, ఈ ప్రపంచం చాలా విశాలమైనదని, అందులో ఎన్నో సమస్యలు, అధ్యయనాంశాలు ఉంటాయనే ఎరుక పుష్కలంగా ఉన్న మేధావి ఆయన.  తాను తుంగభద్ర, కృష్ణా నదీజలాల సాంకేతిక
ఆర్థికం

డీలా పడనున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

2025 సెప్టెంబర్‌ 22-26 తేదీల్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం న్యూయార్క్ లో జరుగుతున్న వేళ, ప్రపంచ ఆర్థిక వేదిక సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు, కృత్రిమ మేధ ప్రభావం, స్థిరమైన ఆర్థికం వంటి ప్రపంచ సవాళ్లపై దృష్ట సారించింది. ఆర్థిక వృద్ధిలో నెలకొన్న అనిశ్చితి, శ్రామికశక్తి భవిష్యత్తును పరిశీలించింది. అభివృద్ధి సంక్లిష్టతను చర్చించేందుకు 22-26 తేదిల్లో స్థిరత్వం, ఆర్థికవృద్ధి, బాధ్యత యుతమైన సాంకేతికపై, పురోగతిని చర్చించడానికి ప్రపంచ దేశాల నుండి 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నూతన తయారీ సాంకేతికతలకు మార్గదర్శకత్వం వహించే సైట్‌లను గుర్తించింది. ఈ నెట్‌వర్క్ ల కోసం 12 మంది
కవిత్వం

తిరోగమనం వైపు

నాడు పేలిన తుపాకీ నేడు విసిరేయబడ్డ చెప్పు వెనుక సనాతన మౌఢ్యం తుపాకీ వెనుక ఉన్మాదం లో మతం చెప్పు వెనుక కులం అదే వ్యక్తి అదే కుర్చీ లో ఆధిపత్య కుల వ్యక్తి వుంటే విసరగలడా?!సాంఘిక అసమానతలను పెంచి పోషించే సనాతనం అక్షరం అత్యున్నత స్థాయికి చేర్చినా సహించదు విసిరింది వ్యక్తి విస్ఫోటనం సంఘంలో ఖజురహో కాలానికి ఇప్పుడు తీర్పు కోరే మతిభ్రమణం విగ్రహాల వెనుక తవ్వే కొద్దీ సత్యాలు బయటపడుతున్నాయి అయినా తీర్పులు సంఖ్యా బలం వైపే మొగ్గు తుపాకీ వ్యక్తి నిర్మూలన వైపు చెప్పు సంఘ లోపాల పై విహారం ఏది ధర్మం?! ఏది
కవిత్వం

డియర్ మోదీ..

డియర్ మోదీ..నీదీ నాదీ సిద్ధాంత చర్చ అయ్యుంటే గౌరవప్రదంగా జరిపే వాడ్ని నీతోను.. నీ అనుచరులతోనూనీ బత్తాయి రౌడీలతోనూ మాగొప్పగా మాట్లాడేవాడ్ని కానీ నీది అబద్దాల రొష్టు నాది నిజాల కొలిమి నిస్సిగ్గుగా నువ్వు మాట్లాడే ప్రతీ అబద్ధం నీ గూండాలు ఎలా మోస్తున్నారు?చరిత్ర..నీకు నచ్చినట్టు రాసుకునేది కాదు చరిత్ర..నీ సిద్ధాంతాలకి తగ్గట్టు చెరిపేసేది కాదు డబ్బై ఏళ్ళకి మెదడు మొద్దబారుతుంది కానీ అబద్ధాలను తయారీ చేస్తుందా? ప్రభుత్వ యంత్రాంగాన్ని నేడు అబద్ధాల తయారీ కేంద్రంగా మార్చావ్ దేశ ప్రధాని హోదాని గాలికి ఒదిలేసి నచ్చినట్ట వాగుతున్నావ్ నీకూ నీ నోటికి తాళం వేయాలంటే నిన్ను గద్దె నుంచి
నివేదిక

రాజ్యం ప్రాధాన్యత  ఆదానీ లాభాలు కారాదు

బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా, పిర్‌పైంటిలో 1,050 ఎకరాల భూమిని అదానీ పవర్‌కు సంవత్సరానికి ఎకరాకు కేవలం రూ 1 చొప్పున, 33 సంవత్సరాల కాలానికి లీజుకు ఇవ్వాలనే నిర్ణయం బీహార్‌లో ప్రధాన రాజకీయ వివాదానికి దారితీసింది. కార్పొరేట్ లాభాల కోసం రైతుల హక్కులను, ప్రజా ప్రయోజనాలను, పర్యావరణ శ్రేయస్సును బలిచేసే ఈ అన్యాయమైన, అపారదర్శకమైన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బహిరంగ మిత్ర పెట్టుబడిదారీ విధానానికి (క్రోనీ క్యాపిటలిజం)పరాకాష్ట; ఇది పాలనపట్ల ప్రజల్లో అపనమ్మకాన్ని మరింతగా పెంచుతోంది. పిర్‌పైంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని, సేకరించిన భూమిని ప్రభావిత రైతులకు తిరిగి కేటాయించాలని, పునరావాసాన్ని కల్పించాలని,
సమకాలీనం

కొండల కోసం పోరాడిన మహిళా కార్యకర్తకు బెయిలు నిరాకరణ

ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాలలో ఉన్న, తరచుగా తిజిమాలిగా పిలిచే సిజిమాలి అనే ప్రశాంతమైన గ్రామంలో, ప్రతిపాదిత మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ప్రతిఘటనా ఉద్యమం జరుగుతోంది. సిజిమాలి అనేది భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఒక కొండ శ్రేణి. బాక్సైట్ నిల్వలు, స్థానిక సముదాయాల పవిత్రస్థల ప్రాముఖ్యత, జీవవైవిధ్యాల కోసం ప్రసిద్ధి చెందింది. 311 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వ ఉన్నదని అంచనా వేసిన 1,549.022 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న సిజిమాలి బాక్సైట్ బ్లాక్‌కు 2023లో మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (అభిప్రాయ పత్రం) ను తీసుకున్నది. అయితే, సెప్టెంబర్ నెల ప్రారంభంలో,
సంపాదకీయం

సాయుధ ప్రతిఘాతుకం.. ఉల్కా పతనం

 14 అక్టోబర్‌ కామ్రేడ్‌ అక్కిరాజు హరగోపాల్‌ రెండేళ్ల క్రితం దండకారణ్యం - బస్తర్‌లో మరణించిన రోజు - అమరత్వం పొందిన రోజు.  జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం..  మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం..  అని 11 అక్టోబర్‌ 2004లో గుత్తికొండ బిలం అమరుడు చారుమజుందార్‌ స్మారక స్థూపం దగ్గర వేలాది మంది ప్రజల ముందు దేశంలోని కోట్లాది పీడిత ప్రజలకిచ్చిన మాట ఆయన నిలుపుకున్నాడు. అప్పటికొక 25 ఏళ్లుగా సాయుధ విప్లవాచరణలో ఉన్నాడు.  నల్లమల విప్లవోద్యమ నిర్మాణానికి నాయకత్వం వహించాడు. సాయుధ విప్లవ శాంతి స్వాప్నికుడుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే రెండు విప్లవ పార్టీల
కొత్త పుస్తకం

ఈ కాలపు అవసరం ఈ పుస్తకం

(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న పాణి శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం - విప్లవోద్యమం పుస్తకానికి ప్రచురణకర్తలు రాసిన ముందుమాట ) ఈ పుస్తకాన్ని వర్తమాన తెలుగు మేధా సంప్రదాయంలో అత్యవసరమైన, ప్రాసంగికమైన, కీలకమైన రచనగా పరిగణించడానికి మూడు కారణాలున్నాయి.ఒకటి, ఇది ఒక వాదనల సంకలనం. విప్లవోద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య చర్చలు జరగాలని, సమాజంలో నెలకొని ఉన్న హింస తగ్గి శాంతి ఏర్పడాలని ఆకాంక్షలు వినిపిస్తున్న సందర్భంలో వ్యక్తమవుతున్న అనేక వాదనలను, అభిప్రాయాలను మదింపు చేసి విప్లవోద్యమం వైపు నుంచి ఒక వాదన వినిపిస్తున్న పుస్తకం ఇది. రెండు, ఇది ఒక ఆశావాదపు ప్రకటన.