కవిత్వం

దేశానికి ఏం కావాలి

ఈ దేశానికో కండ్లు కావాలిరాజ్యం చేస్తున్న కుట్రలను ధిక్కరించడానికి న్యాయాన్ని బహిరంగంగా బజారులో అమ్మేసుకుంటున్నందుకు దేశానికో కండ్లు కావాలిఈ రాజ్యానికి బలమైన గొంతుక కావాలి గొంతెత్తి గర్జించే గళాలేన్నో మూగబోయినందుకు ఫాసిస్టు పాలకుల పాలనలో బందీలుగా నలిగిపోతున్నందుకు రాజ్యానికి బలమైన గొంతుక కావాలి ఈ దేశానికి పిడికిలి కావాలి అన్యాయపు అంగట్లో ఆదివాసి కాళ్ళ కింద నేలను తాకట్టు పెడుతున్నందుకు కార్పొరేట్లపై పిడికిలెత్తి నినదించేందుకుదేశానికో పిడికిలి కావాలి ఈ దేశానికో రంగు కావాలి కాషాయపు కాగితాల కింద నలిగిపోతున్న జెండాను కాపాడేందుకు గాయపడిన పావురపు రంగు కావాలి దోపిడి దొంగలను తరమడానికి పిడికిలెత్తి నినదిస్తూ గొంతు ఎత్తి గర్జిస్తూఈ
కవిత్వం

ఉదయ్ కిరణ్ కవితలు రెండు

1మళ్లీ ఊపిరి పోసుకుంటాయినా బిడ్డ తిరిగి వస్తాడా ముక్కుపచ్చలారని నా బిడ్డను నేను తొమ్మిది నెలలు మోసినా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా పుట్టిన నా బిడ్డ మళ్లీ తిరిగి వస్తాడా. మొన్ననే మొదటిసారి అమ్మ అని పిలుస్తుంటే ఎంత సంతోష పడిపోయామో మళ్ళీ ఆ పిలుపు నాకు వినిపిస్తుందా నన్ను అమ్మ అని మళ్ళీ పిలుస్తాడా .నల్లని రూపున నా బిడ్డకు తెల్లని పాల బువ్వ తినిపించి జో కొడితే హాయిగా నిద్రపోయే నా బిడ్డ మళ్లీ తిరిగి లేస్తాడా మిగిలిన పాల బువ్వ తిని హాయిగా నిద్ర పోతాడా .మాటరాని నా బిడ్డను మావోయిస్టు అంటూ
విశ్లేషణ

తాత్కాలిక సాయుధ పోరాట విరమణ అంటే శాశ్వత విరమణే

ఈ సంవత్సరం మార్చ్ నెల నుండి – అంటే మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేసినప్పటి నుండి దేశంలో ప్రజాస్వామిక వాదులు, విప్లవ సానుభూతిపరులు, మేధావులు ఈ విషయంలో చర్చలు చేస్తున్నారు. కొన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై తమ వైఖరిని ప్రకటించి ఉన్నాయి. ఎన్నో ప్రజాసంఘాలు, విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు కూడా శాంతి చర్చలను జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహించాయి. ముఖ్యంగా తెలంగాణ, పంజాబ్, తమిళ్ నాడు లలో ఇవి పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా ఒక్కొక్క ఘటనలో పది, ఇరవై,
కవిత్వం

వరి గొలుసులకు యమపాశాలు

సన్నని ముసురు కిందనాట్లు వేస్తున్న దృశ్యం చూసి ఫూలే గుండెమరోసారి మండే ఎడారి అవుతుంది చేతిలో పాత కాగితాల కట్టపట్టుకుని డ్యాము ఒడ్డున నిలబడితల్లిని పోగొట్టుకున్న బిడ్డలాపొలాలని పోగొట్టుకున్న 'శాలో'తల్లి డ్యాముకేసి నిర్వేదంగా చూస్తుంటది అవతల నగరం డ్యాము పుణ్యమా ..అని ధగధగా మెరిసిపోతుంటది జిలిబిలి నగవుల మురిసిపోతుంటది నగరం అభివృద్ధి కింద వ్యాపించిన పెంజీకట్లుమట్టి దీపాల్ని కలవర పెడుతుంటాయి ఇవాళ సోమాకు పస్తులే మిగిలాయి ఆయన పొలాలన్నింటినీరిజర్వాయర్ మింగేసింది పాలిపోయిన చర్మం లోంచిపొడుచుకొచ్చిన ఎముకల గూడుపిడచగట్టిన పేగులు లో లోపలికి ముడుచుకుపోతాయి ఉబికి వచ్చే కన్నీళ్లను అదిమిపెట్టిన డ్యాము విస్పోటిస్తున్న క్రోధాలనుఅదిమిపెట్టిన డ్యాముకూలిపోతాయి పర్వతాగ్రాన తిరుగుబాటు రగిలినప్పుడు
ఇంటర్వ్యూ

హస్ దేవ్‍ను కాపాడుకుంటాం

10 ఏళ్లకు పైగా గడిచిపోయింది, హస్‌దేవ్‌లో జరుగుతున్న చెట్ల నరికివేతను, బొగ్గు తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిరసనలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఎలాంటి తార్కికమైన ప్రభావం లేదా ఫలితం రాలేదు. వాస్తవానికి, కార్పొరేట్ - ప్రభుత్వాల మధ్య బంధం చాలా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. మనం నీరు, భూమి, అడవులను కాపాడటానికి ప్రయత్నించాలి. మనం ఈ విధ్వంసాన్ని ఆపకపోతే, మానవ నాగరికతకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ పోరాటం కేవలం హస్‌దేవ్ ఆదివాసులది మాత్రమే కాదు. ఇది మొత్తం సర్‌గుజా డివిజన్ ప్రజల పోరాటం. మనం గెలిపించిన ఎంపీలు
అనువాదం

చివరి పాలస్తీనియన్ గురించి రాండా జర్రర్

బహిరంగ జియోనిస్టు మద్దతుదారుడు మయిమ్ బియాలిక్ ఫిబ్రవరి 2024లో నిర్వహించిన ‘పెన్ అవుట్ లౌడ్’1 సమావేశం నుంచి బయటకు ఈడ్చుకెళ్తుంటే, “ఒక పాలస్తీనీయుడితో పెన్‌లో ఇలా వ్యవహరిస్తున్నారు?” అని రండా జర్రర్ నినదించింది. గాజాపైన ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గురించి మయిమ్ చాలా మొరటు హాస్యం చేసాడు. నిరసనగా, జర్రర్ తదితరులు అప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ చంపిన 13 మంది పాలస్తీనా రచయితల పేర్లను చదివారు. 2023 అక్టోబరు 7 నుండి ఇప్పటివరకు (సెప్టెంబర్ 2025) గాజాలో 270 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ చంపింది.  భావప్రకటనా స్వేచ్ఛ, సాహిత్యం, కళల కోసం పనిచేసే లాభాపేక్ష
సంస్మరణ

సులువైన సమాధానాలకంటే లోతైన ప్రశ్నలు అడిగిన జుబీన్ గార్గ్

1999లో, మా నాన్నమ్మ ఊరు సిబ్సాగర్ నుండి మా ఊరు తిన్సుకియాకి కారులో తిరిగి వస్తున్నప్పుడు, మా అమ్మ జుబీన్ గార్గ్ 'పాఖీ' ఆల్బమ్ కొన్నది. అప్పటికే ఆయన ఒక సంచలనంగా మారినప్పటికీ, అస్సాం అత్యంత ప్రముఖ సాంస్కృతిక చిహ్నాలలో ఒకరుగా ఎదిగిన ఆ వ్యక్తిని నేను వినడం అదే మొదటిసారి. ఆ నాలుగు గంటల ప్రయాణంలో, 'పాఖీ', జుబీన్ గార్గ్ స్వరం మాత్రమే మాకు తోడుగా ఉన్నాయి. 'పాఖీ' (ఈక) ఆల్బమ్లో జుబీన్ గార్గ్ స్వేచ్ఛ, బందిఖానా  వంటి ఇతివృత్తాలను అన్వేషించారు. ఈకను మానవ స్థితికి ఒక రూపకంగా వాడారు. సంపూర్ణ స్వేచ్ఛ కోసం ఉన్న కోరిక,
వ్యాసాలు

కని, విని ఎరుగని వలంటీర్ నిర్మాణం

(మార్చి 14 , 15 -1944 లో విజయవాడలో ఎనిమిదో అఖిల భారత రైతు మహా సభలు  జరిగాయి.  ఈ చారిత్రాత్మక సభలపై ప్రజా శక్తి ఒక బులిటెన్ విడుదల చేసింది. ఇందులో కా. కె ఎస్ రాసిన వ్యాసం ఇది . కమ్యూనిస్టు ఉద్యమంలో వలంటీర్ నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండేదో ఇది చదివి తెలుసుకోవచ్చు - వసంత మేఘం టీం ) ఫిబ్రవరి 20 వ తేదీ వచ్చేసింది. మహాసభ నిర్మాణ ప్రయత్నాలు అనేక దుస్సంఘటనలవల్ల వుత్సాహంగా సాగడంలేదు. కేవలం 24 దినాలు మాత్రమే వుంది. మహాసభ ప్రయత్నాలు గుర్తుకొస్తే ప్రతివాడికి గుండె జలదరిస్తోంది. వ్యవధిలేదు.
తొలికెరటాలు

నల్లింకు పెన్నులో తొణికిన భావోద్వేగాలు

హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా అన్యాయం పట్ల ప్రతిఘటనగా జీవన గాయాలపై ఓదార్పుగా కవి రచనా శైలి సాగింది. ఈ కవి రచన శైలి చాలా ప్రత్యేకం ఆయన కవిత్వంలో అలంకారాలు తక్కువే కానీ ప్రతి పదం వెనుక జీవన సత్యాలు కన్నీళ్లు కనిపిస్తాయి. ఆయన రాసే ప్రతి కవితలో సూటితనం గాఢమైన లోతు కూడా కనిపిస్తుంది తన అనుభవాలను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజపు అనుభవాలను కూడా పాఠకులకు అనుభవింపచేస్తాడు..  గుండెకు
ఆర్ధికం

మందగిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ

మాంద్యం అంటే ఆర్థిక కార్యకలాపాలలో గణనీయమైన, విస్తృతమైన, సుదీర్ఘమైన తిరోగమనం, దీనిలో స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)తో పాటు ఉద్యోగాల సంఖ్య, పారిశ్రామిక ఉత్పత్తి, అమ్మకాల వంటివి తగ్గుతాయి. సాధారణంగా, వరుసగా రెండు త్రైమాసికాల పాటు జిడిపిలో సంకోచం ఉంటే దాన్ని మాంద్యం అంటారు, అయితే దీనిని అమెరికాలో ''అధికారిక మాంద్యం స్కోర్‌ కీపర్‌'' అయిన నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌బిఇఆర్‌) నిర్వచిస్తుంది. మాంద్యం యొక్క ముఖ్య లక్షణాలు 1) ఆర్థిక వ్యవస్థలో మొత్తం పనితీరు తగ్గుతుంది. 2) ఉద్యోగాల సంఖ్య తగ్గి, నిరుద్యోగిత పెరుగుతుంది. 3) కంపెనీలు సరుకులను ఉత్పత్తి చేయడాన్ని తగ్గిస్తాయి. 4) ఈ ప్రభావం